Ap News: పుట్టినరోజే మృత్యు ఒడికి
స్నేహితుడి పుట్టినరోజు సందర్భంగా యువకులంతా సందడిగా గడిపారు. అందరూ కలిసి భోజనాలు చేసి సరదాగా గడిపేందుకు సముద్ర తీరానికి వెళ్లారు. అక్కడ కాసేపు ఆడిపాడుతూ గడిపేశారు.
సముద్రంలో గల్లంతై నలుగురు యువకులు మృతి
కవిటి: స్నేహితుడి పుట్టినరోజు సందర్భంగా యువకులంతా సందడిగా చేశారు. అందరూ కలిసి భోజనాలు చేసి సరదాగా సముద్ర తీరానికి వెళ్లారు. అక్కడ కాసేపు ఆడిపాడారు. కానీ వారి సంతోషం ఎంతో సేపు ఉండలేదు. సెల్ఫీలు తీసుకుంటూ ప్రమాదవశాత్తు వారిలో నలుగురు సముద్రంలో గల్లంతయ్యారు. ఈ హృదయవిదారక ఘటన శ్రీకాకుళం జిల్లా కవిటి మండలంలోని పుక్కళ్లపాలెం సముద్ర తీరంలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కవిటి మండలం బొర్రపుట్టుగకు చెందిన సాయి లోకేశ్ పుట్టినరోజు సందర్భంగా మరో 18 మంది యువకులతో కలిసి వేడుక నిర్వహించారు. అక్కడే అందరూ కలిసి భోజనం చేసిన తర్వాత 19 మంది యువకులు పుక్కళ్లపాలెం సముద్ర తీరానికి వెళ్లారు. వారిలో ఐదుగురు సెల్ఫీలు తీసుకునేందుకు సముద్రంలోకి దిగారు. సెల్ఫీలు తీసుకుంటున్న క్రమంలో అలల ఉద్ధృతి ఎక్కవ కావడంతో ప్రమాదవశాత్తు సముద్రంలో గల్లంతయ్యారు. సాయి లోకేశ్(20), తిరుమల(17), మనోజ్కుమార్(21), గోపీచంద్ నీటిలో గల్లంతవగా.. శ్రీరాం ప్రాణాలతో బయటపడ్డాడు. గల్లంతైన ముగ్గురి మృతదేహాలు లభించాయి. మరో యువకుడు గోపిచంద్ కోసం గాలిస్తున్నారు. చీకటి పడటంతో గాలింపు చర్యలు నిలిపివేశారు. సమాచారం అందుకున్న కాశిబుగ్గ డీఎస్పీ శివరామిరెడ్డి, ఎస్సై అప్పారావు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఇచ్ఛాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు మృతి చెందడంతో బొర్రపుట్టుగ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్