logo

వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య

వరటక్న వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన బేల మండలం బాధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ కృష్ణకుమార్‌ వివరాల ప్రకారం.. జైనథ్‌ మండలం ఖాఫ్రికి చెందిన

Updated : 22 Jan 2022 03:44 IST

అఖిల మృతదేహం

బేల, న్యూస్‌టుడే : వరటక్న వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన బేల మండలం బాధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ కృష్ణకుమార్‌ వివరాల ప్రకారం.. జైనథ్‌ మండలం ఖాఫ్రికి చెందిన అఖిల(30)కు బేల మండలంలోని బాధి గ్రామానికి చెందిన బి.ఉశన్నతో 12 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు జన్మించిన తర్వాత అదనపు కట్నం కింద డబ్బులు తీసుకురావాలంటూ భర్త, అత్త, మామ తరచూ ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించేవారు. మనోవేదనకు గురైన ఆమె గురువారం అర్ధరాత్రి ఇంట్లో పురుగుల మందు తాగి చనిపోయింది. అదనపు కట్నం వేధింపులతోనే తన చెల్లెలు ఆత్మహత్య చేసుకుందని బాధితురాలి అన్న స్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.


చికిత్స పొందుతూ మృతి..

ఆత్రం పార్వతి

బోథ్‌, న్యూస్‌టుడే : మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ దివ్యభారతి వివరాల ప్రకారం.. మండలంలోని నేరడిపల్లె గ్రామానికి చెందిన ఆత్రం పార్వతి(23) అనే మహిళకు, తన సమీప బంధువు (వరుసకు అక్క) కమలాబాయితో గొడవ జరిగింది. దీంతో కమలాబాయి, పార్వతిని కొట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. దీంతో ఈ నెల 17న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు బోథ్‌ సివిల్‌ ఆసుపత్రికి తరలించి, మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ గురువారం రాత్రి మరణించింది. ఆమెకు భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. భర్త ఆత్రం దేవురావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని