ప్రేమ వివాహం.. యువకుడి దారుణహత్య
ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకున్నందుకు యువకుడిని దారుణంగా హత్య చేసిన ఘటన హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
హైదరాబాద్: ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకున్నందుకు యువకుడిని దారుణంగా హత్య చేసిన ఘటన హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. చందానగర్కు చెందిన హేమంత్ అతని ఇంటికి సమీపంలో ఉండే అవంతి ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈవిషయం యువతి తల్లిదండ్రులకు తెలియడంతో గతేడాది నవంబర్ నుంచి ఆమెను ఇంట్లోనే నిర్బంధించి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ క్రమంలో జూన్ 10వ తేదీన అవంతి ఇంటి నుంచి వచ్చేయడంతో ఇద్దరూ కలిసి బీహెచ్ ఈఎల్ సంతోషీమాత ఆలయంలో వివాహం చేసుకున్నారు.
ఈ వివాహాన్ని యువతి తల్లిదండ్రులు, బంధువులు తీవ్రంగా వ్యతిరేకించారు. అవంతి తల్లి దండ్రులకు ఇష్టంలేకపోవడంతో యువజంట గచ్చిబౌలిలోని టీఎన్జీవో కాలనీలో నివాసముంటోంది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం 3 గంటల సమయంలో అవంతి.. బావలు, వదినలు, మామయ్యలు, మరి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మూడు కార్లలో హేమంత్ ఇంటికి వచ్చి ఇద్దరినీ బలవంతంగా కారులో ఎక్కించుకెళ్లారు. మార్గ మధ్యలో అవంతి కారులోంచి దూకేసి తప్పించుకోగా.. హేమంత్ను కొట్టుకుంటూ కారులోనే తీసుకెళ్లారు. ఈవిషయాన్ని హేమంత్ ఫోన్ ద్వారా తల్లిదండ్రులకు సమాచారమివ్వడంతో వారు గచ్చిబౌలి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగినప్పటికీ ఆచూకీ తెలియలేదు. నిన్న సాయంత్రం నుంచి పోలీసులు గాలింపు చేపట్టగా.. శుక్రవారం ఉదయం సంగారెడ్డి జిల్లా కొల్లయ్యగూడెం వద్ద హేమంత్ శవమై కనిపించాడు. ప్రేమ వివాహం ఇష్టం లేని యువతి తండ్రి కిరాయి హంతకులతో హత్య చేయించాడని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకుని పెంచుకున్న కుమారుడ్ని దారుణంగా చంపేశారని హేమంత్ తల్లి రాణి బోరున విలపించారు. వేర్వేరు కులాలు అయినందు వల్లే తమ బిడ్డను పొట్టనపెట్టుకున్నారని ఆరోపించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వారే హత్య చేయించారు: హేమంత్ భార్య అవంతి
‘‘హేమంత్ నేనూ ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. జూన్ 10న వివాహం చేసుకున్నాం. పెళ్లి తర్వాత చందానగర్ పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్కు వెళ్లాం. నా పేరిట ఉన్న ఆస్తులన్నీ కుటుంబ సభ్యులకు రాసిచ్చేశా. అప్పటి నుంచి వారికి దూరంగా గచ్చిబౌలిలో ఉంటున్నాం. మా నాన్నకు ఇష్టం లేకుంటే నన్ను చంపాలి. ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది నేను. మా బావలు, వదినలు, మామయ్యలు, ఇద్దరు రౌడీలు నిన్న సాయంత్రం మూడు కార్లలో వచ్చి మమ్మల్ని బలవంతంగా లాక్కెళ్లారు. నేను మధ్యలో కారులోంచి దూకేసి తప్పించుకున్నాను. హేమంత్ను రౌడీలు కొట్టుకుంటూ కారులో తీసుకెళ్లారు. నిందితులు కొల్లూరులో ఓఆర్ఆర్ ఎక్కి పటాన్ చెరులో దిగారు. మా బావలు, వదినలు, మామయ్యలే ఈ హత్య చేయించారు’’ అని హేమంత్ భార్య అవంతి మీడియాకు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంజాయి మిల్క్షేక్!
గంజాయి విక్రేతలు కొత్త పంథా అనుసరిస్తున్నారు. హ్యాష్ ఆయిల్.. చాక్లెట్లుగా మార్చి విక్రయించడం పాత ట్రెండు.. ఇప్పుడు గంజాయిని పొడిగా చేసి విక్రయిస్తున్నారు. -
మావోయిస్టులకు శరాఘాతం!
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా ఉత్తర బస్తర్ డివిజన్ కమిటీ భారీ మూల్యం చెల్లించుకుంది. -
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడి దుర్మరణం
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని నార్కట్పల్లి-అద్దంకి రహదారి నల్గొండ జిల్లా కేంద్రంలో భారాస నాయకుడు మృతిచెందారు. -
జువెనైల్ హోమ్ నుంచి ఎనిమిది మంది పరారీ
కిటికీ గ్రిల్స్ తొలగించి జువెనైల్ హోమ్ నుంచి ఎనిమిది మంది బాలురు పరారైన ఘటన మేడ్చల్ జిల్లా గాజులరామారంలో సంచలనం సృష్టించింది. -
తప్పుడు ప్రకటనలతో మందుల విక్రయం
జ్వరాన్ని నయం చేస్తుందని తప్పుడు ప్రకటనలతో విక్రయిస్తున్న మందులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
గుజరాత్లో రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం
గుజరాత్లో ఆగివున్న చమురు ట్యాంకర్ను వేగంగా వెళుతున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా 10 మంది దుర్మరణం చెందినట్లు పోలీసులు తెలిపారు. -
అనంత్నాగ్లో బిహార్ కూలీని కాల్చిచంపిన ఉగ్రవాదులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రవాదులు మరోమారు పేట్రేగిపోయారు. బుధవారం అనంత్నాగ్ జిల్లాలో బిహార్కు చెందిన కూలీని కాల్చి చంపారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!