భగ్గుమంటున్న పెట్రో ధరల్లో తగ్గుదల
నిత్యావసర సరకులతో సహా పెట్రో, డీజిల్, వంటగ్యాస్ ధరలు భారీగా పెరిగిన వేళ కేంద్రం ప్రజలపై భారం తగ్గించే నిర్ణయం తీసుకుంది. కేంద్రఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ధరలను తగ్గిస్తూ ప్రకటన
జిల్లా వాసులపై తగ్గనున్న భారం
పాలనాప్రాంగణం, న్యూస్టుడే
నిత్యావసర సరకులతో సహా పెట్రో, డీజిల్, వంటగ్యాస్ ధరలు భారీగా పెరిగిన వేళ కేంద్రం ప్రజలపై భారం తగ్గించే నిర్ణయం తీసుకుంది. కేంద్రఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ధరలను తగ్గిస్తూ ప్రకటన చేయడం పేద, మద్యతరగతి వర్గాలకు ఊరట లభించనుంది.
కేంద్రం పెట్రోల్పై రూ.8 డీజిల్పై రూ.6 ఎక్సైజ్ సుంకం తగ్గించింది. దీనికి అదనంగా రాష్ట్రం పెట్రోల్పై రూ.1.50 డిజిల్పై రూ.1 తగ్గించాల్సి ఉంది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల పరిధిలో 275 బంకులు ఉండగా... నిత్యం లక్షన్నర లీటర్ల పెట్రోల్, 12లక్షల మేర డీజిల్ లీటర్ల వినియోగమవుతోంది. ధరల తగ్గుదల ప్రభావం ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉమ్మడి జిల్లాలోని 30లక్షల మంది జనాభా పడనుంది. ప్రస్తుత తగ్గించిన పెట్రో ధరలు అమల్లోకి వస్తే నెలకు రూ.4.27కోట్ల మేర భారం తగ్గే అవకాశముంది. అదేమాదిరి డీజిల్ వినియోగదారులపై రూ.25.20కోట్ల ఆర్థిక భారం తగ్గి నిత్యావసర సరకులు ధరలు అదుపులోకి రానున్నాయి. డిజిల్ ధర పెరిగిన ప్రతిసారి రవాణాభారం పెరిగి నిత్యవసరాల ధరలు మండిపోవడం పరిపాటిగా మారింది. తాజాగా కేంద్రం నిర్ణయంతో చమురు ధరలు తగ్గి సామాన్యులకు, మధ్య తరగతి ప్రజలపై ఆర్థికభారం కొంత తగ్గనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రాయితీ పెరిగింది..!
చమురు ధరలతో వంటగ్యాస్ సిలిండర్ ధరలు పోటీపడటం.. ఆ ధర ఏకంగా వెయ్యి రూపాయలు దాటడం మళ్లీ కట్టెలు వినియోగించుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది. ప్రస్తుతం 14.2 కిలోల వంటగ్యాస్ ధర రూ.1084 ఉండగా.. వినియోగదారు డబ్బులు చెల్లించాక నగదు బదిలీ రూపేన కేవలం రూ.47 రాయితీ జమవుతోంది. కేంద్రం తాజాగా రాయితీ రూ.200 ఇస్తామని ప్రకటించడంతో వినియోగదారులపై ఆమేరకు భారం తప్పనుంది. ఈ రాయితీని ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన కింద సిలిండర్లు పొందుతున్న వారికి మాత్రమే వర్తింపజేయనున్నారు. ఈ పథకం లబ్ధిదారులు ఉమ్మడి జిల్లాలో 3.80లక్షల కుటుంబాలు ఉన్నాయి. వీరు ఏడాదికి 12 సిలిండర్లను వినియోగిస్తే రూ.2400 రాయితీ సొమ్ము వారి ఖాతాల్లో తిరిగి జమకానుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒక సిలిండర్ను మొత్తం లబ్ధిదారులు వినియోగిస్తే నెలకు రూ.7.60 కోట్ల మేర చెల్లించిన డబ్బు రాయితీ రూపేణా తిరిగి రానుంది.
* పెట్రోల్ బంక్ వెలవెల...!పెట్రో ధరలు ప్రజలపై ఎంత ప్రభావం చూపుతున్నాయో తెలిపే చిత్రమిది. పెట్రో ధరలు భారీగా తగ్గిస్తున్నట్లు ప్రసార మాధ్యమాల్లో ప్రచారం ఫలితంగా శనివారం 7గంటల నుంచి ఆదిలాబాద్ పట్టణంలోని పోలీస్ శాఖ బంక్ వాహనదారులు లేక వెలవెలబోయింది. ఎలాగూ ధరలు తగ్గుతున్నాయి కదా.. ఎవరూ ఇంధనం పోయించుకునేందుకు ముందుకు రాకపోవడంతో రద్దీగా ఉండే బంకులన్నీ శనివారం ఇలా జనసందోహం లేక కళ తప్పాయి.
ఉమ్మడి జిల్లాలో..
* ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన లబ్ధిదారులు: 3.80 లక్షలు
* నెలకు రాయితీ రూపేణా తిరిగి వచ్చే సొమ్ము: రూ.7.60కోట్లు
* రోజుకు పెట్రోల్ వినియోగం: 1.50లక్షల లీటర్లు
* తగ్గనున్న భారం: రూ. 14.25లక్షలు
* రోజుకు డీజిల్ వినియోగం: 12లక్షల లీటర్లు
* తగ్గనున్న భారం: రూ.84లక్షలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆదిత్య ఖండేష్కర్ పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు
[ 23-04-2024]
ఆదిత్య ఖండేష్కర్ తన పుట్టినరోజు సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. -
భారాస అభ్యర్థి నామినేషన్ దాఖలు
[ 23-04-2024]
ఆదిలాబాద్ భారాస ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు నామినేషన్ దాఖలు చేశారు. -
మంగమఠంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు
[ 23-04-2024]
జిల్లా కేంద్రంలోని మంగ మఠం శ్రీ రమా సత్యనారాయణ స్వామి దేవాలయంలో పౌర్ణమిని పురస్కరించుకుని మంగళవారం సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. -
ఊరూరా హనుమాన్ జయంతి వేడుకలు
[ 23-04-2024]
మండలంలోని పొన్నారి, తాంసి, హస్నాపూర్, కప్పలరా, బండల నాగపూర్, వడ్డాడి, గిరిగాం తదితర గ్రామాల్లోని హనుమాన్ ఆలయాల్లో ... -
ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
[ 23-04-2024]
జిల్లా కేంద్రంలో మంగళవారం హనుమాన్ జయంతి వేడుకలను ప్రజలు ఘనంగా నిర్వహించారు. -
సంక్షేమ మంత్రం.. ప్రత్యర్థులపై విమర్శల బాణం
[ 23-04-2024]
ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న భారాస, భాజపా అభ్యర్థులు ఆత్రం సక్కు, గోడం నగేష్ వ్యవహారశైలి మీకు తెలుసు. వారి పనితనం మీకు తెలిసిందే. మంచోడు మంచోడని మంచం ఎక్కిస్తే మంచమంతా పాడు చేసినట్లు ఆత్రం సక్కు వ్యవహారం ఉంటే, బుద్ధిమంతుడని సద్ది కట్టిస్తే బొడ్రాయి దగ్గర భోంచేసి మళ్లీ ఇంటికొచ్చి బోర్లాపడుకున్నట్లు నగేష్ వ్యవహారముంది. -
విద్యార్థులకు ఆన్లైన్ ప్రగతి పత్రాలు
[ 23-04-2024]
విద్యాసంవత్సరం నేటితో ముగియనుంది. విద్యార్థులకు సంగ్రహణాత్మక(ఎస్ఏ2) పరీక్షలు పూర్తి కావడంతో వాటికి సంబంధించిన ఫలితాలను వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నారు. -
శుద్ధజలంపై శ్రద్ధ
[ 23-04-2024]
పంచాయతీల్లో కలుషిత నీటి సరఫరాను నివారించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇకపై ప్రతిరోజు తాగు నీటిని పరీక్షించాకే సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేసింది. -
పారిశ్రామిక ప్రాంతం.. ప్రచారానికి లేదు వేసవి తాపం
[ 23-04-2024]
అభ్యర్థుల ప్రచారానికి మండే ఎండలు అడ్డంకిగా మారాయి. కార్యకర్తలు సైతం ఎండలో బయటకు రావడానికి జంకుతున్నారు. దీంతో జనసమీకరణతో పనిలేకుండా గంపగుత్తగా ఒకేచోట వందల సంఖ్యలో ఎలాంటి ప్రయత్నం లేకుండా ఓటర్లు లభించే ప్రాంతాలు ఏవంటే అవి బొగ్గు గనులే. -
ఆదిలాబాద్ లోక్సభ బరిలో..
[ 23-04-2024]
ఆదిలాబాద్ లోక్సభ స్థానానికి మొదటిసారి ఓ మహిళ పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఆత్రం సుగుణ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని బరిలో నిలిచారు. 1952లో ఆదిలాబాద్ లోక్సభ స్థానంగా ఏర్పడింది. -
మళ్లీ.. ఏనుగు గండం!
[ 23-04-2024]
గుంపులో నుంచి తప్పిపోయిన మగ ఏనుగు.. ఈ నెల మొదటి వారంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి చింతలమానేపల్లి, పెంచికల్పేట్ మండలాలకు వచ్చి ఇద్దరు రైతులను బలి తీసుకున్న ఘటన భయాందోళనకు గురిచేసింది. -
పట్టణానికి దూరం.. కావాలి ప్రత్యామ్నాయం
[ 23-04-2024]
మంచిర్యాల ఎంసీహెచ్(మాతా, శిశు ఆరోగ్య కేంద్రం).. పట్టణానికి దూరంగా ఉండటంతో ఏ చిన్న సమస్య వచ్చినా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేసవిలో అత్యవసరమైనవి.. ముఖ్యమైనవి.. ఆసుపత్రిలో చల్లదనం, సరిపడా నీటి సౌకర్యం. -
నకిలీ వేలిముద్రలతో పీఎంకేకే పథకంలో మోసం
[ 23-04-2024]
నకిలీ వేలిముద్రలతో హాజరు శాతం ఎక్కువగా చూపించి బిల్లులు కాజేసిన ప్రధానమంత్రి కౌశల్య కేంద్ర పథకం నిర్వాహకులను రామగుండం కమిషనరేట్ పోలీసులు అరెస్టు చేశారు. -
ఇసుక దోచేస్తున్నారు..
[ 23-04-2024]
జిల్లాలోని నదులు, వాగులు తదితర ప్రాంతాల నుంచి ఇసుక అక్రమ రవాణా జరగకుండా చూడాలని ఇటీవల జిల్లా పాలనాధికారి అశిష్ సంగ్వాన్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. -
సాయంత్రం ఈదురుగాలులతో అతలాకుతలం
[ 23-04-2024]
భైంసా, కుభీరు, కుంటాల మండలాల్లోని ఆయా గ్రామాల్లో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. తీవ్రగాలులతో రేకుల ఇళ్లు, షెడ్డుల పైకప్పులు ఎగిరిపోయాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?