ఆంక్షల వలయంలోకి కమ్యూనిటీలు
కరోనా కేసుల పెరుగుదల.. ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావంతో గేటెడ్ కమ్యూనిటీలు, అపార్టుమెంట్లలో ప్రజలు అప్రమత్తమయ్యారు. పలుచోట్ల స్వచ్ఛందంగా ఆంక్షలు విధిస్తున్నారు. శానిటైజేషన్పై అధిక శ్రద్ధ పెడుతున్నారు. ఇందుకు నెలకు ప్రత్యేకంగా కొంత
కరోనా తీవ్రతతో గేటెడ్, అపార్టుమెంట్లలో అప్రమత్తం
ఆటస్థలాలు, ఈతకొలనుల మూసివేత
బాధిత కుటుంబాలకు ఎప్పటికప్పుడు సాయం
ఈనాడు, హైదరాబాద్; న్యూస్టుడే, మియాపూర్, కేపీహెచ్బీకాలనీ
మైహోం జ్యువెల్లో క్రిమి సంహారక మందు పిచికారి
కరోనా కేసుల పెరుగుదల.. ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావంతో గేటెడ్ కమ్యూనిటీలు, అపార్టుమెంట్లలో ప్రజలు అప్రమత్తమయ్యారు. పలుచోట్ల స్వచ్ఛందంగా ఆంక్షలు విధిస్తున్నారు. శానిటైజేషన్పై అధిక శ్రద్ధ పెడుతున్నారు. ఇందుకు నెలకు ప్రత్యేకంగా కొంత మొత్తాన్ని కేటాయిస్తున్నారు. కొన్ని నెలలుగా కరోనా కేసులు లేకపోవడంతో అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో ప్రత్యేకంగా నిబంధనలు అమలు చేయలేదు. ఇటీవల కేసులు పెద్దసంఖ్యలో పెరుగుతుండడంతో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు నివాసిత సంక్షేమ సంఘాలు చెబుతున్నాయి. వీలైనంత వరకు సమూహాల సంఖ్యను తగ్గించడంపై దృష్టి పెట్టాయి. పిల్లల ఆటస్థలాలు, టెన్సిస్ కోర్టులు, క్లబ్ హౌస్లు, వాణిజ్య కార్యకలాపాలను అనుమతించడం లేదని పేర్కొంటున్నాయి. ‘‘జాగ్రత్తలు తీసుకుంటున్నాం.. లిఫ్టులను శానిటైజ్ చేయిస్తున్నాం. సీ బ్లాక్లో కొన్ని నిబంధనలు అమల్లోకి వచ్చాయి.’’ అని మూసాపేటలోని రెయిన్బో విస్టాస్ నివాసితుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు ఆకెళ్ల శ్రీరామ్ వివరించారు.
ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులు
కరోనా కేసులు వచ్చిన కుటుంబాలుండే ఫ్లాట్లకు ప్రత్యేకంగా స్టిక్కర్లు అతికిస్తూ.. బారికేడ్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏడు రోజులపాటు ఐసోలేషన్లో ఉండేందుకు సూచిస్తున్నారు. ప్రత్యేక వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి బాధిత కుటుంబాలకు అవసరమైన సరకులు సరఫరా చేస్తున్నారు. కేపీహెచ్బీలోని మలేషియన్ టౌన్షిప్లో ఆటస్థలాలను తాత్కాలికంగా మూసివేశారు. నివాసితులు బయట సంచరించే సమయంలో మాస్కు తప్పనిసరిగా పెట్టుకునేలా పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా పర్యవేక్షకులను ఏర్పాటు చేసినట్లు టౌన్షిప్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సురేశ్ వివరించారు.
ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు సిద్ధం
మదీనాగూడలోని మైహోం జ్యువెల్ కమ్యూనిటీలో 2 వేల ఫ్లాట్లు ఉన్నాయి. సంక్షేమ సంఘం నాయకులు అప్రమత్తమై 24 గంటలు అందుబాటులో ఉండేలా ‘కొవిడ్ రెస్పాన్స్ టీం’ను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసి సదరు బృందం సాయంతో బాధితులకు సరకులు, మందులు చేరవేస్తున్నారు. కమ్యూనిటీలో ప్రత్యేకంగా అంబులెన్స్ అందుబాటులో ఉంచారు. రెండు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఏర్పాటు చేశారు. ఈతకొలనును మూసివేశారు. స్టాళ్ల నిర్వహణ విషయంలో ఆహారం, వస్త్ర సంబంధిత దుకాణాలపై నిబంధనలు విధించి అత్యవసర వస్తువులకే అనుమతిస్తున్నారు.
ప్రతి వీధిలో అవగాహన కల్పిస్తున్నాం
- నందకిశోర్, ప్రధాన కార్యదర్శి, మైహోం జ్యువెల్ యజమానులు సంక్షేమ సంఘం
మా కమ్యూనిటీలోని 14 బ్లాకుల్లో 2 వేల ఫ్లాట్లు ఉన్నాయి. అక్కడక్కడా కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. ప్రతి వీధి తిరుగుతూ మైకుతో అవగాహన కల్పిస్తున్నాం. కమ్యూనిటీలో ఏటా డిసెంబరు 31న రాత్రి భారీ ఎత్తున నూతన సంవత్సర వేడుకలు నిర్వహిస్తుంటాం. ఈసారి వేడుకలను రద్దు చేసి సమూహాలను అనుమతించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం