Andhra News: పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. న్యూడ్‌ ఫొటోలు సేకరించి!

 విజయనగరం జిల్లాలో మరో అత్యాచారం వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని

Updated : 07 May 2022 17:13 IST

శృంగవరపుకోట: పెళ్లి పేరుతో బెదిరింపులకు పాల్పడిన ప్రియుడిపై ప్రియురాలు ఫిర్యాదు చేసిన ఘటన విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలో చోటు చేసుకుంది. విజయనగరం ఏఎస్పీ అనిల్‌ కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ముసిడిపల్లి పంచాయతీలో ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న నవీన్‌.. అదే సచివాలయంలో పనిచేస్తున్న ఓ యువతితో గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతి నుంచి న్యూడ్‌ఫొటోలు సేకరించాడు. వీరిద్దరిదీ ఒకే సామాజిక వర్గం కావడంతో ఇరు కుటుంబాలు వీరి పెళ్లికి అంగీకరించాయి. ఈ క్రమంలోనే గత రెండు నెలలుగా ఈ జంట మధ్య గొడవలు జరుగుతున్నాయి.

కాగా, ఇల్లు కడుతున్నాము డబ్బు కావాలంటూ నవీన్‌ యువతి తల్లిదండ్రులను డిమాండ్‌ చేశాడు. దీనికి వారు అంగీకరించకపోవడంతో బెదిరింపులకు పాల్పడ్డాడు. యువతి అభ్యంతరకర చిత్రాలను ఆమె తండ్రికి సెల్‌ఫోన్‌ ద్వారా పంపి.. డబ్బు ఇవ్వకపోతే ఫొటోలను సోషల్‌ మీడియాలో పెడతానంటూ బెదిరింపులకు దిగాడు. ఈ విషయంపై యువతి పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నవీన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏఎస్పీ అనిల్‌ కుమార్‌ తెలిపారు. సమావేశంలో సీఐ సింహాద్రి నాయుడు, ఎస్సైలు తారకేశ్వరరావు, లోవరాజు పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని