సీసీఐపై స్పష్టత ఇవ్వరేం?
మూతపడ్డ సీసీఐని తిరిగి తెరిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన రాయితీలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని, కేంద్ర ప్రభుత్వమే స్పష్టత ఇవ్వాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే రామన్న పేర్కొన్నారు. నేను మంత్రిగా
కలెక్టరేట్ ఎదుట సాధన కమిటీ ధర్నా
ఎమ్మెల్యే రామన్నతో కలిసి వేదికపై అభివాదం చేస్తున్న సీసీఐ సాధన కమిటీ ప్రతినిధులు
పాలనాప్రాంగణం, న్యూస్టుడే : మూతపడ్డ సీసీఐని తిరిగి తెరిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన రాయితీలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని, కేంద్ర ప్రభుత్వమే స్పష్టత ఇవ్వాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే రామన్న పేర్కొన్నారు. నేను మంత్రిగా ఉన్నపుడు పలు సందర్భాల్లో అప్పటి కేంద్ర మంత్రి అనంత్గీతేను కలిస్తే రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రిని తీసుకురావాలంటే కేటీఆర్తోనూ వెళ్లి కలిసిన విషయాన్ని గుర్తుచేశారు. సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అప్పటి కేంద్ర సహాయ మంత్రి గంగారాం అహిర్తో సహా జిల్లా భాజపా నాయకులు సీసీఐ తెరిపిస్తామన్న మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రస్తుత ఎంపీతో కలిసి దిల్లీ వచ్చేందుకు సిద్ధమని చెప్పినా ఆయన పట్టించుకోవడం లేదన్నారు. దేశవ్యాప్తంగా సిమెంటుకి భారీ డిమాండ్ ఉందని ప్రధాని మోదీ కిందటి అక్టోబరులో స్వయంగా చెప్పి మూతపడ్డ పరిశ్రమలను తెరిపిస్తామని చెప్పినా ఫలితం లేదన్నారు. సాధన కమిటీ కన్వీనర్ దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ ఎన్నికల్లో సీసీఐని తెరిపిస్తామని భాజపా నాయకుల ప్రచారం నమ్మి స్థానికులు ఓట్లు వేసి ఎంపీని గెలిపించారన్నారు. వచ్చే బడ్జెట్ సమావేశంలో సీసీఐ అంశాన్ని ప్రస్తావించి నిధులు విడుదలయ్యేలా చూడాల్సిన బాధ్యత ఎంపీదేనని పేర్కొన్నారు. కాంగ్రెస్నేత, కో-కన్వీనర్ మునిగెల నర్సింగ్ తదితరులు మాట్లాడుతూ సీసీఐని తెరిపిస్తే అయిదు వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. భూనిర్వాసితులకు ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని పేర్కొన్నారు. అంతకుముందు తెరాస శ్రేణులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా తరలివచ్చారు. ధర్నా అనంతరం అదనపు పాలనాధికారి నటరాజ్ను కలిసి వినతిపత్రం అందజేశారు. కమిటీ కో-కన్వీనర్లు నంది రామయ్య, విజ్జగిరి నారాయణ, ఎ.అరవింద్, లోకారి పోశెట్టి, కొండరమేష్, రూపేష్రెడ్డి, శశికాంత్, యూనిస్అక్బానీ, తెరాస, కాంగ్రెస్, సీపీఎం పట్టణాధ్యక్షులు అజయ్, నగేష్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
పాలనాప్రాంగణానికి ర్యాలీగా వస్తున్న తెరాస శ్రేణులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తగ్గిన ఇంటర్ ఉత్తీర్ణత
[ 25-04-2024]
కిందటేడాది మాదిరిగానే ఈసారి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను బుధవారం ఒకేసారి విడుదల చేశారు. గత సంవత్సరంతో పోల్చితే ఈసారి జిల్లా ఉత్తీర్ణత శాతం కొద్దిగా తగ్గింది. -
అయిదేళ్లుగా ఎదురుచూపులే!
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం రైతులందరికి అందడం లేదు. ప్రారంభంలో ఉన్న రైతుల్లో నిబంధనల కారణంగా తొలగిస్తున్నా.. కొత్త వారిని చేర్చకపోవడంతో ఏటా సాయం పొందే రైతుల సంఖ్య తగ్గుతోంది. -
దిగజారిన ఫలితాలు..
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా గతేడాదితో పోలిస్తే అయిదు స్థానాలు కిందికి పడిపోయి రాష్ట్రంలో 7వ స్థానానికి పరిమితమైంది. అయినప్పటికీ ఉత్తమ ఫలితాలనే సాధించినట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు. -
పక్కాగా ఎన్నికల సంఘం మార్గదర్శకాల అమలు
[ 25-04-2024]
పార్లమెంట్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి జిల్లాల ఎన్నికల అధికారులు, పాలనాధికారులు, -
ఏసీబీ అధికారుల విస్తృత తనిఖీలు
[ 25-04-2024]
నాలుగు వరుసల రహదారి విస్తరణలో భాగంగా.. పరిహారం చెల్లింపులో జరిగిన అక్రమాలపై ‘ఈనాడు’ ప్రచురించిన వరుస కథనాలకు ఏసీబీ అధికారులు స్పందించారు. -
స్థిరాస్తి వ్యాపారుల్లో గుబులు
[ 25-04-2024]
ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడం, నిబంధనలు కాలరాసి వెంచర్లు వేసి అమాయకులను మోసం చేయడం, బాండ్ పేపర్ల మీద రాసుకుంటూ బీడీపీపీ భూములను విక్రయించడం, వివాదాస్పద భూములను వాటాలు వేసుకుని పంచుకోవడం, -
ఏనుగు దాడి ఘటనలో.. బాధిత కుటుంబాలకు పరిహారం
[ 25-04-2024]
కాగజ్నగర్ అటవీ డివిజన్ పరిధిలో ఏనుగు దాడిలో మృతి చెందిన ఇద్దరు రైతుల కుటుంబాలకు ప్రభుత్వం మంజూరు చేసిన పరిహారం చెక్కులను అందజేశారు. -
ఆరో రోజు 8 నామినేషన్లు
[ 25-04-2024]
పెద్దపల్లి లోక్సభ స్థానానికి ఆరో రోజు బుధవారం 8 మంది నామినేషన్లు దాఖలు చేశారు. భాజపా జిల్లా అధ్యక్షుడు చందుపట్ల సునీల్రెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, నాయకులు కన్నం అంజయ్యలతో కలిసి -
ఫలితాల్లో దిగజారి.. అట్టడుగుకు చేరి
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ప్రథమ ద్వితీయ ఫలితాల్లో జిల్లాకు నిరాశే ఎదురైంది. -
అలా ఏర్పాటు.. ఇలా తొలగింపు
[ 25-04-2024]
ఆ యూటర్న్ మృత్యువుకు చిరునామాగా మారింది. ఇక్కడ జరిగిన రహదారి ప్రమాదాల్లో దాదాపు 10 మంది మృతి చెందారు. వీరంతా యూటర్న్ వద్దకు రాగానే ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయారు. -
మొరం తవ్వేస్తున్నారు.. వెంచర్లలో నింపేస్తున్నారు
[ 25-04-2024]
జిల్లాలో ఏ గుట్టను చూసినా అక్రమ దందా ఎలా సాగుతుందో తెలుస్తోంది. యథేచ్ఛగా మొరం తవ్వకాలు జరుగుతున్నా.. సిబ్బంది లేకనే ఇబ్బందులు ఉన్నాయంటూ సంబంధిత అధికారులు ప్రకటించడం చూస్తుంటే పరోక్షంగా వారికి ఎలా అండగా ఉన్నారో తెలిసిపోతోంది. -
అమ్మాయిలదే హవా
[ 25-04-2024]
ఇంటర్ వార్షిక పరీక్ష ఫలితాల్లో జిల్లాలో బాలికలదే పైచేయిగా నిలిచింది. గత ఏడాది సైతం వారే ముందంజలో ఉన్నారు. రెగ్యులర్ కోర్సుల్లో గత సంవత్సరంకంటే రాష్ట్రస్థాయిలో దిగజారినా ఒకేషనల్లో మాత్రం కొంత మెరుగైంది. -
ఇంటర్లో మెరిసిన విద్యాకుసుమాలు
[ 25-04-2024]
బోథ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, ఆదర్శ పాఠశాల విద్యార్థులు బుధవారం వెలువడిన ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సర ఫలితాలలో సత్తా చాటారు. -
నమ్మించి మోసం చేసిన హోంగార్డు అరెస్ట్
[ 25-04-2024]
ప్రజలను నమ్మించి మోసం చేసిన హోంగార్డు షమీ ఉల్లాఖాన్ను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణ సీఐ అనిల్ తెలిపిన వివరాల ప్రకారం షమీ ఉల్లాఖాన్ కొద్ది రోజుల క్రితం పట్టణంలో ట్రాఫిక్ విధులు నిర్వహించారు. -
చర్చనీయాంశంగా మాజీ ఎంపీ నామపత్రం దాఖలు
[ 25-04-2024]
మాజీ ఎంపీ రాఠోడ్ రమేష్ ఒక్కరే వచ్చి భాజపా తరఫున నామపత్రం దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. భాజపా అభ్యర్థి గోడం నగేష్ చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న ఆయన ఆ తర్వాత