Tadepalli: లారీలో ఉండగానే ఇసుక లోడింగ్‌.. యువకుడి అనుమానాస్పద మృతి

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం గుండిమెడలో బండారు వర్మ అనే యువకుడు అనుమానాస్పదరీతిలో మృతిచెందాడు.

Updated : 11 May 2023 14:45 IST

తాడేపల్లి: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం గుండిమెడలో బండారు వర్మ అనే యువకుడు అనుమానాస్పదరీతిలో మృతిచెందాడు. ఇసుకరీచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. బండారు వర్మ లారీలో ఉండగానే జేసీబీతో ఇసుకను లోడ్‌ చేశారు. దీంతో ఇసుకలో కూరుకుపోయి యువకుడు మృతిచెందాడు. మృతదేహాన్ని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. బండారు వర్మను యడ్లపాడు మండలం బోయపాలెం వాసిగా పోలీసులు గుర్తించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని