ఉప్పొంగిన దేశభక్తి.. దశదిశలా స్ఫూర్తి
బ్రిటీషు పాలన విముక్తి కోసం అసువులు బాసిన అమరుల త్యాగాలను భావితరాలకు తెలియజేయడమే వజ్రోత్సవాల ఉద్దేశమని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకులం నుంచి జడ్పీ
పట్టణంలో భారీ ర్యాలీ.. ఉత్సాహంగా పాల్గొన్న యంత్రాంగం
ద్విచక్ర వాహన ర్యాలీలో మంత్రి ఐకేరెడ్డి, జడ్పీ ఛైర్పర్సన్ కోవ
లక్ష్మి, ఎమ్మెల్సీ దండె విఠల్, ఎస్పీ కె.సురేష్కుమార్,
ఎమ్మెల్యే ఆత్రం సక్కు తదితరులు
ఆసిఫాబాద్, న్యూస్టుడే: బ్రిటీషు పాలన విముక్తి కోసం అసువులు బాసిన అమరుల త్యాగాలను భావితరాలకు తెలియజేయడమే వజ్రోత్సవాల ఉద్దేశమని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకులం నుంచి జడ్పీ ఛైర్పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ దండె విఠల్, పాలనాధికారి రాహుల్రాజ్, ఎస్పీ కె.సురేష్కుమార్, ఐటీడీఏ పీఓ వరుణ్రెడ్డి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, డీఎఫ్వో దినేష్కుమార్, అదనపు పాలనాధికారులు రాజేశం, చాహత్బాజ్పాయి, ప్రజా ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులతో కలసి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు జాతీయ జెండాలు పట్టుకొని ద్విచక్ర వాహనాలపై, విద్యార్థులు ప్లకార్డులతో పాదయాత్రగా జిల్లా కేంద్రంలో ప్రధాన కూడళ్లగుండా సాగిన ప్రదర్శన ఆకట్టుకుంది. జాతీయ జెండాలు చేత పట్టుకొని.. ‘బోలో స్వాతంత్య్ర భారత్కి జై.. అంటూ సాగిన నినాదాలతో పట్టణం మార్మోగింది. పిల్లలు, పెద్దలు తేడా లేకుండా జాతీయ భావాన్ని చాటేలా సాగిన ప్రదర్శన పండగ వాతావరణాన్ని తలపించింది. అనంతరం గురుకుల పాఠశాలకు చేరుకొని వజ్రోత్సవాల ప్రాధాన్యతను మంత్రి వివరించారు. 75 ఏళ్ల భారతావని ఆవిర్భావం ఎలా జరిగింది? దాని వెనుకు ఎంత మంది కృషి దాగి ఉంది? ఎంత మంది ఆత్మ త్యాగాలు చేశారు? ఎలాంటి ఆయుధాలు లేకుండా అహింసా మార్గంలో దేశాన్ని సాధించుకున్న తీరు.. ఇవన్నీ నేటి తరానికి పెద్దగా తెలియడంలేదన్నారు. ఇలాంటి మహోన్నతమైన అంశాలు భావి పౌరులకు చేరవేయాలన్న ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ ఈ నెల 8 నుంచి 22 వరకు వజ్రోత్సవ వేడుకలు నిర్వహించాలని సూచించారన్నారు. అందుబాటులో ఉన్న అన్ని సినిమా థియేటర్లలో గాంధీ జీవిత చరిత్రను విద్యార్థులకు తెలియజేసేలా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారన్నారు. సమైక్యాంధ్ర పాలనలోనూ అన్నివిధాలా నష్టపోతున్న విషయాన్ని గమనించిన కేసీఆర్.. ప్రత్యేక రాష్ట్ర సాధనకు కంకణం కట్టుకొని సఫలీకృతుడయ్యాడని పేర్కొన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు పాలన మరింత చేరువైందని, ఆగస్టు 15 నుంచి 57 ఏళ్లు నిండిన వారికి ఆసరా పింఛను వస్తుందని, జిల్లాకు వైద్య కళాశాల మంజూరు చేయడంతో మెరుగైన వైద్యం దరిచేరుతుందన్నారు. ఈ నెల 21న హరితహారం నిర్వహించి అందరు మొక్కలు నాటాలని సూచించారు.
అనంతరం పాలనాధికారి రాహుల్రాజ్ మాట్లాడుతూ జిల్లాలో వజ్రోత్సవాల్లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొంటూ కార్యక్రమాలు విజయవంతం చేస్తున్నారన్నారు. ఇదే స్ఫూర్తితో మిగతా కార్యక్రమాలు జయప్రదం చేయాలన్నారు. అమరుల త్యాగాలను ప్రతి ఒక్కరు స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మల్లికార్జున్ యాదవ్, డీఆర్వో సురేష్, డీఎస్పీ శ్రీనివాస్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్థానిక ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. అంతకు ముందు జడ్పీ అధ్యక్షురాలు కోవ లక్ష్మి మంత్రికి, ఎమ్మెల్సీకి రాఖీ కట్టారు.
జాతీయ జెండాలు పట్టుకొని నినాదాలు చేస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు
75 ఆకారంలో కూర్చున్న విద్యార్థులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెక్ పోస్టులను తనిఖీ చేసిన ఎస్పీ
[ 19-04-2024]
మహారాష్ట్రలో ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దులోని మూడు అంతర్ రాష్ట్ర చెక్ పోస్టులను జిల్లా ఎస్పీ గౌష్ ఆలం శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. -
శనివారం హజ్ యాత్రికులకు శిక్షణ శిబిరం
[ 19-04-2024]
ఈ ఏడాది పవిత్ర హజ్ యాత్రకు వెళ్ళటానికి ఎంపికైన వారికి ఒకరోజు శిక్షణ శిబిరాన్ని శనివారం స్థానిక సెంట్రల్ గార్డెన్లో నిర్వహించనున్నట్లు హజ్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ షాహిద్, మహమ్మద్ తవక్కల్ ఒక ప్రకటనలో తెలిపారు. -
ఇంటింటి ప్రచారం నిర్వహించిన భాజపా ఎంపీ అభ్యర్థి
[ 19-04-2024]
రామ్ నగర్, వామన్ నగర్, అంబుగాం, లింగుడ, అట్నం కూడా గ్రామాల్లో భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
మూడు నెలలుగా నిరీక్షణ
[ 19-04-2024]
గిరిజనులు రోగాల బారిన పడి పరిస్థితి విషమంగా ఉంటే వారిని తరలించటానికి సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ రెండు అంబులెన్స్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. -
కొంప ముంచుతున్న సిబిల్ స్కోరు
[ 19-04-2024]
పొట్టకూటి కోసం రోడ్లపైన, వీధుల్లో చిన్నపాటి వ్యాపారాలు చేసుకుంటున్న దీన పరిస్థితి వారిది. ఎండా వానను లెక్క చేయకుండా పండ్లు, కూరగాయలు, ఇతర వస్తువులు అమ్ముకుంటేనే జీవనం సాగేది. -
సమాచారమంతా తెరపైనే
[ 19-04-2024]
ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పక్కాగా ఏర్పాట్లు చేస్తోంది. ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం డిజిటల్ అక్షరాస్యత విపరీతంగా పెరిగింది. -
ఎన్నికల బరి.. 19వ సారి
[ 19-04-2024]
ఆదిలాబాద్ ఓటర్ల అంతరంగం అంచనాకు చిక్కదు. ఎప్పుడు ఏ పార్టీని గెలిపిస్తారనేది తెలియకుండా ఉంటుంది. గత లోక్సభ ఫలితాలను పరిశీలిస్తే. -
తొలిరోజు రెండు నామపత్రాలు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల్లో తొలిఘట్టమైన నామపత్రాల స్వీకరణ ప్రక్రియ గురువారం మొదలైంది. తొలిరోజు రెండు నామపత్రాలు దాఖలయ్యాయి. -
పంచ్లతో పతకాలు
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో కరాటేను పరిచయం చేసిన వారిలో చెప్పుకోదగ్గ మాస్టర్ చుక్క ధర్మరాజ్. సుమారు 35 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ ప్రస్థానం నేటికీ ఆయన శిష్యులు కొనసాగిస్తున్నారు. -
వలసల జోరు... ఖాళీ అవుతున్న కారు
[ 19-04-2024]
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పార్టీల్లో వలసల జోరు కొనసాగుతోంది. భారాస నుంచి ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీ పదవులు చేపట్టిన పేరున్న నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. తమ రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మారుతుండటంతో జిల్లాలో -
గుట్టుగా.. బెట్టింగ్
[ 19-04-2024]
ఐపీఎల్ ప్రపంచకప్ క్రికెట్ పోటీలు జోరుగా సాగుతున్నాయి. అదే సమయంలో బెట్టింగ్ సైతం ఊపందుకుంది. ఒకప్పుడు పెద్ద పట్టణాల్లో అక్కడక్కడా గుట్టుగా సాగిన ఈ వ్యవహారం ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం -
నీటిబొట్టు.. ఒడిసిపట్టి
[ 19-04-2024]
జన్నారం మండలంలోని కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రంలోని మూగజీవాలకు తాగునీటి ఇబ్బంది లేకుండా అటవీ శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. -
మందులిచ్చేవారేరి?
[ 19-04-2024]
ఔషధ దుకాణాలు, ఫార్మసిస్టు లేనిదే నిర్వహణకు అనుమతి లేదు. విక్రయాలు ఏ మాత్రం చేయకూడదని సంబంధిత నియంత్రణ శాఖ చెబుతోంది. కానీ ఈ నియమాలన్నీ ప్రైవేటు వ్యవస్థకే తప్పితే ప్రభుత్వ సంస్థలకు అవసరం లేదనే పరిస్థితి నెలకొంది. -
వడ్డీ వ్యాపారుల ఇళ్లల్లో పోలీసుల తనిఖీలు
[ 19-04-2024]
కాగజ్నగర్ పట్టణంలో ఎలాంటి అనుమతి, రిజిస్ట్రేషన్ లేకుండా ఫైనాన్స్ పేరిట అధిక వడ్డీ వ్యాపారం చేస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు జిల్లా ఎస్పీ ఆదేశాలతో గురువారం పట్టణంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. -
అక్రమ వెంచర్లు సిద్ధం.. సక్రమానికి యత్నం
[ 19-04-2024]
అధికారులు ఎన్నికల విధుల్లో ఉండగా.. మరోవైపు భూ బకాసురులు అక్రమ వెంచర్లలో ప్లాట్ల విక్రయాలను జోరుగా సాగిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్