Telangana News: మరికొన్ని గంటల్లో పెళ్లి.. గుండెపోటుతో వరుడి మృతి

మరికొన్ని గంటల్లో ఆనందోత్సాహాల మధ్య వివాహం జరగాల్సిన ఇంట్లో విషాదం నెలకొంది. గుండెపోటుతో యువకుడు మృతిచెందడం ఆ కుటుంబానికి తీరని గుండెకోతను మిగిల్చింది.

Published : 26 Jan 2023 13:56 IST

ఉట్నూరు: మరికొన్ని గంటల్లో ఆనందోత్సాహాల మధ్య వివాహం జరగాల్సిన ఇంట్లో విషాదం నెలకొంది. గుండెపోటుతో యువకుడు మృతిచెందడం ఆ కుటుంబానికి తీరని గుండెకోతను మిగిల్చింది. ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. 

పట్టణంలోని రావుల శంకరయ్యచారి, భూలక్ష్మి దంపతుల పెద్ద కుమారుడు రావుల సత్యనారాయణాచారి(34)కి జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన యువతితో శుక్రవారం వివాహం జరగాల్సి ఉంది. బుధవారం అర్ధరాత్రి వరకు కుటుంబసభ్యులతో కలిసి పెళ్లి వేడుకల ఏర్పాట్లలో నిమగ్నమైన సత్యనారాయణాచారి.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన కుటుంబసభ్యులు అతడిని ఉట్నూరులోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం సత్యనారాయణాచారి మృతిచెందాడు. పెళ్లిబాజాలు మోగాల్సిన ఇంట్లో వరుడి మృత్యువాతతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని