కాలువలో కలిసిన ప్రాణాలు
ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడం.. ప్రైవేటు వాహనదారులు నిబంధనలు పాటించకపోవడం.. మారుమూల గ్రామాలు కావడంతో తనిఖీలు చేయాల్సిన అధికారులు పట్టించుకోకపోవడం.. ఇలా కారణాలు ఏవైనా నాలుగు
ఆ.. ప్రయాణం.. దినదిన గండమే!
ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న సీఐ అజయ్బాబు, ఎస్సై కె.రాజు
కడెం, న్యూస్టుడే: ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడం.. ప్రైవేటు వాహనదారులు నిబంధనలు పాటించకపోవడం.. మారుమూల గ్రామాలు కావడంతో తనిఖీలు చేయాల్సిన అధికారులు పట్టించుకోకపోవడం.. ఇలా కారణాలు ఏవైనా నాలుగు నిండు ప్రాణాలు కాలువలో కలిశాయి. నాలుగు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. మైనర్లు ఆటోలు నడపడం, లైసెన్సు లేని వాళ్లు కూడా యథేచ్ఛగా ప్రయాణికులను తీసుకెళ్లడం ఆ మార్గంలో నిత్యం జరిగే తంతు అయినా.. బుధవారం ఘటనతో వారెంతో ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారో అర్థమైంది.
ఆటో కాలువలోకి దూసుకెళ్లి బోల్తాపడిన ఘటనలో మృతిచెందిన నలుగురు నిరుపేదలే. కూలీ పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్న వారు బుధవారం బంధువుల ఇళ్లకు బయల్దేరారు. రెండు కిలోమీటర్ల పరిధిలోని గ్రామాలకు చెందినవారు ఆటో ఎక్కిన క్షణాల్లోనే ప్రమాదం చోటుచేసుకుంది.
బంధువుల ఇంటికి వెళుతుండగా..
ప్రమాదంలో మరణించిన కన్నాపూర్ పంచాయతీ చిన్నక్యాంపునకు చెందిన కోండ్ర శంకరమ్మ బంధువుల ఇంటికి బెల్లాల్ మొర్రిగూడెం వెళ్లేందుకు ఆటో ఎక్కారు. భర్త, పిల్లలులేని ఈమె తన తల్లివద్దనే ఉంటూ కూలీ పనిచేసుకుంటూ జీవిస్తోంది. మరో అర కిలోమీటరు వెళితే ఆటో దిగి ఇంటికి వెళ్లేది. అంతలోనే మృత్యువు కబలించింది.
కాలువలో పడిన ఆటో
నలుగురు ఆడ పిల్లలే..
మరో మహిళ పెద్దబెల్లాల్కు చెందిన చీమల శాంత ప్రమాదం జరిగిన చోటుకు అర కిలోమీటరు ముందే ఆటో ఎక్కింది. ఈమెకు నలుగురు ఆడపిల్లలు.. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం బోర్నపల్లిలో బంధువుల ఇంటికి వెళ్లిన పిల్లలను ఇంటికి తీసుకువచ్చేందుకు బయల్దేరిందని కుటుంబ సభ్యులు తెలిపారు. బిడ్డల్లో ఒక్కరికి కూడా పెళ్లి చేయకుండా అర్ధాంతరంగా మరణించడంతో బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
పరామర్శకు వెళుతూ..
మండలంలోని లింగాపూర్ పంచాయతీ మల్లన్నపేటకు చెందిన బోడ చిన్నరాజమల్లు చిన్నబెల్లాల్లో ఇటీవల తన బంధువొకరు మరణిస్తే వారిని పలుకరిద్దామని బయలుదేరాడు. మరో కిలోమీటరు వెళితే వారింటికి చేరుకునేవాడు. అంతలోనే అనంతలోకానికి వెళ్లడంతో వారి బంధువులు గుండెలవిసేలా విలపించారు.
కుమారుడిని చూడకుండానే..
ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నిర్మల్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మరణించిన శ్రీరాముల లక్ష్మి జగిత్యాల జిల్లా రాయికల్ మండలం బోర్నపల్లిలో ఉండే తన కుమారుని వద్దకని బయలుదేరింది. తల్లి రాకకోసం ఎదురుచూస్తున్న కుమారునికి చేదువార్త వినాల్సి వచ్చింది. గాయపడినా కోలుకుంటుందని ఆసుపత్రికి వెళితే అక్కడ మరణించడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కాగా ఆమె దస్తురాబాద్ మండలం గొడిసిర్యాలలో నివాసముంటోంది.
తనిఖీలు ఎక్కడ..?
ఉపాధి కోసమని ఆటోలు నడుపుతున్న వారిలో కొందరికి లైసెన్సు లేకపోవడం, అనుభవం లేనివారికి యజమానులు ఆటోలు ఇస్తుండటం ప్రమాదాలకు కారణమవుతోంది. బెల్లాల్ వద్ద జరిగిన ప్రమాదంలో ఆటో డ్రైవర్, ఆయనతో ఉన్న మరోవ్యక్తి మైనర్లే కావడం, అజాగ్రత్తగా నడుపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు పేర్కొన్నారు. గ్రామాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టకపోవడం వల్ల ప్రైవేటు వాహనదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
ఆ గ్రామాలకు ప్రైవేటు వాహనాలే దిక్కు..
మండలంలోని బెల్లాల్ గోదావరి నది ఒడ్డున ఉన్న గ్రామం. గోదావరి నదిపై రెండేళ్లక్రితం వంతెన నిర్మించకముందు మారుమూల గ్రామమే. కానీ నిర్మల్- జగిత్యాల జిల్లాలను కలుపుతూ కడెం మండలం బెల్లాల్, జగిత్యాల జిల్లా రాయికల్ మండలం బోర్నపల్లిల మధ్యన రూ.40 కోట్ల వరకు వెచ్చించి వంతెన నిర్మించారు. గతేడాది జగిత్యాల నుంచి బోర్నపల్లి మీదుగా కడెం వరకు ఆర్టీసీ బస్సులు నడిచాయి. లాక్డౌన్ సమయంలో రద్దయిన బస్సులను మళ్లీ పునరుద్ధరించలేదు. దీంతో ఈ దారి వెంట ప్రైవేటు వాహనాల్లోనే ప్రమాదకరమైనా ప్రయాణించక తప్పడం లేదు.
కఠిన చర్యలు తీసుకుంటాం.. - అజయ్బాబు, సీఐ ఖానాపూర్
ఆటోలు, ఇతర వాహనాలు లైసెన్సులేకుండా నడిపితే చర్యలు తీసుకుంటాం. మైనర్లకు వాహనాలు ఇస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో బెల్లాల్ వద్ద జరిగిన ఆటోప్రమాదంతో తెలుసుకోవాలి. పిల్లలకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులు, బండ్ల యజమానులపై కేసు నమోదు చేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దూసుకెళ్తున్న వినియోగం.. షెడ్డుకొస్తున్న నియంత్రికలు
[ 26-04-2024]
జిల్లాలో ఎండలు మండిపోతుండటంతో భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. బోరు బావుల్లో నీరు బాగా లోతుకు వెళుతుండటంతో దాని ప్రభావం నియంత్రికలపై పడి కాలిపోతున్నాయి. -
రెఫరీగా మారి.. ప్రచారం చేసి!
[ 26-04-2024]
సిరికొండ మండలం వాయిపేట్, రాజన్పేట్, చెమ్మన్గూడ తదితర గ్రామాల్లో భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ గురువారం ప్రచారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. -
సివిల్స్ ర్యాంకర్కు గవర్నర్ సన్మానం
[ 26-04-2024]
ఇటీవల ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో జాతీయస్థాయిలో 790 ర్యాంకు సాధించిన రేకులవార్ శుభంతో పాటు వారి తల్లిదండ్రులు జీవిత, సత్యనారాయణలను రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ సన్మానించారు. -
పేదలకు అండగా.. గిరిజన క్యాంటిన్
[ 26-04-2024]
టీ తాగాలన్నా కనీసం రూ.6 వెచ్చించాల్సిందే. అలాంటి పరిస్థితిలో కేవలం రూ.5 లకే అందిస్తున్న భోజనం ఉట్నూరువాసుల కడుపు నింపుతోంది. ఏజెన్సీలోని ఆదిమ గిరిజనుల(పీవీటీజీ)ను ఆదుకునేందుకు ఐటీడీఏ అధికారులు పలు పథకాలను ప్రవేశపెడుతున్నారు. -
రిమ్స్ సంచాలకుడిని బ్లాక్మెయిల్ చేసే యత్నం
[ 26-04-2024]
తాను స్పెషల్ బ్రాంచీ పోలీసునని చెప్పి రిమ్స్ సంచాలకుడు రాఠోడ్ జైసింÞ్ను, గజానంద్ ఆసుపత్రి వైద్యుడు అభిజిత్ నుగుర్వార్ను బ్లాక్ మెయిల్ చేసే యత్నం చేసిన గుర్తు తెలియని వ్యక్తిపై ఆదిలాబాద్ రెండో పట్టణ పోలీసులు గురువారం రాత్రి కేసు నమోదు చేశారు. -
వివాహితపై హెడ్కానిస్టేబుల్ లైంగిక వేధింపులు
[ 26-04-2024]
శాంతి, భద్రతలు కాపాడుతూ ప్రజలకు రక్షణ కల్పించాల్సిన హెడ్ కానిస్టేబుల్ మావల పోలీసు స్టేషన్ పరిధిలోని ఒక కాలనీలో వివాహితపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ సంఘటన గురువారం వెలుగు చూసింది. -
జేఈఈ మెయిన్స్లో గిరిజన విద్యార్థిని ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఉట్నూరు మండలం జైత్రంతండాకు చెందిన గిరిజన విద్యార్థిని చౌహాన్ మేఘన ప్రతిభ కనబర్చి పలువురి మన్ననలు అందుకున్నారు. -
గొలుసుకట్టు వ్యాపారంలో ‘బంపర్ ఆఫర్’
[ 26-04-2024]
అమాయకులను నిండా ముంచిన గొలుసుకట్టు వ్యాపారంలో కంపెనీ ఏజెంట్లకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది. డిపాజిట్దారులకు తిరిగి సొమ్మును చెల్లించే క్రమంలో హైదరాబాద్ నగరశివారులో ఉన్న భూమిని ప్రధాన ఏజెంట్లకు విక్రయించాలని యోచిస్తోంది. -
ఆశీర్వదించండి.. ఎంపీగా గెలిపించండి
[ 26-04-2024]
గోడం నగేష్ను ఆశీర్వదించి గెలిపించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. గురువారం భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ ఎంపీ రమేష్ రాఠోడ్, యువ నాయకుడు రితీష్ రాఠోడ్లతో కలిసి ఉట్నూరు మండలం పులిమడుగు, సాలెవాడ, కోపర్ఘడ్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
కాంగ్రెస్తోనే పేదలకు భవిష్యత్తు
[ 26-04-2024]
కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే పేదల బతుకులు బాగుపడతాయని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ అన్నారు. ఆదివారం పార్టీ నాయకులతో కలిసి పట్టణంలోని ఖానాపూర్, కొలీపుర, బొక్కలగూడ, అంబేడ్కర్నగర్లో రోడ్ షోలో పాల్గొన్నారు. -
తుక్కు పేరిట అక్రమ దందా!
[ 26-04-2024]
అనుమతులు, లైసెన్సులు లేకుండానే పలువురు ‘తుక్కు’ పేరిట జిల్లాలో అక్రమ దందా కొనసాగిస్తున్నారు. జిల్లాలోని ప్రధాన రహదారుల సమీపంలోని పెద్ద ప్రహరీలతో కూడిన గోదాములను ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు సాగిస్తున్నారు. -
నాలుగు గంటల వరకే పోలింగ్
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, పాలనాధికారి వెంకటేష్ ధోత్రే పేర్కొన్నారు. ఓటర్లందరికి ఓటరు చీటీలను అందజేస్తున్నామన్నారు. -
అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం
[ 26-04-2024]
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలైన ఘటన కుమురంభీం జిల్లా బెజ్జూరు మండలం పోతపల్లి-కోర్తేగూడ గ్రామాల మధ్య గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. -
చెట్టు పేరు చెప్పి.. ప్లాట్లు అంటగట్టి..
[ 26-04-2024]
మంచిర్యాల జిల్లా కేంద్రంలో అమ్మకానికి ఖాళీ స్థలాలు లేకపోవడంతో భూఅక్రమ వ్యాపారులు సరిహద్దు గ్రామాల్లోని వ్యవసాయ భూములను నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లుగా మార్చి అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. -
వెల్లువెత్తిన నామినేషన్లు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామపత్రాల స్వీకరణ పర్వం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్ఖాన్ నామపత్రాలు స్వీకరించారు. -
దారి మళ్లించి.. మురుగుకాలువ ఆక్రమించి
[ 26-04-2024]
కబ్జాల తీరు కొంత పుంతలు తొక్కుతోంది. కబ్జాదారులకు హద్దూఅదుపులు లేకుండా పోతుండడంతో వారు రెచ్చిపోతున్నారు. పట్టణంలో మురుగుకాలువలను కబ్జా చేస్తున్నా మున్సిపల్ యంత్రాంగం చోద్యం చూస్తుంది. -
సన్న బియ్యం ధరలు పైపైకి
[ 26-04-2024]
బహిరంగ మార్కెట్లో సన్నబియ్యం ధరలు రోజురోజుకి సామాన్యులకు అందనంత ఎత్తుకు ఎదుగుతున్నాయి. పేద, మధ్య తరగతి కుటుంబాలు సన్నబియ్యం కొనాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. -
లైంగిక దాడి కేసులో పదేళ్ల జైలు
[ 26-04-2024]
మాయమాటలు చెప్పి బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో నేరస్థుడికి జైలు శిక్ష విధిస్తూ నిర్మల్ న్యాయస్థానం తీర్పునిచ్చింది. జిల్లా న్యాయస్థానాల సమన్వయాధికారి సక్రియానాయక్ తెలిపిన వివరాలిలా.. -
తూర్పున ఉత్సాహం.. పశ్చిమాన నైరాశ్యం
[ 26-04-2024]
ఉమ్మడి జిల్లాలో లోక్సభ ఎన్నికల ప్రచార శైలి భిన్నంగా సాగుతోంది. తూర్పున పెద్దపల్లి లోక్సభ స్థానం పరిధిలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరులో ప్రచారం ఉత్సాహంగా సాగుతుంటే పశ్చిమాన ఆదిలాబాద్ నియోజకవర్గంలోకి వచ్చే సిర్పూర్, ఆసిఫాబాద్, ఖానాపూర్, ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ముథోల్లో మందకొడిగా కొనసాగుతోంది. -
ఇక లెక్క పక్కా!
[ 26-04-2024]
హరితహారం కార్యక్రమం విజయవంతం చేయడానికి అధికార యంత్రాంగం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకెళ్తోంది. గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టనుంది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని