ఎగిరిన పతాకం..విరబూసిన అక్షరం
స్వాతంత్య్రం సిద్ధించిన ప్రారంభంలో ఉమ్మడి జిల్లాలో అక్షరాస్యత శాతం ఐదు లోపే... కానీ రోజురోజుకు చోటు చేసుకుంటున్న మార్పులు..విద్యావ్యవస్థ అభివృద్ధికి ప్రభుత్వాలు తీసుకున్న చర్యల కారణంగా ప్రస్తుతం అరవై శాతం ఉంది..75 వసంతాల్లో
దండేపల్లి, మంచిర్యాల విద్యావిభాగం, న్యూస్టుడే
స్వాతంత్య్రం సిద్ధించిన ప్రారంభంలో ఉమ్మడి జిల్లాలో అక్షరాస్యత శాతం ఐదు లోపే... కానీ రోజురోజుకు చోటు చేసుకుంటున్న మార్పులు..విద్యావ్యవస్థ అభివృద్ధికి ప్రభుత్వాలు తీసుకున్న చర్యల కారణంగా ప్రస్తుతం అరవై శాతం ఉంది..75 వసంతాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ పలు రంగాల్లో అభివృద్ధి సాధించటమే కాకుండా విద్యారంగంలోనూ గణనీయమైన మార్పులు సాధించింది. ఇక్కడ విద్యను అభ్యసించిన విద్యార్థులు వివిధ రంగాల్లో రాణిస్తున్నారు.
ప్రాథమిక స్థాయి నుంచి కళాశాలల వరకు పురోగతిలో...
చదువు ఆవశ్యతను గుర్తించడంతో రోజురోజుకు విద్యార్థుల నమోదు పెరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో అన్ని యాజమాన్యాల కింద 4,822 పాఠశాలలు ఉండగా 4.12 లక్షల మంది విద్యను అభ్యసిస్తున్నారు.
* ఇరవై ఏళ్ల కిందట ఉమ్మడి జిల్లాలో కనీసం పదుల స్థానంలో కూడా ఇంటర్మీడియట్ కళాశాలలు లేవు...కాని ప్రస్తుతం ప్రభుత్వ, బీసీ, మైనార్టీ, కేజీబీవీ, ఆదర్శ, ఎస్సీ, ఎస్టీ, సాంఘిక సంక్షేమ శాఖల పరిధిలో 137 కళాశాలలతో పాటు ...66 ప్రైవేటు కళాశాలలున్నాయి.
* ఆదిలాబాద్ జిల్లాలో 34, నిర్మల్లో 35, కుమురంభీమ్లో 36, మంచిర్యాలలో 32 ప్రభుత్వ కళాశాలలుండగా...60 వేల మంది విద్యను అభ్యసిస్తున్నారు.
* డిగ్రీ విద్యను అభ్యసించేందుకు ఆదిలాబాద్లో 3, కుమురంభీంలో 1, మంచిర్యాలలో 4, నిర్మల్ జిల్లాలో 3 ప్రభుత్వ కళాశాలలున్నాయి.
ఆర్జీయూకేటీ మన దగ్గరే...
బాసరలోని కళాశాల
రాష్ట్రస్థాయిలో విద్యార్థులకు ఉత్తమ ఇంజినీరింగ్ విద్యను అందజేసేందుకు ఏర్పాటు చేసిన ఆర్జీయూకేటీ (ట్రిపుల్ ఐటీ) నిర్మల్ జిల్లాలోని బాసరలో ఉంది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు చెందిన 8 వేల మంది ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు.
సాంకేతిక విద్యలో ముందంజ..
బెల్లంపల్లిలోని పాలిటెక్నిక్ కళాశాల
ఉమ్మడి జిల్లాలోని ఆదిలాబాద్లో 2, నిర్మల్లో 1, మంచిర్యాలలో ఒక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఉండగా మంచిర్యాలలో మూడు ప్రైవేటు కళాశాలలున్నాయి. ఇందులో వివిధ డిప్లొమా సాంకేతిక కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు 17 ఐటీఐ కళాశాలలున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు కలిపి మంచిర్యాల జిల్లాలో 9, ఆదిలాబాద్లో 4, నిర్మల్లో 3, కుమురంభీంలో ఒక కళాశాల ఉంది.
వైద్య విద్యకు బాసట..
ఆదిలాబాద్లోని రిమ్స్ కళాశాల
వైద్యవిద్య చదివేందుకు ఉమ్మడి జిల్లా కేంద్రంలో రిమ్స్ కళాశాలను ఏర్పాటు చేశారు.. రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు చెందిన 500 పైచిలుకు విద్యార్థులు ఇక్కడ వైద్య విద్య అభ్యసిస్తున్నారు. వైద్యకళాశాలతోపాటు సూపర్స్పెషాలిటీ ఆసుపత్రి ఉంది. మంచిర్యాలలో ఈ ఏడాది వైద్య కళాశాలతో నర్సింగ్ కళాశాల ప్రారంభం కానుండగా.. వచ్చే ఏడాది కుమురం భీం జిల్లాలో ప్రారంభం కానుంది. నిర్మల్కు కూడా వైద్యకళాశాలను ప్రభుత్వం తాజాగా మంజూరు చేసింది.దీంతో నాలుగుజిల్లాల్లో నాలుగు కళాశాలు వచ్చినట్టే.
అక్షర ఉషస్సు..
అక్షరాస్యతపరంగా చూస్తే ఉమ్మడి జిల్లాలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. 1951 జనాభా లెక్కల ప్రకారం ఆరేళ్ల పిల్లలను మినహాయిస్తే అక్షరాస్యత శాతం 10శాతం లోపు ఉండేది. పాఠశాలలు అభివృద్ధి చెంది... పిల్లలందరు బడికి వెళ్తున్నా.. ఇంకా చాలా మంది వయోజనులు నిరక్షరాస్యులుగానే ఉన్నారు. అయితే అందరిని అక్షరాస్యులు చేసే ఉద్దేశంతో ప్రభుత్వాలు అక్షరజ్ఞానం, అక్షర భారతి, అక్షర సంక్రాంతి, సాక్షరభారత్, అమ్మానాన్నకు చదువు తదితర కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 60.575 కు చేరుకోవడం.. వయోజనుల అక్షరాస్యత పెంపులో గణనీయమైన మార్పులు సాధించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గౌతమ్.. నన్ను మన్నించురా...
[ 18-04-2024]
మరికొద్ది గంటల్లో సంతోషంగా పండగ వేడుకలు జరుపుకొనేందుకు సిద్ధమైన ఆ కుటుంబంలో విద్యుత్తు ప్రమాదం విషాదం నింపింది. కాసిపేట ఎస్సై ప్రవీణ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. -
నేత్రపర్వం.. సీతారాముల కల్యాణోత్సవం
[ 18-04-2024]
పల్లెపట్టణం, ఊరూవాడల్లో బుధవారం శ్రీరామనవమి వేడుకలు మిన్నంటాయి. ఆలయాల్లో శ్రీరామచంద్రుడు, సీతాదేవీల కల్యాణం నేత్రపర్వంగా సాగింది. మంగళ వాయిద్యాలు ప్రతిధ్వనిస్తుండగా తలంబ్రాలు, -
ఎన్నికల సమర శంఖారావం..
[ 18-04-2024]
పార్లమెంట్ ఎన్నికల సమరానికి శంఖారావం పూరించే సమయం ఆసన్నమైంది. ఈ పోరులో పాల్గొనే వివిధపార్టీల అభ్యర్థులు, స్వతంత్రుల నామపత్రాల దాఖలుకు రంగం సిద్ధం అయ్యింది. -
ఉపాధి కూలి.. నిరీక్షణతో సరి
[ 18-04-2024]
పేద కూలీలతోపాటు ఇటీవల వ్యవసాయ పనుల సీజన్ ముగియడంతో రైతు కుటుంబాలు అధిక సంఖ్యలో ఉపాధి హామీ పనుల బాట పట్టాయి. సకాలంలో డబ్బులు చేతికందక పూట గడవడం కోసం ఇతరుల వద్ద వారు చేతులు చాచాల్సి వస్తోంది. -
ముగిసిన 27 ఏళ్ల విప్లవ ప్రస్థానం
[ 18-04-2024]
ఆదివాసీ మహిళ రెండు దశాబ్దాల విప్లవ ప్రస్థానం ముగిసిపోయింది. ఛత్తీస్గఢ్ బస్తర్ ప్రాంతంలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో బజార్హత్నూర్ మండలం డెడ్రాకు చెందిన దాసరివార్ సుమన్బాయి అలియాస్ రజిత మృతి చెందారు. -
విద్యార్థి మరణం పాఠం నేర్పేనా?
[ 18-04-2024]
ఆర్జీయూకేటీలో వరుస విద్యార్థి మరణాలు.. ప్రాంగణంలో తరచూ చోటుచేసుకుంటున్న ఘటనలు విశ్వవిద్యాలయాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అటు విద్యార్థులకు, ఇటు తల్లిదండ్రులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. -
బాధలు చెప్పుకొనేదెలా?
[ 18-04-2024]
జిల్లాలో 2015లో ప్రత్యేక మహిళా పోలీస్స్టేషన్ను ప్రారంభించారు. నిత్యం పదుల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్న ఈ స్టేషన్లో ప్రస్తుతం అధికారులెవరూ లేరు. -
నిధుల ప్రవాహం.. తీరాలి దాహం
[ 18-04-2024]
చెన్నూరు పట్టణంలోని శివారు కాలనీల్లో తాగునీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలను గుర్తించి అధికారులు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. వీటికోసం నిధులు అందుబాటులో ఉండటంతో ఇబ్బంది లేకుండా ముందస్తు జాగ్రత్తలకు ఉపక్రమించారు. -
వలసల జోరు.. కారు బేజారు!
[ 18-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నామపర్వానికి ముందు జిల్లాలో అనూహ్య పరిమాణాలు చోటుచేసుకుంటున్నాయి. పట్టున్న నాయకులందరూ కాంగ్రెస్, భాజపా పార్టీలోకి చేరుతున్నారు. -
రాయితీ.. పక్కదారి!
[ 18-04-2024]
జిల్లాలోని రెండు పురపాలికలు, పలు మండలాలు వ్యాపార, వాణిజ్యపరంగా క్రమక్రమంగా అభివృద్ధి చెందుతున్నాయి. పారిశ్రామికంగా కాగజ్నగర్తోపాటు పరిసర ప్రాంతాల్లో హోటళ్లు, టిఫిన్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, పలు గ్యాస్తో నడిచే ఆటోలు, కార్లు ఎక్కువగా ఉన్నాయి. -
ఈదురు గాలుల బీభత్సం.. క్షణాల్లో అతలాకుతలం..
[ 18-04-2024]
మండలంలోని బూరుగూడలో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. క్షణాల వ్యవధిలోనే పలువురి ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. నిత్యావసర సామగ్రి చెల్లాచెదురయ్యాయి. -
అపురూపం.. చరిత్రకు సాక్ష్యం
[ 18-04-2024]
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అపారమైన చారిత్రక వైభవాన్ని కలిగి ఉంది. అద్భుతమైన ఆలయాలు, జాలువారే జలపాతాలకు నిలయంగా ఉంది. ఊహకందని రీతిలో వందల సంవత్సరాల కిందటే నిర్మించిన అబ్బురపరిచే శిల్పసంపద, గత వైభవానికి చిహ్నంగా కోటలు దర్శనమిస్తాయి. -
సంపూర్ణ అక్షరాస్యతకు.. నవభారత!
[ 18-04-2024]
నిరక్షరాస్యులైన వయోజనులందరినీ వచ్చే అయిదేళ్లలో అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంలో భారత ప్రభుత్వం నూతనంగా నవభారత సాక్షరత (న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం) కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
ఎండలతో ఉక్కిరిబిక్కిరి
[ 18-04-2024]
జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలతో వాతావరణం చల్లబడిందని సంతోషిస్తున్న సమయంలోనే భానుడు తిరిగి భగ్గమంటున్నాడు. రెండు రోజుల్లోనే ఉష్ణోగ్రత అయిదు డిగ్రీలకు పైగా పెరిగింది. -
అభ్యర్థులకు కీలకం.. నామపత్రాల ఘట్టం
[ 18-04-2024]
పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని పట్టణాలు, గ్రామాల్లో లోక్సభ ఎన్నికల పోరు క్రమేణా జోరందుకుంటుంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు, కీలక నేతలు సమావేశాలు నిర్వహిస్తూ గెలుపు వ్యూహాలు రచిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీ, తెలంగాణకు సాగర్ నీటి విడుదలపై కేఆర్ఎంబీ ఉత్తర్వులు
-
డేవన్ కాన్వే ఔట్.. మరో సీనియర్ ప్లేయర్కు చెన్నై అవకాశం
-
గత పదేళ్లలో తెలంగాణకు రూ.10 లక్షల కోట్లు: కిషన్రెడ్డి
-
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
-
ఇన్నేళ్లుగా ‘రాహుల్’యాన్ను లాంచ్ చేయలేకపోయింది: రాజ్నాథ్ సింగ్
-
లింక్ క్లిక్ చేస్తున్నారా? ఆగండి..! మెసేజ్ మూలాలు చెక్ చేయండి..