సక్రమ చెల్లింపు.. రుణపరిమితి పెంపు..
పట్టణాల్లో బతుకుదెరువు కోసం చిన్నాచితకా పనులు చేస్తున్న వీధి వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ప్రధానమంత్రి స్వనిధి పథకం కింద రుణ పరిమితిని రూ.50 వేలకు పెంచుతూ ఉత్తర్వులను జారీ చేసింది. గతంలో బ్యాంకుల నుంచి మొదటి విడత రూ.10 వేల రుణం తీసుకుని
ఇక వీధి వ్యాపారులకు పీఎం స్వనిధి రూ.50 వేలు
కైలాస్నగర్, కాగజ్నగర్, న్యూస్టుడే
సమీక్ష నిర్వహిస్తున్న కుమురంభీం జిల్లా అదనపు పాలనాధికారి చాహత్ బాజ్పాయి (పాత చిత్రం)
పట్టణాల్లో బతుకుదెరువు కోసం చిన్నాచితకా పనులు చేస్తున్న వీధి వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ప్రధానమంత్రి స్వనిధి పథకం కింద రుణ పరిమితిని రూ.50 వేలకు పెంచుతూ ఉత్తర్వులను జారీ చేసింది. గతంలో బ్యాంకుల నుంచి మొదటి విడత రూ.10 వేల రుణం తీసుకుని తిరిగి చెల్లించిన కొందరికి రూ.20 వేలు రుణం ఇచ్చారు. దాన్నికూడా సక్రమంగా చెల్లించిన వారికి రూ.50 వేల రుణం పొందే అవకాశం కలిగింది. అప్పులు చేసుకుని వ్యాపారాలు కొనసాగించే పేదలకు ప్రభుత్వ నిర్ణయంతో ఎంతో ప్రయోజనం చేకూరనుంది.
సకాలంలో చెల్లిస్తే ప్రయోజనం..
రెండేళ్ల కిందట కరోనా కష్టకాలంలో లాక్డౌన్ విధించడంతో వీధి వ్యాపారుల బతుకులు ఆగమయ్యాయి. తిరిగి పరిస్థితులు మెరుగుపడ్డాక చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునే వారు పెట్టుబడికి డబ్బుల్లేక అనేక ఇబ్బందులు పడ్డారు. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం వారికి ఆర్థిక చేయూతనందించేందుకు పీఎం స్వనిధి పథకాన్ని ప్రారంభించింది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ఆధ్వర్యంలో వీధి వ్యాపారుల సర్వే నిర్వహించింది. అర్హులైన వారికి గుర్తింపు కార్డులను అందజేసి మొదటి విడతగా రూ.10 వేలు, తర్వాత రూ.20 వేలు అందజేసింది. అయితే మొదటి విడత రుణాలు వేల సంఖ్యలో పొందినప్పటికీ చాలామంది తిరిగి చెల్లించలేదు. అదే సక్రమంగా చెల్లించిన వారు రెండో విడతగా రూ.20 వేలు పొందారు. ప్రస్తుతం ఈ రుణాన్ని సైతం చెల్లించిన వారు రూ.50 వేల రుణాలు పొందేందుకు అర్హత సాధిస్తారు.
డిజిటల్ లావాదేవీలకు ప్రోత్సాహం
నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు వీధి వ్యాపారులకు నగదు ప్రోత్సాహకాన్ని సైతం అందిస్తోంది. ఫోన్ పే, భారత్ పే, పేటీఎం తదితర పేమెంట్ అగ్రిగేటర్లకు చెందిన క్యూఆర్ కోడ్ స్కానర్లను ఉచితంగా అందజేసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న వీధి వర్తకులకు రెండేళ్లలో వివిధ బ్యాంకుల నుంచి దాదాపు రూ.51.98 కోట్ల రుణాలను చెల్లించారు. నెలలో రూ.10 వేల నగదు రహిత లావాదేవీలు చేసిన వారికి ప్రోత్సాహకంగా రూ.100 క్యాష్బ్యాక్ను సైతం వారి ఖాతాల్లో జమ చేస్తోంది. దీంతో ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.22 లక్షలు క్యాష్బ్యాక్ రూపంలో వ్యాపారుల ఖాతాల్లో జమయ్యాయి. సకాలంలో రుణాలు చెల్లించిన వారికి 7శాతం వడ్డీ రాయితీ వర్తిస్తోంది.
సద్వినియోగం చేసుకోండి
- శ్రీనివాస్, డీఎంసీ, మెప్మా, ఆదిలాబాద్
పీఎం స్వనిధి పథకం కింద రుణాలు తీసుకుని సక్రమంగా చెల్లించిన వారికి రూ.50 వేల రుణం అందజేయాలని ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. గడువులోగా చెల్లిస్తే వడ్డీ రాయితీ లభిస్తుంది. వినియోగదారుల నుంచి ఆన్లైన్లో ఎక్కువగా నగదు స్వీకరించిన వారికి ప్రోత్సాహక నగదు ఖాతాల్లో జమవుతుంది. వీధి వ్యాపారులందరూ సద్వినియోగం చేసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉత్సాహంగా అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు
[ 25-04-2024]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో గురువారం జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగాయి. -
ప్రారంభమైన వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం
[ 25-04-2024]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో గురువారం హైదరాబాద్ క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం ప్రారంభమైంది. -
తగ్గిన ఇంటర్ ఉత్తీర్ణత
[ 25-04-2024]
కిందటేడాది మాదిరిగానే ఈసారి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను బుధవారం ఒకేసారి విడుదల చేశారు. గత సంవత్సరంతో పోల్చితే ఈసారి జిల్లా ఉత్తీర్ణత శాతం కొద్దిగా తగ్గింది. -
అయిదేళ్లుగా ఎదురుచూపులే!
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం రైతులందరికి అందడం లేదు. ప్రారంభంలో ఉన్న రైతుల్లో నిబంధనల కారణంగా తొలగిస్తున్నా.. కొత్త వారిని చేర్చకపోవడంతో ఏటా సాయం పొందే రైతుల సంఖ్య తగ్గుతోంది. -
దిగజారిన ఫలితాలు..
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా గతేడాదితో పోలిస్తే అయిదు స్థానాలు కిందికి పడిపోయి రాష్ట్రంలో 7వ స్థానానికి పరిమితమైంది. అయినప్పటికీ ఉత్తమ ఫలితాలనే సాధించినట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు. -
పక్కాగా ఎన్నికల సంఘం మార్గదర్శకాల అమలు
[ 25-04-2024]
పార్లమెంట్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి జిల్లాల ఎన్నికల అధికారులు, పాలనాధికారులు, -
ఏసీబీ అధికారుల విస్తృత తనిఖీలు
[ 25-04-2024]
నాలుగు వరుసల రహదారి విస్తరణలో భాగంగా.. పరిహారం చెల్లింపులో జరిగిన అక్రమాలపై ‘ఈనాడు’ ప్రచురించిన వరుస కథనాలకు ఏసీబీ అధికారులు స్పందించారు. -
స్థిరాస్తి వ్యాపారుల్లో గుబులు
[ 25-04-2024]
ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడం, నిబంధనలు కాలరాసి వెంచర్లు వేసి అమాయకులను మోసం చేయడం, బాండ్ పేపర్ల మీద రాసుకుంటూ బీడీపీపీ భూములను విక్రయించడం, వివాదాస్పద భూములను వాటాలు వేసుకుని పంచుకోవడం, -
ఏనుగు దాడి ఘటనలో.. బాధిత కుటుంబాలకు పరిహారం
[ 25-04-2024]
కాగజ్నగర్ అటవీ డివిజన్ పరిధిలో ఏనుగు దాడిలో మృతి చెందిన ఇద్దరు రైతుల కుటుంబాలకు ప్రభుత్వం మంజూరు చేసిన పరిహారం చెక్కులను అందజేశారు. -
ఆరో రోజు 8 నామినేషన్లు
[ 25-04-2024]
పెద్దపల్లి లోక్సభ స్థానానికి ఆరో రోజు బుధవారం 8 మంది నామినేషన్లు దాఖలు చేశారు. భాజపా జిల్లా అధ్యక్షుడు చందుపట్ల సునీల్రెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, నాయకులు కన్నం అంజయ్యలతో కలిసి -
ఫలితాల్లో దిగజారి.. అట్టడుగుకు చేరి
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ప్రథమ ద్వితీయ ఫలితాల్లో జిల్లాకు నిరాశే ఎదురైంది. -
అలా ఏర్పాటు.. ఇలా తొలగింపు
[ 25-04-2024]
ఆ యూటర్న్ మృత్యువుకు చిరునామాగా మారింది. ఇక్కడ జరిగిన రహదారి ప్రమాదాల్లో దాదాపు 10 మంది మృతి చెందారు. వీరంతా యూటర్న్ వద్దకు రాగానే ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయారు. -
మొరం తవ్వేస్తున్నారు.. వెంచర్లలో నింపేస్తున్నారు
[ 25-04-2024]
జిల్లాలో ఏ గుట్టను చూసినా అక్రమ దందా ఎలా సాగుతుందో తెలుస్తోంది. యథేచ్ఛగా మొరం తవ్వకాలు జరుగుతున్నా.. సిబ్బంది లేకనే ఇబ్బందులు ఉన్నాయంటూ సంబంధిత అధికారులు ప్రకటించడం చూస్తుంటే పరోక్షంగా వారికి ఎలా అండగా ఉన్నారో తెలిసిపోతోంది. -
అమ్మాయిలదే హవా
[ 25-04-2024]
ఇంటర్ వార్షిక పరీక్ష ఫలితాల్లో జిల్లాలో బాలికలదే పైచేయిగా నిలిచింది. గత ఏడాది సైతం వారే ముందంజలో ఉన్నారు. రెగ్యులర్ కోర్సుల్లో గత సంవత్సరంకంటే రాష్ట్రస్థాయిలో దిగజారినా ఒకేషనల్లో మాత్రం కొంత మెరుగైంది. -
ఇంటర్లో మెరిసిన విద్యాకుసుమాలు
[ 25-04-2024]
బోథ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, ఆదర్శ పాఠశాల విద్యార్థులు బుధవారం వెలువడిన ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సర ఫలితాలలో సత్తా చాటారు. -
నమ్మించి మోసం చేసిన హోంగార్డు అరెస్ట్
[ 25-04-2024]
ప్రజలను నమ్మించి మోసం చేసిన హోంగార్డు షమీ ఉల్లాఖాన్ను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణ సీఐ అనిల్ తెలిపిన వివరాల ప్రకారం షమీ ఉల్లాఖాన్ కొద్ది రోజుల క్రితం పట్టణంలో ట్రాఫిక్ విధులు నిర్వహించారు. -
చర్చనీయాంశంగా మాజీ ఎంపీ నామపత్రం దాఖలు
[ 25-04-2024]
మాజీ ఎంపీ రాఠోడ్ రమేష్ ఒక్కరే వచ్చి భాజపా తరఫున నామపత్రం దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. భాజపా అభ్యర్థి గోడం నగేష్ చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న ఆయన ఆ తర్వాత
తాజా వార్తలు (Latest News)
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న