logo

గ్రూప్‌-1 పరీక్ష కేంద్రాల పరిశీలన

జిల్లా కేంద్రంలో ఈ నెల 16న నిర్వహించే గ్రూప్‌-1 పరీక్ష కేంద్రాలను మంగళవారం జిల్లా పాలనాధికారి ముషారఫ్‌ అలీ ఫారుఖీ, ఎస్పీ సీహెచ్‌.ప్రవీణ్‌కుమార్‌లు పరిశీలించారు.

Published : 05 Oct 2022 04:11 IST


ఏర్పాట్లను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారుఖీ, ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌

నిర్మల్‌, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రంలో ఈ నెల 16న నిర్వహించే గ్రూప్‌-1 పరీక్ష కేంద్రాలను మంగళవారం జిల్లా పాలనాధికారి ముషారఫ్‌ అలీ ఫారుఖీ, ఎస్పీ సీహెచ్‌.ప్రవీణ్‌కుమార్‌లు పరిశీలించారు. రవి హైస్కూల్‌, ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో ఏర్పాటుచేసిన కేంద్రాలను చూసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. పరీక్షా కేంద్రాల్లో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలు, ఫర్నీచర్‌ను పరిశీలించారు. 19 కేంద్రాల్లో 4,620 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు చెప్పారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని సూచించారు. వీరి వెంట ఆర్డీవో తుకారాం, జిల్లా విద్యాధికారి రవీందర్‌రెడ్డి, అర్బన్‌ తహసీల్దార్‌ సుభాష్‌చందర్‌ ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని