అసైన్డ్ భూముల్లో.. అక్రమ దందా
పట్టణ శివారులోని శాంతినగర్లో ఖాళీగా కనిపిస్తున్న ఈ అసైన్డ్భూమిని అప్పట్లో లబ్ధిదారులకు కేటాయించారు. నిర్మల్ జిల్లా కేంద్రం ఏర్పాటైన తర్వాత ఆ భూములకు ఇప్పుడు డిమాండ్ పెరిగింది. నిబంధనల ప్రకారం అక్కడ ఎలాంటి నిర్మాణాలు
ఏమార్చి.. చిన్న ప్లాట్లుగా మార్చి విక్రయం
నిర్మల్, న్యూస్టుడే
పట్టణ శివారులోని శాంతినగర్లో ఖాళీగా కనిపిస్తున్న ఈ అసైన్డ్భూమిని అప్పట్లో లబ్ధిదారులకు కేటాయించారు. నిర్మల్ జిల్లా కేంద్రం ఏర్పాటైన తర్వాత ఆ భూములకు ఇప్పుడు డిమాండ్ పెరిగింది. నిబంధనల ప్రకారం అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదు. అయినా.. కొంతమంది స్థిరాస్తి వ్యాపారులు ఆ భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసి ప్లాట్లుగా చేసి విక్రయాలు చేస్తున్నారు.
జిల్లా కేంద్రంగా ఏర్పడిన నిర్మల్లో భూముల ధరలు బాగా పెరిగిపోవడంతో కొంతమంది స్థిరాస్తి వ్యాపారులు అసైన్డ్ భూముల్లో ‘రియల్’ దందా యథేచ్ఛగా సాగిస్తున్నారు. గతంలో ప్రభుత్వం లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఆయా స్థలాలను కేవలం సాగుకు మాత్రమే వినియోగించాలనే నిబంధనలున్నా.. ప్లాట్లుగా మార్చేస్తున్నారు. లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకు భూములను కొనుగోలు చేసి చిన్న చిన్న ప్లాట్లుగా చేసి విక్రయాలు చేస్తున్నారు. కొందరు రాజకీయ నేతలు తెర వెనుకుండి ఈ వ్యవహారం నడిపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
జోరుగా క్రయ విక్రయాలు..
భూమిలేని నిరుపేదల జీవనాధారం కోసం అసైన్డ్భూమిని కేటాయిస్తారు.. ఆ భూముల్లో పంటలు సాగుచేస్తూ జీవనం కొనసాగించడానికి స్థానికులకే ఆ భూమిని అప్పజెప్తారు.. ఆ భూమి యజమాని మరణిస్తే వారసులకు చెందుతుంది. అసైన్డ్ భూముల క్రయవిక్రయాలు చెల్లవు. నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్లు కూడా కావు. నిర్మల్లో మాత్రం ఇందుకు విరుద్ధంగా అసైన్డ్భూముల క్రయ విక్రయాలు జోరుగా జరుగుతున్నాయి. నిర్మల్ శివారులో శాంతినగర్, సోఫినగర్, తదితర ప్రాంతాల్లో అసైన్డ్భూములను కొనుగోలు చేసి వారు మున్సిపల్ రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకుని ఎంతోకొంత ముట్టజెప్పి ఆ భూములకు అసెస్మెంట్ (కొలతలు) చేయించుకుని ఇంటి నెంబర్లు తీసుకున్నారు. ఖాళీ స్థలాలకు ఇంటి నెంబర్లు కేటాయించడంతో సదరు వ్యక్తులు ఆ స్థలాలకు ఆస్తి పన్ను చెల్లిస్తూ వస్తున్నారు. అక్కడ ఇళ్లు ఉన్నట్లు పత్రాలు ఉండటంతో ఆ భూములను అసెస్మెంట్, ఆస్తి పన్ను పత్రాల ఆధారంగా దర్జాగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. శాటిలైట్ ఆధారంగా నిర్మల్ మున్సిపల్ పరిధిలో 18,021 ఇళ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించి బిల్ కలెక్టర్లతో కొలతలు తీయించారు. ఇందులో ఇప్పటివరకు 15,139 ఇళ్లను ఆన్లైన్లో అప్లోడ్ చేయగా.. మరో 72 తిరస్కరించారు. మిగతా 2,810 ఇళ్లు కనిపించడం లేదు.. వీటిలో కొన్ని ఖాళీ భూములకు ఇంటి నెంబర్లు కేటాయించగా.. మరికొన్ని అక్రమ ఇళ్ల నిర్మాణాలు చేసినట్లు స్పష్టమైంది.
చూసీ చూడనట్లు ..
జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలో నిజామాబాద్ వెళ్లే మార్గంలో ప్రధాన రహదారికి ఇరువైపులా అసైన్డ్ భూములు ఉన్నాయి. ఇక్కడ పట్టా భూమి ఎకరం రూ.3 కోట్ల వరకు ధర పలుకుతుండగా.. ఆసైన్డ్ స్థలానికి ఎకరాకు రూ.కోటి నుంచి కోటిన్నర వరకు వెచ్చిస్తున్నారు. గతంలో లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేసిన వారు ఇప్పుడు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో స్థలాలు ఇప్పటికే చాలా మంది చేతులు మారుతున్నాయి. ఎవరైనా ఫిర్యాదు చేస్తే అధికారులు అక్కడికెళ్లి చూసి వస్తున్నారే కాని.. ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అసైన్డ్ భూముల్లో స్థిరాస్తి దందా వెనుక కొంతమంది రాజకీయ నేతల ప్రమేయం ఉండటంతో అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. చాలా మంది పేదలు తక్కువ ధరకు ప్లాట్లు వస్తున్నాయనే ఆశతో కొనుగోలు చేస్తున్నా.. రానున్న రోజుల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ విషయమై రెవెన్యూ అధికారులను సంప్రదిస్తే.. అసైన్డ్ భూముల క్రయవిక్రయాలు జరపడం నేరం. పేదలు తక్కువ ధరకు వస్తున్నాయనే ఆశతో ప్లాట్లు కొనుగోలు చేసి మోసపోవద్దని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముఖ్య నేతల కోసం అభ్యర్ధుల యత్నం
[ 20-04-2024]
ఆదిలాబాద్, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గాలకు నామపత్రాలు దాఖలు చేసేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థుల తేదీలు ఖరారయ్యాయి. ఆదిలాబాద్ ఎస్టీ రిజర్వు కాగా పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్ స్థానం. -
బాలభవన్ కల సాకారమయ్యేనా?
[ 20-04-2024]
కళలకు నిలయంగా ఆదిలాబాద్లోని బాలకేంద్రం నిలుస్తోంది. ఇక్కడ శిక్షణ పొందిన బాలలు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణిస్తున్నారు. రికార్డుల మోత మోగిస్తున్నారు. -
నిర్మల్ నేతలదే ఆధిపత్యం
[ 20-04-2024]
ఇప్పుడు జరగబోయే ఎన్నికలు 18వ లోక్సభకు సంబంధించినవి. ఆదిలాబాద్ ఎంపీ స్థానానికి మాత్రం 19వ సారి జరుగుతున్నాయి. 2008లో అప్పటి ఎంపీ మధుసూదన్రెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరిగింది. -
పరిమళించిన పల్లె.. పరిశ్రమల ముల్లె
[ 20-04-2024]
పెద్దపల్లి లోక్సభ స్థానంగా 62 ఏళ్ల కింద ఆవిర్భవించింది. ఇక్కడి నుంచి ఇప్పటివరకు 15 మంది ఎంపీ అభ్యర్థులుగా దిల్లీకి వెళ్లారు. పెద్దపల్లి నియోజకవర్గంలో గ్రామీణ, పారిశ్రామిక ప్రాంతాలతో సమ్మిళితమై ఉంటుంది. -
రెండోరోజు కాంగ్రెస్ అభ్యర్థి ఒక్కరే!
[ 20-04-2024]
లోక్సభ నామపత్రాల స్వీకరణ పర్వంలో భాగంగా రెండో రోజు ఒకే ఒక్క నామపత్రం దాఖలైంది. కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ తరఫున ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు శుక్రవారం రిటర్నింగ్ అధికారి రాజర్షిషాకు నామపత్రం అందజేశారు. -
ఆత్రం సుగుణకు ఆభరణాలు లేవు..
[ 20-04-2024]
తనకు బంగారు ఆభరణాలు ఏమి లేవని, తనపై 50 క్రిమినల్ కేసులు ఆయా పోలీసుస్టేషన్లలో పెండింగ్లో ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ వెల్లడించారు. -
సరిహద్దు గ్రామాల్లో.. ముగిసిన పోలింగ్
[ 20-04-2024]
తెలంగాణ - మహారాష్ట్ర వివాదాస్పద 12 గ్రామాల్లో మొదటి విడత లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇరు రాష్ట్రాలు ఈ గ్రామాలు మావే అంటుండగా, ఇక్కడి ప్రజలందకిరి ఓటర్లు కార్డులు ఉన్న విషయం విదితమే. -
నింగికెగసిన ఆడబిడ్డలకు సలాం
[ 20-04-2024]
జల్.. జంగల్.. జమీన్ అనే నినాదంతో ఉద్యమించిన అడవిబిడ్డలపై అప్పటి ప్రభుత్వం 1981 ఏప్రిల్ 20న తుపాకీ ఎక్కుపెట్టింది. ఆదివాసీలపై తూటాల వర్షం కురిపించింది. -
ఎన్నికల హడావుడి.. ఇసుక దోపిడీ
[ 20-04-2024]
రెవెన్యూ, పోలీసు అధికారులు పార్లమెంట్ ఎన్నికల హడావుడిలో ఉండగా.. ఇదే అదునుగా జిల్లాలోని ఇసుక మాఫియా చెలరేగిపోతుంది. జిల్లాలో ప్రవహిస్తున్న పెద్దవాగు ఇసుక స్మగ్లర్లకు సిరులు కురిపిస్తుంది. -
ఆడిట్లో అవకతవకలు గుర్తిస్తున్నా ఫలితం శూన్యం
[ 20-04-2024]
పంచాయతీలకు వస్తున్న నిధులను కొందరు ప్రజాప్రతినిధులు పక్కదారి పట్టిస్తున్నారు. రశీదులు లేకుండానే నిధులు ఖర్చు చేస్తున్నారు. మార్కెట్ ధరకన్నా ఎక్కువ వెచ్చించి వివిధ వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. -
నైపుణ్యం పెంచేలా.. సేవలు మెరుగయ్యేలా
[ 20-04-2024]
ఉత్తర తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్)లో నష్టాల తగ్గింపుతోపాటు వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించేలా సీఎండీ వరుణ్రెడ్డి ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. -
అసౌకర్యాలు గుర్తించి.. దూరాభారం తగ్గించి
[ 20-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అధికారులు పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1,850 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మంచిర్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో 741 పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. -
గల్ఫ్ బాధితులకు భరోసా కలిగేనా?
[ 20-04-2024]
ఎడారి దేశాలకు వలసవెళ్లే కార్మికులకు భరోసా కరవైంది. గల్ఫ్ దేశాలకు వెళ్లి జేబునిండా డబ్బులతో తిరిగి వద్దామనుకున్న వారిని అనుకోని అవాంతరాలు చుట్టుముడుతున్నాయి. ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటికే దాదాపు 70 వేల మంది గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఖతార్, బెహరాన్, ఒమన్లకు వెళ్లగా తాజాగా కొత్తతరం కూడా ఎడారి దేశాల బాట పడుతోంది. -
విలువలతో కూడిన విద్య అందించాలి
[ 20-04-2024]
ఒకప్పుడు చదువులకు దూరంగా ఉన్న మారుమూల అల్లంపల్లి గిరిజన విద్యార్థులకు మంచి విలువలతో కూడిన విద్యను అందుబాటులోకి తెచ్చామని త్రిదండి రామానుజ చినజీయరు స్వామి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం