పట్టపగలే ఒంగోలులో యువకుడి హత్య

ఒంగోలు గాంధీ పార్కు వద్ద థామస్ అనే యువకుడిని పట్టపగలే దంపతులు హత్య చేశారు.

Updated : 16 Dec 2020 05:57 IST

ఒంగోలు: ఒంగోలు గాంధీ పార్కు వద్ద థామస్ అనే యువకుడిని పట్టపగలే దంపతులు హత్య చేశారు. యువకుడిని చంపిన అనంతరం నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఒంగోలులోని ఓ వస్ర్తదుకాణంలో థామస్‌ పనిచేస్తున్నట్టు గుర్తించారు. హత్యకు సంబంధించిన సమాచారంతో ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని ఒంగోలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.

థామస్‌కు ఉదయం ఫోన్‌కాల్‌ రావడంతో ఇంటి నుంచి హడావుడిగా బయటికి వచ్చాడని అతని తల్లిదండ్రులు తెలిపారు. పక్కా ప్రణాళికతోనే అతన్ని  పార్కుకు రప్పించి హత్య చేసినట్లు ఆరోపించారు. నిందితుల్లో ఒకరైన మహిళకు థామస్‌కు గతంలో వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కాగా, వీరిద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ మహిళ భర్తతో కలిసి థామస్‌ను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

 

ఇదీ చదవండి..
వివాహేతర సంబంధం.. తీసింది ప్రాణం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని