Corona Virus: పాజిటివ్ ఇస్తాం.. నెగెటివ్గా మారుస్తాం!
కరోనా వైరస్ వచ్చినట్టు ధ్రువపత్రం కావాలా? విదేశాలకు వెళ్లేందుకు వీలుగా నెగెటివ్ రిపోర్టు ఇవ్వాలా? రెండు డోసుల టీకా సర్టిఫికేట్లు మీ స్మార్ట్ఫోన్కు పంపించాలా? ఏ ధ్రువపత్రం కావాలన్నా సిద్ధం.. అంటూ కొందరు దందాకు
నకిలీ ధ్రువపత్రాల పేరుతో నేరస్థుల దందా
ఆధార్.. ఫోన్నంబర్లతో టీకా ధ్రువపత్రాలు
ఈనాడు, హైదరాబాద్: కరోనా వైరస్ వచ్చినట్టు ధ్రువపత్రం కావాలా? విదేశాలకు వెళ్లేందుకు వీలుగా నెగెటివ్ రిపోర్టు ఇవ్వాలా? రెండు డోసుల టీకా సర్టిఫికేట్లు మీ స్మార్ట్ఫోన్కు పంపించాలా? ఏ ధ్రువపత్రం కావాలన్నా సిద్ధం.. అంటూ కొందరు దందాకు తెరలేపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో టీకా డోసులు, ఆర్టీపీసీఆర్ పరీక్షలకు ప్రాధాన్యం పెరగడంతో పరీక్షలు చేయించుకోకుండానే కొందరు నేరస్థులు ధ్రువపత్రాలు, టీకా డోసులు ఇచ్చేస్తున్నారు. ఐదారునెలల నుంచి గుట్టుగా ఈ వ్యవహారం కొనసాగుతోంది. వీరిని పోలీసులు అరెస్ట్ చేస్తుండడంతో ఒకటి, రెండూ అక్రమాలు బయటకు వస్తున్నాయి. అపహరణ కేసులో నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటోన్న మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవ రామ్ కోర్టు విచారణకు హాజరు కాలేనంటూ 4 నెలల క్రితం కరోనా పాజిటివ్ రిపోర్టు సమర్పించడంతో ఆ ధ్రువపత్రం ఇచ్చిన ల్యాబ్ సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన అనంతరం చాంద్రాయణగుట్టలో అక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తిని పట్టుకుని జైలుకు పంపించారు.
నమూనా సేకరణ కేంద్రాల్లో..
వైరస్ వ్యాప్తిని అడ్డుకొనేందుకు ప్రైవేటు, కార్పొరేటు సంస్థలు, విమానయాన సంస్థలు చర్యలు చేపట్టాయి. తమ ఉద్యోగుల్ని ఇతర ప్రాంతాలకు పంపాలన్నా, ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి రప్పించాలన్నా.. 48 గంటల ముందు ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి చేయడంతో రెండు నెలల నుంచి ఈ పరీక్షలకు గిరాకీ పెరిగింది. స్వల్ప లక్షణాలున్న వారిలో కొందరు తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లేందుకు నెగెటివ్ ధ్రువపత్రం కోసం రూ.2 వేల నుంచి రూ.3 వేలు చెల్లిస్తున్నారు. మరికొందరు పనుల నుంచి తప్పించుకునేందుకు, సెలవులు కావాలనుకున్నప్పుడు వైరస్ లక్షణాలు లేకపోయినా పాజిటివ్ ధ్రువపత్రం కావాలంటూ ల్యాబ్ల నుంచి కొంటున్నారు. డయాగ్నస్టిక్ సెంటర్లు, ల్యాబ్లపై నిఘా లేమితో ఇవన్నీ జరుగుతున్నాయి.
టీకా నమోదు ఐడీల ద్వారా
టీకాలు వేసుకోకున్నా వేసుకున్నట్లు డబ్బు తీసుకుని ధ్రువపత్రాలు ఇస్తున్నారు. టీకా పంపిణీ కార్యక్రమాన్ని వేగంగా పూర్తిచేయాలంటూ కేంద్రం ఆదేశించడంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ, కార్పొరేటు ఆసుపత్రుల సిబ్బందికి నమోదుకు గుర్తింపు ఐడీలను ఇచ్చారు. పొరుగు సేవల సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు టీకా వేసుకోవాల్సిన వారి పేర్లు, ఫోన్నంబర్లు ఆధార్కార్డులు తీసుకుని నమోదు చేస్తున్నారు. వీటిని ఆసరాగా చేసుకున్న నేరస్థులు పొరుగుసేవల సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలకు డబ్బులిచ్చి టీకాలు వేయకున్నా వేసుకున్నట్టు ధ్రువపత్రాలు తీసుకుంటున్నారు. కింది స్థాయి సిబ్బంది ఫోన్నంబర్లు, ఆధార్కార్డులను తీసుకుని పరిశీలించకుండానే కొవిన్ పోర్టల్లో నమోదు చేస్తున్నారు. ఇటీవల చనిపోయిన వ్యక్తికి టీకా వేసినట్టు ఆయన గతంలో వాడిన చరవాణికి సందేశం వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సినీ హీరో వెంకటేశ్ వియ్యంకుడు
[ 24-04-2024]
తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా విడుదలైంది. -
విదేశాలకు వెళ్లాల్సింది.. అనంతలోకాలకు..
[ 24-04-2024]
విదేశాలలో ఉన్నత చదువుకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్న ఓ యువకుడిని బస్సు రూపంలో మృత్యువు వెంటాడింది. -
ఎండలో తిరుగుతున్నారా.. జాగ్రత్త!
[ 24-04-2024]
క్రమంగా ఎండలు పెరుగుతున్నాయి. పగలు ఎండ వేడి తీవ్రమైన నేపథ్యంలో దాని తీవ్రత నుంచి రక్షించుకునేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎం.రాజారావు సూచించారు. -
యానిమేషన్ సినీ కథా రచయిత ఆత్మహత్య
[ 24-04-2024]
అప్పుల బాధ తట్టుకోలేక ఓ యానిమేషన్ సినిమా కథ రచయిత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రాయదుర్గం ఎస్ఐ మన్మథ]రావు తెలిపిన వివరాల ప్రకారం.. -
ఆన్లైన్ రుణం.. తీసుకోకున్నా నరకం
[ 24-04-2024]
లోన్యాప్ నేరగాళ్లు మరో అడుగు ముందుకేసి సరికొత్త పద్ధతుల్లో నరకం చూపిస్తున్నారు. ఇప్పటివరకు యాప్ల ద్వారా రుణం ఇచ్చి.. -
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
[ 24-04-2024]
జియాగూడలోని ఫ్రఖ్యాత రంగనాథస్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడు శృంగారం రాజగోపాలాచార్యులు (55) హఠాన్మరణం చెందారు. -
సికింద్రాబాద్ స్టేషన్లో టిక్కెట్ కౌంటర్ల పెంపు
[ 24-04-2024]
వేసవి సెలవులు ఇవ్వడంతో ప్రయాణాలు పెరిగాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు ప్రయాణికులు పోటెత్తుతున్నారు. క్యూఆర్ కోడ్తో టిక్కెట్లు తీసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ ప్రయాణికులు బారులు తీరాల్సి వస్తోంది. -
హనుమా.. నగర శోభ కనుమా
[ 24-04-2024]
రామలక్ష్మణ జానకీ.. జై బోలో హనుమాన్కీ నినాదాలు.. డప్పు చప్పుళ్లు, డీజే మోతలు.. యువత కేరింతలు.. పటిష్ఠ పోలీసు బందోబస్తు మధ్య వీర హనుమాన్ విజయయాత్ర ఘనంగా జరిగింది. -
బలం ఉంది.. భరోసా కొరవడింది
[ 24-04-2024]
రాజధాని పరిధిలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారాసకు బలమైన నేతలున్నారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశిస్తే చాలు దూసుకుపోయే క్యాడర్ ఉంది. -
నేతల చూపు యువత వైపు
[ 24-04-2024]
పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంటున్న దరిమిలా నేతలు నెమ్మదిగా ప్రచారంపై దృష్టి సారిస్తున్నారు. పార్టీల అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. -
నాయకుల హుషారు.. నామినేషన్ల జోరు
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా మంగళవారం 48 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ప్రజారోగ్యంతో బంతాట
[ 24-04-2024]
కోటి మంది జనాభా ఉన్న హైదరాబాద్ నగరంలో ప్రజారోగ్యానికి భరోసా కొరవడింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఆహారకల్తీని అరికట్టేందుకు ప్రభుత్వం 24 మంది ఆహార భద్రతాధికారులను నియమించగా అందులో ప్రస్తుతం పనిచేస్తున్నది ఏడుగురు మాత్రమే. -
ఓటేద్దాం.. వేయిద్దాం
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల ఎన్నికల అధికారులు కె.శశాంక, గౌతమ్లు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. -
వర్షపు నీటిని ఒడిసి పడదాం..
[ 24-04-2024]
వర్షపు నీటిని ఒడిసిపట్టి రాజధానిలో భూగర్భ జలాలను పెంచడంతో పాటు ప్లంబర్లకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ‘ది రెయిన్వాటర్ ప్రాజెక్టు’, జీహెచ్ఎంసీ, జలమండలి, ఈపీటీఆర్ఐ, పీసీబీ కలిసి ప్రారంభించిన ‘రెయిన్వాటర్ హార్వెస్టింగ్’ శిక్షణ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. -
కంటోన్మెంట్లో మూడు నామినేషన్లు దాఖలు
[ 24-04-2024]
ప్రస్తుతం తన చేతిలో రూ.1,45,000 నగదు, ఎస్బీఐ అశోక్నగర్ శాఖలో రూ.5 వేల నగదు, కార్ఖానా వాసవినగర్లోని కెనరా బ్యాంకులో -
ఉద్యానమా.. ఆక్రమించేద్దాం!
[ 24-04-2024]
చుట్టూ బహుళ అంతస్తుల భవనాలు.. గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణాలు.. దుండిగల్ మున్సిపాలిటీలోని మల్లంపేటకు కిలోమీటర్ దూరంలో బాహ్య వలయ రహదారి.. -
ఆదరిస్తే.. వందేళ్లకు సరిపడా అభివృద్ధి
[ 24-04-2024]
అయిదేళ్లపాటు జరిగే అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ను ఆదరిస్తే పాలమూరు జిల్లాను వందేళ్లకు సరిపడా అభివృద్ధి చేసి చూపిస్తానని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
స్థానికంగా కీలకం.. ప్రగతిలో భాగస్వామ్యం
[ 24-04-2024]
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సమీపిస్తుండటంతో ఎంపీ అభ్యర్థుల ప్రచార సందడి మొదలైంది. అభ్యర్థుల నామపత్రాల సమర్పణ సైతం తుది దశకు వస్తుండటంతో ప్రచారపర్వం వేగవంతం చేస్తున్నారు. -
విధులు నిర్వర్తించినా... ఓటేయొచ్చు!
[ 24-04-2024]
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశ్యంతో ఎన్నికల సంఘం పలు కార్యక్రమాలు చేపడుతోంది. -
ఐపీఎల్ మ్యాచ్.. అర్ధరాత్రి వరకు మెట్రో సేవల పొడిగింపు
[ 24-04-2024]
ఉప్పల్ స్టేడియంలో గురువారం జరిగే ఐపీఎల్ నేపథ్యంలో మెట్రో సేవలు అర్ధరాత్రి వరకు పొడిగిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. -
విశ్రాంత ఐఏఎస్కు రూ.1.89 కోట్లకు టోకరా
[ 24-04-2024]
సైబర్ నేరగాళ్లకు చిక్కిన విశ్రాంత ఐఏఎస్ అధికారి రూ.1.89 కోట్లు పోగొట్టుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన ఓ మహిళ ఫారెక్స్ ట్రేడింగ్ చేస్తే లాభాలు వస్తాయని ఈ మొత్తం కొట్టేసింది. -
తల్లి ప్రవర్తన నచ్చక.. హత్య చేసిన కుమారుడు
[ 24-04-2024]
తల్లి ప్రవర్తన నచ్చక కుమారుడే హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుండిగల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
కొరియర్ పేరుతో వైద్యురాలికి టోకరా
[ 24-04-2024]
కొరియర్లో డ్రగ్స్ పార్సిల్ వచ్చిందని సైబర్ నేరస్థులు బెదిరించి వైద్యురాలి నుంచి నగదు కొట్టేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. -
మ్యాట్రిమోని వేదిక.. ఒంటరి మహిళలకు వల
[ 24-04-2024]
డిగ్రీ మధ్యలోనే ఆపేసిన ఓ యువకుడు సైబర్ నేరగాడి అవతారం ఎత్తాడు. వితంతువులు, విడాకులు తీసుకున్న ఒంటరి మహిళల్ని మ్యాట్రిమోని వేదికల ద్వారా సంప్రదించి పెళ్లి చేసుకుంటానంటూ మోసాలు చేస్తున్నాడు. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
[ 24-04-2024]
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..