Andhra News: వైఎస్ కొండారెడ్డి జిల్లా బహిష్కరణకు చర్యలు.. కలెక్టర్కు ఎస్పీ ప్రతిపాదనలు
ఎస్ఆర్కే కన్స్ట్రక్షన్స్ గుత్తేదారును బెదిరించిన కేసులో అరెస్టైన వైఎస్ కొండారెడ్డి ఇవాళ బెయిల్పై విడుదలయ్యారు. సీఎం జగన్ ఆదేశాలతో కడప పోలీసులు కొండారెడ్డిని అరెస్టు
కడప: ఎస్ఆర్కే కన్స్ట్రక్షన్స్ గుత్తేదారును బెదిరించిన కేసులో అరెస్టైన వైఎస్ కొండారెడ్డి ఇవాళ బెయిల్పై విడుదలయ్యారు. సీఎం జగన్ ఆదేశాలతో కడప పోలీసులు కొండారెడ్డిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కొండారెడ్డిని జిల్లా నుంచి బహిష్కరించేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. బహిష్కరణపై జిల్లా ఎస్పీ అన్బురాజన్ కలెక్టర్కు ప్రతిపాదనలు పంపించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. బెదిరింపులు, అవినీతి, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా బెదిరిస్తే 100, 14400, 94407-96900 నంబర్లను సంప్రదించి సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు.
అసలేం జరిగింది..
నంద్యాల జిల్లా చాగలమర్రి- అన్నమయ్య జిల్లా రాయచోటి మధ్య 143 కిలోమీటర్ల... రహదారులు, భవనాల శాఖ రహదారిని కేంద్రం నేషనల్ హైవేగా గుర్తించి రూ.350 కోట్లు కేటాయించింది. గుత్తేదారు రవికుమార్రెడ్డికి చెందిన ఎస్ఆర్కే కన్స్ట్రక్షన్స్ సంస్థ 30 శాతం లెస్తో టెండరు దక్కించుకుని పనులు చేపట్టింది. చక్రాయపేట పరిధిలో 4 కి.మీ. పొడవున్న రహదారి పనుల్లో తనకు భాగస్వామ్యం వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మండల వైకాపా ఇన్ఛార్జి, సీఎం జగన్ బంధువు వైఎస్ కొండారెడ్డి డిమాండు చేశాడు. లేదంటే పనులు జరగనివ్వనని బెదిరించాడు. ఈ వ్యవహారం గుత్తేదారు వియ్యంకుడు, కర్ణాటక మంత్రి శ్రీరాములు వరకు వెళ్లింది. ఆయన దిల్లీలోని భాజపా అగ్రనేతలకు పరిస్థితిని తెలపగా వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ ఉదంతంలో కదలిక వచ్చింది. కొండారెడ్డిని అరెస్టు చేయాలని సీఎం జగన్ నుంచి వచ్చిన ఆదేశాలతో జిల్లా పోలీసులు ఆదివారమే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సోమవారం అధికారికంగా అరెస్టు చూపి, రిమాండుకు తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
Crime News: తమ పొరుగునే ఉంటున్న వ్యక్తి చేతిలో ఓ యువతి లైంగిక దోపిడీకి గురైంది. శారీరకంగా హింస అనుభవించింది. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.