గురువుల సంకల్పం.. కలిసొచ్చిన ఆంగ్లం
అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ఉచిత విద్య, మధ్యాహ్న భోజనం, పాఠ్యపుస్తకాలు, యూనిఫాం.. ఇలా విద్యార్థుల కోసం అనేక సౌకర్యాలను అందజేస్తున్న ప్రభుత్వ పాఠశాలలు గతంలో వివిధ కారణాలతో మూతబడ్డాయి. గ్రామీణ ప్రాంతాల్లో గతంలో మూతబడిన పాఠశాలలు
కుమురం భీం జిల్లాలో 9 పాఠశాలలు పునఃప్రారంభం
కౌటాల గ్రామీణం, న్యూస్టుడే
కౌటాల మండలం తాటినగర్లో పునఃప్రారంభమైన పాఠశాలలో విద్యార్థులకు బోధిస్తున్న ఉపాధ్యాయురాలు
అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ఉచిత విద్య, మధ్యాహ్న భోజనం, పాఠ్యపుస్తకాలు, యూనిఫాం.. ఇలా విద్యార్థుల కోసం అనేక సౌకర్యాలను అందజేస్తున్న ప్రభుత్వ పాఠశాలలు గతంలో వివిధ కారణాలతో మూతబడ్డాయి. గ్రామీణ ప్రాంతాల్లో గతంలో మూతబడిన పాఠశాలలు తిరిగి ప్రారంభించేందుకు ఉపాధ్యాయులు చేసిన బడిబాట ద్వారా చేసిన ప్రయత్నాలు ఫలించాయి. కుమురం భీం జిల్లాలో తొమ్మిది పాఠశాలలు మళ్లీ తెరచుకున్నాయి.
దారిచూపిన ‘బడి బాట’..
జిల్లాలో ఏళ్లుగా మూతపడి ఉన్న ప్రభుత్వ పాఠశాలలు ఈ ఏడాది విద్యా సంవత్సరంలో తిరిగి ప్రారంభమయ్యాయి. ఇలా జిల్లా వ్యాప్తంగా తొమ్మిది బడులలో విద్యాబోధన పునఃప్రారంభమయ్యాయి. బడిబాట కార్యక్రమంలో భాగంగా.. ఉపాధ్యాయులు గ్రామాల్లో ర్యాలీలు, గ్రామసభలు నిర్వహించి సర్కారు బడుల్లో అందుతున్న విద్యాబోధన, సౌకర్యాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. దీంతో పాటు ఈ విద్యాసంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమం కూడా ప్రారంభం కానుందని విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఫలితంగా ఉపాధ్యాయుల సంకల్పం, తల్లిదండ్రుల్లో వచ్చిన మార్పుల వల్ల అంతా ఏకమై పాఠశాలలను తిరిగి తెరిపించారు.
సమష్టిగా కలిసి.. బాగుచేసి
ఏళ్లుగా తెరచుకోని బడుల భవనాలు శిథిలావస్థకు చేరి ఉండటంతో తాత్కాలికంగా అవస్థలు తప్పడం లేదు. ఇది గ్రహించిన గ్రామస్థులు, ఉపాధ్యాయులు అందరూ ఏకమై సమష్టిగా మరమ్మతులు చేయించాలని నిర్ణయించుకొన్నారు. ఈమేరకు ఖర్చులు భరించి బడులను బాగు చేయిస్తున్నారు. ఫ్లోరింగ్, బ్లాక్బోర్డు, రంగులు తదితర పనులు మొదలుపెట్టారు. ఒకవైపు మరమ్మతులు కొనసాగుతుండటంతో చదువులకు ఆటంకం కలగకుండా కౌటాల మండలం వైగాం గ్రామంలోని తాత్కాలికంగా ఓ ఇంట్లో బోధన కొనసాగిస్తున్నారు. ప్రైవేటుకు ధీటుగా విద్యాబోధన అందించేందుకు ఉపాధ్యాయులు సైతం క్రమం తప్పకుండా హాజరవుతున్నారు. ఫలితంగా విద్యార్థుల తల్లిదండ్రులకు బడులపై నమ్మకం పెరుగుతోంది.
ఇంటినే తరగతి గదిగా మార్చి..
కౌటాల మండలం వైగాం గ్రామంలోని పాఠశాలలో విద్యార్థుల సంఖ్య లేకపోవడంతో ఆరేళ్ల కిందట మూతబడింది. బడి బాటలో 35 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ఏళ్లుగా తెరచుకోని బడి భవనానికి ప్రస్తుతం మరమ్మతులు కొనసాగుతున్నాయి. దీంతో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సరిత.. చదువులకు ఆటంకం కలగకుండా ఇలా ఓ ఇంట్లో విద్యాబోధన అందిస్తున్నారు.
మూడేళ్లకు తెరుచుకొని
ఇది వాంకిడి మండలంలోని సామెల ప్రాథమిక పాఠశాల. ఇది మూడేళ్ల కిందట విద్యార్థుల సంఖ్య లేకపోవడంతో మూతబడింది. ఈ ఏడాది ఈ పాఠశాలలో ఉపాధ్యాయుడు జాదవ్ సచిన్కు పోస్టింగ్ ఇచ్చారు. ఈయనతో పాటు సీఆర్పీ సందీప్లు బడిని తెరిపించేందుకు కృషి చేశారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచి మారుతితో కలిసి ఇంటింటా ప్రచారం చేపట్టారు. వారి కష్టానికి ఫలితం కూడా దక్కింది. 31 మంది విద్యార్థులు చేరడంతో పాఠశాల పునఃప్రారంభమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గౌతమ్.. నన్ను మన్నించురా...
[ 18-04-2024]
మరికొద్ది గంటల్లో సంతోషంగా పండగ వేడుకలు జరుపుకొనేందుకు సిద్ధమైన ఆ కుటుంబంలో విద్యుత్తు ప్రమాదం విషాదం నింపింది. కాసిపేట ఎస్సై ప్రవీణ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. -
నేత్రపర్వం.. సీతారాముల కల్యాణోత్సవం
[ 18-04-2024]
పల్లెపట్టణం, ఊరూవాడల్లో బుధవారం శ్రీరామనవమి వేడుకలు మిన్నంటాయి. ఆలయాల్లో శ్రీరామచంద్రుడు, సీతాదేవీల కల్యాణం నేత్రపర్వంగా సాగింది. మంగళ వాయిద్యాలు ప్రతిధ్వనిస్తుండగా తలంబ్రాలు, -
ఎన్నికల సమర శంఖారావం..
[ 18-04-2024]
పార్లమెంట్ ఎన్నికల సమరానికి శంఖారావం పూరించే సమయం ఆసన్నమైంది. ఈ పోరులో పాల్గొనే వివిధపార్టీల అభ్యర్థులు, స్వతంత్రుల నామపత్రాల దాఖలుకు రంగం సిద్ధం అయ్యింది. -
ఉపాధి కూలి.. నిరీక్షణతో సరి
[ 18-04-2024]
పేద కూలీలతోపాటు ఇటీవల వ్యవసాయ పనుల సీజన్ ముగియడంతో రైతు కుటుంబాలు అధిక సంఖ్యలో ఉపాధి హామీ పనుల బాట పట్టాయి. సకాలంలో డబ్బులు చేతికందక పూట గడవడం కోసం ఇతరుల వద్ద వారు చేతులు చాచాల్సి వస్తోంది. -
ముగిసిన 27 ఏళ్ల విప్లవ ప్రస్థానం
[ 18-04-2024]
ఆదివాసీ మహిళ రెండు దశాబ్దాల విప్లవ ప్రస్థానం ముగిసిపోయింది. ఛత్తీస్గఢ్ బస్తర్ ప్రాంతంలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో బజార్హత్నూర్ మండలం డెడ్రాకు చెందిన దాసరివార్ సుమన్బాయి అలియాస్ రజిత మృతి చెందారు. -
విద్యార్థి మరణం పాఠం నేర్పేనా?
[ 18-04-2024]
ఆర్జీయూకేటీలో వరుస విద్యార్థి మరణాలు.. ప్రాంగణంలో తరచూ చోటుచేసుకుంటున్న ఘటనలు విశ్వవిద్యాలయాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అటు విద్యార్థులకు, ఇటు తల్లిదండ్రులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. -
బాధలు చెప్పుకొనేదెలా?
[ 18-04-2024]
జిల్లాలో 2015లో ప్రత్యేక మహిళా పోలీస్స్టేషన్ను ప్రారంభించారు. నిత్యం పదుల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్న ఈ స్టేషన్లో ప్రస్తుతం అధికారులెవరూ లేరు. -
నిధుల ప్రవాహం.. తీరాలి దాహం
[ 18-04-2024]
చెన్నూరు పట్టణంలోని శివారు కాలనీల్లో తాగునీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలను గుర్తించి అధికారులు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. వీటికోసం నిధులు అందుబాటులో ఉండటంతో ఇబ్బంది లేకుండా ముందస్తు జాగ్రత్తలకు ఉపక్రమించారు. -
వలసల జోరు.. కారు బేజారు!
[ 18-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నామపర్వానికి ముందు జిల్లాలో అనూహ్య పరిమాణాలు చోటుచేసుకుంటున్నాయి. పట్టున్న నాయకులందరూ కాంగ్రెస్, భాజపా పార్టీలోకి చేరుతున్నారు. -
రాయితీ.. పక్కదారి!
[ 18-04-2024]
జిల్లాలోని రెండు పురపాలికలు, పలు మండలాలు వ్యాపార, వాణిజ్యపరంగా క్రమక్రమంగా అభివృద్ధి చెందుతున్నాయి. పారిశ్రామికంగా కాగజ్నగర్తోపాటు పరిసర ప్రాంతాల్లో హోటళ్లు, టిఫిన్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, పలు గ్యాస్తో నడిచే ఆటోలు, కార్లు ఎక్కువగా ఉన్నాయి. -
ఈదురు గాలుల బీభత్సం.. క్షణాల్లో అతలాకుతలం..
[ 18-04-2024]
మండలంలోని బూరుగూడలో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. క్షణాల వ్యవధిలోనే పలువురి ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. నిత్యావసర సామగ్రి చెల్లాచెదురయ్యాయి. -
అపురూపం.. చరిత్రకు సాక్ష్యం
[ 18-04-2024]
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అపారమైన చారిత్రక వైభవాన్ని కలిగి ఉంది. అద్భుతమైన ఆలయాలు, జాలువారే జలపాతాలకు నిలయంగా ఉంది. ఊహకందని రీతిలో వందల సంవత్సరాల కిందటే నిర్మించిన అబ్బురపరిచే శిల్పసంపద, గత వైభవానికి చిహ్నంగా కోటలు దర్శనమిస్తాయి. -
సంపూర్ణ అక్షరాస్యతకు.. నవభారత!
[ 18-04-2024]
నిరక్షరాస్యులైన వయోజనులందరినీ వచ్చే అయిదేళ్లలో అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంలో భారత ప్రభుత్వం నూతనంగా నవభారత సాక్షరత (న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం) కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
ఎండలతో ఉక్కిరిబిక్కిరి
[ 18-04-2024]
జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలతో వాతావరణం చల్లబడిందని సంతోషిస్తున్న సమయంలోనే భానుడు తిరిగి భగ్గమంటున్నాడు. రెండు రోజుల్లోనే ఉష్ణోగ్రత అయిదు డిగ్రీలకు పైగా పెరిగింది. -
అభ్యర్థులకు కీలకం.. నామపత్రాల ఘట్టం
[ 18-04-2024]
పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని పట్టణాలు, గ్రామాల్లో లోక్సభ ఎన్నికల పోరు క్రమేణా జోరందుకుంటుంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు, కీలక నేతలు సమావేశాలు నిర్వహిస్తూ గెలుపు వ్యూహాలు రచిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీ, తెలంగాణకు సాగర్ నీటి విడుదలపై కేఆర్ఎంబీ ఉత్తర్వులు
-
డేవన్ కాన్వే ఔట్.. మరో సీనియర్ ప్లేయర్కు చెన్నై అవకాశం
-
గత పదేళ్లలో తెలంగాణకు రూ.10 లక్షల కోట్లు: కిషన్రెడ్డి
-
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
-
ఇన్నేళ్లుగా ‘రాహుల్’యాన్ను లాంచ్ చేయలేకపోయింది: రాజ్నాథ్ సింగ్
-
లింక్ క్లిక్ చేస్తున్నారా? ఆగండి..! మెసేజ్ మూలాలు చెక్ చేయండి..