logo

బాల్య మిత్రుల్ని బలిగొన్న అతివేగం

అతివేగం, నిర్లక్ష్యానికి ఇద్దరు మిత్రులు ప్రాణాలు కోల్పోయారు. రాంగోపాల్‌పేట ఠాణా పరిధిలోని కర్భలామైదానం కూడలి వద్ద శనివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం..

Published : 24 Jan 2022 01:43 IST

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం

బన్సీలాల్‌పేట్‌, న్యూస్‌టుడే: అతివేగం, నిర్లక్ష్యానికి ఇద్దరు మిత్రులు ప్రాణాలు కోల్పోయారు. రాంగోపాల్‌పేట ఠాణా పరిధిలోని కర్భలామైదానం కూడలి వద్ద శనివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓల్డ్‌బోయిగూడకు చెందిన రోహిత్‌(27) ఈవెంట్‌ ఆర్గనైజర్‌. గాస్‌మండిప్రాంతానికి చెందిన అఖిల్‌(27) ప్రైవేటు ఉద్యోగి. వీరిద్దరు బాల్య స్నేహితులు. శనివారం అర్ధరాత్రి ద్విచక్రవాహనంపై నెక్లెస్‌రోడ్డు నుంచి వస్తూ ప్యారడైజ్‌ వైపు వెళ్లేందుకు కర్భలామైదానం కూడలి వద్ద ఎడమవైపు తిప్పారు. ట్యాంక్‌బండ్‌ నుంచి ప్యారడైజ్‌ వైపు వేగంగా వస్తున్న గుర్తుతెలియని లారీ ఒక్కసారిగా వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. కిందపడిన వీరిని స్థానికులు, పోలీసులు ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే అఖిల్‌ మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు. రోహిత్‌ చికిత్స పొందుతూ మృతిచెందాడు. రోహిత్‌ ఈవెంట్‌ ఆర్గనైజర్‌గా పనిచేస్తూ కుటుంబానికిఅండగా ఉంటున్నాడు. అతని తండ్రి గతంలో ప్రమాదానికి గురై ఇంటి వద్దే ఉంటున్నాడు. ఇటీవలే సోదరి వివాహం జరిగింది. అఖిల్‌ బీటెక్‌ పూర్తిచేసి ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు