కరెంటు చౌర్యం.. రూ. కోట్లలో నష్టం
విద్యుత్తును వక్రమార్గంలో వాడి కొందరు ఆ శాఖ ఖజానాకు గండికొడుతున్నారు. వినియోగంలో ఎక్కువ నష్టాలు వచ్చే గ్రామాల్లో అధికారులు పర్యవేక్షిస్తుంటే.. విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. కరెంటు చౌర్యం కారణంగా ఉమ్మడి జిల్లా మొత్తంలో విద్యుత్తు సంస్థ రూ.కోట్ల మేర నష్టపోతోంది.
మూడేళ్లలో 24 వేల మందిపై కేసులు
న్యూస్టుడే, రాంనగర్
కొండీలు వేసి అక్రమంగా విద్యుత్తు వినియోగం
విద్యుత్తును వక్రమార్గంలో వాడి కొందరు ఆ శాఖ ఖజానాకు గండికొడుతున్నారు. వినియోగంలో ఎక్కువ నష్టాలు వచ్చే గ్రామాల్లో అధికారులు పర్యవేక్షిస్తుంటే.. విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. కరెంటు చౌర్యం కారణంగా ఉమ్మడి జిల్లా మొత్తంలో విద్యుత్తు సంస్థ రూ.కోట్ల మేర నష్టపోతోంది. మూడేళ్లలో ఇలా 24 వేల మంది ఇందుకు పాల్పడ్డారు.
ఉమ్మడి జిల్లాలో 9.80 లక్షల విద్యుత్తు వినియోగదారులు ఉన్నారు. గతంలో పాత మీటర్లతో చౌర్యానికి పాల్పడుతున్నారనే వాటిని మార్చేసి స్మార్ట్ మీటర్లను బిగించారు. చాలా గ్రామాల్లో మీటర్లు లేకుండా నేరుగా ఇళ్లకు విద్యుత్తును వినియోగిస్తుండటంతో సంస్థ లెక్కల్లో తేడా వస్తోంది. మూడేళ్లలో ఆ శాఖ అధికారులు జరిపిన దాడుల్లో 24 వేల దొంగ కనెక్షన్లు బయటపడ్డాయి. వారిపై కేసులు నమోదు చేసి, చౌర్యం చేసిన కరెంటు విలువ రూ.7.05 కోట్లుగా లెక్క తేల్చారు. వీటిలో ఇళ్లకు సంబంధించిన కేటగిరి-1లోనే ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి. ఇంటి అవసరాలకు అక్రమంగా వినియోగిస్తున్న వారు 21 వేల మంది ఉన్నారు. వారికి రూ.5 కోట్ల జరిమానా వేశారు.
విధానాలెన్నో..
వ్యవసాయానికి ఉచితం కాగా, ఎస్సీ, ఎస్టీలకు 101 యూనిట్ల వరకు ఉచితంగా సరఫరా ఉంది. వ్యవసాయం మాటున ఇతర అవసరాలకు వాడుకుంటున్నారు. తీగలను నేరుగా మెయిన్ వైర్లకు కలిపి వాడుకోవడం, ఇంటి అవసరాలకు అని మీటర్ తీసుకొని దుకాణాలకు వాడుకోవడం, మీటర్ల కంటే ముందే లూప్వైర్ పెట్టి వినియోగించుకోవడం తదితర వాటిని అధికారుల దాడుల్లో గుర్తించారు.
* ఆదిలాబాద్ పట్టణంలోని ఓ ఇంట్లో కరెంటు వినియోగానికి, చెల్లించే బిల్లుకు తేడా ఎక్కువగా ఉండటంతో తనిఖీ చేసి అధికారులే ఆశ్చర్యపోయారు. ఆ ఇంటికి ఉన్న మీటరుకు వచ్చే వైరుకు మందుగానే బైపాస్ వైరును బిగించి, దాన్ని ఇంటి మోటారుకు కనెక్షన్గా ఇచ్చారు. దీంతో ఇంటి మోటారు ఎంత తిరిగినా.. ఇంటికి మాత్రమే బిల్లు వచ్చేది. అతడిపై కేసు నమోదు చేసి రూ.13వేలు జరిమానా వేశారు.
* ఉమ్మడి జిల్లాలో 300కు పైగా గ్రామాల్లో లైన్లకు కొండీలు వేసి వాడుకుంటున్నట్లు గుర్తించారు. ఉట్నూర్ మండలం కొమ్ముగూడెంలో నేరుగా విద్యుత్తును వాడుకోవడాన్ని ఎస్ఈ ఉత్తమ్ఝాడే బుధవారం పరిశీలించారు. 101 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తును వాడుకోవచ్చని చెప్పడంతో అప్పటికప్పుడే 39 మంది మీటర్లు బిగించుకునేలా చర్యలు తీసుకున్నారు.
* నిర్మల్ జిల్లా ఖానాపూర్కు చెందిన ఓ ప్రజాప్రతినిధికి దగ్గరి వ్యక్తి దొంగ కనెక్షన్ ద్వారా కరెంట్ వాడుకుంటున్నారు. గుర్తించిన అధికారులు కేసు నమోదు చేసి భారీగా జరిమానా వేశారు.
* ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ నాయకునికి ఇటుకబట్టీ ఉంది. పక్కనే ఉన్న పంట పొలంలో వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్ దానికి వాడేశారు. అధికారులు తనిఖీ చేసి సదరు నాయకునికి జరిమానాతో పాటు కేసు నమోదు చేశారు. ఇలాంటి కేసులు నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో ఎక్కువగా నమోదయ్యాయి.
విద్యుత్తు వినియోగంపై అవగాహన కలిగిస్తున్న అధికారులు
నష్టాలపై పరిశీలన
ఫీడర్ల వారీగా విద్యుత్తు వినియోగాన్ని లెక్కిస్తారు. ఒక్కో ఫీడర్లలో వినియోగానికి, బిల్లుల్లో నమోదైన విద్యుత్తును పోల్చి.. భారీగా తేడా వచ్చిన ఫీడర్లను అధికారులు పరిశీలిస్తున్నారు. గతేడాది సాంగిడి, బరంపూర్, నర్సాపూర్, కొమ్ముగూడ తదితర ఫీడర్లలో భారీగా తేడా రావడంతో వినియోగం తీరును పరిశీలిస్తున్నారు. పోల్ టు పోల్ మ్యాపింగ్ చేస్తున్నారు. ఫీడర్ పరిధిలో ఉన్న కనెక్షన్లు, వినియోగం తదితర వాటిని లెక్కించి నష్టనివారణకు చర్యలు తీసుకుంటున్నారు.
అక్రమ వాడకంతో ఇబ్బందులు
ఉత్తమ్ఝాడే, ఎస్ఈ, ఆదిలాబాద్
అక్రమ వాడకం వల్ల సంస్థతో పాటు వినియోగదారులకు ఇబ్బందులు ఉంటాయి. ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం 101 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తు సరఫరా చేస్తోంది. వ్యవసాయానికి 24 గంటలు ఉచితంగా ఇస్తోంది. మీటర్లు ఏర్పాటు చేసుకొని, రాయితీని సద్వినియోగం చేసుకోవాలి. మీటరు తీసుకునే సమయంలో కుల ధ్రువీకరణ పత్రం ఇస్తే రాయితీ వర్తిస్తుంది.
కేసులు నమోదు చేస్తాం
వి.వి.రమణమూర్తి, విద్యుత్తు విజిలెన్స్ సీఐ
అక్రమార్కులపై సంబంధిత శాఖ అధికారులు ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేస్తాం. ఉమ్మడి జిల్లా మొత్తంలో గతేడాది 8,940 మందిపై కేసులు నమోదు చేసి, ఇప్పటి వరకు 6,258 మంది నుంచి రూ.62 లక్షలు జరిమానా వసూలు చేశాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మలేరియా రహిత సమాజానికి కృషి చేయాలి
[ 25-04-2024]
జిల్లాను మలేరియా రహిత జిల్లాగా మార్చడానికి ప్రజలను భాగస్వాములు చేస్తూ కృషి చేయాలని డీఎంహెచ్ఓ నరేందర్ సూచించారు. -
టీకాల నిర్వహణపై పరిశీలన
[ 25-04-2024]
జిల్లాలో టీకాల నిర్వహణ తీరుపై పరిశీలన కార్యక్రమం కొనసాగుతోంది. 2019లో అందుబాటులోకి వచ్చిన ఆర్వీవీ, 2021లో అందుబాటులోకి ... -
వివాహితపై హెడ్ కానిస్టేబుల్ అసభ్య ప్రవర్తన
[ 25-04-2024]
పట్టణంలోని ఓ కాలనీకి చెందిన వివాహితపై బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగు చూసింది. -
కూచిపూడి నృత్యం వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం
[ 25-04-2024]
భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలు నృత్యాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. -
ఉత్సాహంగా అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు
[ 25-04-2024]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో గురువారం జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగాయి. -
ప్రారంభమైన వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం
[ 25-04-2024]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో గురువారం హైదరాబాద్ క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం ప్రారంభమైంది. -
తగ్గిన ఇంటర్ ఉత్తీర్ణత
[ 25-04-2024]
కిందటేడాది మాదిరిగానే ఈసారి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను బుధవారం ఒకేసారి విడుదల చేశారు. గత సంవత్సరంతో పోల్చితే ఈసారి జిల్లా ఉత్తీర్ణత శాతం కొద్దిగా తగ్గింది. -
అయిదేళ్లుగా ఎదురుచూపులే!
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం రైతులందరికి అందడం లేదు. ప్రారంభంలో ఉన్న రైతుల్లో నిబంధనల కారణంగా తొలగిస్తున్నా.. కొత్త వారిని చేర్చకపోవడంతో ఏటా సాయం పొందే రైతుల సంఖ్య తగ్గుతోంది. -
దిగజారిన ఫలితాలు..
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా గతేడాదితో పోలిస్తే అయిదు స్థానాలు కిందికి పడిపోయి రాష్ట్రంలో 7వ స్థానానికి పరిమితమైంది. అయినప్పటికీ ఉత్తమ ఫలితాలనే సాధించినట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు. -
పక్కాగా ఎన్నికల సంఘం మార్గదర్శకాల అమలు
[ 25-04-2024]
పార్లమెంట్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి జిల్లాల ఎన్నికల అధికారులు, పాలనాధికారులు, -
ఏసీబీ అధికారుల విస్తృత తనిఖీలు
[ 25-04-2024]
నాలుగు వరుసల రహదారి విస్తరణలో భాగంగా.. పరిహారం చెల్లింపులో జరిగిన అక్రమాలపై ‘ఈనాడు’ ప్రచురించిన వరుస కథనాలకు ఏసీబీ అధికారులు స్పందించారు. -
స్థిరాస్తి వ్యాపారుల్లో గుబులు
[ 25-04-2024]
ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడం, నిబంధనలు కాలరాసి వెంచర్లు వేసి అమాయకులను మోసం చేయడం, బాండ్ పేపర్ల మీద రాసుకుంటూ బీడీపీపీ భూములను విక్రయించడం, వివాదాస్పద భూములను వాటాలు వేసుకుని పంచుకోవడం, -
ఏనుగు దాడి ఘటనలో.. బాధిత కుటుంబాలకు పరిహారం
[ 25-04-2024]
కాగజ్నగర్ అటవీ డివిజన్ పరిధిలో ఏనుగు దాడిలో మృతి చెందిన ఇద్దరు రైతుల కుటుంబాలకు ప్రభుత్వం మంజూరు చేసిన పరిహారం చెక్కులను అందజేశారు. -
ఆరో రోజు 8 నామినేషన్లు
[ 25-04-2024]
పెద్దపల్లి లోక్సభ స్థానానికి ఆరో రోజు బుధవారం 8 మంది నామినేషన్లు దాఖలు చేశారు. భాజపా జిల్లా అధ్యక్షుడు చందుపట్ల సునీల్రెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, నాయకులు కన్నం అంజయ్యలతో కలిసి -
ఫలితాల్లో దిగజారి.. అట్టడుగుకు చేరి
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ప్రథమ ద్వితీయ ఫలితాల్లో జిల్లాకు నిరాశే ఎదురైంది. -
అలా ఏర్పాటు.. ఇలా తొలగింపు
[ 25-04-2024]
ఆ యూటర్న్ మృత్యువుకు చిరునామాగా మారింది. ఇక్కడ జరిగిన రహదారి ప్రమాదాల్లో దాదాపు 10 మంది మృతి చెందారు. వీరంతా యూటర్న్ వద్దకు రాగానే ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయారు. -
మొరం తవ్వేస్తున్నారు.. వెంచర్లలో నింపేస్తున్నారు
[ 25-04-2024]
జిల్లాలో ఏ గుట్టను చూసినా అక్రమ దందా ఎలా సాగుతుందో తెలుస్తోంది. యథేచ్ఛగా మొరం తవ్వకాలు జరుగుతున్నా.. సిబ్బంది లేకనే ఇబ్బందులు ఉన్నాయంటూ సంబంధిత అధికారులు ప్రకటించడం చూస్తుంటే పరోక్షంగా వారికి ఎలా అండగా ఉన్నారో తెలిసిపోతోంది. -
అమ్మాయిలదే హవా
[ 25-04-2024]
ఇంటర్ వార్షిక పరీక్ష ఫలితాల్లో జిల్లాలో బాలికలదే పైచేయిగా నిలిచింది. గత ఏడాది సైతం వారే ముందంజలో ఉన్నారు. రెగ్యులర్ కోర్సుల్లో గత సంవత్సరంకంటే రాష్ట్రస్థాయిలో దిగజారినా ఒకేషనల్లో మాత్రం కొంత మెరుగైంది. -
ఇంటర్లో మెరిసిన విద్యాకుసుమాలు
[ 25-04-2024]
బోథ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, ఆదర్శ పాఠశాల విద్యార్థులు బుధవారం వెలువడిన ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సర ఫలితాలలో సత్తా చాటారు. -
నమ్మించి మోసం చేసిన హోంగార్డు అరెస్ట్
[ 25-04-2024]
ప్రజలను నమ్మించి మోసం చేసిన హోంగార్డు షమీ ఉల్లాఖాన్ను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణ సీఐ అనిల్ తెలిపిన వివరాల ప్రకారం షమీ ఉల్లాఖాన్ కొద్ది రోజుల క్రితం పట్టణంలో ట్రాఫిక్ విధులు నిర్వహించారు. -
చర్చనీయాంశంగా మాజీ ఎంపీ నామపత్రం దాఖలు
[ 25-04-2024]
మాజీ ఎంపీ రాఠోడ్ రమేష్ ఒక్కరే వచ్చి భాజపా తరఫున నామపత్రం దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. భాజపా అభ్యర్థి గోడం నగేష్ చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న ఆయన ఆ తర్వాత
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా