బాబోయ్.. 1945
1945.. ఈ అంకెలు చూడగానే లోకేశ్వరం మండలంలోని రాజురాకు చెందిన రైతులు ఆందోళన చెందుతారు. దీనికంతటికీ కారణం రెవెన్యూ అధికారులు చేసిన పొరపాటు. దశాబ్ద కాలానికి పైగా ఎంత మంది అధికారుల చుట్టూ తిరిగినా అంకె మారడం లేదు. వారి ఇబ్బందులు దూరమవడం లేదు..
అసైన్డ్ భూములు, డీ-1 పట్టాలకు ఒకే సర్వే నెంబరు కేటాయింపు
లోకేశ్వరం, న్యూస్టుడే
1945.. ఈ అంకెలు చూడగానే లోకేశ్వరం మండలంలోని రాజురాకు చెందిన రైతులు ఆందోళన చెందుతారు. దీనికంతటికీ కారణం రెవెన్యూ అధికారులు చేసిన పొరపాటు. దశాబ్ద కాలానికి పైగా ఎంత మంది అధికారుల చుట్టూ తిరిగినా అంకె మారడం లేదు. వారి ఇబ్బందులు దూరమవడం లేదు..
చేతిలో పట్టాదారు పాసుపుస్తకం చూపుతున్న ఈ రైతు లోలం లస్మన్న. ఈయనకు 1945/106 సర్వే నెంబరులో 1.00 ఎకరం భూమి కేటాయించారు. ఈయనకు ఇద్దరు కుమారులు. తన కుమారులకు భూమి పంపకం చేద్దామని మండల కార్యాలయానికి వెళ్లగా ఈ సర్వే నెంబరులోని భూమిని పేరు బదలాయింపు కుదరదని, అసైన్డ్గా నమోదైనందున తామేమీ చేయలేమని అధికారులు చేతులెత్తేస్తున్నారు.
ధరణితోనే అసలు సమస్య
రాజురా 1978లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో ముంపునకు గురైన గ్రామం. పాత గ్రామంలో భూములు కోల్పోయిన రైతులకు డీ-1 పట్టాల రూపంలో కొత్త ఊరిలో భూములు అందజేశారు. ఆ సమయంలో ఎంత మందికి పట్టాలు జారీ చేశారో వారందరికీ ఒకే సర్వే నెంబరు(1945)ను కేటాయించారు. ఆ తర్వాత గ్రామంలోని సర్కారీ భూమిలో కొంత భాగాన్ని భూమి లేని నిరుపేదలకు అసైన్డ్ పేరున పట్టాలిచ్చారు. వీటికి కూడా 1945 సర్వే నెంబరులోనే కేటాయించారు. ఇప్పుడు గ్రామ పహాణీ చూస్తే 1945/1 నుంచి 1945/76 వరకు దాదాపు 100 ఎకరాలు 80 మంది రైతుల పేరున అసైన్డ్ భూమి ఉంటుంది. మళ్లీ 1945/15 నుంచి 1945/131 వరకు 512 ఎకరాలు దాదాపు 150 మందికి డీ-1 పట్టా రూపంలో అందజేసిన భూములుంటాయి. ఎక్కడైనా ఒక రైతుకు కేటాయించిన సర్వే నెంబరును మరో రైతుకు కేటాయించరు. ఇక్కడ మాత్రం అధికారులు ఇవేవీ పట్టనట్లు వ్యవహరించడం హాస్యాస్పదం. రెవెన్యూ అధికారుల పొరపాటు కారణంగా ప్రస్తుతం ఈ సర్వే నెంబర్లలోని భూములను కొనుగోలు చేసినా, విక్రయించినా ఆన్లైన్లో అసైన్డ్ భూమిగానే చూపడంతో పట్టా మార్పిడి కుదరడం లేదు. దాదాపు 40 ఏళ్ల కిందట కేటాయించిన భూములకు ధరణి రాకతో సమస్య మరింత జటిలమైంది.
తన పట్టాదారు పాసుపుస్తకంలో 1945/15/అ2 సర్వే నెంబరులో 2.24 ఎకరాల పట్టా భూమి ఉందని చూపుతున్న ఈ రైతు మైస శ్రీనివాసు. ఇదే సర్వే నెంబరు 1945/15లో పుప్పాల లస్మన్నకు 1.00 ఎకరం అసైన్డ్ కేటాయించినట్లు ఉంది. తనఖా రుణం అవసరం ఉండి మైస శ్రీనివాసు బ్యాంకుకు వెళ్లగా పాసుపుస్తకంలో పట్టాభూమిగా ఉన్నా.. ధరణిలో ప్రభుత్వ భూమిగా ఉందని చెప్పి తిరస్కరిస్తున్నారు. తనది ప్రభుత్వం అందజేసిన పట్టా భూమి అని మండల తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి ధ్రువీకరణ పత్రం తెచ్చి ఇవ్వగా స్థానిక టీజీబీ మేనేజరుతో పాటు ఆర్ఎం, ఎస్ఎం స్థాయి అధికారులు సైతం తిప్పి పంపడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎంపీగా సుగుణక్కను గెలిపించుకుంటాం
[ 28-03-2024]
ఆదిలాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఏఐసీసీ ప్రకటించిన సుగుణక్కను పార్టీ కార్యకర్తలు అందరూ ఐక్యంగా కృషిచేసి గెలిపించుకుంటామని పార్టీ పట్టణ అధ్యక్షుడు గుడిపల్లి నగేష్ అన్నారు. -
శివాజీ విగ్రహ నిర్మాణానికి విరాళం
[ 28-03-2024]
తాంసీ మండల కేంద్రంలో హిందూ యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న శివాజీ మహారాజ్ విగ్రహ నిర్మాణానికి భాజపా జిల్లా నాయకుడు లోక ప్రవీణ్ రెడ్డి విరాళంగా అందజేశారు. -
విశ్రాంత ఉద్యోగులకు ఉచిత కంటి వైద్య పరీక్షలు
[ 28-03-2024]
జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో గురువారం వరంగల్ మ్యాక్సీ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో విశ్రాంత ఉద్యోగులకు ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. -
ఆదిలాబాద్లో బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికలు
[ 28-03-2024]
ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికలు గురువారం ఉదయం న్యాయస్థానం ఆవరణలో ప్రారంభమయ్యాయి. -
లక్ష్యానికి మించి ‘ఉపాధి’ పనులు
[ 28-03-2024]
మండుటెండల్లో ఉపాధిహామీ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ సంవత్సరం బడ్జెట్్ ప్రణాళికలు మించి పనులు చేశారు. 2023-24లో మొత్తం 36.58 లక్షల పని దినాలు అంచనాతో ప్రణాళికలు రూపొందించారు. -
కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ..
[ 28-03-2024]
అనూహ్య మలుపులు తిరిగిన ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిత్వం ఎట్టకేలకు ఆత్రం సుగుణకే ఖరారైంది. ఉట్నూరుకు చెందిన టీచర్, మానవ హక్కుల వేదిక జిల్లా కార్యదర్శిగా పని చేస్తున్న సుగుణ పేరును ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) ఆమోదించింది. -
‘పది’ మూల్యాంకనానికి ఏర్పాట్లు
[ 28-03-2024]
పదోతరగతి పరీక్షలు ఈనెల 30తో ముగియనున్నాయి. ఫలితాలు సకాలంలో విడుదల చేసేలా విద్యాశాఖ కసరత్తు ముమ్మరం చేసింది. పరీక్షపత్రాల మూల్యాంకనానికి ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే జిల్లాకు ఇతర జిల్లాల నుంచి పత్రాలు చేరాయి. -
గొంతు తడవదు.. గోస తీరదు
[ 28-03-2024]
ఆసిఫాబాద్ మండలం సుద్దాఘాట్ గ్రామానికి చెందిన ప్రజలు నిత్యం కిలోమీటరు దూరంలోని వాగు నుంచి నీరు తెచ్చుకుంటున్నారు. పక్కనే చెలమ తీసి నీటిని పట్టుకెళ్తున్నారు. వాగు అవతల ఉన్న పదుల సంఖ్యల్లో గ్రామాలదీ ఇదే పరిస్థితి. -
నిప్పు.. నిర్లక్ష్యం చేస్తే పెను ముప్పు
[ 28-03-2024]
వేసవి వచ్చిందంటే సహజంగా కొన్ని సమస్యలు వస్తుంటాయి. ప్రధానంగా అడవుల్లో కార్చిచ్చులు మొదలవుతాయి. అటవీప్రాంతంలో జరిగితే మనకొచ్చిన ఇబ్బందేంటని నిర్లక్ష్య వైఖరి చాలా మందిలో కనిపిస్తుంటుంది. -
10,489 మందికి ఎన్నికల విధులు
[ 28-03-2024]
లోకసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అధికార యంత్రాంగం పోలింగ్ కోసం అంతా సిద్ధం చేస్తోంది. ఎన్నికల నిర్వహణలో ప్రధాన భూమిక పోషించే ఉద్యోగ, ఉపాధ్యాయ సమాచార సేకరణ, కంప్యూటర్లో వారి వివరాల నిక్షిప్తం చేసే ప్రక్రియను పూర్తి చేశారు. -
అరచేతిలో అతివకు భద్రత
[ 28-03-2024]
ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చినా అతివలపై జరుగుతున్న నేరాలు ఆగడం లేదు. ఇప్పటికే మహిళలు, యువతుల, విద్యార్థినుల భద్రతకు అనేక మొబైల్ యాప్లను ప్రవేశపెట్టిన తెలంగాణ పోలీసుశాఖ తాజాగా టీ-సేఫ్ యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. -
భానుడి భగభగ
[ 28-03-2024]
వేసవి ప్రారంభంలోనే సూర్యుడు నిప్పులు గక్కుతున్నాడు. రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన పది ప్రాంతాల్లో ఆరు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఉన్నాయి. రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో జైనథ్లో మధ్యాహ్న సమయంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 42.3 డిగ్రీలుగా నమోదు అయింది. -
పల్లెలు భళా.. పట్టణాల్లో డీలా
[ 28-03-2024]
స్థానిక సంస్థల అభివృద్ధికి ప్రధానమైన ఆర్థిక వనరులు ఆస్తి పన్నులే. ఆర్థిక సంఘం, ప్రత్యేకాభివృద్ధి నిధులతో పంచాయతీలు, పురపాలక సంఘాల్లో సీసీ రహదారులు, నీటి సరఫరా, విద్యుత్ దీపాల నిర్వహణ, మరమ్మతు పనులు చేపడుతున్నారు. -
ముదురుతున్న వివాదం!
[ 28-03-2024]
ప్రభుత్వస్థలం కబ్జాకు గురవుతోంది. అక్రమమార్గంలో పట్టాలు చేసుకుంటున్నారు. విచారణ జరపండి. బాధ్యులపై చర్యలు తీసుకోండి.. అంటూ ఏకంగా శాసనసభ్యుడు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. -
రోడ్లు నిర్మానుష్యం.. అవస్థల్లో జనం
[ 28-03-2024]
ఆదిలాబాద్లో రాష్ట్రంలోనే అత్యధికంగా బుధవారం 42.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాలో మూడ్రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. -
ప్రభుత్వ బడులకు ఉచిత వెలుగులు
[ 28-03-2024]
ప్రభుత్వ పాఠశాలలకు విద్యుత్తు ఛార్జీలు గుదిబండగా మారాయి. సర్కారు అందించే నిర్వహణ నిధులు సరిపోకపోవడంతో చాలా పాఠశాలల్లో విద్యుత్తు బిల్లులు పేరుకుపోయాయి. -
రెండు పడక గదుల ఇళ్లపై నీలినీడలు
[ 28-03-2024]
భారాస హయాంలో చేపట్టిన రెండు పడకల ఇళ్ల నిర్మాణాలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. మూడు నెలల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో వీటి విషయంలో ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. -
హలో.. హలోకు అనుమతి
[ 28-03-2024]
మారుమూల గ్రామాల్లో సంకేతాల (సిగ్నల్స్) సమస్య పరిష్కరించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల కిందట ప్రత్యేకంగా సెల్టవర్లు మంజూరు చేసింది. స్థలసమస్య కారణంగా పలు పనులు నిలిచి పోయాయి. -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
[ 28-03-2024]
పట్టణంలోని శివాజీచౌక్ ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్న లక్ష్మణ్ (25) అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్లు పట్టణ సీఐ అనిల్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
-
రషీద్ బౌలింగ్లో సిక్స్లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM