ఏరీ.. అధికారి..!
ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టడంలో రిజిస్ట్రేషన్లు, స్టాంపులశాఖ కీలకపాత్ర పోషిస్తుంది. నూతన జిల్లాలు ఏర్పడటంతో దాదాపు అన్నిచోట్ల రియల్ వ్యాపారం ఊపందుకుంటున్న విషయం తెలిసిందే. జిల్లాగా
మూడేళ్లలో ఎనిమిదిసార్లు మారిన వైనం
మంచిర్యాల సిటీ, న్యూస్టుడే
క్రయవిక్రయాలు లేక వెలవెలబోతున్న దృశ్యం
ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టడంలో రిజిస్ట్రేషన్లు, స్టాంపులశాఖ కీలకపాత్ర పోషిస్తుంది. నూతన జిల్లాలు ఏర్పడటంతో దాదాపు అన్నిచోట్ల రియల్ వ్యాపారం ఊపందుకుంటున్న విషయం తెలిసిందే. జిల్లాగా ఏర్పడకముందే మంచిర్యాలలో భూక్రయవిక్రయాలు జోరుగా సాగేవి. జిల్లాగా ఆవిర్భవించాక ఇంకా పెరిగింది. ప్రతిరోజు వందల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరిగేవి. శాఖకు రూ.కోట్లలో ఆదాయం వచ్చేది. ఇటీవల ప్రభుత్వ నిబంధనలతో కొంత, వ్యవసాయేతర భూములను మాత్రమే సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో చేయాలని నియమాలు విధించడంతో ఇంకొంత ఆదాయం రావడం తగ్గింది. అయినా జిల్లాకేంద్రం, చుట్టు పక్కప్రాంతాల్లో ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉండటంతో ప్లాట్ల క్రయవిక్రయాలు జరుగుతూనే ఉన్నాయి. గత మూడేళ్ల నుంచి మంచిర్యాల సబ్రిజిస్ట్రార్గా వచ్చిన ఏ ఒక్కరు నిలకడగా ఉండకపోవడంతో కార్యకలాపాలు మందకొడిగా సాగుతున్నాయి. శాశ్వత అధికారిని నియమించకపోవడం, ఇన్ఛార్జులకు పూర్తి అధికారాలు లేకపోవడంతో రిజిస్ట్రేషన్లు తగ్గుముఖం పడుతున్నాయి. క్రయవిక్రయాలు లేక కార్యాలయం గత కొన్నిరోజులుగా వెలవెలబోతోంది. ఆదాయానికి గండిపడుతోంది.
ఐదేళ్లలో ఒకరు.. మూడేళ్లలో ఎనిమిది
గడిచిన ఎనిమిది సంవత్సరాల్లో కేవలం ఒకే ఒక్కరు మాత్రమే ఐదేళ్లపాటు ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు లేకుండా విధులు నిర్వర్తించారు. పదవి విరమణను ఇక్కడే చేశారు. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా ఆరునెలలపాటు సక్రమంగా ఉన్నది లేదు. ఇలా వచ్చి అలా వెళ్లారు. మూడేళ్లలో ఎనిమిది మంది సబ్రిజిస్ట్రార్లు మారడం విశేషం.
* 2014లో సబ్రిజిస్ట్రార్గా బాధ్యతలు చేపట్టిన రాంబాబు.. 2019వరకు కొనసాగారు. అనంతరం కొద్దిరోజులపాటు ఇన్ఛార్జులతో నెట్టుకువచ్చారు. ఇక్కడే సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న శ్రీధర్రాజు కొద్దిరోజులపాటు వ్యవహరించి బదిలీపై కరీంనగర్కు వెళ్లగా.. ఆదిలాబాద్ కార్యాలయం నుంచి రవికాంత్ వచ్చారు. ఈయన విధులు నిర్వహిస్తుండగానే శాశ్వత అధికారిగా అప్పారావును నియమించారు. మరో మూడేళ్లు ఎలాంటి సమస్య ఉండదనుకుంటే మూడు నెలల్లోనే తప్పుడు రిజిస్ట్రేషన్ చేయడంతో అప్పారావుపై సస్పెన్షన్ వేటు పడింది. ఆ తర్వాత మళ్లీ ఆదిలాబాద్ నుంచే మురళీకృష్ణకు తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు. ఆయన కొనసాగుతుండగానే నరేష్ శాశ్వత అధికారిగా వచ్చారు. కార్యకలాపాలు సాఫీగా జరుగుతున్నాయి అనుకునే సమయంలోనే జోనల్ వ్యవస్థకు సంబంధించిన బదిలీలు రావడంతో నరేష్ జనగామకు వెళ్లిపోయారు. అనంతరం రాము బాధ్యతలు చేపట్టగా ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగ ప్రకటనతో గ్రూప్-1 కొలువు కోసం సెలవుపెట్టారు. దీంతో ఇమ్రాన్ను సబ్రిజిస్ట్రార్గా నియామకం చేయగా.. ఇక్కడి పని ఒత్తిడా లేదా వ్యక్తిగత కారణమా.. పనిచేయడం ఇష్టంలేదో తెలియదుగానీ ఈయన సైతం సెలవులో వెళ్లారు. ప్రస్తుతం సీనియర్ అసిస్టెంట్ హోదాలో అశోక్ తాత్కాలిక సబ్రిజిస్ట్రార్గా విధులు నిర్వహిస్తున్నారు.
అధికారాలు లేని సబ్రిజిస్ట్రార్..
మంచిర్యాలశాఖకు శాశ్వత అధికారికి మాత్రమే పూర్తిస్థాయి అధికారాలు ఉంటాయి. తాత్కాలికంగా వచ్చినా, ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నవారు పరిమితికి లోబడే పనిచేయాల్సి ఉంటుంది. అన్నిరకాల వ్యవహారాలకు సంబంధించిన అధికారం వీరికి ఉండదు. గడిచిన మూడేళ్లలో ఒకరిద్దరు తప్ప ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్కరు ఇన్ఛార్జులుగానే ఉన్నారు. దీంతో కొన్ని లావాదేవీల్లో జాప్యం జరుగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మలేరియా రహిత సమాజానికి కృషి చేయాలి
[ 25-04-2024]
జిల్లాను మలేరియా రహిత జిల్లాగా మార్చడానికి ప్రజలను భాగస్వాములు చేస్తూ కృషి చేయాలని డీఎంహెచ్ఓ నరేందర్ సూచించారు. -
టీకాల నిర్వహణపై పరిశీలన
[ 25-04-2024]
జిల్లాలో టీకాల నిర్వహణ తీరుపై పరిశీలన కార్యక్రమం కొనసాగుతోంది. 2019లో అందుబాటులోకి వచ్చిన ఆర్వీవీ, 2021లో అందుబాటులోకి ... -
వివాహితపై హెడ్ కానిస్టేబుల్ అసభ్య ప్రవర్తన
[ 25-04-2024]
పట్టణంలోని ఓ కాలనీకి చెందిన వివాహితపై బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగు చూసింది. -
కూచిపూడి నృత్యం వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం
[ 25-04-2024]
భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలు నృత్యాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. -
ఉత్సాహంగా అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు
[ 25-04-2024]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో గురువారం జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగాయి. -
ప్రారంభమైన వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం
[ 25-04-2024]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో గురువారం హైదరాబాద్ క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం ప్రారంభమైంది. -
తగ్గిన ఇంటర్ ఉత్తీర్ణత
[ 25-04-2024]
కిందటేడాది మాదిరిగానే ఈసారి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను బుధవారం ఒకేసారి విడుదల చేశారు. గత సంవత్సరంతో పోల్చితే ఈసారి జిల్లా ఉత్తీర్ణత శాతం కొద్దిగా తగ్గింది. -
అయిదేళ్లుగా ఎదురుచూపులే!
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం రైతులందరికి అందడం లేదు. ప్రారంభంలో ఉన్న రైతుల్లో నిబంధనల కారణంగా తొలగిస్తున్నా.. కొత్త వారిని చేర్చకపోవడంతో ఏటా సాయం పొందే రైతుల సంఖ్య తగ్గుతోంది. -
దిగజారిన ఫలితాలు..
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా గతేడాదితో పోలిస్తే అయిదు స్థానాలు కిందికి పడిపోయి రాష్ట్రంలో 7వ స్థానానికి పరిమితమైంది. అయినప్పటికీ ఉత్తమ ఫలితాలనే సాధించినట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు. -
పక్కాగా ఎన్నికల సంఘం మార్గదర్శకాల అమలు
[ 25-04-2024]
పార్లమెంట్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి జిల్లాల ఎన్నికల అధికారులు, పాలనాధికారులు, -
ఏసీబీ అధికారుల విస్తృత తనిఖీలు
[ 25-04-2024]
నాలుగు వరుసల రహదారి విస్తరణలో భాగంగా.. పరిహారం చెల్లింపులో జరిగిన అక్రమాలపై ‘ఈనాడు’ ప్రచురించిన వరుస కథనాలకు ఏసీబీ అధికారులు స్పందించారు. -
స్థిరాస్తి వ్యాపారుల్లో గుబులు
[ 25-04-2024]
ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడం, నిబంధనలు కాలరాసి వెంచర్లు వేసి అమాయకులను మోసం చేయడం, బాండ్ పేపర్ల మీద రాసుకుంటూ బీడీపీపీ భూములను విక్రయించడం, వివాదాస్పద భూములను వాటాలు వేసుకుని పంచుకోవడం, -
ఏనుగు దాడి ఘటనలో.. బాధిత కుటుంబాలకు పరిహారం
[ 25-04-2024]
కాగజ్నగర్ అటవీ డివిజన్ పరిధిలో ఏనుగు దాడిలో మృతి చెందిన ఇద్దరు రైతుల కుటుంబాలకు ప్రభుత్వం మంజూరు చేసిన పరిహారం చెక్కులను అందజేశారు. -
ఆరో రోజు 8 నామినేషన్లు
[ 25-04-2024]
పెద్దపల్లి లోక్సభ స్థానానికి ఆరో రోజు బుధవారం 8 మంది నామినేషన్లు దాఖలు చేశారు. భాజపా జిల్లా అధ్యక్షుడు చందుపట్ల సునీల్రెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, నాయకులు కన్నం అంజయ్యలతో కలిసి -
ఫలితాల్లో దిగజారి.. అట్టడుగుకు చేరి
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ప్రథమ ద్వితీయ ఫలితాల్లో జిల్లాకు నిరాశే ఎదురైంది. -
అలా ఏర్పాటు.. ఇలా తొలగింపు
[ 25-04-2024]
ఆ యూటర్న్ మృత్యువుకు చిరునామాగా మారింది. ఇక్కడ జరిగిన రహదారి ప్రమాదాల్లో దాదాపు 10 మంది మృతి చెందారు. వీరంతా యూటర్న్ వద్దకు రాగానే ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయారు. -
మొరం తవ్వేస్తున్నారు.. వెంచర్లలో నింపేస్తున్నారు
[ 25-04-2024]
జిల్లాలో ఏ గుట్టను చూసినా అక్రమ దందా ఎలా సాగుతుందో తెలుస్తోంది. యథేచ్ఛగా మొరం తవ్వకాలు జరుగుతున్నా.. సిబ్బంది లేకనే ఇబ్బందులు ఉన్నాయంటూ సంబంధిత అధికారులు ప్రకటించడం చూస్తుంటే పరోక్షంగా వారికి ఎలా అండగా ఉన్నారో తెలిసిపోతోంది. -
అమ్మాయిలదే హవా
[ 25-04-2024]
ఇంటర్ వార్షిక పరీక్ష ఫలితాల్లో జిల్లాలో బాలికలదే పైచేయిగా నిలిచింది. గత ఏడాది సైతం వారే ముందంజలో ఉన్నారు. రెగ్యులర్ కోర్సుల్లో గత సంవత్సరంకంటే రాష్ట్రస్థాయిలో దిగజారినా ఒకేషనల్లో మాత్రం కొంత మెరుగైంది. -
ఇంటర్లో మెరిసిన విద్యాకుసుమాలు
[ 25-04-2024]
బోథ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, ఆదర్శ పాఠశాల విద్యార్థులు బుధవారం వెలువడిన ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సర ఫలితాలలో సత్తా చాటారు. -
నమ్మించి మోసం చేసిన హోంగార్డు అరెస్ట్
[ 25-04-2024]
ప్రజలను నమ్మించి మోసం చేసిన హోంగార్డు షమీ ఉల్లాఖాన్ను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణ సీఐ అనిల్ తెలిపిన వివరాల ప్రకారం షమీ ఉల్లాఖాన్ కొద్ది రోజుల క్రితం పట్టణంలో ట్రాఫిక్ విధులు నిర్వహించారు. -
చర్చనీయాంశంగా మాజీ ఎంపీ నామపత్రం దాఖలు
[ 25-04-2024]
మాజీ ఎంపీ రాఠోడ్ రమేష్ ఒక్కరే వచ్చి భాజపా తరఫున నామపత్రం దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. భాజపా అభ్యర్థి గోడం నగేష్ చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న ఆయన ఆ తర్వాత
తాజా వార్తలు (Latest News)
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!