‘స్వచ్ఛత’ను చాటి.. ర్యాంకుల్లో మేటి
స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్-2022 ఫలితాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచి ఫలితాలను సాధించింది. పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపడటంతో జిల్లాలు మంచి ర్యాంకులను దక్కించుకున్నాయి.
సర్వే ఫలితాల్లో మెరుగుపడిన జిల్లాలు
న్యూస్టుడే, మావల
స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్-2022 ఫలితాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచి ఫలితాలను సాధించింది. పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపడటంతో జిల్లాలు మంచి ర్యాంకులను దక్కించుకున్నాయి. దేశంలో తెలంగాణ రాష్ట్రం మొదటి ర్యాంకు సాధించగా జిల్లాలు సైతం అదేస్థాయిలో పనితీరును కనబరిచాయి. దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించిన 709 జిల్లాల్లో ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీం, మంచిర్యాల జిల్లాలు టాప్-25లో నిలవటం విశేషం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమాలతో గ్రామస్థుల్లో అవగాహన పెరిగింది. స్వచ్ఛతకు ప్రాధాన్యం ఇస్తుండడంతో ఉత్తమ ఫలితాలను సాధించడానికి దోహదపడింది.
తాంసి మండలం సావర్గావ్ పంచాయతీలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పిస్తున్న సిబ్బంది
పల్లెల్లో కేంద్ర బృందాల పరిశీలన
కేంద్ర ప్రభుత్వం గ్రామాల్లో స్వచ్ఛతను పెంపొందించేందుకు స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఉత్తమ ఫలితాలను సాధించిన రాష్ట్రాలకు, జిల్లాలకు ర్యాంకులను కేటాయిస్తోంది. ఇంటింటికీ చెత్త సేకరణ, ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో పారిశుద్ధ్య పరిస్థితి, ఇంకుడు గుంతల నిర్మాణం, ప్లాస్టిక్ నిషేధం, సేంద్రియ ఎరువుల తయారీ, స్వచ్ఛతలో ప్రజల భాగస్వామ్యం తదితర అంశాలను సర్వేలో పరిగణనలోకి తీసుకుంటారు. కేంద్రం నియమించిన బృందాలు ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రత్యక్షంగా పరిశీలించి, ప్రజల అభిప్రాయాలను తీసుకుని తయారుచేసిన నివేదికల ఆధారంగా మార్కులను, ర్యాంకులను నిర్ణయిస్తారు. ఈ సారి మొత్తం 1000 మార్కులకు సేవల పురోగతికి 350 మార్కులు, ప్రజాభిప్రాయ సేకరణకు 350, ప్రత్యక్ష పరిశీలనకు 300 మార్కులను కేటాయించారు.
ఇచ్చోడ మండలం ముఖరా(కె)లో శ్రమదానం చేస్తున్న గ్రామస్థులు
పెరిగిన ప్రజల భాగస్వామ్యం
స్వచ్ఛ సర్వేక్షణ్లో అత్యధిక మార్కులతో నిర్మల్ జిల్లా ముందంజలో నిలిచింది. తర్వాత కుమురం భీం, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాలున్నాయి. ప్రజాభిప్రాయ సేకరణలో, సేవల పురోగతిలో నాలుగు జిల్లాలు మెరుగైన స్కోరు సాధించాయి. నిర్మల్ జిల్లా సేవల పురోగతిలో 350 మార్కులు, ప్రత్యక్ష పరిశీలనలో 284, ప్రజాభిప్రాయ సేకరణలో 349 స్కోరు సాధించింది. కుమురం భీం జిల్లా సేవల్లో 343, పరిశీలనలో 283, ఫీడ్బ్యాక్లో 349 మార్కులు పొందింది. మంచిర్యాల జిల్లాకు 343, పరిశీలనలో 283, అభిప్రాయ సేకరణలో 350 మార్కులు వచ్చాయి. ఆదిలాబాద్ జిల్లా ప్రజాభిప్రాయంలో 350 స్కోరు సాధించగా, పరిశీలనలో 281, సేవల్లో 345 మార్కులను సాధించింది. నాలుగు జిల్లాలు అటు జాతీయ స్థాయిలో, ఇటు రాష్ట్రంలో మెరుగైన ఫలితాలను సాధించి ముందంజలో నిలిచాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెక్ పోస్టులను తనిఖీ చేసిన ఎస్పీ
[ 19-04-2024]
మహారాష్ట్రలో ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దులోని మూడు అంతర్ రాష్ట్ర చెక్ పోస్టులను జిల్లా ఎస్పీ గౌష్ ఆలం శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. -
శనివారం హజ్ యాత్రికులకు శిక్షణ శిబిరం
[ 19-04-2024]
ఈ ఏడాది పవిత్ర హజ్ యాత్రకు వెళ్ళటానికి ఎంపికైన వారికి ఒకరోజు శిక్షణ శిబిరాన్ని శనివారం స్థానిక సెంట్రల్ గార్డెన్లో నిర్వహించనున్నట్లు హజ్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ షాహిద్, మహమ్మద్ తవక్కల్ ఒక ప్రకటనలో తెలిపారు. -
ఇంటింటి ప్రచారం నిర్వహించిన భాజపా ఎంపీ అభ్యర్థి
[ 19-04-2024]
రామ్ నగర్, వామన్ నగర్, అంబుగాం, లింగుడ, అట్నం కూడా గ్రామాల్లో భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
మూడు నెలలుగా నిరీక్షణ
[ 19-04-2024]
గిరిజనులు రోగాల బారిన పడి పరిస్థితి విషమంగా ఉంటే వారిని తరలించటానికి సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ రెండు అంబులెన్స్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. -
కొంప ముంచుతున్న సిబిల్ స్కోరు
[ 19-04-2024]
పొట్టకూటి కోసం రోడ్లపైన, వీధుల్లో చిన్నపాటి వ్యాపారాలు చేసుకుంటున్న దీన పరిస్థితి వారిది. ఎండా వానను లెక్క చేయకుండా పండ్లు, కూరగాయలు, ఇతర వస్తువులు అమ్ముకుంటేనే జీవనం సాగేది. -
సమాచారమంతా తెరపైనే
[ 19-04-2024]
ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పక్కాగా ఏర్పాట్లు చేస్తోంది. ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం డిజిటల్ అక్షరాస్యత విపరీతంగా పెరిగింది. -
ఎన్నికల బరి.. 19వ సారి
[ 19-04-2024]
ఆదిలాబాద్ ఓటర్ల అంతరంగం అంచనాకు చిక్కదు. ఎప్పుడు ఏ పార్టీని గెలిపిస్తారనేది తెలియకుండా ఉంటుంది. గత లోక్సభ ఫలితాలను పరిశీలిస్తే. -
తొలిరోజు రెండు నామపత్రాలు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల్లో తొలిఘట్టమైన నామపత్రాల స్వీకరణ ప్రక్రియ గురువారం మొదలైంది. తొలిరోజు రెండు నామపత్రాలు దాఖలయ్యాయి. -
పంచ్లతో పతకాలు
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో కరాటేను పరిచయం చేసిన వారిలో చెప్పుకోదగ్గ మాస్టర్ చుక్క ధర్మరాజ్. సుమారు 35 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ ప్రస్థానం నేటికీ ఆయన శిష్యులు కొనసాగిస్తున్నారు. -
వలసల జోరు... ఖాళీ అవుతున్న కారు
[ 19-04-2024]
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పార్టీల్లో వలసల జోరు కొనసాగుతోంది. భారాస నుంచి ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీ పదవులు చేపట్టిన పేరున్న నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. తమ రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మారుతుండటంతో జిల్లాలో -
గుట్టుగా.. బెట్టింగ్
[ 19-04-2024]
ఐపీఎల్ ప్రపంచకప్ క్రికెట్ పోటీలు జోరుగా సాగుతున్నాయి. అదే సమయంలో బెట్టింగ్ సైతం ఊపందుకుంది. ఒకప్పుడు పెద్ద పట్టణాల్లో అక్కడక్కడా గుట్టుగా సాగిన ఈ వ్యవహారం ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం -
నీటిబొట్టు.. ఒడిసిపట్టి
[ 19-04-2024]
జన్నారం మండలంలోని కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రంలోని మూగజీవాలకు తాగునీటి ఇబ్బంది లేకుండా అటవీ శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. -
మందులిచ్చేవారేరి?
[ 19-04-2024]
ఔషధ దుకాణాలు, ఫార్మసిస్టు లేనిదే నిర్వహణకు అనుమతి లేదు. విక్రయాలు ఏ మాత్రం చేయకూడదని సంబంధిత నియంత్రణ శాఖ చెబుతోంది. కానీ ఈ నియమాలన్నీ ప్రైవేటు వ్యవస్థకే తప్పితే ప్రభుత్వ సంస్థలకు అవసరం లేదనే పరిస్థితి నెలకొంది. -
వడ్డీ వ్యాపారుల ఇళ్లల్లో పోలీసుల తనిఖీలు
[ 19-04-2024]
కాగజ్నగర్ పట్టణంలో ఎలాంటి అనుమతి, రిజిస్ట్రేషన్ లేకుండా ఫైనాన్స్ పేరిట అధిక వడ్డీ వ్యాపారం చేస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు జిల్లా ఎస్పీ ఆదేశాలతో గురువారం పట్టణంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. -
అక్రమ వెంచర్లు సిద్ధం.. సక్రమానికి యత్నం
[ 19-04-2024]
అధికారులు ఎన్నికల విధుల్లో ఉండగా.. మరోవైపు భూ బకాసురులు అక్రమ వెంచర్లలో ప్లాట్ల విక్రయాలను జోరుగా సాగిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ