‘ముంపు’చూపు కరవు..
నిరుపేదలకు నీడ కల్పించాలనే సదాశయంతో ప్రభుత్వం రెండు పడకగదుల ఇళ్లకు శ్రీకారం చుట్టింది. నివాసయోగ్యమైన స్థలాలను కాదని చెరువుల చెంత, ముంపు ప్రాంతాల్లో పనులు చేపడుతున్నారు. ముందుచూపు లేక ఇష్టారాజ్యంగా కడుతున్న నిర్మాణాలతో
నివాసయోగ్యం కాని చోట రెండుపడక గదుల ఇళ్లు
ఈనాడు డిజిటల్, ఆసిఫాబాద్
నిరుపేదలకు నీడ కల్పించాలనే సదాశయంతో ప్రభుత్వం రెండు పడకగదుల ఇళ్లకు శ్రీకారం చుట్టింది. నివాసయోగ్యమైన స్థలాలను కాదని చెరువుల చెంత, ముంపు ప్రాంతాల్లో పనులు చేపడుతున్నారు. ముందుచూపు లేక ఇష్టారాజ్యంగా కడుతున్న నిర్మాణాలతో భవిష్యత్తులో ప్రమాదం పొంచి ఉన్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. ఉమ్మడి జిల్లాలో చేపట్టిన రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణాలు ఇప్పటికే నత్తనడకన సాగుతూ విమర్శల పాలవుతున్నాయి. ఏకంగా చెరువు సమీపంలో, శిఖం భూముల్లోనే వీటిని చేపడుతుండటంతో ఇప్పటికే చుట్టూ వరద చేరింది.
నత్తనడక పనుల వల్ల ఉమ్మడి జిల్లాలో రెండుపడక గదుల ఇళ్లను పంపిణీ చేయలేదు. బిల్లులు సకాలంలో రాకపోవడంతో చాలాచోట్ల గుత్తేదారులు చేతులెత్తేస్తున్నారు. వివాదరహిత స్థలాలను ఎంపిక చేయాల్సిన అధికారులు హడావుడిగా స్థలాలను చూడటంతో కొన్నిచోట్ల యజమానులు న్యాయస్థానాలను ఆశ్రయించడంతో నిర్మాణాలు నిలిచిపోయాయి. మరోవైపు కడుతున్నవి సైతం నాసిరకంగా.. నీటివనరుల వద్ద ఉండటంతో ఏమాత్రం నివాసయోగ్యం కాదని లబ్ధిదార్లు అభిప్రాయపడుతున్నారు.
పంపిణీపై సందిగ్ధం..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 5408 రెండు పడక గదుల పనులు కొనసాగుతున్నాయి. ఇందులో ఖానాపూర్లో ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తయ్యింది. బెల్లంపల్లిలో ఇంకా గోడల పనులే నడుస్తున్నాయి. మంచిర్యాల జిల్లాలోని రాజీవ్నగర్లో నిర్మాణ పనులు ముగిశాయి. మందమర్రిలో సైతం 380 ఇళ్ల పనులు తుది దశలో ఉన్నాయి. నిర్మల్ పట్టణంలో 1380 ఇళ్లను పూర్తి చేశారు. సోఫీనగర్లోని రెండు పడకగదుల నిర్మాణాలకు సిద్దాపూర్ వాగు జలాలతో ముప్పు పొంచి ఉందని ప్రజలు అంటున్నారు. నిర్మాణాలు త్వరగా పూర్తి చేసి పంపిణీ ప్రక్రియ చేపట్టాలని నిరాశ్రయులు కోరుతున్నారు.
శిఖం భూమిలో..
మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణం శివారు ప్రాంతంలో 300 ఇళ్లను చెరువు శిఖం భూముల్లోనే నిర్మిస్తున్నారు. నీటి పారుదలశాఖ అధికారులు, రెవెన్యూ, పీఆర్ అధికారులు ఎవరూ ఈ విషయం పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం పునాదుల దశకు పనులు చేరుకున్నాయి. భారీ వర్షాలకు చెరువు నిండితే ఇళ్లలోకి సులువుగా వరద చేరే అవకాశం ఉంది. సమీపంలోనే ప్రస్తుతం నీళ్లు ఉన్నాయి. రూ.కోట్ల వ్యయం నీటిపాలవుతందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
అర్ధాంతరంగా ఆగిన 125 ఇళ్లు
కుమురం భీం జిల్లా కాగజ్నగర్ పట్టణ శివారులో 480 ఇళ్లు మంజూరు కాగా అధికారులు పనులు ప్రారంభించారు. ఇందులో 125 ఇళ్లకు సంబంధించి పునాదులు, పిల్లర్లు నిర్మించారు. ఓ వ్యక్తి ఈ స్థలం నాదేనని కోర్టుకు వెళ్లడంతో నిర్మాణాలు నాలుగేళ్ల నుంచి నిలిచిపోయాయి. పునాదుల కోసమే రూ.కోటి వరకు ఖర్చు చేశారు. మిగతా 355 ఇళ్ల పనులు తుది దశలో ఉన్నాయి.
చెరువుల చెంత.. వరదొస్తే చింత
ఆదిలాబాద్ జిల్లా కేఆర్కే కాలనీలో 980 ఇళ్లను నిర్మించారు. పనులు తుది దశలో ఉన్నాయి. పక్కనే చెరువు ఉంది. ఇటీవల వర్షాలకు ఇళ్ల చుట్టూ చెరువు నీళ్లు చేరాయి. భారీ వర్షాలు పడితే ఎలా అని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. నార్నూర్ మండలం గాదిగూడ సమీపంలో సైతం వాగు పక్కనే 25 ఇళ్లు పూర్తి చేశారు. వర్షాలకు వరదంతా ఇళ్లలోకి చేరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తగ్గిన ఇంటర్ ఉత్తీర్ణత
[ 25-04-2024]
కిందటేడాది మాదిరిగానే ఈసారి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను బుధవారం ఒకేసారి విడుదల చేశారు. గత సంవత్సరంతో పోల్చితే ఈసారి జిల్లా ఉత్తీర్ణత శాతం కొద్దిగా తగ్గింది. -
అయిదేళ్లుగా ఎదురుచూపులే!
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం రైతులందరికి అందడం లేదు. ప్రారంభంలో ఉన్న రైతుల్లో నిబంధనల కారణంగా తొలగిస్తున్నా.. కొత్త వారిని చేర్చకపోవడంతో ఏటా సాయం పొందే రైతుల సంఖ్య తగ్గుతోంది. -
దిగజారిన ఫలితాలు..
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా గతేడాదితో పోలిస్తే అయిదు స్థానాలు కిందికి పడిపోయి రాష్ట్రంలో 7వ స్థానానికి పరిమితమైంది. అయినప్పటికీ ఉత్తమ ఫలితాలనే సాధించినట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు. -
పక్కాగా ఎన్నికల సంఘం మార్గదర్శకాల అమలు
[ 25-04-2024]
పార్లమెంట్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి జిల్లాల ఎన్నికల అధికారులు, పాలనాధికారులు, -
ఏసీబీ అధికారుల విస్తృత తనిఖీలు
[ 25-04-2024]
నాలుగు వరుసల రహదారి విస్తరణలో భాగంగా.. పరిహారం చెల్లింపులో జరిగిన అక్రమాలపై ‘ఈనాడు’ ప్రచురించిన వరుస కథనాలకు ఏసీబీ అధికారులు స్పందించారు. -
స్థిరాస్తి వ్యాపారుల్లో గుబులు
[ 25-04-2024]
ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడం, నిబంధనలు కాలరాసి వెంచర్లు వేసి అమాయకులను మోసం చేయడం, బాండ్ పేపర్ల మీద రాసుకుంటూ బీడీపీపీ భూములను విక్రయించడం, వివాదాస్పద భూములను వాటాలు వేసుకుని పంచుకోవడం, -
ఏనుగు దాడి ఘటనలో.. బాధిత కుటుంబాలకు పరిహారం
[ 25-04-2024]
కాగజ్నగర్ అటవీ డివిజన్ పరిధిలో ఏనుగు దాడిలో మృతి చెందిన ఇద్దరు రైతుల కుటుంబాలకు ప్రభుత్వం మంజూరు చేసిన పరిహారం చెక్కులను అందజేశారు. -
ఆరో రోజు 8 నామినేషన్లు
[ 25-04-2024]
పెద్దపల్లి లోక్సభ స్థానానికి ఆరో రోజు బుధవారం 8 మంది నామినేషన్లు దాఖలు చేశారు. భాజపా జిల్లా అధ్యక్షుడు చందుపట్ల సునీల్రెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, నాయకులు కన్నం అంజయ్యలతో కలిసి -
ఫలితాల్లో దిగజారి.. అట్టడుగుకు చేరి
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ప్రథమ ద్వితీయ ఫలితాల్లో జిల్లాకు నిరాశే ఎదురైంది. -
అలా ఏర్పాటు.. ఇలా తొలగింపు
[ 25-04-2024]
ఆ యూటర్న్ మృత్యువుకు చిరునామాగా మారింది. ఇక్కడ జరిగిన రహదారి ప్రమాదాల్లో దాదాపు 10 మంది మృతి చెందారు. వీరంతా యూటర్న్ వద్దకు రాగానే ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయారు. -
మొరం తవ్వేస్తున్నారు.. వెంచర్లలో నింపేస్తున్నారు
[ 25-04-2024]
జిల్లాలో ఏ గుట్టను చూసినా అక్రమ దందా ఎలా సాగుతుందో తెలుస్తోంది. యథేచ్ఛగా మొరం తవ్వకాలు జరుగుతున్నా.. సిబ్బంది లేకనే ఇబ్బందులు ఉన్నాయంటూ సంబంధిత అధికారులు ప్రకటించడం చూస్తుంటే పరోక్షంగా వారికి ఎలా అండగా ఉన్నారో తెలిసిపోతోంది. -
అమ్మాయిలదే హవా
[ 25-04-2024]
ఇంటర్ వార్షిక పరీక్ష ఫలితాల్లో జిల్లాలో బాలికలదే పైచేయిగా నిలిచింది. గత ఏడాది సైతం వారే ముందంజలో ఉన్నారు. రెగ్యులర్ కోర్సుల్లో గత సంవత్సరంకంటే రాష్ట్రస్థాయిలో దిగజారినా ఒకేషనల్లో మాత్రం కొంత మెరుగైంది. -
ఇంటర్లో మెరిసిన విద్యాకుసుమాలు
[ 25-04-2024]
బోథ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, ఆదర్శ పాఠశాల విద్యార్థులు బుధవారం వెలువడిన ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సర ఫలితాలలో సత్తా చాటారు. -
నమ్మించి మోసం చేసిన హోంగార్డు అరెస్ట్
[ 25-04-2024]
ప్రజలను నమ్మించి మోసం చేసిన హోంగార్డు షమీ ఉల్లాఖాన్ను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణ సీఐ అనిల్ తెలిపిన వివరాల ప్రకారం షమీ ఉల్లాఖాన్ కొద్ది రోజుల క్రితం పట్టణంలో ట్రాఫిక్ విధులు నిర్వహించారు. -
చర్చనీయాంశంగా మాజీ ఎంపీ నామపత్రం దాఖలు
[ 25-04-2024]
మాజీ ఎంపీ రాఠోడ్ రమేష్ ఒక్కరే వచ్చి భాజపా తరఫున నామపత్రం దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. భాజపా అభ్యర్థి గోడం నగేష్ చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న ఆయన ఆ తర్వాత
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!