Kadapa: సచివాలయంలో సర్వేయర్పై వైకాపా కార్యకర్త దాడి
వైఎస్సార్ కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం నేలటూరు గ్రామ సచివాలయ సర్వేయర్పై అధికార పార్టీ కార్యకర్త దాడి చేశాడు.
బ్రహ్మంగారిమఠం: వైఎస్సార్ కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం నేలటూరు గ్రామ సచివాలయ సర్వేయర్పై అధికార పార్టీ కార్యకర్త దాడి చేశాడు. సచివాలయంలోకి వచ్చిన వైకాపా కార్యకర్త నాగమల్లేశ్వర్రెడ్డి అక్కడున్న సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. కార్యాలయంలో సర్వేయర్ సునీల్ వర్కు చేసుకుంటుండగా.. కార్యాలయ భవనం పైకి వెళ్లి పిచ్చాపాటిగా మాట్లాడుకోవాలని మరో వ్యక్తిని వెంటబెట్టుకొని వచ్చాడు. ఈరోజు సెలవు.. కార్యాలయంలోకి రావొద్దని సునీల్ వారించడంతో నాగమల్లేశ్వర్రెడ్డి ఆగ్రహించాడు. ‘మా గ్రామంలోని కార్యాలయంలోకి మా ఇష్టానుసారం వస్తాం. నువ్వెవరు చెప్పేదానికి’ అంటూ సర్వేయర్ సునీల్పై దాడికి దిగాడు. ఈ ఘటనలో సునీల్ తలకు గాయమైంది. ఈ విషయంపై బ్రహ్మంగారిమఠం పోలీసులకు ఫిర్యాదు చేసి, ఉన్నతాధికారులకు సమాచారం తెలియజేసినట్టు బాధితుడు సునీల్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Child Selling Racket: పేద తల్లులే లక్ష్యం.. శిశు విక్రయ ముఠా గుట్టు రట్టు
పిల్లల్ని విక్రయిస్తున్న ముఠా గుట్టును బెంగళూరు పోలీసులు రట్టు చేశారు. తమిళనాడులోని వైద్యుల సాయంతో ఈ ముఠా నడుస్తున్నట్లు తెలుస్తోంది. -
Girl Kidnap: బాలిక కిడ్నాప్.. రూ.10 లక్షల డిమాండ్
ఆరేళ్ల బాలిక కిడ్నాప్ అంశం సుఖాంతమైంది. పోలీసుల విస్త్రృత తనిఖీలు చేయడంతో భయపడిన కిడ్నాపర్లు ఆమెను ఓ గ్రౌండ్లో వదిలేసి పరారయ్యారు. -
Robbery: ప్రముఖ నగల దుకాణంలో 25కిలోల బంగారు ఆభరణాలు చోరీ
ప్రముఖ నగల దుకాణంలో భారీ చోరీ జరిగింది. కోయంబత్తూరులోని జోస్ ఆలుక్కాస్ గోల్డ్ షాప్లో దాదాపు 25కిలోల బంగారు ఆభరణాలను దుండగులు ఎత్తుకెళ్లారు. -
కన్నకూతుళ్లను కీచకులకు అప్పగించిన తల్లికి.. 40 ఏళ్ల జైలు శిక్ష..!
Crime News: మాతృత్వాన్ని మరిచిన ఓ తల్లి కన్న కుమార్తెలను ఘోరమైన మనో వేదనకు గురిచేసింది. ఆమె చర్యలను తీవ్రంగా ఖండించిన కోర్టు.. 40 ఏళ్ల జైలు శిక్షను విధించింది. -
వృత్తలేఖినితో 108 సార్లు పొడిచారు
మధ్యప్రదేశ్లోని ఇందౌర్లో దారుణ ఘటన వెలుగుచూసింది. చిన్న ఘర్షణ కారణంగా నాలుగో తరగతి చదువుతున్న ఓ బాలుడిపై తోటి విద్యార్థులు వృత్తలేఖిని(జామెట్రీ కంపాస్)తో 108 సార్లు పొడిచారు. -
ఎలుగుబంటి దాడిలో విశాఖ జూ ఉద్యోగి మృతి
విశాఖ జంతు ప్రదర్శనశాలలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎలుగుబంటి దాడిలో దాన్ని సంరక్షించే ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు. -
ఆటో, ఇసుక లారీ ఢీ.. తండ్రీ కుమారుల దుర్మరణం
కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం రంగపేటస్జేజీ వద్ద సోమవారం రాత్రి ఆటోను ఇసుక లారీ ఢీకొనడంతో తండ్రీకుమారులు దుర్మరణం చెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. -
ఏపీలో.. బాలికల వసతిగృహంలో ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య
ఏపీలోని పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం యలమందలోని నరసరావుపేట ఇంజినీరింగ్ కళాశాల (ఎన్ఈసీ)లో బీటెక్ రెండో ఏడాది చదువుతున్న విద్యార్థిని కోలగట్ల రేచల్రెడ్డి (19) ఆత్మహత్యకు పాల్పడింది. -
యూపీలో యువకుడిపై మూత్రం.. నలుగురి అరెస్టు
ఉత్తర్ ప్రదేశ్లోని మేరఠ్లో ఒక యువకుడిని తీవ్రంగా కొట్టి మూత్రం పోసిన కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇంకా ముగ్గురు నిందితులను అరెస్టు చేయాల్సి ఉంది.


తాజా వార్తలు (Latest News)
-
Child Selling Racket: పేద తల్లులే లక్ష్యం.. శిశు విక్రయ ముఠా గుట్టు రట్టు
-
Paris: బీచ్లు, పార్కుల్లో ధూమపానంపై నిషేధం!
-
Yanamala: ఆందోళనకర స్థితిలో ఏపీ ఆర్థిక పరిస్థితి: యనమల రామకృష్ణుడు
-
Social Look: చీరలో మాళవిక హొయలు.. జాక్వెలిన్ ట్రిప్
-
YSRCP: వైకాపాలో భగ్గుమన్న అసమ్మతి.. ఆమంచికి వ్యతిరేకంగా భారీ ర్యాలీ
-
Israel-Hamas: ‘హమాస్ వలలో పడొద్దు..తుపాకీ గురిపెట్టి నవ్విస్తున్నారు: ఇజ్రాయెల్ సైన్యం