పండగొక్కటే.. విధానాలే వేరు..!!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భిన్నత్వంలో ఏకత్వం కనిపిస్తుంది. మినీ భారత్గా ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. కొందరు చదువు కోసం, మరికొందరు ఉద్యోగాలు, ఇంకొందరు వ్యాపార నిమిత్తం ఇక్కడే స్థిరపడ్డారు.
ఒక్కో రాష్ట్రంలో విభిన్నంగా దసరా ఉత్సవాలు
న్యూస్టుడే, ఆదిలాబాద్ సాంస్కృతికం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భిన్నత్వంలో ఏకత్వం కనిపిస్తుంది. మినీ భారత్గా ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. కొందరు చదువు కోసం, మరికొందరు ఉద్యోగాలు, ఇంకొందరు వ్యాపార నిమిత్తం ఇక్కడే స్థిరపడ్డారు. వందల సంవత్సరాల కిందట వలసగా వచ్చిన వీరంతా పండగలు, వేడుకలు, ఇతరత్ర కార్యక్రమాలు కలిసి చేస్తుంటారు.. ఈ నేపథ్యంలో వీరంతా దసరా పండగను తమ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం నిర్వహించడం గురించి వివరిస్తూ ‘న్యూస్టుడే’ ప్రత్యేక కథనం.
దేవీ నవరాత్రోత్సవాల్లో క్షత్రియ పట్కరీ సమాజ్
శ్రీసోమవంశీయ సహస్త్ర క్షత్రియ పట్కరీ సమాజ్ కర్ణాటకలోని హుబ్లీ, నిజామాబాద్ జిల్లా ఆర్మూరుతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా ఉన్నారు. వీరు దేవీ నవరాత్రోత్సవాలను ఎక్కువగా ప్రాధాన్యమిస్తారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారిని కొలుస్తారు. తొమ్మిది రోజులు ఉపవాసాలు ఉంటారు. నవమి రోజు మహాప్రసాదం వితరణ చేస్తారు. బంధువులు, మిత్రులను ఇంటికి ఆహ్వానిస్తారు. దసరా రోజు అంటే దశమి రోజు ఇంటి దేవుని మందిరంలో ప్రతిష్ఠించిన దేవీ ఘటస్థాపనకు ప్రత్యేక నైవేద్యం సమర్పిస్తారు. ఆ తర్వాత వాటిని నీటిలో నిమజ్జనం చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి దసరా వేడుకల్లో పాల్గొంటారు. గ్రామ శివారున ఉన్న జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు చేస్తారు. జమ్మి ఆకులను ఇచ్చిపుచ్చుకుంటారు.
గుజరాతీలు పార్వతి దేవిని కొలుస్తారు
విజయదశమి రోజున గుజరాతీ సమాజ్ పార్వతి దేవిని కొలుస్తారు. ఇంటింటా శక్తి పూజ చేస్తారు. ఇంటి గోడల మీద త్రిశూలాన్ని, శక్తి ఆయుధాన్ని పసుపుతో గీసి పూజిస్తారు. పొలం నుంచి తీసుకొచ్చిన మట్టితో వేదిక తయారు చేస్తారు. అందులో గోధుమ విత్తనాలు చల్లుతారు. దానిపై మట్టి ఉండ పెడతారు. దానిని నీటితో నింపి వెండి నాణెం వేస్తారు. ఆ మట్టికుండను వారు దేవిగా భావిస్తారు. అష్టమి రోజున నిర్వహిస్తారు. దశమి రోజున నిమజ్జనం చేస్తారు. ఆ తర్వాత పౌర్ణమి వరకు జరిగే గర్బా ఉత్సవాల్లో మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు.
మరాఠివారి హారతికి ప్రాధాన్యం
జిల్లా సరిహద్దున మహారాష్ట్ర ఉండటంతో చాలామంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చదువు, ఉద్యోగం, వ్యాపారరీత్యా నివాసం ఉంటున్నారు. దసరా ఉత్సవాన్ని విజయానికి సంకేతంగా పరిగణిస్తారు. వేడుక రోజు జమ్మి ఆకులను ఇంటికి తీసుకొచ్చి గుమ్మం వద్ద నిలుస్తారు. వీరికి ఇంటిల్లిపాదితో పాటు మహిళలు వారు తీసుకొచ్చిన జమ్మి ఆకులను ఇంటిదేవుని వద్ద ఉంచి పూజ చేస్తారు. ఆ తర్వాత తులసి చెట్టు వద్ద పెట్టి పూజిస్తారు. హారతి పళ్లెంలో బంగారం, వెండితో పాటు జమ్మి ఆకులు పెట్టి గుమ్మం వద్ద నిలిచిన వారికి హారతి ఇస్తారు. ఆ తర్వాత ఇంట్లోకి అనుమతిస్తారు. కుటుంబ సభ్యులు జమ్మి ఆకులు ఇచ్చిపుచ్చుకుంటారు. ప్రతి కార్యంలో విజయం చేకూరాలని పెద్దలు ఆశీర్వదిస్తారు.
రాజస్థానీలకు దాండియా నృత్యాలు ప్రత్యేకం
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను రాజస్థానీ సమాజ్ ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. దసరా పండగ రాక ముందు నుంచే అంటే నెలరోజుల నుంచే ఆ సమాజ్లోని మహిళలు, యువతుల్లో సందడి నెలకొంటుంది. ప్రత్యేకంగా దాండియా నృత్యాన్ని నేర్చుకుంటారు. దుర్గాదేవి ప్రతిమను ప్రతిష్ఠించిన మండపాల వద్ద, వారి సమాజ్ భవనం ప్రాంగణంలో రోజూ రాత్రి విడతల వారీగా మహిళలు, యువతులు దాండియా నృత్యం చేస్తారు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఈ నృత్యాన్ని చిన్నారుల నుంచి పండుటాకుల వరకు వచ్చి వీక్షిస్తుంటారు. విజయదశమి రోజున జమ్మి ఆకులను తీసుకొచ్చి పూర్వీకుల చిత్రపటాల వద్ద ఉంచి మొక్కుతారు. పెద్దల నుంచి ఆశీర్వాదం తీసుకుంటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తేలిన బరి.. గెలుపుపై గురి
[ 29-03-2024]
ఆదిలాబాద్ ఎంపీ సీటు విజయం మూడు ప్రధాన పార్టీలకు కీలకంగా మారింది. కాంగ్రెస్ అభ్యర్థిగా ఆత్రం సుగుణ, భాజపా అభ్యర్థిగా గోడం నగేష్, భారాస తరఫున ఆత్రం సక్కు మధ్య త్రిముఖ పోటీ ఏర్పడింది. -
ఇక విద్యుత్తు కోతలకు చెక్
[ 29-03-2024]
ఎండలు ఎక్కువ కావడంతో విద్యుత్తు వినియోగం పెరిగిపోయింది. దీంతో కొన్ని చోట్ల సరఫరాకు అంతరాయం కలుగుతోంది. వచ్చే రెండు నెలల్లో విద్యుత్తు వినియోగం మరింత పెరిగే అవకాశం... -
ఎమ్మెల్యే ఫిర్యాదు చేసినా పట్టించుకోరా?: ఏలేటి
[ 29-03-2024]
గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అల్లోల ఇంద్రకరణ్రెడ్డి హయాంలో ప్రభుత్వ భూములను విచ్చలవిడిగా చెరబట్టారని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి మరోసారి ఆరోపించారు. -
పెన్గంగా.. ఇసుకదందా
[ 29-03-2024]
మండలవాసులకు వరప్రదాయినిగా ఉన్న పెన్గంగా నదిలో ఇసుకదొంగలు పడ్డారు. పారే నీటిని ఆపిమరీ యంత్రాలతో ఇసుకను తోడి అక్రమ రవాణా చేస్తున్నారు. -
గడువు ముందర సందిగ్ధం!
[ 29-03-2024]
ఏటా సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి, ప్రభుత్వ పనులకు బడ్జెట్ కేటాయిస్తారు. దానిని ఆ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ఖర్చు చేయాలి. ఇందుకు సంబంధించిన బిల్లులను ఖజానా శాఖకు పంపిస్తే.. వారు ఈ-కుబేర్లో నమోదు చేస్తారు. -
ఆన్లైన్ జూదంలో నష్టపోయి.. రైతుల డబ్బు కాజేత
[ 29-03-2024]
ఆదిలాబాద్ ఐపీపీబీ(ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్) మేనేజర్ విజయ్ జాదవ్ ఆన్లైన్ జూదానికి అలవాటు పడి అందులో నష్టపోయి రైతులకు చెందిన డబ్బులను కాజేసినట్లు తెలుస్తోంది. -
బహుజన, తెలంగాణవాదాన్ని భారీ మెజార్టీతో గెలిపించాలి
[ 29-03-2024]
రాజ్యాంగాన్ని కాపాడాలనే సంకల్పం, బహుజన, తెలంగాణ వాదం ఒక్కటేననే ఉద్దేశంతో తాను భారాసతో చేతులు కలిపినట్లు ఆ పార్టీ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ అన్నారు. -
సమస్యలు తెలుసుకుని.. పరిష్కారానికి ఆదేశించి
[ 29-03-2024]
గ్రామాల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని జిల్లా పాలనాధికారి వెంకటేష్ దోత్రే అన్నారు. గురువారం అదనపు పాలనాధికారి దీపక్ తివారీతో కలసి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. -
ఉద్యానవనాలపై ఉదాసీనత..
[ 29-03-2024]
మంచిర్యాల పట్టణవాసులకు ఆహ్లాదం కోసం వివిధ వార్డుల్లో ఉద్యానవనాల నిర్మాణం చేపట్టారు. ఒక్కో ఉద్యానవనానికి రూ.40 లక్షల నుంచి రూ.90 లక్షలు కేటాయించారు. -
రూ.‘కోటి’.. చీకటి పాలు
[ 29-03-2024]
ఒకవైపు రహదారి విస్తరణ లేక, మరోవైపు సిర్పూరు కాగితం మిల్లు(ఎస్పీఎం)కు నిత్యం ముడిసరకు లారీల రాకపోకల కారణంగా.. ఏడాదిలోపే రూ.కోటితో ఏర్పాటు చేసిన వెలుగులు విరజిమ్మే సెంట్రల్ లైటింగ్ వ్యవస్థ చీకటి పాలవుతోంది. -
‘టీజీ’ కోడ్తో రిజిస్ట్రేషన్లు
[ 29-03-2024]
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్ను ‘టీఎస్’ నుంచి ‘టీజీ’కి మార్పు చేస్తూ ఈ నెల 15న గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. -
పట్టణ వనాలపై పట్టింపు శూన్యం
[ 29-03-2024]
జిల్లాలోని నిర్మల్, భైంసా, ఖానాపూర్ పట్టణాల్లోని 80 వార్డుల్లో 52 పట్టణ ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. హరితహారంలో భాగంగా రూ.లక్షల నిధులు వ్యయం చేస్తున్నా నిర్వహణ లేకపోవడంతో అందులోని నాటిన మొక్కలన్నీ ఎండిపోతున్నాయి. -
ఆత్మహత్యలతో రెండు కుటుంబాల్లో విషాదం
[ 29-03-2024]
బాసర రైల్వే స్టేషన్లో నిజామాబాద్ పట్టణానికి చెందిన యువతి, యువకుడు బుధవారం రాత్రి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇరు కుటుంబాల్లో విషాదం నింపింది. -
సాగులో సాంకేతికత.. మహిళలకు సాధికారత
[ 29-03-2024]
వ్యవసాయరంగంలో మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం నమో డ్రోన్ దీదీ యోజనను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా జిల్లాలవారీగా ప్రయోగాత్మకంగా కొంత మంది యువతీ యువకులను ఎంపిక చేసి డ్రోన్ నిర్వహణ, -
ఈత కారాదు గుండెకోత
[ 29-03-2024]
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విభిన్న వాతావరణానికి పెట్టింది పేరు. ఇక్కడ వర్షాలు, చలి, ఎండ.. అన్నీ ఎక్కువే. మార్చిలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటుతున్నాయి. -
ఆదరిస్తే అభివృద్ధి చేస్తా : సుగుణ
[ 29-03-2024]
ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి మొదటిసారి ఆదివాసీ మహిళకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించిందని ఆ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ అన్నారు. దీంతో పార్టీకి ఆదివాసీలపై ఉన్న ప్రేమ నిరూపితమైందని తెలిపారు.