logo

భాజపా నేతలతో కేంద్ర మాజీ మంత్రి సమావేశం

ఇచ్చోడ మండల కేంద్రంలోని ఓ కల్యాణ మండపంలో భాజపా నేతల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ హాజరయ్యారు.

Published : 01 Jul 2022 05:14 IST

గుడిహత్నూర్‌లో కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్‌ జావడేకర్‌కు సన్మానం చేస్తున్న భాజపా మండల నాయకులు

ఇచ్చోడ, న్యూస్‌టుడే : ఇచ్చోడ మండల కేంద్రంలోని ఓ కల్యాణ మండపంలో భాజపా నేతల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ హాజరయ్యారు. బూత్‌ స్థాయి నేతలతో ఒక్కొక్కరిగా చర్చించారు. వచ్చే నెల 2న హైదరాబాద్‌లో నిర్వహించే మోదీ సభతో పాటు నియోజకవర్గ పరిస్థితులపై ఆరా తీసినట్లు సమాచారం. బోథ్‌ నియోజకవర్గంలోని 9 మండలాలకు చెందిన నాయకులతో చర్చలు జరిపారు. సమావేశానికి మీడియాను అనుమితించలేదు.
సన్మానం..
గుడిహత్నూర్‌: కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్‌ జావడేకర్‌ను గుడిహత్నూర్‌లో భాజపా నేతలు సన్మానించారు. జడ్పీటీసీ సభ్యుడు బ్రహ్మానంద్‌, ఎంపీపీ భరత్‌, గుడిహత్నూర్‌ సహకార సంఘం అధ్యక్షుడు సంజీవ్‌ ముండే, భాజపా మండల అధ్యక్షుడు సుభాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని