నాసిరకం.. నత్తనడక
వైకుంఠధామాల నిర్మాణాల్లో గుత్తేదారులు చేతివాటం చూపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల దహన సంస్కారాలకు ఇబ్బందులు తలెత్తవద్దని నిధులు విడుదల చేస్తోంది. వాటి నిర్మాణాల్లో నాణ్యత
ఇష్టానుసారంగా శ్మశానవాటిక నిర్మాణాలు
న్యూస్టుడే, ఆదిలాబాద్ గ్రామీణం
వైకుంఠధామాల నిర్మాణాల్లో గుత్తేదారులు చేతివాటం చూపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల దహన సంస్కారాలకు ఇబ్బందులు తలెత్తవద్దని నిధులు విడుదల చేస్తోంది. వాటి నిర్మాణాల్లో నాణ్యత పాటించకపోవడంతో ప్రారంభానికి ముందే పగుళ్లు తేలగా, పలుచోట్ల కూలిపోతున్నాయి. గడువు మీరినా ఇంకా పనులు పూర్తికాని పరిస్థితి. జిల్లాలో చేపట్టిన నిర్మాణాల దుస్థితిపై ‘న్యూస్టుడే’ పరిశీలన కథనం.
జిల్లాలో 468 వైకుంఠధామాలు మంజూరయ్యాయి. వీటి నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులు చెప్పడమే తప్ప నేటికీ చాలా చోట్ల ఇంకా అసంపూర్తిగా, నిర్మాణ దశలోనే ఉన్నాయి. నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించకుండా పనులు చేపట్టడంతో ప్రారంభానికి ముందే పగుళ్లు తేలి ఉన్నాయి. మరికొన్నిచోట్ల పనుల దశలోనే కూలిపోవడం నాణ్యత తీరును తేటతెల్లం చేస్తున్నాయి. ఎప్పటికప్పుడు పరిశీలన చేపట్టాల్సిన అధికారులు అటువైపు చూడకపోవడంతో వాటి పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా తయారైంది.
గుత్తేదారులకు నాయకుల అండ
గుత్తేదారులకు నాయకుల అండ ఉండటంతో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. పనులపై ఆరా తీయాల్సిన పంచాయతీ పాలకులు పట్టించుకోవడం లేదు. బిల్లులు సకాలంలో రావడం లేదనే ఆరోపణలు వినిపిస్తుండగా, సకాలంలో నిర్మాణాలు చేపకట్టకపోవడంతోనే అలస్యమైనట్లు అధికారులు పేర్కొంటున్నారు.
నాణ్యత నవ్వుతోంది
ఇది ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని దిమ్మలో నిర్మించిన వైకుంఠధామం. నిర్మాణ దశలోనే పగుళ్లుతేలగా వాటిని సిమెంటు పూతలతో కనిపించకుండా చేసినా ప్రస్తుతం పగుళ్లు తేలి నాణ్యతలోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. వైకుంఠధామానికి వెళ్లేందుకు వేసిన సీసీ రోడ్డుదీ అదే తీరు. అప్పుడే నాణ్యతలోపంతో కనిపిస్తోంది.
పగిలిన గోడలు
కూలిపోయిన దహన సంస్కారాలు నిర్వహించే నిర్మాణం
అధ్వానంగా మారి..
ఇది ఆదిలాబాద్ గ్రామీణ మండలం అంకాపూర్లో చేపట్టిన వైకుంఠధామ నిర్మాణం. పనులు నాలుగేళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. చివరికి పాలనాధికారి పనుల పూర్తికి చర్యలు తీసుకోవడంతో మళ్లీ పనులు ప్రారంభించారు. దహన సంస్కారాలు నిర్వహించే నిర్మాణం ఇటీవల నిర్మాణ దశలోనే కూలిపోయింది. సరైన నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో పాటు క్యూరింగ్ చేయక పరిస్థితి అధ్వానంగా తయారైంది. సుమారు రూ.9 లక్షలు ఖర్చు చేసినట్లు చెబుతున్న క్షేత్రస్థాయిలో పనులు అసంపూర్తిగా కనబడుతున్నాయి. అధికారులు నామమాత్రంగా వ్యవహరించడంతో ఇష్టారాజ్యంగా మారింది. దీని నిర్మాణం కోసం తీసుకున్న పంచాయతీ నిధులు రూ.2.50 లక్షలు తిరిగి చెల్లించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గొలుసుకట్టు వ్యాపారంలో ‘బంపర్ ఆఫర్’
[ 26-04-2024]
అమాయకులను నిండా ముంచిన గొలుసుకట్టు వ్యాపారంలో కంపెనీ ఏజెంట్లకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది. డిపాజిట్దారులకు తిరిగి సొమ్మును చెల్లించే క్రమంలో హైదరాబాద్ నగరశివారులో ఉన్న భూమిని ప్రధాన ఏజెంట్లకు విక్రయించాలని యోచిస్తోంది. -
ఆశీర్వదించండి.. ఎంపీగా గెలిపించండి
[ 26-04-2024]
గోడం నగేష్ను ఆశీర్వదించి గెలిపించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. గురువారం భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ ఎంపీ రమేష్ రాఠోడ్, యువ నాయకుడు రితీష్ రాఠోడ్లతో కలిసి ఉట్నూరు మండలం పులిమడుగు, సాలెవాడ, కోపర్ఘడ్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
కాంగ్రెస్తోనే పేదలకు భవిష్యత్తు
[ 26-04-2024]
కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే పేదల బతుకులు బాగుపడతాయని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ అన్నారు. ఆదివారం పార్టీ నాయకులతో కలిసి పట్టణంలోని ఖానాపూర్, కొలీపుర, బొక్కలగూడ, అంబేడ్కర్నగర్లో రోడ్ షోలో పాల్గొన్నారు. -
తుక్కు పేరిట అక్రమ దందా!
[ 26-04-2024]
అనుమతులు, లైసెన్సులు లేకుండానే పలువురు ‘తుక్కు’ పేరిట జిల్లాలో అక్రమ దందా కొనసాగిస్తున్నారు. జిల్లాలోని ప్రధాన రహదారుల సమీపంలోని పెద్ద ప్రహరీలతో కూడిన గోదాములను ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు సాగిస్తున్నారు. -
నాలుగు గంటల వరకే పోలింగ్
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, పాలనాధికారి వెంకటేష్ ధోత్రే పేర్కొన్నారు. ఓటర్లందరికి ఓటరు చీటీలను అందజేస్తున్నామన్నారు. -
అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం
[ 26-04-2024]
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలైన ఘటన కుమురంభీం జిల్లా బెజ్జూరు మండలం పోతపల్లి-కోర్తేగూడ గ్రామాల మధ్య గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. -
చెట్టు పేరు చెప్పి.. ప్లాట్లు అంటగట్టి..
[ 26-04-2024]
మంచిర్యాల జిల్లా కేంద్రంలో అమ్మకానికి ఖాళీ స్థలాలు లేకపోవడంతో భూఅక్రమ వ్యాపారులు సరిహద్దు గ్రామాల్లోని వ్యవసాయ భూములను నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లుగా మార్చి అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. -
వెల్లువెత్తిన నామినేషన్లు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామపత్రాల స్వీకరణ పర్వం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్ఖాన్ నామపత్రాలు స్వీకరించారు. -
దారి మళ్లించి.. మురుగుకాలువ ఆక్రమించి
[ 26-04-2024]
కబ్జాల తీరు కొంత పుంతలు తొక్కుతోంది. కబ్జాదారులకు హద్దూఅదుపులు లేకుండా పోతుండడంతో వారు రెచ్చిపోతున్నారు. పట్టణంలో మురుగుకాలువలను కబ్జా చేస్తున్నా మున్సిపల్ యంత్రాంగం చోద్యం చూస్తుంది. -
సన్న బియ్యం ధరలు పైపైకి
[ 26-04-2024]
బహిరంగ మార్కెట్లో సన్నబియ్యం ధరలు రోజురోజుకి సామాన్యులకు అందనంత ఎత్తుకు ఎదుగుతున్నాయి. పేద, మధ్య తరగతి కుటుంబాలు సన్నబియ్యం కొనాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. -
లైంగిక దాడి కేసులో పదేళ్ల జైలు
[ 26-04-2024]
మాయమాటలు చెప్పి బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో నేరస్థుడికి జైలు శిక్ష విధిస్తూ నిర్మల్ న్యాయస్థానం తీర్పునిచ్చింది. జిల్లా న్యాయస్థానాల సమన్వయాధికారి సక్రియానాయక్ తెలిపిన వివరాలిలా.. -
తూర్పున ఉత్సాహం.. పశ్చిమాన నైరాశ్యం
[ 26-04-2024]
ఉమ్మడి జిల్లాలో లోక్సభ ఎన్నికల ప్రచార శైలి భిన్నంగా సాగుతోంది. తూర్పున పెద్దపల్లి లోక్సభ స్థానం పరిధిలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరులో ప్రచారం ఉత్సాహంగా సాగుతుంటే పశ్చిమాన ఆదిలాబాద్ నియోజకవర్గంలోకి వచ్చే సిర్పూర్, ఆసిఫాబాద్, ఖానాపూర్, ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ముథోల్లో మందకొడిగా కొనసాగుతోంది. -
ఇక లెక్క పక్కా!
[ 26-04-2024]
హరితహారం కార్యక్రమం విజయవంతం చేయడానికి అధికార యంత్రాంగం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకెళ్తోంది. గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టనుంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా