logo

Crime News: పెళ్లి కోసం పురోహితుడిని ఆశ్రయిస్తే.. ప్రేమ పేరిట మోసం!

పెళ్లి కోసం పురోహితుడిని ఆశ్రయిస్తే ప్రేమ పేరుతో మోసం చేశాడని ఆరోపిస్తూ ఆయన ఇంటి ఎదుటే యువతి ధర్నాకు దిగింది. బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం..

Updated : 24 Jan 2022 08:03 IST

జవహర్‌నగర్‌, న్యూస్‌టుడే: పెళ్లి కోసం పురోహితుడిని ఆశ్రయిస్తే ప్రేమ పేరుతో మోసం చేశాడని ఆరోపిస్తూ ఆయన ఇంటి ఎదుటే యువతి ధర్నాకు దిగింది. బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్‌నగర్‌ ఠాణా పరిధి దమ్మాయిగూడకు చెందిన యువతి పెళ్లి కావడం లేదని, సంబందాలు ఉంటే చెప్పాలని స్థానిక పురోహితుణ్ని ఆశ్రయించారు. మంచి సంబంధం కుదుర్చుతానని చెప్పడంతో నమ్మి అతడు చెప్పినట్లు చేశారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి కొన్నిరోజులుగా కనిపించడం లేదంటూ, తనకు న్యాయం చేయాలని బాధితురాలు కుటుంబ సభ్యులతో కలిసి పురోహితుడి ఇంటి ఎదుట ఆదివారం ధర్నా చేపట్టారు. దీనిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని సీఐ చంద్రశేఖర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని