వినిపించనుంది కొత్త కూత..!
రైల్వేశాఖకు సంబంధించిన న్యూ నార్త్ సౌత్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ (ఎన్ఎస్ డీఎఫ్సీ) రామగుండం, మణుగూరు మధ్య సరకు రవాణాకు రైలుమార్గం కోసం సర్వే చేపట్టింది. ప్రస్తుతం క్షేత్రస్థాయి సర్వే, మట్టినమూనాలు సేకరిస్తున్నారు. సర్వే నివేదిక ఆధారంగా రైల్వేశాఖ నిధుల మంజూరుపై నిర్ణయం తీసుకోనుంది.
చెన్నూరు మీదుగా రామగుండం - మణుగూరు రైల్వేలైనుకు సర్వే
మంచిర్యాల అర్బన్, న్యూస్టుడే
రైల్వేశాఖకు సంబంధించిన న్యూ నార్త్ సౌత్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ (ఎన్ఎస్ డీఎఫ్సీ) రామగుండం, మణుగూరు మధ్య సరకు రవాణాకు రైలుమార్గం కోసం సర్వే చేపట్టింది. ప్రస్తుతం క్షేత్రస్థాయి సర్వే, మట్టినమూనాలు సేకరిస్తున్నారు. సర్వే నివేదిక ఆధారంగా రైల్వేశాఖ నిధుల మంజూరుపై నిర్ణయం తీసుకోనుంది. దక్షిణమధ్య రైల్వేమార్గంలో ఇప్పటికే మంచిర్యాల మీదుగా పలు రైళ్ల రాకపోకలకు సౌకర్యం ఉంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ముఖ్యనగరాలను వెళ్లేందుకు అవకాశాలు ఉన్నాయి. తాజాగా రామగుండం నుంచి చెన్నూరు మీదుగా మణుగూరుకు సరకు రవాణా రైల్వేమార్గం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ములుగు జిల్లాలో వంతెన నిర్మాణం కోసం మట్టి నమూనాలను సేకరించే ప్రక్రియ జరుగుతోంది. జిల్లాలో మంచిర్యాల నుంచి బల్లార్షా మార్గంలో రైలు సదుపాయం ఉండగా.. చెన్నూరు ప్రాంత వాసులకు సైతం రైలు కూత వినిపించొచ్చు. గతంలో రైల్వేశాఖ ప్రతిపాదించిన సరకు రవాణా కారిడార్లో భాగంగా ఈ రైల్వేలైనుపై అధికారులు దృష్టిసారిస్తున్నారు.
ములుగు జిల్లాలో మట్టి నమూనాలు సేకరిస్తున్న సిబ్బంది
దూరభారం తగ్గనుంది...
రామగుండం నుంచి మణుగూరుకు ప్రస్తుత రైల్వేమార్గం 289 కిలోమీటర్లు ఉంటుంది. ప్రస్తుత కొత్తలైను చెన్నూరు, భూపాలపల్లి, మేడారం, తాడ్వాయి మీదుగా 200 కిలోమీటర్లలోపే వస్తుంది. మణుగూరు నుంచి భద్రాచలం, కొత్తగూడెం, విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు చేరుకునేందుకు సమయం ఆదా అవుతుంది. భవిష్యత్తులో ప్యాసింజర్ రైళ్లు నడిపితే ప్రయాణికులకు దూరభారం తగ్గుతుంది. సింగరేణి ప్రాంత కార్మికులు తరచూ రామగుండం, భూపాలపల్లి, మణుగూరుకు రాకపోకలు సాగిస్తుంటారు. వారికి ప్రయోజనం కలుగుతుంది. కాళేశ్వరం, రామప్ప, మేడారం, లక్నవరం జలాశయం, బొగత జలపాతం తదితర పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాలకు సులభంగా చేరుకోవడానికి వీలు ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తగ్గిన ఇంటర్ ఉత్తీర్ణత
[ 25-04-2024]
కిందటేడాది మాదిరిగానే ఈసారి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను బుధవారం ఒకేసారి విడుదల చేశారు. గత సంవత్సరంతో పోల్చితే ఈసారి జిల్లా ఉత్తీర్ణత శాతం కొద్దిగా తగ్గింది. -
అయిదేళ్లుగా ఎదురుచూపులే!
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం రైతులందరికి అందడం లేదు. ప్రారంభంలో ఉన్న రైతుల్లో నిబంధనల కారణంగా తొలగిస్తున్నా.. కొత్త వారిని చేర్చకపోవడంతో ఏటా సాయం పొందే రైతుల సంఖ్య తగ్గుతోంది. -
దిగజారిన ఫలితాలు..
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా గతేడాదితో పోలిస్తే అయిదు స్థానాలు కిందికి పడిపోయి రాష్ట్రంలో 7వ స్థానానికి పరిమితమైంది. అయినప్పటికీ ఉత్తమ ఫలితాలనే సాధించినట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు. -
పక్కాగా ఎన్నికల సంఘం మార్గదర్శకాల అమలు
[ 25-04-2024]
పార్లమెంట్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి జిల్లాల ఎన్నికల అధికారులు, పాలనాధికారులు, -
ఏసీబీ అధికారుల విస్తృత తనిఖీలు
[ 25-04-2024]
నాలుగు వరుసల రహదారి విస్తరణలో భాగంగా.. పరిహారం చెల్లింపులో జరిగిన అక్రమాలపై ‘ఈనాడు’ ప్రచురించిన వరుస కథనాలకు ఏసీబీ అధికారులు స్పందించారు. -
స్థిరాస్తి వ్యాపారుల్లో గుబులు
[ 25-04-2024]
ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడం, నిబంధనలు కాలరాసి వెంచర్లు వేసి అమాయకులను మోసం చేయడం, బాండ్ పేపర్ల మీద రాసుకుంటూ బీడీపీపీ భూములను విక్రయించడం, వివాదాస్పద భూములను వాటాలు వేసుకుని పంచుకోవడం, -
ఏనుగు దాడి ఘటనలో.. బాధిత కుటుంబాలకు పరిహారం
[ 25-04-2024]
కాగజ్నగర్ అటవీ డివిజన్ పరిధిలో ఏనుగు దాడిలో మృతి చెందిన ఇద్దరు రైతుల కుటుంబాలకు ప్రభుత్వం మంజూరు చేసిన పరిహారం చెక్కులను అందజేశారు. -
ఆరో రోజు 8 నామినేషన్లు
[ 25-04-2024]
పెద్దపల్లి లోక్సభ స్థానానికి ఆరో రోజు బుధవారం 8 మంది నామినేషన్లు దాఖలు చేశారు. భాజపా జిల్లా అధ్యక్షుడు చందుపట్ల సునీల్రెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, నాయకులు కన్నం అంజయ్యలతో కలిసి -
ఫలితాల్లో దిగజారి.. అట్టడుగుకు చేరి
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ప్రథమ ద్వితీయ ఫలితాల్లో జిల్లాకు నిరాశే ఎదురైంది. -
అలా ఏర్పాటు.. ఇలా తొలగింపు
[ 25-04-2024]
ఆ యూటర్న్ మృత్యువుకు చిరునామాగా మారింది. ఇక్కడ జరిగిన రహదారి ప్రమాదాల్లో దాదాపు 10 మంది మృతి చెందారు. వీరంతా యూటర్న్ వద్దకు రాగానే ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయారు. -
మొరం తవ్వేస్తున్నారు.. వెంచర్లలో నింపేస్తున్నారు
[ 25-04-2024]
జిల్లాలో ఏ గుట్టను చూసినా అక్రమ దందా ఎలా సాగుతుందో తెలుస్తోంది. యథేచ్ఛగా మొరం తవ్వకాలు జరుగుతున్నా.. సిబ్బంది లేకనే ఇబ్బందులు ఉన్నాయంటూ సంబంధిత అధికారులు ప్రకటించడం చూస్తుంటే పరోక్షంగా వారికి ఎలా అండగా ఉన్నారో తెలిసిపోతోంది. -
అమ్మాయిలదే హవా
[ 25-04-2024]
ఇంటర్ వార్షిక పరీక్ష ఫలితాల్లో జిల్లాలో బాలికలదే పైచేయిగా నిలిచింది. గత ఏడాది సైతం వారే ముందంజలో ఉన్నారు. రెగ్యులర్ కోర్సుల్లో గత సంవత్సరంకంటే రాష్ట్రస్థాయిలో దిగజారినా ఒకేషనల్లో మాత్రం కొంత మెరుగైంది. -
ఇంటర్లో మెరిసిన విద్యాకుసుమాలు
[ 25-04-2024]
బోథ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, ఆదర్శ పాఠశాల విద్యార్థులు బుధవారం వెలువడిన ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సర ఫలితాలలో సత్తా చాటారు. -
నమ్మించి మోసం చేసిన హోంగార్డు అరెస్ట్
[ 25-04-2024]
ప్రజలను నమ్మించి మోసం చేసిన హోంగార్డు షమీ ఉల్లాఖాన్ను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణ సీఐ అనిల్ తెలిపిన వివరాల ప్రకారం షమీ ఉల్లాఖాన్ కొద్ది రోజుల క్రితం పట్టణంలో ట్రాఫిక్ విధులు నిర్వహించారు. -
చర్చనీయాంశంగా మాజీ ఎంపీ నామపత్రం దాఖలు
[ 25-04-2024]
మాజీ ఎంపీ రాఠోడ్ రమేష్ ఒక్కరే వచ్చి భాజపా తరఫున నామపత్రం దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. భాజపా అభ్యర్థి గోడం నగేష్ చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న ఆయన ఆ తర్వాత
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!