రక్షణ కరవై.. భక్షణకు సిద్ధమై..
జిల్లాలో సర్కారు భూములకు రక్షణ కరవైంది. అసైన్డ్, బీడీపీపీ భూముల్లో యథేచ్ఛగా వెంచర్లు వేసి ప్లాట్లు విక్రయిస్తున్నారు. ఈ వ్యవహారమంతా ఓ వ్యక్తి కనుసన్నల్లోనే జరుగుతోంది. దీనికి కొందరు అధికారులు, నేతల సహకరిస్తున్నారు. నెలనెలా ఠంఛనుగా ఎవరి వాటాలు వారికి
ఇదీ జిల్లాలో సర్కారు స్థలాల దుస్థితి..
ఈనాడు డిజిటల్, ఆసిఫాబాద్
ఇనాం భూముల్లో వేసిన వెంచర్
జిల్లాలో సర్కారు భూములకు రక్షణ కరవైంది. అసైన్డ్, బీడీపీపీ భూముల్లో యథేచ్ఛగా వెంచర్లు వేసి ప్లాట్లు విక్రయిస్తున్నారు. ఈ వ్యవహారమంతా ఓ వ్యక్తి కనుసన్నల్లోనే జరుగుతోంది. దీనికి కొందరు అధికారులు, నేతల సహకరిస్తున్నారు. నెలనెలా ఠంఛనుగా ఎవరి వాటాలు వారికి అందుతుండటంతో భూ ఆక్రమణలు ఆకాశమే హద్దుగా కొనసాగుతున్నాయి. దీంతో జిల్లా కేంద్రం చుట్టూ ఉన్న వేలాది ఎకరాల బీడీపీపీ, అసైన్డ్, అబాదీ, ఇనాం, ఏజెన్సీ భూములు ప్లాట్లుగా రూపాంతరం చెందుతున్నాయి. అక్రమార్కులకు ఆదాయమార్గమవుతున్నాయి.
జిల్లా ఆవిర్భావం అనంతరం రెండువేల ఎకరాల ప్రభుత్వ భూములు జిల్లా కేంద్రంనుంచి అయిదు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయని అధికారులు ప్రత్యేక సర్వే చేసి 2016లోనే గుర్తించారు. వాటికి హద్దులు, రక్షణ చర్యలు అంతంతమాత్రంగానే ఉండటంతో అక్రమార్కుల కన్ను పడింది. పర్యవేక్షణ లేకపోవడంతో ప్రధాన రహదారులను ఆనుకుని ఉన్న భూములను కజ్జా చేసి క్రయవిక్రయాలు జరుపుతున్నారు. మొదట బాండ్ పేపర్లపై ఒప్పంద పత్రాలు రాసుకుంటూ.. ఆపై అధికారుల అండదండలతో అదను చూసి ఇంటి నెంబర్లు తీసుకుంటున్నారు. అనంతరం రిజిస్ట్రేషన్లు కూడా జరుగుతున్నాయి.
కలెక్టర్ క్యాంపు కార్యాలయం పక్కనే..
పాలనాధికారి క్యాంపు కార్యాలయాన్ని ఆనుకునే ప్రస్తుతం ఇనాం భూముల దందా కొనసాగుతోంది. 15 ఎకరాల భూమిలో కొందరు నేతలు, అధికారులు భాగస్వాములుగా ఉన్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. సర్వే నంబర్ 21 నుంచి 26 వరకు ఇనాం భూములు ఉన్నాయి. ప్రస్తుతం 15 ఎకరాల ఇనాం భూమిని చదును చేసి ప్లాట్లు చేశారు. ఇందులో రూ.10 నుంచి రూ.20 లక్షల వరకు ఒక్కో ప్లాటును విక్రయిస్తున్నారు. ఈ లెక్కన సుమారు రూ.5 కోట్ల దందా ఇక్కడ నడుస్తోంది. వాంకిడి మండలంలో 98 సర్వే నంబర్లలోని ఇనాం భూములను సైతం తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు.
ఇదీ ఇనాం భూముల చరిత్ర...
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలను కలుపుకొని ఒకప్పుడు ఆసిఫాబాద్ జిల్లాగా ఉండేది. ప్రభుత్వానికి అందించిన సేవలకు మెచ్చి అప్పటి అధికారులకు కొందరు వ్యక్తులకు ఇనాం (బహుమతి)గా భూములను ఇచ్చారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1955లో ఈ ఇనాం భూములను రద్దు చేసింది. వీటికి సాగు చేసుకోవడానికే వాడాలని, ప్లాట్లు చేయడం, విక్రయించడం చేయరాదని స్పష్టం చేసింది. తెలంగాణలో ఓఆర్సీ(అక్యూపెన్సీ రైట్స్ సర్టిఫికేట్స్) ఉంటేనే ఈ భూములను ఇతరులకు విక్రయించవచ్చని స్పష్టమైన నిబంధనలున్నాయి.
ఓఆర్సీ రావాలంటే...
ఇనాం భూములకు ఓఆర్సీ ధ్రువపత్రం రావాలంటే 1955 ఖాస్ర పహాణీతో పాటు 1973-74 సంవత్సరాలకు సంబంధించి పహాణీలను జతచేసి తహసీల్దార్కు దరఖాస్తు చేసుకుంటే అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. సంబంధిత రైతు పది సంవత్సరాలు భూమి శిస్తు చెల్లించినట్లుగా అధారాలు చూపాలి. అనంతరం సదరు వ్యక్తికి నిజాం కాలంలోనే ఇనాం భూములు ఇచ్చాయనే విషయాన్ని ఆర్డీఓ నిర్ధారించి, ఓఆర్సీ జారీ చేస్తారు.
కొలిక్కివచ్చిన ప్రయత్నాలు..
రెవెన్యూ అధికారుల సహకారంతో కొందరు ఓఆర్సీ పొందడానికి చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. జిల్లాలో నాలుగు వరుసల రహదారిని ఆనుకుని ఉన్న బీడీపీపీ భూముల్లో (బిలా దాఖల పొరంబోకు) ప్రస్తుతం భారీ భవనాల నిర్మాణాలు సాతుగున్నాయి. వీటికి సైతం నౌ లావుణి పట్టాలు ఉన్నాయని మండల స్థాయి అధికారులు చెబుతుండగా, జిల్లాస్థాయి అధికారులు సైతం విస్మయం చెందుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడా నౌ లావుణి పట్టాలు చూడలేదని, దీనిగురించి వినలేదని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి చెప్పారు.
మొరమూ అక్రమమే...
వెంచర్లలో రహదారులు నిర్మించడానికి బుదల్ఘాట్ వాగు ఒడ్డుకు ఉన్న భూముల నుంచి ప్రొక్లెయిన్ సహకారంతో రోజంతా ఎలాంటి అనుమతులు లేకుండానే ట్రాక్టర్లలో మట్టిని తీసుకువస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దూసుకెళ్తున్న వినియోగం.. షెడ్డుకొస్తున్న నియంత్రికలు
[ 26-04-2024]
జిల్లాలో ఎండలు మండిపోతుండటంతో భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. బోరు బావుల్లో నీరు బాగా లోతుకు వెళుతుండటంతో దాని ప్రభావం నియంత్రికలపై పడి కాలిపోతున్నాయి. -
రెఫరీగా మారి.. ప్రచారం చేసి!
[ 26-04-2024]
సిరికొండ మండలం వాయిపేట్, రాజన్పేట్, చెమ్మన్గూడ తదితర గ్రామాల్లో భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ గురువారం ప్రచారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. -
సివిల్స్ ర్యాంకర్కు గవర్నర్ సన్మానం
[ 26-04-2024]
ఇటీవల ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో జాతీయస్థాయిలో 790 ర్యాంకు సాధించిన రేకులవార్ శుభంతో పాటు వారి తల్లిదండ్రులు జీవిత, సత్యనారాయణలను రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ సన్మానించారు. -
పేదలకు అండగా.. గిరిజన క్యాంటిన్
[ 26-04-2024]
టీ తాగాలన్నా కనీసం రూ.6 వెచ్చించాల్సిందే. అలాంటి పరిస్థితిలో కేవలం రూ.5 లకే అందిస్తున్న భోజనం ఉట్నూరువాసుల కడుపు నింపుతోంది. ఏజెన్సీలోని ఆదిమ గిరిజనుల(పీవీటీజీ)ను ఆదుకునేందుకు ఐటీడీఏ అధికారులు పలు పథకాలను ప్రవేశపెడుతున్నారు. -
రిమ్స్ సంచాలకుడిని బ్లాక్మెయిల్ చేసే యత్నం
[ 26-04-2024]
తాను స్పెషల్ బ్రాంచీ పోలీసునని చెప్పి రిమ్స్ సంచాలకుడు రాఠోడ్ జైసింÞ్ను, గజానంద్ ఆసుపత్రి వైద్యుడు అభిజిత్ నుగుర్వార్ను బ్లాక్ మెయిల్ చేసే యత్నం చేసిన గుర్తు తెలియని వ్యక్తిపై ఆదిలాబాద్ రెండో పట్టణ పోలీసులు గురువారం రాత్రి కేసు నమోదు చేశారు. -
వివాహితపై హెడ్కానిస్టేబుల్ లైంగిక వేధింపులు
[ 26-04-2024]
శాంతి, భద్రతలు కాపాడుతూ ప్రజలకు రక్షణ కల్పించాల్సిన హెడ్ కానిస్టేబుల్ మావల పోలీసు స్టేషన్ పరిధిలోని ఒక కాలనీలో వివాహితపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ సంఘటన గురువారం వెలుగు చూసింది. -
జేఈఈ మెయిన్స్లో గిరిజన విద్యార్థిని ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఉట్నూరు మండలం జైత్రంతండాకు చెందిన గిరిజన విద్యార్థిని చౌహాన్ మేఘన ప్రతిభ కనబర్చి పలువురి మన్ననలు అందుకున్నారు. -
గొలుసుకట్టు వ్యాపారంలో ‘బంపర్ ఆఫర్’
[ 26-04-2024]
అమాయకులను నిండా ముంచిన గొలుసుకట్టు వ్యాపారంలో కంపెనీ ఏజెంట్లకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది. డిపాజిట్దారులకు తిరిగి సొమ్మును చెల్లించే క్రమంలో హైదరాబాద్ నగరశివారులో ఉన్న భూమిని ప్రధాన ఏజెంట్లకు విక్రయించాలని యోచిస్తోంది. -
ఆశీర్వదించండి.. ఎంపీగా గెలిపించండి
[ 26-04-2024]
గోడం నగేష్ను ఆశీర్వదించి గెలిపించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. గురువారం భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ ఎంపీ రమేష్ రాఠోడ్, యువ నాయకుడు రితీష్ రాఠోడ్లతో కలిసి ఉట్నూరు మండలం పులిమడుగు, సాలెవాడ, కోపర్ఘడ్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
కాంగ్రెస్తోనే పేదలకు భవిష్యత్తు
[ 26-04-2024]
కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే పేదల బతుకులు బాగుపడతాయని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ అన్నారు. ఆదివారం పార్టీ నాయకులతో కలిసి పట్టణంలోని ఖానాపూర్, కొలీపుర, బొక్కలగూడ, అంబేడ్కర్నగర్లో రోడ్ షోలో పాల్గొన్నారు. -
తుక్కు పేరిట అక్రమ దందా!
[ 26-04-2024]
అనుమతులు, లైసెన్సులు లేకుండానే పలువురు ‘తుక్కు’ పేరిట జిల్లాలో అక్రమ దందా కొనసాగిస్తున్నారు. జిల్లాలోని ప్రధాన రహదారుల సమీపంలోని పెద్ద ప్రహరీలతో కూడిన గోదాములను ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు సాగిస్తున్నారు. -
నాలుగు గంటల వరకే పోలింగ్
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, పాలనాధికారి వెంకటేష్ ధోత్రే పేర్కొన్నారు. ఓటర్లందరికి ఓటరు చీటీలను అందజేస్తున్నామన్నారు. -
అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం
[ 26-04-2024]
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలైన ఘటన కుమురంభీం జిల్లా బెజ్జూరు మండలం పోతపల్లి-కోర్తేగూడ గ్రామాల మధ్య గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. -
చెట్టు పేరు చెప్పి.. ప్లాట్లు అంటగట్టి..
[ 26-04-2024]
మంచిర్యాల జిల్లా కేంద్రంలో అమ్మకానికి ఖాళీ స్థలాలు లేకపోవడంతో భూఅక్రమ వ్యాపారులు సరిహద్దు గ్రామాల్లోని వ్యవసాయ భూములను నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లుగా మార్చి అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. -
వెల్లువెత్తిన నామినేషన్లు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామపత్రాల స్వీకరణ పర్వం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్ఖాన్ నామపత్రాలు స్వీకరించారు. -
దారి మళ్లించి.. మురుగుకాలువ ఆక్రమించి
[ 26-04-2024]
కబ్జాల తీరు కొంత పుంతలు తొక్కుతోంది. కబ్జాదారులకు హద్దూఅదుపులు లేకుండా పోతుండడంతో వారు రెచ్చిపోతున్నారు. పట్టణంలో మురుగుకాలువలను కబ్జా చేస్తున్నా మున్సిపల్ యంత్రాంగం చోద్యం చూస్తుంది. -
సన్న బియ్యం ధరలు పైపైకి
[ 26-04-2024]
బహిరంగ మార్కెట్లో సన్నబియ్యం ధరలు రోజురోజుకి సామాన్యులకు అందనంత ఎత్తుకు ఎదుగుతున్నాయి. పేద, మధ్య తరగతి కుటుంబాలు సన్నబియ్యం కొనాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. -
లైంగిక దాడి కేసులో పదేళ్ల జైలు
[ 26-04-2024]
మాయమాటలు చెప్పి బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో నేరస్థుడికి జైలు శిక్ష విధిస్తూ నిర్మల్ న్యాయస్థానం తీర్పునిచ్చింది. జిల్లా న్యాయస్థానాల సమన్వయాధికారి సక్రియానాయక్ తెలిపిన వివరాలిలా.. -
తూర్పున ఉత్సాహం.. పశ్చిమాన నైరాశ్యం
[ 26-04-2024]
ఉమ్మడి జిల్లాలో లోక్సభ ఎన్నికల ప్రచార శైలి భిన్నంగా సాగుతోంది. తూర్పున పెద్దపల్లి లోక్సభ స్థానం పరిధిలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరులో ప్రచారం ఉత్సాహంగా సాగుతుంటే పశ్చిమాన ఆదిలాబాద్ నియోజకవర్గంలోకి వచ్చే సిర్పూర్, ఆసిఫాబాద్, ఖానాపూర్, ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ముథోల్లో మందకొడిగా కొనసాగుతోంది. -
ఇక లెక్క పక్కా!
[ 26-04-2024]
హరితహారం కార్యక్రమం విజయవంతం చేయడానికి అధికార యంత్రాంగం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకెళ్తోంది. గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టనుంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా