ఖాతాలో సొమ్ము పడక.. అన్నదాతల వెత
ధాన్యం మిల్లుకు చేరిన రెండు మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం చెబుతుండగా.. రోజులు గడుస్తున్నా ధాన్యం డబ్బులు చేతికందక రైతులు పడిగాపులు కాస్తున్నారు. యాసంగి
దండేపల్లి, జైపూర్, న్యూస్టుడే
దండేపల్లిలో కొనుగోళ్లు చేస్తున్న కేంద్ర నిర్వాహకులు
ధాన్యం మిల్లుకు చేరిన రెండు మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం చెబుతుండగా.. రోజులు గడుస్తున్నా ధాన్యం డబ్బులు చేతికందక రైతులు పడిగాపులు కాస్తున్నారు. యాసంగి పనులు ఊపందుకున్నాయి.వరి, ఇతర ఆరుతడి పంటల సాగు పనుల్లో రైతులు తలమునకలయ్యారు. పెట్టుబడి కోసం చేతిలో డబ్బులు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. అన్నదాతకు మద్దతు అందించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. వానాకాలం పంటను అమ్మి నెల రోజులు గడుస్తున్నా ఇంత వరకు నగదు జమకావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హమాలీ కూలీ, కోత యంత్రాలకు ఇవ్వాల్సిన డబ్బులు, యాసంగి పెట్టుబడులు చెల్లించేందుకు రైతులు అగచాట్లు పడుతున్నారు.
పెట్టుబడికి తిప్పలు...
ఎరువులు, పురుగు మందుల కోసం సాధారణంగా వ్యాపారుల వద్ద పంట డబ్బులు రాగానే చెల్లించేలా ఒప్పందం చేసుకుంటారు. పంట డబ్బులు రాగానే వడ్డీతో కలిపి వ్యాపారులకు చెల్లిస్తారు.పంట అమ్మి నెల రోజులు గడుస్తున్నా డబ్బులు ఖాతాలో పడకపోవడంతో బయట చెల్లించే అప్పులకు వడ్డీ పెరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాసంగి కోసం తిరిగి అప్పులు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. రైతుల చరవాణులకు ఓటీపీ వచ్చి 20 రోజులు దాటినా డబ్బులు రాకపోవడంతో తాము ధాన్యం అమ్మిన ఐకేపీ, సహకార సంఘాలు, డీసీఎంఎస్ కేంద్రాల నిర్వాహకులు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆన్లైన్ పూర్తయిందని త్వరలోనే జమ అవుతాయని అధికారులు చెబుతున్నా..డబ్బులు జమ కాక ఆందోళన చెందుతున్నారు.
* ఈ విషయమై జిల్లా పౌరసరఫరాల అధికారి ప్రేంకుమార్ను సంప్రదించగా.. ఆన్లైన్లో రైతులు, ధాన్యం అమ్మకాల వివరాలన్ని నమోదు చేశామని, నిధులు విడుదల కాగానే చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
చిత్రంలో కనిపిస్తున్న రైతు గోపతి శ్రీనివాస్..దండేపల్లి మండలం నంబాల గ్రామం.. ఈయనకు ఏడు ఎకరాల పొలం ఉంది..వానాకాలంలో సాగు చేయగా స్థానికంగా ఉన్న కొనుగోలు కేంద్రంలో 101 క్వింటాళ్ల ధాన్యం అమ్మాడు.. గతేడాది డిసెంబరు 31న ధాన్యం మిల్లుకు చేరగా..ఈనెల 2న ఆయన చరవాణికి ఓటీపీ కూడా వచ్చింది..కానీ ఆయనకు రావాల్సిన రూ. 2 లక్షలు ఇప్పటికీ రాలేదు. ఒకవైపు యాసంగి సాగు పనులు సాగుతుంటే పెట్టుబడికి డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నానని, వెంటనే డబ్బుల ఖాతాలో జమయ్యేలా చర్యలు తీసుకోవాలని రైతు కోరుతున్నాడు.
వడ్లమ్మి నెలరోజులవుతోంది
సొంత భూమి లేకపోవడంతో రెండు ఎకరాలను కౌలుకు తీసుకొని అప్పు చేసి వ్యవసాయం చేశాను. అందులో దిగుబడి 26 క్వింటాళ్ల మాత్రమే వచ్చింది. వడ్లమ్మి నెల రోజులవుతున్నా నేటికి ఖాతాలో నగదు జమ కాలేదు. కొనుగోలు కేంద్రం నిర్వాహకులను అడిగితే తమ పరిధిలో ఉన్న పని పూర్తి చేశామని, ప్రభుత్వం నుంచి రావాలంటున్నారు. మళ్లీ వ్యవసాయం చేద్దామంటే పెట్టుబడి లేక మళ్లీ అప్పులు తెవాల్సిన పరిస్థితి.
-గుడుగుల దేవేందర్, కౌలు రైతు, కాన్కూర్
జిల్లాలో వరి సాగు: 1.63 లక్షల ఎకరాలు
కొనుగోలు కేంద్రాలు: 243
కొనుగోలు చేసిన ధాన్యం: 1.37లక్షల మెట్రిక్ టన్నులు
మొత్తం రావాల్సిన డబ్బులు: రూ.268.78 కోట్లు
మొత్తం రైతులు: 25,827
ఇప్పటి వరకు చెల్లించిన డబ్బులు: రూ.163.97కోట్లు
చెల్లించాల్సిన డబ్బులు: రూ.102.36 కోట్లు
డబ్బులు పొందిన రైతులు: 14,335
ఎదురుచూస్తున్న వారు: 10,492
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మలేరియా రహిత సమాజానికి కృషి చేయాలి
[ 25-04-2024]
జిల్లాను మలేరియా రహిత జిల్లాగా మార్చడానికి ప్రజలను భాగస్వాములు చేస్తూ కృషి చేయాలని డీఎంహెచ్ఓ నరేందర్ సూచించారు. -
టీకాల నిర్వహణపై పరిశీలన
[ 25-04-2024]
జిల్లాలో టీకాల నిర్వహణ తీరుపై పరిశీలన కార్యక్రమం కొనసాగుతోంది. 2019లో అందుబాటులోకి వచ్చిన ఆర్వీవీ, 2021లో అందుబాటులోకి ... -
వివాహితపై హెడ్ కానిస్టేబుల్ అసభ్య ప్రవర్తన
[ 25-04-2024]
పట్టణంలోని ఓ కాలనీకి చెందిన వివాహితపై బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగు చూసింది. -
కూచిపూడి నృత్యం వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం
[ 25-04-2024]
భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలు నృత్యాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. -
ఉత్సాహంగా అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు
[ 25-04-2024]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో గురువారం జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగాయి. -
ప్రారంభమైన వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం
[ 25-04-2024]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో గురువారం హైదరాబాద్ క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం ప్రారంభమైంది. -
తగ్గిన ఇంటర్ ఉత్తీర్ణత
[ 25-04-2024]
కిందటేడాది మాదిరిగానే ఈసారి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను బుధవారం ఒకేసారి విడుదల చేశారు. గత సంవత్సరంతో పోల్చితే ఈసారి జిల్లా ఉత్తీర్ణత శాతం కొద్దిగా తగ్గింది. -
అయిదేళ్లుగా ఎదురుచూపులే!
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం రైతులందరికి అందడం లేదు. ప్రారంభంలో ఉన్న రైతుల్లో నిబంధనల కారణంగా తొలగిస్తున్నా.. కొత్త వారిని చేర్చకపోవడంతో ఏటా సాయం పొందే రైతుల సంఖ్య తగ్గుతోంది. -
దిగజారిన ఫలితాలు..
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా గతేడాదితో పోలిస్తే అయిదు స్థానాలు కిందికి పడిపోయి రాష్ట్రంలో 7వ స్థానానికి పరిమితమైంది. అయినప్పటికీ ఉత్తమ ఫలితాలనే సాధించినట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు. -
పక్కాగా ఎన్నికల సంఘం మార్గదర్శకాల అమలు
[ 25-04-2024]
పార్లమెంట్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి జిల్లాల ఎన్నికల అధికారులు, పాలనాధికారులు, -
ఏసీబీ అధికారుల విస్తృత తనిఖీలు
[ 25-04-2024]
నాలుగు వరుసల రహదారి విస్తరణలో భాగంగా.. పరిహారం చెల్లింపులో జరిగిన అక్రమాలపై ‘ఈనాడు’ ప్రచురించిన వరుస కథనాలకు ఏసీబీ అధికారులు స్పందించారు. -
స్థిరాస్తి వ్యాపారుల్లో గుబులు
[ 25-04-2024]
ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడం, నిబంధనలు కాలరాసి వెంచర్లు వేసి అమాయకులను మోసం చేయడం, బాండ్ పేపర్ల మీద రాసుకుంటూ బీడీపీపీ భూములను విక్రయించడం, వివాదాస్పద భూములను వాటాలు వేసుకుని పంచుకోవడం, -
ఏనుగు దాడి ఘటనలో.. బాధిత కుటుంబాలకు పరిహారం
[ 25-04-2024]
కాగజ్నగర్ అటవీ డివిజన్ పరిధిలో ఏనుగు దాడిలో మృతి చెందిన ఇద్దరు రైతుల కుటుంబాలకు ప్రభుత్వం మంజూరు చేసిన పరిహారం చెక్కులను అందజేశారు. -
ఆరో రోజు 8 నామినేషన్లు
[ 25-04-2024]
పెద్దపల్లి లోక్సభ స్థానానికి ఆరో రోజు బుధవారం 8 మంది నామినేషన్లు దాఖలు చేశారు. భాజపా జిల్లా అధ్యక్షుడు చందుపట్ల సునీల్రెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, నాయకులు కన్నం అంజయ్యలతో కలిసి -
ఫలితాల్లో దిగజారి.. అట్టడుగుకు చేరి
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ప్రథమ ద్వితీయ ఫలితాల్లో జిల్లాకు నిరాశే ఎదురైంది. -
అలా ఏర్పాటు.. ఇలా తొలగింపు
[ 25-04-2024]
ఆ యూటర్న్ మృత్యువుకు చిరునామాగా మారింది. ఇక్కడ జరిగిన రహదారి ప్రమాదాల్లో దాదాపు 10 మంది మృతి చెందారు. వీరంతా యూటర్న్ వద్దకు రాగానే ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయారు. -
మొరం తవ్వేస్తున్నారు.. వెంచర్లలో నింపేస్తున్నారు
[ 25-04-2024]
జిల్లాలో ఏ గుట్టను చూసినా అక్రమ దందా ఎలా సాగుతుందో తెలుస్తోంది. యథేచ్ఛగా మొరం తవ్వకాలు జరుగుతున్నా.. సిబ్బంది లేకనే ఇబ్బందులు ఉన్నాయంటూ సంబంధిత అధికారులు ప్రకటించడం చూస్తుంటే పరోక్షంగా వారికి ఎలా అండగా ఉన్నారో తెలిసిపోతోంది. -
అమ్మాయిలదే హవా
[ 25-04-2024]
ఇంటర్ వార్షిక పరీక్ష ఫలితాల్లో జిల్లాలో బాలికలదే పైచేయిగా నిలిచింది. గత ఏడాది సైతం వారే ముందంజలో ఉన్నారు. రెగ్యులర్ కోర్సుల్లో గత సంవత్సరంకంటే రాష్ట్రస్థాయిలో దిగజారినా ఒకేషనల్లో మాత్రం కొంత మెరుగైంది. -
ఇంటర్లో మెరిసిన విద్యాకుసుమాలు
[ 25-04-2024]
బోథ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, ఆదర్శ పాఠశాల విద్యార్థులు బుధవారం వెలువడిన ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సర ఫలితాలలో సత్తా చాటారు. -
నమ్మించి మోసం చేసిన హోంగార్డు అరెస్ట్
[ 25-04-2024]
ప్రజలను నమ్మించి మోసం చేసిన హోంగార్డు షమీ ఉల్లాఖాన్ను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణ సీఐ అనిల్ తెలిపిన వివరాల ప్రకారం షమీ ఉల్లాఖాన్ కొద్ది రోజుల క్రితం పట్టణంలో ట్రాఫిక్ విధులు నిర్వహించారు. -
చర్చనీయాంశంగా మాజీ ఎంపీ నామపత్రం దాఖలు
[ 25-04-2024]
మాజీ ఎంపీ రాఠోడ్ రమేష్ ఒక్కరే వచ్చి భాజపా తరఫున నామపత్రం దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. భాజపా అభ్యర్థి గోడం నగేష్ చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న ఆయన ఆ తర్వాత
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు