పండగ వేడుక.. పర్యాటకుల సందడి
పర్యాటకుల స్వర్గధామం రామోజీ ఫిల్మ్సిటీలో పండగ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. దసరా, దీపావళి సెలవులను ఆహ్లాదకర వాతావరణంలో ఆస్వాదించాలనుకొనే వారి కోసం....
రామోజీ ఫిల్మ్సిటీలో కోలాహలం
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: పర్యాటకుల స్వర్గధామం రామోజీ ఫిల్మ్సిటీలో పండగ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. దసరా, దీపావళి సెలవులను ఆహ్లాదకర వాతావరణంలో ఆస్వాదించాలనుకొనే వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రామోజీ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ఆబాలగోపాలాన్ని అలరిస్తున్నాయి. మిరుమిట్లు గొలిపే విద్యుత్తు దీపకాంతుల వెలుగుల్లో ఫిల్మ్సిటీ అందాలు సరికొత్తగా కనిపిస్తూ పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 వరకు ఈ ప్రత్యేక సంబరాలు కొనసాగుతాయి. కలల లోకంలో తేలియాడేలా చేసే కార్నివాల్ పరేడ్లో పాల్గొంటూ.. ఫిల్మ్సిటీ వీధుల్లో విహరిస్తూ సందర్శకులు ఆనందతీరాలకు చేరుతున్నారు. ప్రకృతి రమణీయ ఉద్యానవనాల సందర్శన, కిలకిలారావాల పక్షుల పార్కు, సీతాకోకచిలుకల పార్కు సందర్శనతో మర్చిపోలేని జ్ఞాపకాలను సొంతం చేసుకుంటున్నారు. సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే యాక్షన్ ప్యాక్డ్ స్టంట్ షో, రైడ్స్, ఆకట్టుకొనే స్టేజ్ షోలు, మైమరిపించే సంగీతం సరికొత్త అనుభూతిని పంచుతున్నాయి. బాహుబలి సెట్ సందర్శన మరో ఆకర్షణగా నిలుస్తోంది. వినోదం, విహారంతో పాటు పండగ రుచులతో అందించే విందు ప్రత్యేకతను చాటుతోంది.
నృత్యాలతో హోరెత్తిస్తున్న కళాకారులు
సాయంత్రం వేళ దాండియా ఆటలు.. రామోజీ ఫెస్టివ్ సెలబ్రేషన్స్కు సాయంత్రం వేళ విచ్చేస్తున్న పర్యాటకులు దాండియా ఆటల్లో పాలుపంచుకుంటూ ఆనందోత్సాహాల్లో తేలియాడుతున్నారు. డీజే దాండియా ఆట పాటల్లో ఆడుతూ పాడుతూ గడుపుతున్నారు. సన్ ఫౌంటెయిన్ డ్యాన్స్ ఫ్లోర్లో డీజే బీట్లకు అనుగుణంగా నర్తిస్తూ ఆనందిస్తున్నారు. విభిన్న ప్రాంతీయ రుచులతో అందించే విందును ఆస్వాదిస్తున్నారు. సాయంత్రం వేళ పండగ సెలవులను ఆహ్లాదంగా గడపాలనుకునే వారికి ప్రత్యేక ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. ఆస్వాదించాలనుకుంటే... ఈ సెలబ్రేషన్స్ను మీరు ఆస్వాదించాలనుకుంటే డే, ఈవెనింగ్ ప్యాకేజీలను ఎంచుకొని రావచ్చు. సాధారణ, ప్రీమియం సహా అనేక ప్యాకేజీలు స్వాగతం పలుకుతున్నాయి. ఆకర్షణీయమైన స్టే ప్యాకేజీలతో లగ్జరీ హోటల్ సితార, కంఫర్ట్ హోటల్ తారా, శాంతినికేతన్, వసుంధర విల్లా, గ్రీన్స్ ఇన్, హోటల్ సహారాలో విడిది చేసే వీలుంటుంది. అంతేకాదండోయ్.. పర్యాటకులు తిరిగి వెళ్లే సమయంలో ఫిల్మ్సిటీ నుంచి ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ వరకు రవాణా సౌకర్యం ఉంటుంది. నిర్దేశించిన రుసుం చెల్లించి వినియోగించుకోవచ్చు.
వీక్షిస్తున్న సందర్శకులు
మరిన్ని వివరాలకు..
ఫోన్ నంబరు 1800 120 2999 లేదా www.ramojifilmcity.com
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముఖ్య నేతల కోసం అభ్యర్ధుల యత్నం
[ 20-04-2024]
ఆదిలాబాద్, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గాలకు నామపత్రాలు దాఖలు చేసేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థుల తేదీలు ఖరారయ్యాయి. ఆదిలాబాద్ ఎస్టీ రిజర్వు కాగా పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్ స్థానం. -
బాలభవన్ కల సాకారమయ్యేనా?
[ 20-04-2024]
కళలకు నిలయంగా ఆదిలాబాద్లోని బాలకేంద్రం నిలుస్తోంది. ఇక్కడ శిక్షణ పొందిన బాలలు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణిస్తున్నారు. రికార్డుల మోత మోగిస్తున్నారు. -
నిర్మల్ నేతలదే ఆధిపత్యం
[ 20-04-2024]
ఇప్పుడు జరగబోయే ఎన్నికలు 18వ లోక్సభకు సంబంధించినవి. ఆదిలాబాద్ ఎంపీ స్థానానికి మాత్రం 19వ సారి జరుగుతున్నాయి. 2008లో అప్పటి ఎంపీ మధుసూదన్రెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరిగింది. -
పరిమళించిన పల్లె.. పరిశ్రమల ముల్లె
[ 20-04-2024]
పెద్దపల్లి లోక్సభ స్థానంగా 62 ఏళ్ల కింద ఆవిర్భవించింది. ఇక్కడి నుంచి ఇప్పటివరకు 15 మంది ఎంపీ అభ్యర్థులుగా దిల్లీకి వెళ్లారు. పెద్దపల్లి నియోజకవర్గంలో గ్రామీణ, పారిశ్రామిక ప్రాంతాలతో సమ్మిళితమై ఉంటుంది. -
రెండోరోజు కాంగ్రెస్ అభ్యర్థి ఒక్కరే!
[ 20-04-2024]
లోక్సభ నామపత్రాల స్వీకరణ పర్వంలో భాగంగా రెండో రోజు ఒకే ఒక్క నామపత్రం దాఖలైంది. కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ తరఫున ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు శుక్రవారం రిటర్నింగ్ అధికారి రాజర్షిషాకు నామపత్రం అందజేశారు. -
ఆత్రం సుగుణకు ఆభరణాలు లేవు..
[ 20-04-2024]
తనకు బంగారు ఆభరణాలు ఏమి లేవని, తనపై 50 క్రిమినల్ కేసులు ఆయా పోలీసుస్టేషన్లలో పెండింగ్లో ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ వెల్లడించారు. -
సరిహద్దు గ్రామాల్లో.. ముగిసిన పోలింగ్
[ 20-04-2024]
తెలంగాణ - మహారాష్ట్ర వివాదాస్పద 12 గ్రామాల్లో మొదటి విడత లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇరు రాష్ట్రాలు ఈ గ్రామాలు మావే అంటుండగా, ఇక్కడి ప్రజలందకిరి ఓటర్లు కార్డులు ఉన్న విషయం విదితమే. -
నింగికెగసిన ఆడబిడ్డలకు సలాం
[ 20-04-2024]
జల్.. జంగల్.. జమీన్ అనే నినాదంతో ఉద్యమించిన అడవిబిడ్డలపై అప్పటి ప్రభుత్వం 1981 ఏప్రిల్ 20న తుపాకీ ఎక్కుపెట్టింది. ఆదివాసీలపై తూటాల వర్షం కురిపించింది. -
ఎన్నికల హడావుడి.. ఇసుక దోపిడీ
[ 20-04-2024]
రెవెన్యూ, పోలీసు అధికారులు పార్లమెంట్ ఎన్నికల హడావుడిలో ఉండగా.. ఇదే అదునుగా జిల్లాలోని ఇసుక మాఫియా చెలరేగిపోతుంది. జిల్లాలో ప్రవహిస్తున్న పెద్దవాగు ఇసుక స్మగ్లర్లకు సిరులు కురిపిస్తుంది. -
రూ.కోట్లలో అక్రమాలు.. కానరాని చర్యలు
[ 20-04-2024]
పంచాయతీలకు వస్తున్న నిధులను కొందరు ప్రజాప్రతినిధులు పక్కదారి పట్టిస్తున్నారు. రశీదులు లేకుండానే నిధులు ఖర్చు చేస్తున్నారు. మార్కెట్ ధరకన్నా ఎక్కువ వెచ్చించి వివిధ వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. -
నైపుణ్యం పెంచేలా.. సేవలు మెరుగయ్యేలా
[ 20-04-2024]
ఉత్తర తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్)లో నష్టాల తగ్గింపుతోపాటు వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించేలా సీఎండీ వరుణ్రెడ్డి ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. -
అసౌకర్యాలు గుర్తించి.. దూరాభారం తగ్గించి
[ 20-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అధికారులు పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1,850 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మంచిర్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో 741 పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. -
గల్ఫ్ బాధితులకు భరోసా కలిగేనా?
[ 20-04-2024]
ఎడారి దేశాలకు వలసవెళ్లే కార్మికులకు భరోసా కరవైంది. గల్ఫ్ దేశాలకు వెళ్లి జేబునిండా డబ్బులతో తిరిగి వద్దామనుకున్న వారిని అనుకోని అవాంతరాలు చుట్టుముడుతున్నాయి. ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటికే దాదాపు 70 వేల మంది గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఖతార్, బెహరాన్, ఒమన్లకు వెళ్లగా తాజాగా కొత్తతరం కూడా ఎడారి దేశాల బాట పడుతోంది. -
విలువలతో కూడిన విద్య అందించాలి
[ 20-04-2024]
ఒకప్పుడు చదువులకు దూరంగా ఉన్న మారుమూల అల్లంపల్లి గిరిజన విద్యార్థులకు మంచి విలువలతో కూడిన విద్యను అందుబాటులోకి తెచ్చామని త్రిదండి రామానుజ చినజీయరు స్వామి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీ ఆటే స్ఫూర్తి.. లేటుగా బ్యాటింగ్కు రావడానికి కారణముంది: ఫ్లెమింగ్
-
నిరంతరం రాష్ట్రం గురించి ఆలోచించే నేత చంద్రబాబు : పవన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మారిన లోగో రంగు.. వివాదంలో దూరదర్శన్
-
ఆ ముగ్గురిని చూస్తే ముచ్చటేసింది.. రోహిత్ ఈజ్ బ్యాక్: హర్భజన్
-
దుర్గారావును చూపించాలంటూ ఆందోళన.. సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత