వైఫల్యమే పాఠం.. విజయతీరమే గమ్యం
ఇంటర్, పది పరీక్ష ఫలితాలు వెలువడనున్నాయి. పరీక్ష ఫలితాలు కొంత మంది తల్లిదండ్రులకు కడుపు కోతను మిగిల్చుతున్నాయి. పరీక్షల్లో ఉత్తీర్ణత కాలేకపోయిన విద్యార్థులు కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. బంగారం లాంటి జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకుంటున్నారు
ఫలితాలతో నిరుత్సాహం చెంది రాయొద్దు మరణ శాసనం
ప్రపంచ కుబేరులేం చదువరులు కారు
దండేపల్లి గ్రామీణం, న్యూస్టుడే
ఇంటర్, పది పరీక్ష ఫలితాలు వెలువడనున్నాయి. పరీక్ష ఫలితాలు కొంత మంది తల్లిదండ్రులకు కడుపు కోతను మిగిల్చుతున్నాయి. పరీక్షల్లో ఉత్తీర్ణత కాలేకపోయిన విద్యార్థులు కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. బంగారం లాంటి జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు నుంచి మొదలు, యాజమాన్యాల వరకు తమ పిల్లలకు మంచి ర్యాంకులు రావాలనే ఒత్తిడి కావచ్చు...స్నేహితుల ముందు ఎలా తిరగాలనే మానసిక సంఘర్షణ..ఇలా ఎన్నో కారణాలు విద్యార్థుల మృతికి కారణమవుతున్నాయి. మార్కులే కొలమానం కాదు అనే విషయాన్ని అందరూ గుర్తించాలి. ప్రముఖుల జీవితాలే ప్రేరణ కావాలి. ఒకసారి అనుత్తీర్ణులైనా పట్టుదలతో ఎన్నో విజయాలు సాధించవచ్చని తెలుసుకోవాలి. ఈ నేపథ్యంలో ‘న్యూస్టుడే’ కథనం.
గొప్పవాళ్లందరు చదువరులు కాదు..
ప్రపంచ కుబేరుల జాబితాలో పేరు సంపాదించిన వారిలో ఎక్కువ మంది ఏదో కారణంతో చదువు మధ్యలో ఆపేసిన వారే. సంపాదన విషయంలో మనం వారి పేర్లను స్మరించుకుంటున్నాం. అందుకు వారు చేసిందొక్కటే.. నచ్చిన మార్గంలో ప్రయాణించి అనుకున్న విజయం సాధించే వరకు విశ్రమించకపోవడం. ధ్రువపత్రాలను కేవలం అర్హతగానే పరిగణించారు. వారి ఆలోచనలకు పదును పెట్టారు. వైఫల్యాలను అనుభవాలుగా స్వీకరించి విజయాలు సాధించారు.
ఫలితంపై ఎంత శ్రద్ధ చూపిస్తారో.. దాన్ని పొందే పద్ధతుల్లోనూ అంతే శ్రద్ధ పాటించాలి.... ..స్వామి వివేకానంద
విద్యార్థులేం చేయాలి..
* నిరాశ చెంది ఒంటరిగా కూర్చుంటే మనసు పరిపరివిధాల పోతుంది. తల్లిదండ్రులకు పెద్ద తలవంపులు తెచ్చానన్న బలహీనమైన భావన మరింత కుంగుబాటుకు దారి తీస్తుంది. అలా కాకుండా రోజూ ఎలా గడిపామో భవిష్యత్తులోనూ అలాగే చేయండి.
* అనుత్తీర్ణత సాధించిన సబ్జెక్టులో మళ్లీ పరీక్ష ఉంటుంది. విద్యాసంవత్సరం వృథా కాకుండా సహచర విద్యార్థులతో కలిసి చదివే వెసులుబాటు ఉన్నందున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనే దిశగా అడుగులు వేయాలి.
* ఫలితాలు వచ్చాక ఒకటి, రెండు రోజులు కాసేపు ధ్యానంలో గడిపి వచ్చే ఫలితాన్ని సానుకూలంగా ఎదుర్కోవడానికి మానసికంగా సిద్ధం కావాలి. పరీక్షలు ఫలితాలు జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి సోపానాలు మాత్రమేనని గమనించాలి.
* వీలైనంత వరకు కుటుంబసభ్యులతో కలిసి గడపాలి. ఆహ్లాదకరమైన విషయాలు మాట్లాడుకోవాలి. స్నేహితులతో గడపండి. మంచి శ్రేణి సాధించిన మీ మిత్రులను కలిసి మనస్ఫూర్తిగా అభినందించండి.
తల్లిదండ్రులు ఏం చేయాలంటే..
* ఫలితాలు రాగానే ఇంట్లో ఎలాంటి చర్చలు, వాదోపవాదాలు లేకుండా సూర్యోదయం అయినంత తేలికగా ఉండాలి. దూషణలు, రేపు తాము తలెత్తుకొని ఎలా తిరగాలన్న ఆక్రోశాన్ని పొరపాటున కూడా తల్లిదండ్రులు వ్యక్తం చేయరాదు. ఎలా బతుకుతారని అర్థం లేని ప్రశ్నలతో వేధించవద్దు.
* తమ బిడ్డ మిగితా అందరి కన్న తెలివైన వాడని, పదిలో మంచి గ్రేడ్ తెచ్చుకుంటాడని అందరితో చెప్పి తీరా ఫలితాలు వచ్చాక చతికిల పడుతుంటారు. ఎలాంటి చర్చలు లేకుండా మామూలుగా ఉన్నట్లే గడిపితే పిల్లలు ఇబ్బంది పడరు.
* ఫలితాలు వెల్లడైన తర్వాత తోటి వారితో పోల్చే ప్రయత్నం చేయకండి. చదువుల కోసం తెచ్చిన వేలాది రూపాయలు బూడిద పాలయ్యాయని నిందించే ప్రయత్నం చేయండి. పిల్లలకు ఏదైనా సున్నితంగా చెప్పాలన్న విషయం గుర్తుంచుకోవాలి.
చివరిగా ఒక్క విషయం..
ఎవరికీ పరీక్షల్లో తప్పాలని నలుగురిలో చులకనవ్వాలని ఉండదు. తల్లిదండ్రులకు తలవంపులు తేవాలని ఎవరూ కోరుకోరు. అనుత్తీర్ణతకు అనేక కారణాలు ఉంటాయి. వాటిని అన్వేషించి అధిగమించడం ఎలాగో తెలుసుకోండి. ప్రయత్నలోపం లేకుండా వెంటనే సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధపడండి.
చదువు మధ్యలో ఆపేసి
మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ అంటే ప్రపంచ కుబేరుడిగానే తెలుసు. ఆయన తన అభిరుచి కోసం హార్వర్డ్ విశ్వవిద్యాలయం చదువును మధ్యలో వదిలేసి వచ్చారు. ఆ తర్వాత కంప్యూటర్ రంగంలో మార్పులకనుగుణంగా సాఫ్ట్వేర్ రూపొందిస్తూ సంపాదనలో కుబేరులయ్యారు.
రెండు విశ్వవిద్యాలయం నుంచి డ్రాపవుటై
ఒరాకిల్ డేటాబేస్ సాఫ్ట్వేర్ సంస్థను స్థాపించిన ల్యారీ ఎలీ సన్ను పెంపుడు తండ్రి ఎందుకు పనికిరాడని తిట్టేవారట. తర్వాత రెండు విశ్వవిద్యాలయాల నుంచి డ్రాపవుటై అంచలంచెలుగా ఎదిగి ల్యారీ ఒరాకిల్ను స్థాపించారు. సంపదలో ప్రత్యేక స్థానాన్ని పొందారు.
చిన్నప్పుడు ప్రోగ్రామింగ్ నేర్చుకోవడంతో..
సామాజిక మాధ్యమాల్లో అత్యంత ఆదరణ పొందిన ఫేస్బుక్ను రూపొందించడానికి జుకర్బర్గ్ హార్వర్డ్ విశ్వవిద్యాలయం చదువు మధ్యలో మానేశారు. చిన్నప్పుడు ప్రోగ్రామింగ్ నేర్చుకోవడంతో సృజనాత్మక ఆలోచనలతో ముందుకు సాగి నేడు కుబేరుడయ్యారు.
ఎనిమిదిలో తప్పినా... సత్తా చాటాడు.
ప్రముఖ క్రికెటర్ సచిన్ ఎనిమిదో తరగతిలో అనుత్తీర్ణుడయ్యారు. కానీ అతనికి నచ్చిన రంగాన్ని ఎంచుకొని కష్టపడి విజయతీరాలకు చేరారు. ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు సంపాదించారు. చదువు ఒక్కటే కాదు..జీవితంలో తమకు నచ్చిన రంగంలో కష్టపడితే ఎలాంటి ఢోకా ఉండదు.
ఉద్యోగం రాకున్నా.. సినిమాల్లో రాణించారు..
బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. అలాంటి అమితాబ్కు స్వరంలో సున్నితత్వం తక్కువ ఉందని ఆకాశవాణిలో ఉద్యోగానికి తిరస్కరించారు. అనంతరం సినిమా నటుడిగా రాణించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ పార్టీలో పలువురు చేరిక
[ 29-03-2024]
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, యువత శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే
[ 29-03-2024]
జిల్లాలో శుక్రవారం క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే నిర్వహించారు. చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. -
తాంసి సీఎస్ఐ చర్చిలో గుడ్ ఫ్రైడే
[ 29-03-2024]
అదిలాబాద్ జిల్లా తాంసిలోని సీఎస్ఐ చర్చిలో శుక్రవారం గుడ్ ఫ్రైడేను నిర్వహించారు. ఏసుక్రీస్తు ప్రార్థన మందిరంలో క్రైస్తవులంతా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. -
సీఎస్ఐ చర్చిలో గుడ్ ఫ్రైడే
[ 29-03-2024]
జిల్లా కేంద్రంలోని విద్యానగర్ కాలనీలో ఉన్న సీఎస్ఐ చర్చిలో క్రైస్తవులు గుడ్ ఫ్రైడేను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. -
మతతత్వంతో లబ్ధి పొందే పార్టీలకు బుద్ధి చెప్పాలి
[ 29-03-2024]
మతతత్వం రెచ్చగొట్టి లబ్ధి పొందాలనుకునే పార్టీలకు రానున్న లోక్సభ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పూరపాటి రమేష్ పిలుపునిచ్చారు. -
అక్రమ మద్యం విక్రయిస్తే కేసులు తప్పవు
[ 29-03-2024]
అక్రమంగా మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ స్టేషన్ ఎక్సైజ్ సీఐ విజేందర్ హెచ్చరించారు. -
తేలిన బరి.. గెలుపుపై గురి
[ 29-03-2024]
ఆదిలాబాద్ ఎంపీ సీటు విజయం మూడు ప్రధాన పార్టీలకు కీలకంగా మారింది. కాంగ్రెస్ అభ్యర్థిగా ఆత్రం సుగుణ, భాజపా అభ్యర్థిగా గోడం నగేష్, భారాస తరఫున ఆత్రం సక్కు మధ్య త్రిముఖ పోటీ ఏర్పడింది. -
ఇక విద్యుత్తు కోతలకు చెక్
[ 29-03-2024]
ఎండలు ఎక్కువ కావడంతో విద్యుత్తు వినియోగం పెరిగిపోయింది. దీంతో కొన్ని చోట్ల సరఫరాకు అంతరాయం కలుగుతోంది. వచ్చే రెండు నెలల్లో విద్యుత్తు వినియోగం మరింత పెరిగే అవకాశం... -
ఎమ్మెల్యే ఫిర్యాదు చేసినా పట్టించుకోరా?: ఏలేటి
[ 29-03-2024]
గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అల్లోల ఇంద్రకరణ్రెడ్డి హయాంలో ప్రభుత్వ భూములను విచ్చలవిడిగా చెరబట్టారని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి మరోసారి ఆరోపించారు. -
పెన్గంగా.. ఇసుకదందా
[ 29-03-2024]
మండలవాసులకు వరప్రదాయినిగా ఉన్న పెన్గంగా నదిలో ఇసుకదొంగలు పడ్డారు. పారే నీటిని ఆపిమరీ యంత్రాలతో ఇసుకను తోడి అక్రమ రవాణా చేస్తున్నారు. -
గడువు ముందర సందిగ్ధం!
[ 29-03-2024]
ఏటా సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి, ప్రభుత్వ పనులకు బడ్జెట్ కేటాయిస్తారు. దానిని ఆ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ఖర్చు చేయాలి. ఇందుకు సంబంధించిన బిల్లులను ఖజానా శాఖకు పంపిస్తే.. వారు ఈ-కుబేర్లో నమోదు చేస్తారు. -
ఆన్లైన్ జూదంలో నష్టపోయి.. రైతుల డబ్బు కాజేత
[ 29-03-2024]
ఆదిలాబాద్ ఐపీపీబీ(ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్) మేనేజర్ విజయ్ జాదవ్ ఆన్లైన్ జూదానికి అలవాటు పడి అందులో నష్టపోయి రైతులకు చెందిన డబ్బులను కాజేసినట్లు తెలుస్తోంది. -
బహుజన, తెలంగాణవాదాన్ని భారీ మెజార్టీతో గెలిపించాలి
[ 29-03-2024]
రాజ్యాంగాన్ని కాపాడాలనే సంకల్పం, బహుజన, తెలంగాణ వాదం ఒక్కటేననే ఉద్దేశంతో తాను భారాసతో చేతులు కలిపినట్లు ఆ పార్టీ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ అన్నారు. -
సమస్యలు తెలుసుకుని.. పరిష్కారానికి ఆదేశించి
[ 29-03-2024]
గ్రామాల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని జిల్లా పాలనాధికారి వెంకటేష్ దోత్రే అన్నారు. గురువారం అదనపు పాలనాధికారి దీపక్ తివారీతో కలసి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. -
ఉద్యానవనాలపై ఉదాసీనత..
[ 29-03-2024]
మంచిర్యాల పట్టణవాసులకు ఆహ్లాదం కోసం వివిధ వార్డుల్లో ఉద్యానవనాల నిర్మాణం చేపట్టారు. ఒక్కో ఉద్యానవనానికి రూ.40 లక్షల నుంచి రూ.90 లక్షలు కేటాయించారు. -
రూ.‘కోటి’.. చీకటి పాలు
[ 29-03-2024]
ఒకవైపు రహదారి విస్తరణ లేక, మరోవైపు సిర్పూరు కాగితం మిల్లు(ఎస్పీఎం)కు నిత్యం ముడిసరకు లారీల రాకపోకల కారణంగా.. ఏడాదిలోపే రూ.కోటితో ఏర్పాటు చేసిన వెలుగులు విరజిమ్మే సెంట్రల్ లైటింగ్ వ్యవస్థ చీకటి పాలవుతోంది. -
‘టీజీ’ కోడ్తో రిజిస్ట్రేషన్లు
[ 29-03-2024]
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్ను ‘టీఎస్’ నుంచి ‘టీజీ’కి మార్పు చేస్తూ ఈ నెల 15న గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. -
పట్టణ వనాలపై పట్టింపు శూన్యం
[ 29-03-2024]
జిల్లాలోని నిర్మల్, భైంసా, ఖానాపూర్ పట్టణాల్లోని 80 వార్డుల్లో 52 పట్టణ ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. హరితహారంలో భాగంగా రూ.లక్షల నిధులు వ్యయం చేస్తున్నా నిర్వహణ లేకపోవడంతో అందులోని నాటిన మొక్కలన్నీ ఎండిపోతున్నాయి. -
ఆత్మహత్యలతో రెండు కుటుంబాల్లో విషాదం
[ 29-03-2024]
బాసర రైల్వే స్టేషన్లో నిజామాబాద్ పట్టణానికి చెందిన యువతి, యువకుడు బుధవారం రాత్రి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇరు కుటుంబాల్లో విషాదం నింపింది. -
సాగులో సాంకేతికత.. మహిళలకు సాధికారత
[ 29-03-2024]
వ్యవసాయరంగంలో మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం నమో డ్రోన్ దీదీ యోజనను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా జిల్లాలవారీగా ప్రయోగాత్మకంగా కొంత మంది యువతీ యువకులను ఎంపిక చేసి డ్రోన్ నిర్వహణ, -
ఈత కారాదు గుండెకోత
[ 29-03-2024]
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విభిన్న వాతావరణానికి పెట్టింది పేరు. ఇక్కడ వర్షాలు, చలి, ఎండ.. అన్నీ ఎక్కువే. మార్చిలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటుతున్నాయి. -
ఆదరిస్తే అభివృద్ధి చేస్తా : సుగుణ
[ 29-03-2024]
ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి మొదటిసారి ఆదివాసీ మహిళకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించిందని ఆ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ అన్నారు. దీంతో పార్టీకి ఆదివాసీలపై ఉన్న ప్రేమ నిరూపితమైందని తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ