గుంటల పేరిట.. గంతలు..
చెన్నూరులో అసైన్డు భూముల దందా జోరుగా సాగుతోంది. ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తూ భూముల అమ్మకాలు, కొనుగోలు చేపడుతున్నారు. అసైన్డు భూముల అమ్మకం.. కొనుగోళ్లు చేయరాదనే నిబంధన ఉన్నా.. ఇక్కడ అమలు కావడం లేదు.
అసైన్డ్భూముల్లో ప్లాట్లుచేసి అమ్మకం
చెన్నూరు పట్టణం, న్యూస్టుడే
షెడ్డు నిర్మాణం చేపట్టేందుకు వేసిన బండరాళ్లు
చెన్నూరులో అసైన్డు భూముల దందా జోరుగా సాగుతోంది. ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తూ భూముల అమ్మకాలు, కొనుగోలు చేపడుతున్నారు. అసైన్డు భూముల అమ్మకం.. కొనుగోళ్లు చేయరాదనే నిబంధన ఉన్నా.. ఇక్కడ అమలు కావడం లేదు. రాజకీయ నాయకుల అండతో కొందరు స్థిరాస్థి వ్యాపారులు ఎకరాల కొద్దీ భూములను కొనుగోలు చేసి ప్లాట్లుగా చేసి అమ్ముతున్నారు. ఈ భూదందా వ్యవహారంలో లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
తక్కువ ధరలో కొనుగోలు చేస్తూ..
అసైన్డ్ భూములు కొనడం, అమ్మటం చట్టప్రకారం నేరం. వాటిల్లో శాశ్వత నిర్మాణాలు చేపడితే తీవ్ర నేరంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటారు. చెన్నూరులో మాత్రం వీటిని అధికారులు మామూలుగానే తీసుకోవడంతో భూముల దందా జోరుగా సాగుతోంది. చెన్నూరు పురపాలికగా రూపాంతరం చెందడం, 63వ జాతీయ రహదారి నిర్మాణం పూర్తై రాకపోకలు ప్రారంభం కావడంతో భూముల ధరలు బాగా పెరిగాయి. దీంతో కొందరు స్థిరాస్తి వ్యాపారులు ఏకంగా ప్రభుత్వ భూములపై కన్నేసి కొనుగోలు, అమ్మకాలు చేపడుతున్నారు. భూములను కాగితాలపై గుంటల చొప్పున ప్లాట్లుగా మార్చి లక్షల్లో విక్రయిస్తూ భారీగా లబ్ధి పొందుతున్నారు.
సాగు చేయకుంటే.. స్వాధీనం చేసుకుంటారని..
చెన్నూరు ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూములను గతంలో అప్పటి ప్రభుత్వం చాలామంది ఎస్సీలకు సాగు నిమిత్తం పంపిణీ చేసింది. అందులో కొందరు రైతులు భూములను సాగు చేసుకోగా మరికొందరు బీడుగా వదిలేశారు. ఆ భూములన్నీ రెవెన్యూ రికార్డుల్లో వారిపేరునే ఉన్నాయి. ఇటీవల కాలంలో పట్టాభూముల ధరలు పెరగడంతో కొందరు స్థిరాస్థి వ్యాపారులు అసైన్డుభూముల దందాను ప్రారంభించారు. అమాయక రైతుల అవసరాలను ఆసరాగా చేసుకోవడంతో పాటు వారిని భయాందోళనకు గురిచేస్తున్నారు. భూములు బీడుగా ఉంటే ప్రభుత్వ అవసరాలకు తిరిగి స్వాధీనం చేసుకుంటారని వారిని భయపెడుతూన్నారు. ఈ విషయంలో దళారులు రంగప్రవేశం చేసి రైతులు భూములను విక్రయించేలా చేస్తున్నారు.
కాగితాలపైనే వెంచర్ ఏర్పాటు...
చెన్నూరులోని గెర్రెకాలనీ, లంబాడిపల్లికి వెళ్లే మార్గంలో సర్వేనెంబర్లు 858, 859, 869, 1046, 1047, 1048లలో ఉన్న అసైన్డు భూములను ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. కొనుగోలు చేసిన వ్యక్తులు సిమెంటు స్తంభాలతో హద్దులను ఏర్పాటు చేసుకుంటున్నారు. కొందరు దొడ్డిదారిన ఇంటినెంబరు పొంది కొనుగోలు చేసిన భూమిని రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. మరికొందరు యథేచ్ఛగా షెడ్ల నిర్మాణాలను చేపడుతున్నారు. ఇదంతా బహిరంగంగానే సాగుతున్నా.. పురపాలిక, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడంలేదు. ఈ అక్రమ వ్యవహారంతో కొందరు ప్రజాప్రతినిధులు, ఓ అధికారి భారీగా దండు కొంటున్నట్లు సమాచారం. ●
చెన్నూరు పట్టణ సమీపంలోని లంబాడిపల్లికి వెళ్లే మార్గంలో సర్వే నంబరు 1046, 1047, 1048 (బై నంబర్లు ఉన్నాయి)లో ఉన్న అసైన్డు భూమిని స్థిరాస్తి వ్యాపారులు కొనుగోలు చేశారు. అందులో గుంటల చొప్పున ప్లాట్లుగా మార్చి విక్రయించారు. కొనుగోలు చేసిన వ్యక్తులు సిమెంటు స్తంభాలను ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇందులో శాశ్వత నిర్మాణాలను చేపడుతున్న సమయంలో దొడ్డిదారిన అనుమతులు కోసం ప్రయత్నం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మలేరియా రహిత సమాజానికి కృషి చేయాలి
[ 25-04-2024]
జిల్లాను మలేరియా రహిత జిల్లాగా మార్చడానికి ప్రజలను భాగస్వాములు చేస్తూ కృషి చేయాలని డీఎంహెచ్ఓ నరేందర్ సూచించారు. -
టీకాల నిర్వహణపై పరిశీలన
[ 25-04-2024]
జిల్లాలో టీకాల నిర్వహణ తీరుపై పరిశీలన కార్యక్రమం కొనసాగుతోంది. 2019లో అందుబాటులోకి వచ్చిన ఆర్వీవీ, 2021లో అందుబాటులోకి ... -
వివాహితపై హెడ్ కానిస్టేబుల్ అసభ్య ప్రవర్తన
[ 25-04-2024]
పట్టణంలోని ఓ కాలనీకి చెందిన వివాహితపై బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగు చూసింది. -
కూచిపూడి నృత్యం వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం
[ 25-04-2024]
భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలు నృత్యాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. -
ఉత్సాహంగా అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు
[ 25-04-2024]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో గురువారం జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగాయి. -
ప్రారంభమైన వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం
[ 25-04-2024]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో గురువారం హైదరాబాద్ క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం ప్రారంభమైంది. -
తగ్గిన ఇంటర్ ఉత్తీర్ణత
[ 25-04-2024]
కిందటేడాది మాదిరిగానే ఈసారి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను బుధవారం ఒకేసారి విడుదల చేశారు. గత సంవత్సరంతో పోల్చితే ఈసారి జిల్లా ఉత్తీర్ణత శాతం కొద్దిగా తగ్గింది. -
అయిదేళ్లుగా ఎదురుచూపులే!
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం రైతులందరికి అందడం లేదు. ప్రారంభంలో ఉన్న రైతుల్లో నిబంధనల కారణంగా తొలగిస్తున్నా.. కొత్త వారిని చేర్చకపోవడంతో ఏటా సాయం పొందే రైతుల సంఖ్య తగ్గుతోంది. -
దిగజారిన ఫలితాలు..
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా గతేడాదితో పోలిస్తే అయిదు స్థానాలు కిందికి పడిపోయి రాష్ట్రంలో 7వ స్థానానికి పరిమితమైంది. అయినప్పటికీ ఉత్తమ ఫలితాలనే సాధించినట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు. -
పక్కాగా ఎన్నికల సంఘం మార్గదర్శకాల అమలు
[ 25-04-2024]
పార్లమెంట్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి జిల్లాల ఎన్నికల అధికారులు, పాలనాధికారులు, -
ఏసీబీ అధికారుల విస్తృత తనిఖీలు
[ 25-04-2024]
నాలుగు వరుసల రహదారి విస్తరణలో భాగంగా.. పరిహారం చెల్లింపులో జరిగిన అక్రమాలపై ‘ఈనాడు’ ప్రచురించిన వరుస కథనాలకు ఏసీబీ అధికారులు స్పందించారు. -
స్థిరాస్తి వ్యాపారుల్లో గుబులు
[ 25-04-2024]
ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడం, నిబంధనలు కాలరాసి వెంచర్లు వేసి అమాయకులను మోసం చేయడం, బాండ్ పేపర్ల మీద రాసుకుంటూ బీడీపీపీ భూములను విక్రయించడం, వివాదాస్పద భూములను వాటాలు వేసుకుని పంచుకోవడం, -
ఏనుగు దాడి ఘటనలో.. బాధిత కుటుంబాలకు పరిహారం
[ 25-04-2024]
కాగజ్నగర్ అటవీ డివిజన్ పరిధిలో ఏనుగు దాడిలో మృతి చెందిన ఇద్దరు రైతుల కుటుంబాలకు ప్రభుత్వం మంజూరు చేసిన పరిహారం చెక్కులను అందజేశారు. -
ఆరో రోజు 8 నామినేషన్లు
[ 25-04-2024]
పెద్దపల్లి లోక్సభ స్థానానికి ఆరో రోజు బుధవారం 8 మంది నామినేషన్లు దాఖలు చేశారు. భాజపా జిల్లా అధ్యక్షుడు చందుపట్ల సునీల్రెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, నాయకులు కన్నం అంజయ్యలతో కలిసి -
ఫలితాల్లో దిగజారి.. అట్టడుగుకు చేరి
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ప్రథమ ద్వితీయ ఫలితాల్లో జిల్లాకు నిరాశే ఎదురైంది. -
అలా ఏర్పాటు.. ఇలా తొలగింపు
[ 25-04-2024]
ఆ యూటర్న్ మృత్యువుకు చిరునామాగా మారింది. ఇక్కడ జరిగిన రహదారి ప్రమాదాల్లో దాదాపు 10 మంది మృతి చెందారు. వీరంతా యూటర్న్ వద్దకు రాగానే ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయారు. -
మొరం తవ్వేస్తున్నారు.. వెంచర్లలో నింపేస్తున్నారు
[ 25-04-2024]
జిల్లాలో ఏ గుట్టను చూసినా అక్రమ దందా ఎలా సాగుతుందో తెలుస్తోంది. యథేచ్ఛగా మొరం తవ్వకాలు జరుగుతున్నా.. సిబ్బంది లేకనే ఇబ్బందులు ఉన్నాయంటూ సంబంధిత అధికారులు ప్రకటించడం చూస్తుంటే పరోక్షంగా వారికి ఎలా అండగా ఉన్నారో తెలిసిపోతోంది. -
అమ్మాయిలదే హవా
[ 25-04-2024]
ఇంటర్ వార్షిక పరీక్ష ఫలితాల్లో జిల్లాలో బాలికలదే పైచేయిగా నిలిచింది. గత ఏడాది సైతం వారే ముందంజలో ఉన్నారు. రెగ్యులర్ కోర్సుల్లో గత సంవత్సరంకంటే రాష్ట్రస్థాయిలో దిగజారినా ఒకేషనల్లో మాత్రం కొంత మెరుగైంది. -
ఇంటర్లో మెరిసిన విద్యాకుసుమాలు
[ 25-04-2024]
బోథ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, ఆదర్శ పాఠశాల విద్యార్థులు బుధవారం వెలువడిన ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సర ఫలితాలలో సత్తా చాటారు. -
నమ్మించి మోసం చేసిన హోంగార్డు అరెస్ట్
[ 25-04-2024]
ప్రజలను నమ్మించి మోసం చేసిన హోంగార్డు షమీ ఉల్లాఖాన్ను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణ సీఐ అనిల్ తెలిపిన వివరాల ప్రకారం షమీ ఉల్లాఖాన్ కొద్ది రోజుల క్రితం పట్టణంలో ట్రాఫిక్ విధులు నిర్వహించారు. -
చర్చనీయాంశంగా మాజీ ఎంపీ నామపత్రం దాఖలు
[ 25-04-2024]
మాజీ ఎంపీ రాఠోడ్ రమేష్ ఒక్కరే వచ్చి భాజపా తరఫున నామపత్రం దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. భాజపా అభ్యర్థి గోడం నగేష్ చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న ఆయన ఆ తర్వాత
తాజా వార్తలు (Latest News)
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM