హెచ్ఎండీఏలో.. అమ్మో.. అక్రమార్కులు!
మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోని పట్టణ ప్రణాళిక విభాగాల్లో అక్రమార్కుల బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో జరుగుతున్న కూల్చివేతల్లో ఈ అక్రమాల పుట్ట కదులుతోంది. పలు మున్సిపాలిటీల్లో అనుమతులు లేకుండా భవనాలు నిర్మించడం, వాటిని చట్టబద్ధం చేసేందుకు సిబ్బంది సహాయ సహకారాలు అందిస్తున్నారు. అనుమతులు తీసుకొని నిర్మించిన భవనాన్ని పట్టణ ప్రణాళిక అధికారులు
అనుమతి లేని ఇళ్ల నుంచి పన్నుల వసూలు
భవనాల కూల్చివేతల్లో వెలుగులోకి వాస్తవాలు
4 జోన్ల పరిధిలో 40 మందిపై చర్యలకు సిద్ధం
దూలపల్లిలో అక్రమ నిర్మాణాలను కూలుస్తున్న సిబ్బంది
ఈనాడు, హైదరాబాద్: మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోని పట్టణ ప్రణాళిక విభాగాల్లో అక్రమార్కుల బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో జరుగుతున్న కూల్చివేతల్లో ఈ అక్రమాల పుట్ట కదులుతోంది. పలు మున్సిపాలిటీల్లో అనుమతులు లేకుండా భవనాలు నిర్మించడం, వాటిని చట్టబద్ధం చేసేందుకు సిబ్బంది సహాయ సహకారాలు అందిస్తున్నారు. అనుమతులు తీసుకొని నిర్మించిన భవనాన్ని పట్టణ ప్రణాళిక అధికారులు తనిఖీలు చేసి, అతిక్రమణలు లేకుంటే నివాసయోగ్య పత్రం జారీ చేస్తారు. అప్పుడే ఎంత పన్ను అనేది నిర్ణయిస్తున్నారు. హెచ్ఎండీఏ పరిధిలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఇందుకు భిన్నంగా జరుగుతున్నట్లు తేలింది. అనుమతులు లేకుండానే భవనాలు నిర్మించగా, వాటికే పన్ను వసూలు చేయడం విస్తు గొలుపుతోంది. తాజాగా మేడ్చల్ జోన్లో చేపట్టిన కూల్చివేతల్లో ఈ తరహా అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఈ జోన్లోని నాలుగు మున్సిపాలిటీల్లో వందల సంఖ్యలో ఇలాంటి భవనాలున్నట్లు తెలుస్తోంది. ఇతర జోన్లలో ఇదే పరిస్థితి నెలకొంది. నగరానికి పక్కనే ఉన్న మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో 7 కార్పొరేషన్లు, 22 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటి పరిధిలో పెద్ద ఎత్తున అక్రమ భవనాలు వెలిశాయి. కొన్ని రోజులుగా హెచ్ఎండీఏ స్థానిక రెవెన్యూ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ సిబ్బందితో కలిపి వీటిని గుర్తించే పనిలో పడింది. ఇప్పటివరకు 600 చదరపు గజాలు ఆపై ఉన్న భవనాలను 200వరకు గుర్తించారు. ఇందులో 60కి పైగా భవనాలను సిబ్బంది పాక్షికంగా కూల్చివేశారు. జీప్లస్ 2 నిర్మాణాలకు సంబంధిత మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అనుమతులు ఇస్తాయి. అంతకు మించితే హెచ్ఎండీఏలో దరఖాస్తు చేసుకోవాలి. చాలామంది జీప్లస్2కే అనుమతి తీసుకొని అయిదు, ఆరు అంతస్తులు నిర్మిస్తున్నారు. 600 గజాలు ఆపైన స్థలాల్లో అనుమతులు లేకుండా భారీ షెడ్లు ఇతర నిర్మాణాలు చేపడుతున్నారు. భారీ అపార్ట్మెంట్లు నిర్మించి వాటిని విక్రయించి ప్రజలను మోసగిస్తున్నారు.
ఇంటి దొంగల హస్తంపై ఆరా
* హెచ్ఎండీఏ పరిధిలో మేడ్చల్, ఘట్కేసర్, శంకర్పల్లి, శంషాబాద్ జోన్లు ఉన్నాయి. ఇక్కడి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పట్టణ ప్రణాళి విభాగాలు అవినీతి నిలయాలుగా మారాయనటానికి పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలే నిరద్శనంగా నిలుస్తున్నాయి.
* ఈ నాలుగు జోన్ల పరిధిలో తొలి విడతలో 600 గజాలు ఆపైన అక్రమ నిర్మాణాలను 200 వరకు హెచ్ఎండీఏ గుర్తించింది. మరో 600 వరకు ఈ తరహా భవనాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
* నగరాన్ని ఆనుకుని ఈ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఉండటంతో స్థలాలకు భారీగా డిమాండ్ పెరిగింది. హెచ్ఎండీఏ నుంచి అనుమతులు తీసుకొని వెంచర్లు, నిర్మాణాలు చేపట్టాలంటే లేఅవుట్ రుసుంలు, అభివృద్ధి ఛార్జీల పేరుతో పెద్ద మొత్తంలో చెల్లించాలి. నిర్మాణాలు పూర్తయ్యే వరకు హెచ్ఎండీఏ వద్ద స్థలాలు, లేదా ఫ్లాట్లు తనఖా పెట్టాలి. కొందరు ఈ నిబంధనలు పాటించక కుండా అక్రమ పద్ధతులను ఎంచుకుంటున్నారు.
* నాలుగు జోన్లలో భారీగా అక్రమ భవనాలు రావడంలో స్థానిక పట్టణ ప్రణాళిక విభాగం హస్తం ఉందనేది బహిరంగ రహస్యమే. స్తిరాస్థి వ్యాపారులతో కొందరు సిబ్బంది కుమ్మక్కై వాటాలు తీసుకొని అక్రమ భవనాలను ప్రోత్సహిస్తున్నట్లు హెచ్ఎండీఏ అధికారుల వద్ద పక్కా సమాచారం ఉంది.
* మేడ్చల్లో తాజాగా పలు భవనాలకు అక్రమంగా ఆస్తి పన్ను గుర్తింపు సంఖ్య(పీటీఐఎన్)నెంబర్లు కేటాయించి ఆస్తి పన్నులు సైతం వసూలు చేస్తున్న వైనం ఓ ఉన్నతాధికారి దృష్టికి వచ్చింది. సంబంధిత ఉద్యోగిని పిలిచి ప్రశ్నించారు. ఆ భవనాలను ఉన్నతాధికారి సీజ్ చేయించారు.
* ఇలా నాలుగు జోన్ల పరిధిలో దాదాపు 40-50 పట్టణ ప్రణాళిక సిబ్బంది హస్తంతోనే ఈ అక్రమాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఒక్కో భవనం నుంచి లక్షల్లోనే వసూలు చేసి పంచుకున్నారు. ఈ అక్రమాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు.
* క్షేత్రస్థాయి సిబ్బందికి మెమోలు జారీ చేయాలని నిర్ణయించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బల్దియా హస్తగతం!
[ 29-03-2024]
గ్రేటర్లో పార్టీని బలోపేతం చేయడానికి అధికార కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తోంది. రాష్ట్రంలో అనేక పురపాలక సంఘాలు, నగరపాలక సంఘాల పరిధిలో గత ఎన్నికల్లో భారాస అభ్యర్థులు గెలిచినా కూడా చాలా చోట్ల వీరంతా కాంగ్రెస్లో చేరుతున్నారు. -
భయపెడుతున్న భువన్
[ 29-03-2024]
మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఇంటిపన్నులు భయపెడుతున్నాయి. భువన్ సర్వే పేరుతో ఆస్తిపన్ను మదింపు చేయించిన మున్సిపల్ అధికారులు ఆ సర్వే ప్రకారం ఇళ్ల విస్తీర్ణం ఆధారంగా పన్ను జారీ చేస్తున్నారు. -
భూ వినియోగ మార్పిడి దస్త్రాల్లో కదలిక
[ 29-03-2024]
ఎట్టకేలకు హెచ్ఎండీఏ పరిధిలోని భూ వినియోగ మార్పిడి(ల్యాండ్ యూజ్ కన్వర్షన్) దస్త్రాలకు మోక్షం లభించనుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆగిన ఈ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. -
మూలికా వనం.. కబ్జాల పరం
[ 29-03-2024]
జవహర్నగర్ కార్పొరేషన్లో ప్రారంభించిన మూలికా వనం(హెర్బల్ గార్డెన్)ను ఆక్రమించేందుకు కొందరు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ వనంలో పదుల సంఖ్యలోనే మొక్కలుండగా, వాటి సంరక్షణనూ మున్సిపల్, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. -
రూ.44.68 కోట్ల లోటుతో ఉస్మానియా వర్సిటీ బడ్జెట్
[ 29-03-2024]
ఉస్మానియా విశ్వవిద్యాలయం వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. కామర్స్ విభాగం సీనియర్ ప్రొఫెసర్ అప్పారావు జమా ఖర్చులను గురువారం ప్రకటించారు. -
వైద్యుల చొరవతో ఏడేళ్లకు కుటుంబ సభ్యుల చెంతకు
[ 29-03-2024]
మానసిక సమస్యలతో ఇంటి నుంచి వెళ్లిపోయిన ఓ బాధితుడు ఎర్రగడ్డలోని మానసిక చికిత్సాలయం వైద్యుల చొరవతో ఏడేళ్ల తరువాత కుటుంబ సభ్యుల చెంతకు చేరారు. -
సన్నని ధార...చాలని సరఫరా
[ 29-03-2024]
ఒకవైపు గ్రేటర్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోగా.. జలమండలి అరకొర నీటి సరఫరా...అందులో తక్కువ ఒత్తిడితో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
24 గంటలూ.. ట్యాంకర్లతో నీటి సరఫరా
[ 29-03-2024]
వచ్చేనెల మొదటి వారం నుంచి గ్రేటర్వ్యాప్తంగా 24 గంటలపాటు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయనున్నట్లు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ తెలిపారు. ఇందుకు అదనంగా 250 ట్యాంకర్లు, 24 ఫిల్లింగ్ కేంద్రాలను అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. -
నిబంధన ఎగ్గొట్టి.. రసాయనంతో మగ్గబెట్టి
[ 29-03-2024]
మధురఫలంగా పేరుగాంచిన మామిడి పండుపైన రసాయనక మరక పడుతోంది. ఇష్టానుసారం కార్బైడ్, ఇథలిన్ రసాయనాలు విచ్చలవిడిగా వినియోగించి మగ్గబెట్టేస్తున్నారు. ఇటీవల టాస్క్ఫోర్సు పోలీసులు, జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేసి రూ.12లక్షల విలువైన మామిడికాయలను పట్టుకున్నారు. -
పైసలు కాదు.. ప్రయాణమే ముఖ్యం
[ 29-03-2024]
ఇరవై కిలోమీటర్ల సిటీ బస్సు ప్రయాణానికి రూ.35.. 20 కిలోమీటర్ల మెట్రో ప్రయాణానికి రూ.50 వసూలు చేస్తున్నారు.. 20 కిలోమీటర్ల ఎంఎంటీఎస్ ప్రయాణానికి కేవలం రూ.5 మాత్రమే. బస్సులో గంటలకొద్దీ ప్రయాణ సమయం పడుతున్నా.. -
నిప్పు పొంచి ఉన్న ముప్పు
[ 29-03-2024]
భానుడి భగభగలకు నగరం ఉక్కిరిబిక్కిరవుతోంది. గురువారం ఉష్ణోగ్రత 39.8 డిగ్రీలకు చేరుకుంది. మున్ముందు ఇది మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. మండే ఎండలకు తోడు తేమ శాతం తగ్గి అగ్నిప్రమాదాలు పెరుగుతున్నాయి. -
రూ.3 కోట్ల వజ్రం రూ.30లక్షలకే అంటూ మోసానికి యత్నం
[ 29-03-2024]
రూ.కోట్ల విలువైన వజ్రాన్ని రూ.లక్షలకే విక్రయిస్తామని ప్రజలను నమ్మిస్తున్న ముఠాను హబీబ్నగర్ పోలీసులు అరెస్ట్చేశారు. సౌత్వెస్ట్ డీసీపీ ఉదయ్కుమార్రెడ్డి కథనం ప్రకారం.. ముంబాయి, ఠాగూర్నగర్ విక్రిల్ ఈస్ట్ ప్రాంతానికి చెందిన బాలచంద్ర తులేరే (48) మూడురోజుల క్రితం నగరానికి వచ్చాడు. -
బిస్కెట్ తయారీ పరిశ్రమలో అగ్నిప్రమాదం
[ 29-03-2024]
కాటేదాన్ పారిశ్రామికవాడలోని పహల్ఫుడ్ బిస్కెట్ పరిశ్రమలో గురువారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు, పరిశ్రమ మేనేజర్ సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం.. -
కార్ల గోదాంలో మంటలు.. ఆరు వాహనాలు దగ్ధం
[ 29-03-2024]
గండిపేట మండలం ఖానాపూర్ సమీపంలోని ఓ కార్ల గోదాంలో గురువారం మధ్యాహ్నం చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో మరమ్మతులకు గురైన వాహనాలు ఆహుతయ్యాయి. నగరానికి చెందిన ఓ వ్యాపారి మరమ్మతులకు గురయిన కార్లను ఖానాపూర్ సమీపంలోని ఓ గోదాంలో నిల్వ ఉంచారు. -
చేయి లేకున్నా.. సైకిల్ యాత్ర
[ 29-03-2024]
ఈ చిత్రంలో కనిపిస్తున్న సైక్లిస్టు తమిళనాడుకు చెందిన బి.తమీమ్ అన్సారీ. 2003లో తాను పనిచేసే కర్మాగారంలో ప్రమాదవశాత్తూ కుడి చేతిని కోల్పోయారు. ఆ సమయంలో చికిత్సకు ఖర్చులు, ఆర్థిక ఇబ్బందులు తోడవటంతో ప్రమాద బీమా వంటివి లేక ఆవస్థలు పడ్డారు. -
ప్రత్యర్థులు వారే... పార్టీలు వేరే
[ 29-03-2024]
ఐదేళ్ల కిందట లోక్సభ ఎన్నికల్లో వారిద్దరూ ప్రత్యర్థులు.. ఒకరు భారాస అభ్యర్థిగా నామినేషన్ వేస్తే, మరొకరు భారాసకు రాజీనామా చేసి కాంగ్రెస్ నుంచి పోటీ పడ్డారు. హోరాహోరీ పోరులో భారాస అభ్యర్థి డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డి 14వేలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. -
ఉప్పల్లో సినీ నటి నిధి అగర్వాల్ సందడి
[ 29-03-2024]
40 ఏళ్లుగా వస్త్ర వ్యాపార రంగంలో తెలుగు రాష్ట్రాల్లో అగ్రగామిగా సీఎంఆర్ వస్త్ర దుకాణం నిలిచిందని సినీతార నిధి అగర్వాల్ కొనియాడారు. -
ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
[ 29-03-2024]
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక గురువారం ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి జిల్లాలో 1,439 ఓట్లకుగాను 1,437 ఓట్లు పోలయ్యాయి. ఓటేసిన వాళ్లలో 19 మంది ఎక్స్అఫీషియో సభ్యులు కూడా ఉన్నారు. -
రంజాన్ జోష్.. అత్తర్లకు క్రేజ్
[ 29-03-2024]
రంజాన్ నేపథ్యంలో పాతనగరంలో అత్తర్ల అమ్మకాలు జోరందుకున్నాయి. ముఖ్య పండగలు, పెళ్లిళ్ల సీజన్లలో అత్తర్కు గిరాకీ ఎక్కువగా ఉన్నా.. రంజాన్ మాసంలో అనేక రకాల ఫ్లేవర్లకు డిమాండ్ అధికంగా ఉంటోంది. -
కొడంగల్ వృద్ధితోనే.. ఉపాధి అవకాశాలు సమృద్ధి: టీఆర్ఆర్
[ 29-03-2024]
‘ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొడంగల్ను అభివృద్ధి చేస్తున్నారు. ఆ ప్రభావం పరిగి, తాండూర్, పాలమూరు మీద పడి అవి కూడా పురోగమించి మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయని’ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, పరిగి శాసన సభ్యులు రామ్మోహన్రెడ్డి అన్నారు. -
‘భారాస విజయానికి కృషి చేద్దాం’
[ 29-03-2024]
చేవెళ్ల లోక్సభ ఎన్నికల్లో భారాస తప్పక విజయం సాధిస్తుందని తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్రెడ్డి అన్నారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ విజయం సాధించేందుకు కార్యకర్తలు, నాయకులు గట్టిగా కృషి చేయాలని చెప్పారు. -
మోదీ పాలనతోనే గ్రామాల్లో మార్పు: కొండా
[ 29-03-2024]
కేంద్రంలో భాజపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామాల్లో అనేక రకాలుగా మార్పు వచ్చిందని చేవెళ్ల పార్లమెంట్ భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా గురువారం మిట్టకంకల్, కడ్మూరు, మేడిపల్లి కలాన్ గ్రామాల్లో పర్యటించారు. -
మహమ్మారిపై అప్రమత్తత అవసరం
[ 29-03-2024]
ప్రమాదకర ఎయిడ్స్పై అప్రమత్తత అవసరమని, ఎయిడ్స్పై సందేహాలు ఉన్నవారు ఉచిత హెల్ప్లైన్ నంబరు 1097ను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ జీవరాజ్ అన్నారు. -
బ్యాలెట్ పెట్టెలో ఫలితం నిక్షిప్తం
[ 29-03-2024]
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. ప్రధాన పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ఏ ఒక్క ఓటూ చేజారిపోకుండా జాగ్రత్త పడ్డారు. ఉమ్మడి జిల్లాలో 1,439 ఓట్లకుగాను 1,437 ఓట్లు పోలయ్యాయి. -
ఇసుక అక్రమ నిల్వ.. అదనుచూసి విక్రయం
[ 29-03-2024]
తాండూరు పరిసరాల్లోని కాగ్నా, కాకర వేణి నదుల నుంచి కొల్లగొడుతున్న ఇసుకను అక్రమార్కులు తమకు అనుకూలంగా ఉన్న ప్రదేశాల్లో నిల్వ చేస్తున్నారు. నదుల్లో అనుమతుల పేరిట తవ్వకాలు ఆగిపోయినపుడు నిల్వ చేసిన ఇసుకను డిమాండును బట్టి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
[ 29-03-2024]
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్