గుట్కా.. రూ.కోట్ల సంపాదనకు చిట్కా!
ఓ వైపు జిల్లాలో పట్టణం నుంచి మారుమూల పల్లెలకు నిషేధిత గుట్కా విక్రయాలు నిత్యం రూ.కోట్లలోనే జరుగుతున్నాయి. మరోవైపు అధికారులు మాత్రం మామూలుగా వ్యవహరించడం పరిపాటిగా మారింది.
చిరువ్యాపారులపై కేసులు...సూత్రధారులపై చర్యలు శూన్యం
ఇచ్చోడ, న్యూస్టుడే
ఇది జైనథ్ మండల కేంద్రంలో పట్టుకున్న గుట్కా. రెండు నెలల కిందట దాదాపు రూ.రెండున్నర లక్షల విలువైన గుట్కాను ఓ వ్యక్తి తన ఇంట్లో నిల్వ చేసుకున్నాడు. ముందస్తు సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించగా సరకు లభ్యమైంది. ఇలా అతను రూ.కోట్ల విలువ చేసే గుట్కాను మార్కెట్లో విక్రయాలు చేస్తున్నాడని వెల్లడైంది.
ఓ వైపు జిల్లాలో పట్టణం నుంచి మారుమూల పల్లెలకు నిషేధిత గుట్కా విక్రయాలు నిత్యం రూ.కోట్లలోనే జరుగుతున్నాయి. మరోవైపు అధికారులు మాత్రం మామూలుగా వ్యవహరించడం పరిపాటిగా మారింది. చిన్నపాటి దాడులు నిర్వహిస్తూ చేతులు దులిపేసుకుంటున్నారే తప్ప పూర్తిస్థాయిలో చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో నిషేధిత గుట్కా రవాణాపై ‘న్యూస్టుడే’ కథనం.
తక్కువ పెట్టుబడి అత్యధిక సంపాదనకు అవకాశం ఉండటంతో కొంతమంది వ్యాపారులు దర్జాగా గుట్కా అక్రమరవాణా చేస్తున్నారు. జిల్లాకు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి జిల్లాకు దిగుమతి చేసుకొని అక్కడ నుంచి పల్లెలకు తరలిస్తున్నారు. తక్కువ ధరతో కొనుగోలు చేసి అడ్డగోలు ధరలతో అమ్మకాలు జరుపుతున్నారు. గుట్కా విక్రయాలతో పాన్షాప్ నుంచి పెద్దస్థాయి దుకాణాల వరకు అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. అయితే పోలీసుల దాడిలో మాత్రం చిరు వ్యాపారులే దొరకడం, కేసులు నమోదు చేయడంతో.. వారు పోలీస్స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. దీంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బడా వ్యాపారులపై నామమాత్రపు చర్యలు చేపట్టడం, చిన్నచితక వ్యాపారులపై కేసులు నమోదు చేయడం ఏంటని ఆరోపిస్తున్నారు.
జిల్లాలో ఇలా..
* ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఓ వ్యక్తి రూ.కోట్లలో నిత్యం గుట్కా క్రయవిక్రయాలు జరుపుతున్నాడు. ఇప్పటికే అనేక సార్లు పోలీసులు పట్టుకొని కేసులు కూడా నమోదు చేశారు. అయినా అతని దందా అంతకు రెట్టింపు కాగా జిల్లా నలుమూలలకు రవాణా జోరు పెంచాడు. మహారాష్ట్ర, కర్ణాటక నుంచి దిగుమతి చేసుకుని అడ్డగోలు ధరలతో అమ్మకాలు సాగిసున్నాడు. ఇది అందరికి తెలిసిన విషయమే. కానీ పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టే పరిస్థితి లేదు.
* ఇచ్చోడ మండల కేంద్రంలో ఓ దుకాణదారుడు ఇప్పటికే గుట్కా అమ్మకాలు జరుపుతూ పట్టుబడటంతో ఎనిమిది కేసులకు పైగా నమోదయ్యాయి. కానీ దందా మాత్రం ఆగడం లేదు. ఇచ్చోడ మండలంతోపాటు సిరికొండ చుట్టుపక్క గ్రామాలకు రవాణా చేస్తున్నాడు. కిరాణాల మాటున రూ.లక్షల్లో వ్యాపారం సాగిస్తున్నాడు.
* నేరడిగొండ మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి గుట్కా వ్యాపారం దర్జాగా చేస్తున్నాడు. పెద్దల అండదండలతో అతని దందాకు అదుపు లేకుండా పోయింది. ఇతరులు అమ్మకాలు జరపకుండా చూడడం, అతనే నేరుగా రంగంలోకి దిగి విక్రయాలు చేయడం నిత్య కృత్యం. అయినా అతనిపై చర్యలు మాత్రం నామమాత్రమే. గుడిహత్నూర్, ఇంద్రవెల్లి మండలాల్లోనూ అదే తీరు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాంసి సీఎస్ఐ చర్చిలో గుడ్ ఫ్రైడే
[ 29-03-2024]
అదిలాబాద్ జిల్లా తాంసిలోని సీఎస్ఐ చర్చిలో శుక్రవారం గుడ్ ఫ్రైడేను నిర్వహించారు. ఏసుక్రీస్తు ప్రార్థన మందిరంలో క్రైస్తవులంతా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. -
సీఎస్ఐ చర్చిలో గుడ్ ఫ్రైడే
[ 29-03-2024]
జిల్లా కేంద్రంలోని విద్యానగర్ కాలనీలో ఉన్న సీఎస్ఐ చర్చిలో క్రైస్తవులు గుడ్ ఫ్రైడేను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. -
మతతత్వంతో లబ్ధి పొందే పార్టీలకు బుద్ధి చెప్పాలి
[ 29-03-2024]
మతతత్వం రెచ్చగొట్టి లబ్ధి పొందాలనుకునే పార్టీలకు రానున్న లోక్సభ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పూరపాటి రమేష్ పిలుపునిచ్చారు. -
అక్రమ మద్యం విక్రయిస్తే కేసులు తప్పవు
[ 29-03-2024]
అక్రమంగా మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ స్టేషన్ ఎక్సైజ్ సీఐ విజేందర్ హెచ్చరించారు. -
తేలిన బరి.. గెలుపుపై గురి
[ 29-03-2024]
ఆదిలాబాద్ ఎంపీ సీటు విజయం మూడు ప్రధాన పార్టీలకు కీలకంగా మారింది. కాంగ్రెస్ అభ్యర్థిగా ఆత్రం సుగుణ, భాజపా అభ్యర్థిగా గోడం నగేష్, భారాస తరఫున ఆత్రం సక్కు మధ్య త్రిముఖ పోటీ ఏర్పడింది. -
ఇక విద్యుత్తు కోతలకు చెక్
[ 29-03-2024]
ఎండలు ఎక్కువ కావడంతో విద్యుత్తు వినియోగం పెరిగిపోయింది. దీంతో కొన్ని చోట్ల సరఫరాకు అంతరాయం కలుగుతోంది. వచ్చే రెండు నెలల్లో విద్యుత్తు వినియోగం మరింత పెరిగే అవకాశం... -
ఎమ్మెల్యే ఫిర్యాదు చేసినా పట్టించుకోరా?: ఏలేటి
[ 29-03-2024]
గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అల్లోల ఇంద్రకరణ్రెడ్డి హయాంలో ప్రభుత్వ భూములను విచ్చలవిడిగా చెరబట్టారని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి మరోసారి ఆరోపించారు. -
పెన్గంగా.. ఇసుకదందా
[ 29-03-2024]
మండలవాసులకు వరప్రదాయినిగా ఉన్న పెన్గంగా నదిలో ఇసుకదొంగలు పడ్డారు. పారే నీటిని ఆపిమరీ యంత్రాలతో ఇసుకను తోడి అక్రమ రవాణా చేస్తున్నారు. -
గడువు ముందర సందిగ్ధం!
[ 29-03-2024]
ఏటా సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి, ప్రభుత్వ పనులకు బడ్జెట్ కేటాయిస్తారు. దానిని ఆ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ఖర్చు చేయాలి. ఇందుకు సంబంధించిన బిల్లులను ఖజానా శాఖకు పంపిస్తే.. వారు ఈ-కుబేర్లో నమోదు చేస్తారు. -
ఆన్లైన్ జూదంలో నష్టపోయి.. రైతుల డబ్బు కాజేత
[ 29-03-2024]
ఆదిలాబాద్ ఐపీపీబీ(ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్) మేనేజర్ విజయ్ జాదవ్ ఆన్లైన్ జూదానికి అలవాటు పడి అందులో నష్టపోయి రైతులకు చెందిన డబ్బులను కాజేసినట్లు తెలుస్తోంది. -
బహుజన, తెలంగాణవాదాన్ని భారీ మెజార్టీతో గెలిపించాలి
[ 29-03-2024]
రాజ్యాంగాన్ని కాపాడాలనే సంకల్పం, బహుజన, తెలంగాణ వాదం ఒక్కటేననే ఉద్దేశంతో తాను భారాసతో చేతులు కలిపినట్లు ఆ పార్టీ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ అన్నారు. -
సమస్యలు తెలుసుకుని.. పరిష్కారానికి ఆదేశించి
[ 29-03-2024]
గ్రామాల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని జిల్లా పాలనాధికారి వెంకటేష్ దోత్రే అన్నారు. గురువారం అదనపు పాలనాధికారి దీపక్ తివారీతో కలసి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. -
ఉద్యానవనాలపై ఉదాసీనత..
[ 29-03-2024]
మంచిర్యాల పట్టణవాసులకు ఆహ్లాదం కోసం వివిధ వార్డుల్లో ఉద్యానవనాల నిర్మాణం చేపట్టారు. ఒక్కో ఉద్యానవనానికి రూ.40 లక్షల నుంచి రూ.90 లక్షలు కేటాయించారు. -
రూ.‘కోటి’.. చీకటి పాలు
[ 29-03-2024]
ఒకవైపు రహదారి విస్తరణ లేక, మరోవైపు సిర్పూరు కాగితం మిల్లు(ఎస్పీఎం)కు నిత్యం ముడిసరకు లారీల రాకపోకల కారణంగా.. ఏడాదిలోపే రూ.కోటితో ఏర్పాటు చేసిన వెలుగులు విరజిమ్మే సెంట్రల్ లైటింగ్ వ్యవస్థ చీకటి పాలవుతోంది. -
‘టీజీ’ కోడ్తో రిజిస్ట్రేషన్లు
[ 29-03-2024]
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్ను ‘టీఎస్’ నుంచి ‘టీజీ’కి మార్పు చేస్తూ ఈ నెల 15న గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. -
పట్టణ వనాలపై పట్టింపు శూన్యం
[ 29-03-2024]
జిల్లాలోని నిర్మల్, భైంసా, ఖానాపూర్ పట్టణాల్లోని 80 వార్డుల్లో 52 పట్టణ ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. హరితహారంలో భాగంగా రూ.లక్షల నిధులు వ్యయం చేస్తున్నా నిర్వహణ లేకపోవడంతో అందులోని నాటిన మొక్కలన్నీ ఎండిపోతున్నాయి. -
ఆత్మహత్యలతో రెండు కుటుంబాల్లో విషాదం
[ 29-03-2024]
బాసర రైల్వే స్టేషన్లో నిజామాబాద్ పట్టణానికి చెందిన యువతి, యువకుడు బుధవారం రాత్రి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇరు కుటుంబాల్లో విషాదం నింపింది. -
సాగులో సాంకేతికత.. మహిళలకు సాధికారత
[ 29-03-2024]
వ్యవసాయరంగంలో మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం నమో డ్రోన్ దీదీ యోజనను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా జిల్లాలవారీగా ప్రయోగాత్మకంగా కొంత మంది యువతీ యువకులను ఎంపిక చేసి డ్రోన్ నిర్వహణ, -
ఈత కారాదు గుండెకోత
[ 29-03-2024]
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విభిన్న వాతావరణానికి పెట్టింది పేరు. ఇక్కడ వర్షాలు, చలి, ఎండ.. అన్నీ ఎక్కువే. మార్చిలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటుతున్నాయి. -
ఆదరిస్తే అభివృద్ధి చేస్తా : సుగుణ
[ 29-03-2024]
ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి మొదటిసారి ఆదివాసీ మహిళకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించిందని ఆ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ అన్నారు. దీంతో పార్టీకి ఆదివాసీలపై ఉన్న ప్రేమ నిరూపితమైందని తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు: అనసూయ
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM