logo

విద్యుదాఘాతంతో మాజీ సైనికుడు మృత్యువాత

మండలం చందోలులో నీటి కోసం చేతిపంపు కొడుతుండగా ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతి చెందాడు. చందోలు పంచాయతీ పరిధిలోని పెద్దహరిజనవాడకు చెందిన మాజీ సైనికుడు చేబ్రోలు

Published : 20 Jan 2022 04:32 IST

చందోలు (పిట్టలవానిపాలెం), న్యూస్‌టుడే : మండలం చందోలులో నీటి కోసం చేతిపంపు కొడుతుండగా ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతి చెందాడు. చందోలు పంచాయతీ పరిధిలోని పెద్దహరిజనవాడకు చెందిన మాజీ సైనికుడు చేబ్రోలు సునీల్‌కుమార్‌ (36) ఇంటి ఆవరణలో విద్యుత్తు మోటరుతో ఉన్న చేతిపంపును కొడుతుండగా ప్రమాదశాత్తూ పంపునకు విద్యుత్తు సరఫరా జరిగి అక్కడికక్కడే మృతి చెందాడు. అతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చందోలు ఎస్సై శివయ్య తెలిపారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు