Telangana news: వృద్ధురాలిపై యువకుడి పైశాచికత్వం.. రోడ్డుపై ఈడ్చుకుంటూ దాడి!

మతిస్థిమితం లేని ఓ వృద్ధ యాచకురాలిపై.. యువకుడు విచక్షణ కోల్పోయి పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు.

Published : 10 Feb 2022 14:47 IST

షాద్‌నగర్: మతిస్థిమితం లేని ఓ వృద్ధ యాచకురాలిపై.. యువకుడు విచక్షణ కోల్పోయి పైశాచికత్వంగా ప్రవర్తించాడు. రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లి.. దాడికి పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పురపాలికలో ఈ దారుణ ఘటన జరిగింది. ఫరూఖ్‌నగర్‌లో 70 ఏళ్ల సిద్ధమ్మ బిక్షాటన చేస్తూ జీవిస్తోంది. స్థానికులు ఆమెకు నిత్యం భోజనం అందిస్తుంటారు. వారు వృద్ధురాలికి గాయాలు కావడం గమనించి.. ఏం జరిగిందని ఆరా తీశారు. స్థానికంగా సీసీ కెమెరా దృశ్యాలు పరిశీలించారు. అదే పరిసరాల్లో డిగ్రీ చదువుతున్న యువకుడు పర్వేజ్.. వృద్ధురాలిపై దారుణంగా దాడి చేసినట్లు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. మతిస్థిమితం లేని వృద్ధురాలు తనపై ఇష్టానుసారంగా మాట్లాడటంతో.. సహనం కోల్పోయి దాడి చేసినట్లు యువకుడు చెప్పాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని