బతికున్నా.. చంపేస్తున్నారు..!
మోమిన్పేట్ మండలం బూరుగుపల్లిలో బుచ్చమ్మ (పక్క చిత్రం) అనే మహిళ బతికి ఉండగానే మృతి చెందిదంటూ తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రం తయారు చేశారు. అది నిజమే అంటూ తహసీల్దారూ ఆమోదించారు. అనంతరం వంశ వృక్షం వేసి ఆ భూమి వారసురాలు ఈమే అంటూ ఓ మహిళ పేరిట పేర్లు మార్పించారు (మ్యుటేషన్). దాన్ని వారం తిరగకముందే వేరొరికి అమ్ముకున్నారు. అన్నీ చకచకా జరిగిపోయాయి. ఈ భూమి విలువ అక్షరాలా రూ.8 కోట్లపైమాటే అని అంచనా. సర్వే నంబరు
తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రాలతో భూముల బదలాయింపు
తరచూ వెలుగులోకి...
పట్టించుకోని అధికారులు
ఈనాడు డిజిటల్, వికారాబాద్
* మోమిన్పేట్ మండలం బూరుగుపల్లిలో బుచ్చమ్మ (పక్క చిత్రం) అనే మహిళ బతికి ఉండగానే మృతి చెందిదంటూ తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రం తయారు చేశారు. అది నిజమే అంటూ తహసీల్దారూ ఆమోదించారు. అనంతరం వంశ వృక్షం వేసి ఆ భూమి వారసురాలు ఈమే అంటూ ఓ మహిళ పేరిట పేర్లు మార్పించారు (మ్యుటేషన్). దాన్ని వారం తిరగకముందే వేరొరికి అమ్ముకున్నారు. అన్నీ చకచకా జరిగిపోయాయి. ఈ భూమి విలువ అక్షరాలా రూ.8 కోట్లపైమాటే అని అంచనా. సర్వే నంబరు 46, 49లలో 3 ఎకరాల భూమికి 2005 నుంచి 2014 వరకు నాలుగు దఫాలు రిజిస్ట్రేషన్ జరిగింది. కొంత కాలంగా మ్యుటేషన్ పెండింగ్లో ఉంది. సంబంధిత వ్యక్తులు తరచూ రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం కనిపించలేదు. అయితే ఇటీవల భూమికి సంబంధించి వారసులమంటూ ఓ మహిళ రావడం, గతంలో రిజిస్ట్రేషన్ పత్రాలను రద్దు చేసి, బతికి ఉన్న వ్యక్తిని మృతి చెందినట్లు చూపించి, మా భూమిని అక్రమంగా వేరొకరికి రిజిస్ట్రేషన్ చేసిన తహసీల్దార్పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బాధితులు కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం కలకలం రేపింది.
* ధారూర్ మండలంలోనూ రెండు నెలల క్రితం ఇదే తరహా సంఘటన వెలుగులోకి వచ్చింది. మొయినాబాద్కు చెందిన మహిళకు ధారూర్ మండలంలో వ్యవసాయ పొలం ఉంది. ఆమె ‘మృతి చెందింది’ అంటూ తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే రెవెన్యూ ఉద్యోగి తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించి, వేరొకరి పేరిట రిజిస్ట్రేషన్ చేయించాడు. తీరా విషయం బయటకు రావడంతో కొన్నాళ్ల పాటు పోలీసులకు చిక్కకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అనంతరం ముందస్తు బెయిల్ తీసుకుని దర్జాగా తిరుగుతున్నాడు. ఈయన విషయంలో కొంత మంది ప్రజా ప్రతినిధులు పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందించారని సమాచారం.
సజీవంగా ఉన్నా.. వారు ‘చనిపోయారంటూ’ తప్పుడు మరణ ‘ధ్రువీకరణ’ పత్రాలను సృష్టించడం.. క్షేత్ర స్థాయిలో పరిశీలించాం.. అది వాస్తవమే అంటూ నిర్ధరించం రెవెన్యూ అధికారులకు అలవాటుగా మారిపోతోంది. అనంతరం సదరు వ్యక్తులకు చెందాల్సిన భూముల మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకోవడం, పేరు మార్పిడి అయిన వెంటనే రూ.కోట్ల విలువైన భూములను అమ్ముకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ వ్యవహారంలో అక్రమంగా రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. అయితే తప్పు చేసినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నా ఉన్నతాధికారులు ఆ ఉద్యోగులపై చర్యలు తీసుకోవడానికి మీనమేషాలు లెక్కిస్తున్నారు. బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పెద్దగా ఫలితం కనిపించడం లేదు. దీంతో జిల్లాలో మళ్లీమళ్లీ అదే తరహా సంఘటనలు పునరావృతం కావడం ఆందోళన కలిగిస్తోంది.
లోపాలే ఆసరా... అంతా కుమ్మక్కు
జిల్లా కేంద్రమైన వికారాబాద్, మోమిన్పేట్, పూడూరు, పరిగి, నవాబుపేట్ మండలాల్లో భూములకు విపరీతమైన ధరలు ఉన్నాయి. ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లినా ఎకరం కనీసం రూ.53 లక్షల నుంచి రూ.1.30 కోట్లు పలుకుతోంది. దీంతో రెవెన్యూ శాఖలో పనిచేసే కొంత మంది ఉన్నత, మధ్యస్థాయి సిబ్బంది బయటి వ్యక్తులతో కలిసి లోపాలను ఆసరాగా చేసుకుని పావులు కదుపుతున్నారు. తగాదాల్లో ఉన్నవి, కొన్నాళ్లుగా ఎవరూ పట్టించుకోని భూములను లక్ష్యంగా చేసుకుని, నకిలీ సంతకాలతో కొత్త ధ్రువ పత్రాలు సృష్టిస్తున్నారు. ధరణి పోర్టల్లో అంతా సరి చేస్తున్నారు. ఆనక అమ్మకానికి పెడుతున్నారు.
* వికారాబాద్ మండలం బూర్గుపల్లిలో రూ.5 కోట్ల విలువైన 7 ఎకరాల భూమి అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో ఔట్ సోర్సింగ్ సిబ్బందిని బాధ్యులుగా చేసి, ఇతర ఉన్నతాధికారులు తప్పించుకున్నారు. ఇదే మండలంలో ఈ తరహా సంఘటనలో మరో మూడు వెలుగులోకి వచ్చాయి.
* పరిగి మండలంలో ప్రభుత్వం సాదాబైనామాలను నిలిపివేసిన తరువాత తహసీల్దార్ ఆన్లైన్ చేసి, వేరే వ్యక్తులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను జారీ చేశారు. ఈ సందర్భంలోనూ ఉన్నతాధికారులు గుట్టుగానే వ్యవహరించారనే విమర్శలొచ్చాయి. చర్యల శూన్యం.
* పూడూరు మండలంలో 14 ఎకరాల దేవాదాయ భూములను ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారు, ఫోర్జరీ సంతకాలు చేసిన వ్యక్తులు దర్జాగా తిరుగుతున్నారు. మరెన్నో సందర్భాల్లో రెవెన్యూ సిబ్బంది అక్రమాలు స్పష్టంగా కనిపిస్తున్నా జిల్లా ఉన్నతాధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంపై సర్వత్రా విమర్శలొస్తున్నాయి. ఈ విషయమై రెవెన్యూ విభాగంలోని ఓ ఉన్నతాధికారిని వివరణ కోరగా పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా పాలనాధికారి సైతం భూముల పేర్ల బదలాయింపులో జరుగుతున్న అక్రమాలపై పూర్తి విచారణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విదేశాలకు వెళ్లాల్సింది.. అనంతలోకాలకు..
[ 24-04-2024]
విదేశాలలో ఉన్నత చదువుకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్న ఓ యువకుడిని బస్సు రూపంలో మృత్యువు వెంటాడింది. -
ఎండలో తిరుగుతున్నారా.. జాగ్రత్త!
[ 24-04-2024]
క్రమంగా ఎండలు పెరుగుతున్నాయి. పగలు ఎండ వేడి తీవ్రమైన నేపథ్యంలో దాని తీవ్రత నుంచి రక్షించుకునేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎం.రాజారావు సూచించారు. -
యానిమేషన్ సినీ కథా రచయిత ఆత్మహత్య
[ 24-04-2024]
అప్పుల బాధ తట్టుకోలేక ఓ యానిమేషన్ సినిమా కథ రచయిత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రాయదుర్గం ఎస్ఐ మన్మథ]రావు తెలిపిన వివరాల ప్రకారం.. -
ఆన్లైన్ రుణం.. తీసుకోకున్నా నరకం
[ 24-04-2024]
లోన్యాప్ నేరగాళ్లు మరో అడుగు ముందుకేసి సరికొత్త పద్ధతుల్లో నరకం చూపిస్తున్నారు. ఇప్పటివరకు యాప్ల ద్వారా రుణం ఇచ్చి.. -
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
[ 24-04-2024]
జియాగూడలోని ఫ్రఖ్యాత రంగనాథస్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడు శృంగారం రాజగోపాలాచార్యులు (55) హఠాన్మరణం చెందారు. -
సికింద్రాబాద్ స్టేషన్లో టిక్కెట్ కౌంటర్ల పెంపు
[ 24-04-2024]
వేసవి సెలవులు ఇవ్వడంతో ప్రయాణాలు పెరిగాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు ప్రయాణికులు పోటెత్తుతున్నారు. క్యూఆర్ కోడ్తో టిక్కెట్లు తీసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ ప్రయాణికులు బారులు తీరాల్సి వస్తోంది. -
హనుమా.. నగర శోభ కనుమా
[ 24-04-2024]
రామలక్ష్మణ జానకీ.. జై బోలో హనుమాన్కీ నినాదాలు.. డప్పు చప్పుళ్లు, డీజే మోతలు.. యువత కేరింతలు.. పటిష్ఠ పోలీసు బందోబస్తు మధ్య వీర హనుమాన్ విజయయాత్ర ఘనంగా జరిగింది. -
బలం ఉంది.. భరోసా కొరవడింది
[ 24-04-2024]
రాజధాని పరిధిలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారాసకు బలమైన నేతలున్నారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశిస్తే చాలు దూసుకుపోయే క్యాడర్ ఉంది. -
నేతల చూపు యువత వైపు
[ 24-04-2024]
పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంటున్న దరిమిలా నేతలు నెమ్మదిగా ప్రచారంపై దృష్టి సారిస్తున్నారు. పార్టీల అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. -
నాయకుల హుషారు.. నామినేషన్ల జోరు
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా మంగళవారం 48 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ప్రజారోగ్యంతో బంతాట
[ 24-04-2024]
కోటి మంది జనాభా ఉన్న హైదరాబాద్ నగరంలో ప్రజారోగ్యానికి భరోసా కొరవడింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఆహారకల్తీని అరికట్టేందుకు ప్రభుత్వం 24 మంది ఆహార భద్రతాధికారులను నియమించగా అందులో ప్రస్తుతం పనిచేస్తున్నది ఏడుగురు మాత్రమే. -
ఓటేద్దాం.. వేయిద్దాం
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల ఎన్నికల అధికారులు కె.శశాంక, గౌతమ్లు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. -
వర్షపు నీటిని ఒడిసి పడదాం..
[ 24-04-2024]
వర్షపు నీటిని ఒడిసిపట్టి రాజధానిలో భూగర్భ జలాలను పెంచడంతో పాటు ప్లంబర్లకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ‘ది రెయిన్వాటర్ ప్రాజెక్టు’, జీహెచ్ఎంసీ, జలమండలి, ఈపీటీఆర్ఐ, పీసీబీ కలిసి ప్రారంభించిన ‘రెయిన్వాటర్ హార్వెస్టింగ్’ శిక్షణ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. -
కంటోన్మెంట్లో మూడు నామినేషన్లు దాఖలు
[ 24-04-2024]
ప్రస్తుతం తన చేతిలో రూ.1,45,000 నగదు, ఎస్బీఐ అశోక్నగర్ శాఖలో రూ.5 వేల నగదు, కార్ఖానా వాసవినగర్లోని కెనరా బ్యాంకులో -
ఉద్యానమా.. ఆక్రమించేద్దాం!
[ 24-04-2024]
చుట్టూ బహుళ అంతస్తుల భవనాలు.. గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణాలు.. దుండిగల్ మున్సిపాలిటీలోని మల్లంపేటకు కిలోమీటర్ దూరంలో బాహ్య వలయ రహదారి.. -
ఆదరిస్తే.. వందేళ్లకు సరిపడా అభివృద్ధి
[ 24-04-2024]
అయిదేళ్లపాటు జరిగే అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ను ఆదరిస్తే పాలమూరు జిల్లాను వందేళ్లకు సరిపడా అభివృద్ధి చేసి చూపిస్తానని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
స్థానికంగా కీలకం.. ప్రగతిలో భాగస్వామ్యం
[ 24-04-2024]
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సమీపిస్తుండటంతో ఎంపీ అభ్యర్థుల ప్రచార సందడి మొదలైంది. అభ్యర్థుల నామపత్రాల సమర్పణ సైతం తుది దశకు వస్తుండటంతో ప్రచారపర్వం వేగవంతం చేస్తున్నారు. -
విధులు నిర్వర్తించినా... ఓటేయొచ్చు!
[ 24-04-2024]
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశ్యంతో ఎన్నికల సంఘం పలు కార్యక్రమాలు చేపడుతోంది. -
ఐపీఎల్ మ్యాచ్.. అర్ధరాత్రి వరకు మెట్రో సేవల పొడిగింపు
[ 24-04-2024]
ఉప్పల్ స్టేడియంలో గురువారం జరిగే ఐపీఎల్ నేపథ్యంలో మెట్రో సేవలు అర్ధరాత్రి వరకు పొడిగిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. -
విశ్రాంత ఐఏఎస్కు రూ.1.89 కోట్లకు టోకరా
[ 24-04-2024]
సైబర్ నేరగాళ్లకు చిక్కిన విశ్రాంత ఐఏఎస్ అధికారి రూ.1.89 కోట్లు పోగొట్టుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన ఓ మహిళ ఫారెక్స్ ట్రేడింగ్ చేస్తే లాభాలు వస్తాయని ఈ మొత్తం కొట్టేసింది. -
తల్లి ప్రవర్తన నచ్చక.. హత్య చేసిన కుమారుడు
[ 24-04-2024]
తల్లి ప్రవర్తన నచ్చక కుమారుడే హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుండిగల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
కొరియర్ పేరుతో వైద్యురాలికి టోకరా
[ 24-04-2024]
కొరియర్లో డ్రగ్స్ పార్సిల్ వచ్చిందని సైబర్ నేరస్థులు బెదిరించి వైద్యురాలి నుంచి నగదు కొట్టేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. -
మ్యాట్రిమోని వేదిక.. ఒంటరి మహిళలకు వల
[ 24-04-2024]
డిగ్రీ మధ్యలోనే ఆపేసిన ఓ యువకుడు సైబర్ నేరగాడి అవతారం ఎత్తాడు. వితంతువులు, విడాకులు తీసుకున్న ఒంటరి మహిళల్ని మ్యాట్రిమోని వేదికల ద్వారా సంప్రదించి పెళ్లి చేసుకుంటానంటూ మోసాలు చేస్తున్నాడు. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
[ 24-04-2024]
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్