ముందుంది ముప్పు.. రక్షణ గోడలే దిక్కు
కాళేశ్వరం జలాశయం బ్యాక్ వాటర్ జిల్లా కేంద్రానికి కొత్త సమస్య తెచ్చిపెట్టింది. భారీ వర్షాలతో ఇటీవల మంచిర్యాలలో అనేక కాలనీలు వరదనీటిలో మునిగి ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ఈ సమస్య భవిష్యత్తులో ఏటా వచ్చే ప్రమాదం ఉంది. ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు ఇప్పటికైనా స్పందించి.. సుందరీకరణ పేరుతో ప్రజాధనం
మంచిర్యాల పట్టణం, న్యూస్టుడే
మంచిర్యాల పట్టణం మధ్యలో నుంచి ప్రవహించే రాళ్లవాగు
కాళేశ్వరం జలాశయం బ్యాక్ వాటర్ జిల్లా కేంద్రానికి కొత్త సమస్య తెచ్చిపెట్టింది. భారీ వర్షాలతో ఇటీవల మంచిర్యాలలో అనేక కాలనీలు వరదనీటిలో మునిగి ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ఈ సమస్య భవిష్యత్తులో ఏటా వచ్చే ప్రమాదం ఉంది. ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు ఇప్పటికైనా స్పందించి.. సుందరీకరణ పేరుతో ప్రజాధనం వృథా చేయకుండా రాళ్లవాగు సరిహద్దులో ఉండే కాలనీలకు రక్షణ గోడలు ఎత్తుగా (సైడ్ వాల్స్) నిర్మిస్తే ముందు ముందు వచ్చే వరదల ముప్పు నుంచి తప్పించుకునే అవకాశం ఉంది.
ఇదీ పరిస్థితి..
ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురిస్తే చాలు జిల్లా కేంద్రానికి 12 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఎల్లంపల్లి జలాశయం నీరు విడుదల చేస్తారు. దిగువ ప్రాంతంలో ఉన్న కాళేశ్వరం జలాశయం బ్యాక్ వాటర్ వెనుకకు వదులుతున్నారు. ఫలితంగా మంచిర్యాల గోదావరి సరిహద్దు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. పట్టణంలో నుంచి ప్రవహించే రాళ్లవాగు, తొళ్లవాగు వరద నీరు గోదావరినదిలో కలువకుండా ఉద్ధృతంగా పారడంతో ఆ వాగుల నీళ్లు కూడా వెనక్కి వచ్చి వేలా సంఖ్యలో నివాస గృహాలు ముంపునకు గురవుతున్నాయి. గత నెలలో వచ్చిన వరదల్లో 13 కాలనీల్లో 2,265 ఇళ్లు నీట మునిగాయి. ఇందులో 85 ఇళ్లు పూర్తిగా కూలీ పోయాయి. ఎల్ఐసీ కాలనీ, రాంనగర్, ఎన్టీఆర్ నగర్, పద్మాశాలినగర్ కాలనీల్లో రూ.కోట్ల ఆస్తులకు నష్టం జరిగింది. అనేక మంది ప్రజలు కట్టు బట్టలతో ప్రాణాలతో బయట పడ్డారు.
ఇలా చేస్తే బాగు..
మంచిర్యాల పురపాలక సంఘానికి పట్టణ ప్రగతి నిధులు ప్రతి నెల వస్తున్నాయి. మరోపక్క సాధారణ నిధులు, ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ నిధులు కూడా వస్తాయి. వీటితో ఇక్కడి ప్రజాప్రతినిధులు, అధికారులు కమీషన్లు వచ్చే పనులకు ప్రాధాన్యం ఇస్తూ పార్కులు, జంక్షన్లు, సుందరీకరణ పనులకు ఎక్కువ నిధులు కేటాయిస్తున్నారు. ఆ నిధులు వృథాగా ఖర్చు చేయకుండా రాళ్లవాగు సరిహద్దులో ఉన్న కాలనీల్లో వరదనీరు రాకుండా రక్షణ గోడలు ఎత్తుగా నిర్మించాలి.
* వాగు మధ్యలో ఉన్న తుమ్మ చెట్లను, ఎత్తు గడ్డలను తొలగించి కెనాల్ నీరు ఎలా పోతుందో.. అలా వాగునీరు గోదావరి నదిలో కలిసేలా చర్యలు తీసుకోవాలి. రాళ్లవాగు నీరు గోదావరిలో కలిసే ప్రాంతంలో కొంత దూరం వరదనీరు సులభంగా వెళ్లడానికి ఎల్-టర్న్గా కాలువ నిర్మించాలి. గోదావరినది, రాళ్లవాగు బఫర్ జోన్ స్థలాల్లో అక్రమంగా నిర్మించిన ఇళ్లను తొలగించాలి. అందులో ఎవరైన పేద ప్రజలు ఉంటే వారికి ప్రభుత్వం పరంగా ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఎత్తు ప్రాంతాల్లో కేటాయించాలి.
* భవిష్యత్తులో బఫర్ జోన్ స్థలాల్లో ఇళ్లు కట్టకుండా మున్సిపల్, రెవెన్యూ, నీటిపారుద శాఖ అధికారులు సమన్వయంతో శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవాలి. అప్పుడే పట్టణ ప్రజలకు రక్షణ ఉండే అవకాశం ఉంది.
మంచిర్యాలలో గత నెలలో వచ్చిన వరదలతో రాంనగర్, ఎల్ఐసీ కాలనీలు ఇలా వరద నీటిలో మునిగాయి. ఆ ఇళ్లలో ఉన్న ఖరీదైన వస్తువులు, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ పరికరాలు చెడిపోయాయి. ఒక్కొక్క భవనంలో రూ.50 వేల నుంచి రూ.5 లక్షల పైచిలుకు నష్టం జరిగింది. మాతాశిశు ఆసుపత్రి కూడా వరదనీటిలో మునిగింది. అందులో విలువైన మందులు, పరికరాలు పనికి రాకుండా పోయాయి.
మంచిర్యాలలో రాళ్లవాగు ఒడ్డు పక్కన కార్మెల్ కాన్వెంట్ పాఠశాల ఉంది. అందులో వేలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. రాళ్లవాగు ఉప్పొంగి ప్రవహించినా.. ఆ పాఠశాలలోకి వెళ్లకుండా సరిహద్దులో రక్షణ గోడ ఎత్తుగా నిర్మించారు. ఆ పాఠశాలకు పక్కన రాళ్లవాగు అవతలి ఒడ్డున స్థిరాస్థి వ్యాపారులు రెండేళ్ల కిందట లేఔట్ వెంచర్ ఏర్పాటు చేశారు. అందులో అనేక మంది ప్రజలు పెద్దపెద్ద భవనాలు నిర్మించారు. ఆ వ్యాపారులు ముందస్తు జాగ్రత్త కోసం రాళ్లవాగు సరిహద్దులో ఎత్తుగా రక్షణ గోడ ఇలా నిర్మించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ పార్టీలో పలువురు చేరిక
[ 29-03-2024]
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, యువత శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే
[ 29-03-2024]
జిల్లాలో శుక్రవారం క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే నిర్వహించారు. చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. -
తాంసి సీఎస్ఐ చర్చిలో గుడ్ ఫ్రైడే
[ 29-03-2024]
అదిలాబాద్ జిల్లా తాంసిలోని సీఎస్ఐ చర్చిలో శుక్రవారం గుడ్ ఫ్రైడేను నిర్వహించారు. ఏసుక్రీస్తు ప్రార్థన మందిరంలో క్రైస్తవులంతా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. -
సీఎస్ఐ చర్చిలో గుడ్ ఫ్రైడే
[ 29-03-2024]
జిల్లా కేంద్రంలోని విద్యానగర్ కాలనీలో ఉన్న సీఎస్ఐ చర్చిలో క్రైస్తవులు గుడ్ ఫ్రైడేను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. -
మతతత్వంతో లబ్ధి పొందే పార్టీలకు బుద్ధి చెప్పాలి
[ 29-03-2024]
మతతత్వం రెచ్చగొట్టి లబ్ధి పొందాలనుకునే పార్టీలకు రానున్న లోక్సభ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పూరపాటి రమేష్ పిలుపునిచ్చారు. -
అక్రమ మద్యం విక్రయిస్తే కేసులు తప్పవు
[ 29-03-2024]
అక్రమంగా మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ స్టేషన్ ఎక్సైజ్ సీఐ విజేందర్ హెచ్చరించారు. -
తేలిన బరి.. గెలుపుపై గురి
[ 29-03-2024]
ఆదిలాబాద్ ఎంపీ సీటు విజయం మూడు ప్రధాన పార్టీలకు కీలకంగా మారింది. కాంగ్రెస్ అభ్యర్థిగా ఆత్రం సుగుణ, భాజపా అభ్యర్థిగా గోడం నగేష్, భారాస తరఫున ఆత్రం సక్కు మధ్య త్రిముఖ పోటీ ఏర్పడింది. -
ఇక విద్యుత్తు కోతలకు చెక్
[ 29-03-2024]
ఎండలు ఎక్కువ కావడంతో విద్యుత్తు వినియోగం పెరిగిపోయింది. దీంతో కొన్ని చోట్ల సరఫరాకు అంతరాయం కలుగుతోంది. వచ్చే రెండు నెలల్లో విద్యుత్తు వినియోగం మరింత పెరిగే అవకాశం... -
ఎమ్మెల్యే ఫిర్యాదు చేసినా పట్టించుకోరా?: ఏలేటి
[ 29-03-2024]
గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అల్లోల ఇంద్రకరణ్రెడ్డి హయాంలో ప్రభుత్వ భూములను విచ్చలవిడిగా చెరబట్టారని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి మరోసారి ఆరోపించారు. -
పెన్గంగా.. ఇసుకదందా
[ 29-03-2024]
మండలవాసులకు వరప్రదాయినిగా ఉన్న పెన్గంగా నదిలో ఇసుకదొంగలు పడ్డారు. పారే నీటిని ఆపిమరీ యంత్రాలతో ఇసుకను తోడి అక్రమ రవాణా చేస్తున్నారు. -
గడువు ముందర సందిగ్ధం!
[ 29-03-2024]
ఏటా సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి, ప్రభుత్వ పనులకు బడ్జెట్ కేటాయిస్తారు. దానిని ఆ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ఖర్చు చేయాలి. ఇందుకు సంబంధించిన బిల్లులను ఖజానా శాఖకు పంపిస్తే.. వారు ఈ-కుబేర్లో నమోదు చేస్తారు. -
ఆన్లైన్ జూదంలో నష్టపోయి.. రైతుల డబ్బు కాజేత
[ 29-03-2024]
ఆదిలాబాద్ ఐపీపీబీ(ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్) మేనేజర్ విజయ్ జాదవ్ ఆన్లైన్ జూదానికి అలవాటు పడి అందులో నష్టపోయి రైతులకు చెందిన డబ్బులను కాజేసినట్లు తెలుస్తోంది. -
బహుజన, తెలంగాణవాదాన్ని భారీ మెజార్టీతో గెలిపించాలి
[ 29-03-2024]
రాజ్యాంగాన్ని కాపాడాలనే సంకల్పం, బహుజన, తెలంగాణ వాదం ఒక్కటేననే ఉద్దేశంతో తాను భారాసతో చేతులు కలిపినట్లు ఆ పార్టీ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ అన్నారు. -
సమస్యలు తెలుసుకుని.. పరిష్కారానికి ఆదేశించి
[ 29-03-2024]
గ్రామాల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని జిల్లా పాలనాధికారి వెంకటేష్ దోత్రే అన్నారు. గురువారం అదనపు పాలనాధికారి దీపక్ తివారీతో కలసి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. -
ఉద్యానవనాలపై ఉదాసీనత..
[ 29-03-2024]
మంచిర్యాల పట్టణవాసులకు ఆహ్లాదం కోసం వివిధ వార్డుల్లో ఉద్యానవనాల నిర్మాణం చేపట్టారు. ఒక్కో ఉద్యానవనానికి రూ.40 లక్షల నుంచి రూ.90 లక్షలు కేటాయించారు. -
రూ.‘కోటి’.. చీకటి పాలు
[ 29-03-2024]
ఒకవైపు రహదారి విస్తరణ లేక, మరోవైపు సిర్పూరు కాగితం మిల్లు(ఎస్పీఎం)కు నిత్యం ముడిసరకు లారీల రాకపోకల కారణంగా.. ఏడాదిలోపే రూ.కోటితో ఏర్పాటు చేసిన వెలుగులు విరజిమ్మే సెంట్రల్ లైటింగ్ వ్యవస్థ చీకటి పాలవుతోంది. -
‘టీజీ’ కోడ్తో రిజిస్ట్రేషన్లు
[ 29-03-2024]
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్ను ‘టీఎస్’ నుంచి ‘టీజీ’కి మార్పు చేస్తూ ఈ నెల 15న గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. -
పట్టణ వనాలపై పట్టింపు శూన్యం
[ 29-03-2024]
జిల్లాలోని నిర్మల్, భైంసా, ఖానాపూర్ పట్టణాల్లోని 80 వార్డుల్లో 52 పట్టణ ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. హరితహారంలో భాగంగా రూ.లక్షల నిధులు వ్యయం చేస్తున్నా నిర్వహణ లేకపోవడంతో అందులోని నాటిన మొక్కలన్నీ ఎండిపోతున్నాయి. -
ఆత్మహత్యలతో రెండు కుటుంబాల్లో విషాదం
[ 29-03-2024]
బాసర రైల్వే స్టేషన్లో నిజామాబాద్ పట్టణానికి చెందిన యువతి, యువకుడు బుధవారం రాత్రి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇరు కుటుంబాల్లో విషాదం నింపింది. -
సాగులో సాంకేతికత.. మహిళలకు సాధికారత
[ 29-03-2024]
వ్యవసాయరంగంలో మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం నమో డ్రోన్ దీదీ యోజనను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా జిల్లాలవారీగా ప్రయోగాత్మకంగా కొంత మంది యువతీ యువకులను ఎంపిక చేసి డ్రోన్ నిర్వహణ, -
ఈత కారాదు గుండెకోత
[ 29-03-2024]
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విభిన్న వాతావరణానికి పెట్టింది పేరు. ఇక్కడ వర్షాలు, చలి, ఎండ.. అన్నీ ఎక్కువే. మార్చిలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటుతున్నాయి. -
ఆదరిస్తే అభివృద్ధి చేస్తా : సుగుణ
[ 29-03-2024]
ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి మొదటిసారి ఆదివాసీ మహిళకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించిందని ఆ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ అన్నారు. దీంతో పార్టీకి ఆదివాసీలపై ఉన్న ప్రేమ నిరూపితమైందని తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి