మారని తీరు.. అభ్యర్థుల బేజారు
జిల్లాలో ప్రభుత్వ మైనార్టీ గురుకులాల్లోని ఔట్ సోర్సింగ్లో భర్తీ చేయనున్న పలు అధ్యాపకుల పోస్టుల భర్తీ ప్రక్రియ వివాదాస్పదం అవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఎంపిక ప్రక్రియ చేపడుతున్నారని నిరుద్యోగులు, గతంలో చేసిన పొరపాట్లే మళ్లీ
మైనార్టీ గురుకులాల్లో పోస్టుల భర్తీ ప్రక్రియపై అనుమానాలు
కాగజ్నగర్, న్యూస్టుడే
గురుకుల పాఠశాల భవనం
జిల్లాలో ప్రభుత్వ మైనార్టీ గురుకులాల్లోని ఔట్ సోర్సింగ్లో భర్తీ చేయనున్న పలు అధ్యాపకుల పోస్టుల భర్తీ ప్రక్రియ వివాదాస్పదం అవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఎంపిక ప్రక్రియ చేపడుతున్నారని నిరుద్యోగులు, గతంలో చేసిన పొరపాట్లే మళ్లీ చేస్తున్నారని వివిధ సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. అందరికీ తెలియజేయాల్సిన వివరాల్లో గోప్యత పాటిస్తున్నారని, అర్హులకు పోస్టులు దక్కకుండా కుట్ర పన్నుతున్నారనే ఆరోపణలకు అధికారుల తీరు బలం చేకూర్చుతోంది.
రెండురోజుల క్రితం కాగజ్నగర్ మండలం గన్నారం మైనార్టీ గురుకులం బాలుర-1 పీజీటీ సోషల్, కాగజ్నగర్ మండలంలోని కోయవాగు మైనార్టీ గురుకులంలో బాలుర-1 వృక్షశాస్త్రం ఔట్సోర్సింగ్ అధ్యాపకుల పోస్టుల భర్తీకి ఆ గురుకులాల ప్రిన్సిపళ్లు దరఖాస్తులు ఆహ్వానిస్తూ పూర్తి వివరాలు లేకుండా ప్రకటన జారీ చేశారు. ఈ నెల 17వ తేదీ వరకు స్వీకరణ గడువు విధించారు.
ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చిన దరఖాస్తుల్లో అర్హులను ఎంపిక చేయాలి. ప్రస్తుతం ప్రకటన కేవలం జిల్లాకే పరిమితమైంది. దీంతో ఇతరులకు తెలిసే అవకాశం తక్కువ. జిల్లా మైనార్టీ అధికారి ఆ పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేయాలి. కానీ కేవలం ప్రిన్సిపల్స్ ప్రకటించి, తమకు అనుకూలమైన అభ్యర్థులను భర్తీ చేసుకునే అవకాశం ఉందని టీపీటీఎఫ్(తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం) ప్రతినిధి గులాబ్ ఆరోపించారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం జీవోనెం.4459 ప్రకారం జిల్లా పాలనాధికారి పర్యవేక్షణలోనే ప్రకటన జారీ చేసి అర్హులైన వారిని భర్తీ చేయాలని స్పష్టమైన ఆదేశాలున్నాయి. అయినప్పటికీ అది జిల్లాలో అమలు కావడం లేదు. సత్వరమే ఆ ప్రకటనను రద్దు చేసి జిల్లా పాలనాధికారి, జిల్లా మైనార్టీ అధికారుల పర్యవేక్షణలో ప్రకటన జారీ చేసి భర్తీ చేయాలని కోరారు. లేనిపక్షంలో ఆందోళన చేస్తామని నిరుద్యోగులు పేర్కొన్నారు.
అంతటా ఆరోపణలే..
ఆసిఫాబాద్ మైనార్టీ గురుకులంలోని ఇటీవలే ఔట్సోర్సింగ్ పద్ధతిలో మూడు అధ్యాపకుల పోస్టులను భర్తీలోనూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు తెలిసింది. ఈ ముగ్గురులో ఒకరు మంచిర్యాల, నిర్మల్ మరొకరు, నిజామాబాద్కు చెందినవారిని ఆ పోస్టుల్లో నియమించారు. మైనార్టీ గురుకులం బాలురలో ప్రిన్సిపల్ నియామకంలో కూడా నిబంధనలు పాటించలేదు. ఎలాంటి ప్రకటన జారీ చేయకుండానే ప్రిన్సిపల్ను కూడా భర్తీ చేసినట్లు ఆరోపణలున్నాయి.
చర్యలు తీసుకోవాలని వినతి
నిర్మల్ జిల్లా మైనార్టీ గురుకులాల్లోని పోస్టుల భర్తీ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి, సత్వరమే చర్యలు తీసుకోవాలని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఇటీవల ప్రభుత్వ కార్యదర్శి హైమద్ నదీంకు లేఖ రాశారు. జిల్లాలోని అన్ని గురుకులాల్లోని భర్తీ అయిన పోస్టులపై విచారణ చేపట్టి, అనర్హులను తొలగించాలని కోరారు. స్వయంగా మంత్రి ఆదేశించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్ఛు
అమలు కాని ఆదేశాలు..
ఏడాది క్రితం మైనార్టీ గురుకులం(గన్నారం)లో 11 ఔట్సోర్సింగ్ అధ్యాపకుల భర్తీలోనూ అక్రమాలు జరిగినట్లు పలువురు అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. ముందస్తుగానే భర్తీ చేసి ఆ తర్వాత నామమాత్రంగా హైదరాబాద్లో డెమో నిర్వహించి వారినే నియమించుకున్నారు. మైనార్టీ నేషనల్ కమిషన్ ఆధ్వర్యంలో విచారణ జరపగా, భర్తీలో ఆక్రమాలు జరిగినట్లు విచారణలో తేలింది. ఫ్రిబవరి 10న విజిలెన్స్ చీఫ్ రామ్మోహన్రావు బృందం విచారణ చేపట్టారు. విచారణలోనూ అక్రమాలు జరిగినట్లు తేలగా, ఆ నివేదిక ప్రభుత్వానికి సమర్పించారు. అయినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం వారే విధుల్లోనూ కొనసాగుతున్నారు.
మంత్రి ఐకే రెడ్డి పంపించిన విజ్ఞప్తి
తెల్లకాగితంపై పోస్టుల భర్తీకి ఇటీవల జారీ చేసిన ప్రకటన
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైభవంగా హనుమాన్ శోభాయాత్ర
[ 23-04-2024]
జిల్లా కేంద్రంలో హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం సాయంత్రం నిర్వహించిన హనుమాన్ శోభాయాత్ర వైభవంగా సాగింది. -
డీఎల్ఎస్ఏ కార్యదర్శి బదిలీ
[ 23-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా 32 మంది న్యాయమూర్తులను బదిలీ చేస్తూ హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
వైభవంగా హనుమాన్ శోభాయాత్ర
[ 23-04-2024]
జిల్లా కేంద్రంలో హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం సాయంత్రం నిర్వహించిన హనుమాన్ శోభాయాత్ర వైభవంగా సాగింది. -
విక్రయదారులు లైసెన్స్ తీసుకోకపోతే చర్యలు
[ 23-04-2024]
ఇండియాస్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ నమోదు లేదా సంబంధిత అధికారుల నుంచి లైసెన్స్ పొందకుండా ఆహార పదార్థాలు విక్రయించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోనున్నారు. -
25న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు
[ 23-04-2024]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో ఈ నెల 25న ఉదయం 8 గంటలకు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. -
25న విశ్రాంత ఉద్యోగులకు ఉచిత కంటి వైద్య శిబిరం
[ 23-04-2024]
జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో ఈనెల 25న ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నారు. -
హోటల్లో ఆకస్మిక తనిఖీ.. రూ.25వేలు జరిమానా
[ 23-04-2024]
ఆదిలాబాద్ పట్టణంలోని బావర్చి బిర్యానీ హోటల్లో తనిఖీలు నిర్వహించారు. -
వ్యాధి తీవ్రత అధికంగా ఉంటేనే రిఫర్ చేయాలి..
[ 23-04-2024]
మహిళల వ్యాధి తీవ్రత అధికంగా ఉంటే రిమ్స్ ఆస్పత్రికి రిఫర్ చేయాలని డీఎంహెచ్వో రాథోడ్ నరేందర్ సూచించారు. -
హనుమాన్ ఆలయాల్లో ఎమ్మెల్యే పూజలు
[ 23-04-2024]
అదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని పొన్నారి, గుట్ట హనుమాన్ ఆలయాల్లో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
మహిళల హక్కుల పై ఉపాధి కూలీలకు అవగాహన
[ 23-04-2024]
సఖీ కేంద్రం, మహిళా సాధికారత కేంద్రం అధ్వర్యంలో మంగళవారం అదిలాబాద్ గ్రామీణ మండలంలోని అంకొలి, లోకారి గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలకు సఖీ కేంద్రం అందించే సేవలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. -
ఆదిత్య ఖండేష్కర్ పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు
[ 23-04-2024]
ఆదిత్య ఖండేష్కర్ తన పుట్టినరోజు సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. -
భారాస అభ్యర్థి నామినేషన్ దాఖలు
[ 23-04-2024]
ఆదిలాబాద్ భారాస ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు నామినేషన్ దాఖలు చేశారు. -
మంగమఠంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు
[ 23-04-2024]
జిల్లా కేంద్రంలోని మంగ మఠం శ్రీ రమా సత్యనారాయణ స్వామి దేవాలయంలో పౌర్ణమిని పురస్కరించుకుని మంగళవారం సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. -
ఊరూరా హనుమాన్ జయంతి వేడుకలు
[ 23-04-2024]
మండలంలోని పొన్నారి, తాంసి, హస్నాపూర్, కప్పలరా, బండల నాగపూర్, వడ్డాడి, గిరిగాం తదితర గ్రామాల్లోని హనుమాన్ ఆలయాల్లో ... -
ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
[ 23-04-2024]
జిల్లా కేంద్రంలో మంగళవారం హనుమాన్ జయంతి వేడుకలను ప్రజలు ఘనంగా నిర్వహించారు. -
సంక్షేమ మంత్రం.. ప్రత్యర్థులపై విమర్శల బాణం
[ 23-04-2024]
ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న భారాస, భాజపా అభ్యర్థులు ఆత్రం సక్కు, గోడం నగేష్ వ్యవహారశైలి మీకు తెలుసు. వారి పనితనం మీకు తెలిసిందే. మంచోడు మంచోడని మంచం ఎక్కిస్తే మంచమంతా పాడు చేసినట్లు ఆత్రం సక్కు వ్యవహారం ఉంటే, బుద్ధిమంతుడని సద్ది కట్టిస్తే బొడ్రాయి దగ్గర భోంచేసి మళ్లీ ఇంటికొచ్చి బోర్లాపడుకున్నట్లు నగేష్ వ్యవహారముంది. -
విద్యార్థులకు ఆన్లైన్ ప్రగతి పత్రాలు
[ 23-04-2024]
విద్యాసంవత్సరం నేటితో ముగియనుంది. విద్యార్థులకు సంగ్రహణాత్మక(ఎస్ఏ2) పరీక్షలు పూర్తి కావడంతో వాటికి సంబంధించిన ఫలితాలను వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నారు. -
శుద్ధజలంపై శ్రద్ధ
[ 23-04-2024]
పంచాయతీల్లో కలుషిత నీటి సరఫరాను నివారించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇకపై ప్రతిరోజు తాగు నీటిని పరీక్షించాకే సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేసింది. -
పారిశ్రామిక ప్రాంతం.. ప్రచారానికి లేదు వేసవి తాపం
[ 23-04-2024]
అభ్యర్థుల ప్రచారానికి మండే ఎండలు అడ్డంకిగా మారాయి. కార్యకర్తలు సైతం ఎండలో బయటకు రావడానికి జంకుతున్నారు. దీంతో జనసమీకరణతో పనిలేకుండా గంపగుత్తగా ఒకేచోట వందల సంఖ్యలో ఎలాంటి ప్రయత్నం లేకుండా ఓటర్లు లభించే ప్రాంతాలు ఏవంటే అవి బొగ్గు గనులే. -
ఆదిలాబాద్ లోక్సభ బరిలో..
[ 23-04-2024]
ఆదిలాబాద్ లోక్సభ స్థానానికి మొదటిసారి ఓ మహిళ పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఆత్రం సుగుణ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని బరిలో నిలిచారు. 1952లో ఆదిలాబాద్ లోక్సభ స్థానంగా ఏర్పడింది. -
మళ్లీ.. ఏనుగు గండం!
[ 23-04-2024]
గుంపులో నుంచి తప్పిపోయిన మగ ఏనుగు.. ఈ నెల మొదటి వారంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి చింతలమానేపల్లి, పెంచికల్పేట్ మండలాలకు వచ్చి ఇద్దరు రైతులను బలి తీసుకున్న ఘటన భయాందోళనకు గురిచేసింది. -
పట్టణానికి దూరం.. కావాలి ప్రత్యామ్నాయం
[ 23-04-2024]
మంచిర్యాల ఎంసీహెచ్(మాతా, శిశు ఆరోగ్య కేంద్రం).. పట్టణానికి దూరంగా ఉండటంతో ఏ చిన్న సమస్య వచ్చినా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేసవిలో అత్యవసరమైనవి.. ముఖ్యమైనవి.. ఆసుపత్రిలో చల్లదనం, సరిపడా నీటి సౌకర్యం. -
నకిలీ వేలిముద్రలతో పీఎంకేకే పథకంలో మోసం
[ 23-04-2024]
నకిలీ వేలిముద్రలతో హాజరు శాతం ఎక్కువగా చూపించి బిల్లులు కాజేసిన ప్రధానమంత్రి కౌశల్య కేంద్ర పథకం నిర్వాహకులను రామగుండం కమిషనరేట్ పోలీసులు అరెస్టు చేశారు. -
ఇసుక దోచేస్తున్నారు..
[ 23-04-2024]
జిల్లాలోని నదులు, వాగులు తదితర ప్రాంతాల నుంచి ఇసుక అక్రమ రవాణా జరగకుండా చూడాలని ఇటీవల జిల్లా పాలనాధికారి అశిష్ సంగ్వాన్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. -
సాయంత్రం ఈదురుగాలులతో అతలాకుతలం
[ 23-04-2024]
భైంసా, కుభీరు, కుంటాల మండలాల్లోని ఆయా గ్రామాల్లో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. తీవ్రగాలులతో రేకుల ఇళ్లు, షెడ్డుల పైకప్పులు ఎగిరిపోయాయి.
తాజా వార్తలు (Latest News)
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు