ఇన్‌స్టాలో పరిచయమై.. బాలికను వేధించి..!

12 ఏళ్ల బాలికను సామాజిక మాధ్యమాల వేదికగా వేధింపులకు పాల్పడుతున్న ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.

Published : 13 Sep 2020 01:22 IST

యువకుడి అరెస్ట్‌ చేసిన పోలీసులు

హైదరాబాద్‌: 12 ఏళ్ల బాలికను సామాజిక మాధ్యమాల వేదికగా వేధింపులకు పాల్పడుతున్న ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. కాలిఫోర్నియాలో బాలికను ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం చేసుకున్న 27 ఏళ్ల సంతోష్‌ను సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలికతో పరిచయం పెంచుకొని ఆపై ఫొటోలు సేకరించిన సంతోష్‌ ఆమెను బెదిరింపులకు గురిచేసేవాడు. అతడి వేధింపులను భరించలేని బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు సైబర్‌ క్రైం పోలీసులకు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు యువకుడిని అరెస్టు చేశారు. నిజామాబాద్‌కు చెందిన సంతోష్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసి ఉద్యోగం లేక ఖాళీగా ఉన్నట్టు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు