logo

ఉత్సవాలను కలిసి నిర్వహించుకోవడం హర్షణీయం

దుర్గా నవరాత్రి ఉత్సవాలను హిందువులతో పాటు ముస్లింలు కలిసి నిర్వహించుకోవడం హర్షణీయమని ఎంపీ సోయం బాపురావు పిప్పల్‌కోటి వాసులను అభినందించారు.

Published : 05 Oct 2022 04:36 IST


ఎంపీ సోయం, భాజపా జిల్లా అధ్యక్షుడు శంకర్‌ను సన్మానిస్తున్న పిప్పల్‌కోటి గ్రామస్థులు

భీంపూర్‌, న్యూస్‌టుడే : దుర్గా నవరాత్రి ఉత్సవాలను హిందువులతో పాటు ముస్లింలు కలిసి నిర్వహించుకోవడం హర్షణీయమని ఎంపీ సోయం బాపురావు పిప్పల్‌కోటి వాసులను అభినందించారు. ఇదే స్ఫూర్తిని ప్రతి గ్రామంలో కొనసాగించాలని ఆకాంక్షించారు. మంగళవారం పిప్పల్‌కోటిలో జరిగిన ముగింపు ఉత్సవాలకు ఎంపీతో పాటు భాజపా జిల్లా అధ్యక్షుడు పాయల్‌ శంకర్‌ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. గ్రామస్థులు వారిని సత్కరించారు. దుర్గా మండలి సభ్యులు గడ్డం సంతోష్‌, సాదిక్‌, స్వామి, ప్రవీణ్‌, శ్రీనివాస్‌, రాజు, భాజపా మండల అధ్యక్షుడు రాకేష్‌యాదవ్‌, నాయకులు రెడ్డి రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని