కదలని దస్త్రం.. అక్రమాలే సమస్తం
సమగ్ర భూ ప్రక్షాళన అనంతరం అనేక రకాల భూ సమస్యలతో అన్నదాతలు సతమతమవుతున్నారు. సర్వే నంబర్లు, విస్తీర్ణంలో వ్యత్యాసాలతో పాసు పుస్తకాలు పొందలేకపోతున్నారు. ధరణిలో కొన్ని ఐచ్ఛికాలు వచ్చినా అధికారులు చేయి తడపనిదే పని చేయడం లేదని కర్షకులు వాపోతున్నారు.
ఏళ్లుగా పెండింగ్లో ‘ధరణి’ దరఖాస్తులు
ఈనాడు డిజిటల్, ఆసిఫాబాద్
సమగ్ర భూ ప్రక్షాళన అనంతరం అనేక రకాల భూ సమస్యలతో అన్నదాతలు సతమతమవుతున్నారు. సర్వే నంబర్లు, విస్తీర్ణంలో వ్యత్యాసాలతో పాసు పుస్తకాలు పొందలేకపోతున్నారు. ధరణిలో కొన్ని ఐచ్ఛికాలు వచ్చినా అధికారులు చేయి తడపనిదే పని చేయడం లేదని కర్షకులు వాపోతున్నారు.
మీ సేవతో పాటు ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల విభాగానికి భూ సమస్యలకు సంబంధించి ఏన్నో అర్జీలు ఇస్తున్నా.. పరిష్కారం మాత్రం కావడం లేదు. డిజిటల్ సైన్ (డీఎస్) పెండింగ్తో సైతం ఆనేక మంది రైతులు కాస్తుల్లో ఉన్నా చేతికి పట్టాపాసు పుస్తకం రాక, ఐదు సంవత్సరాల నుంచి రైతుబంధు, రైతు బీమా పథకాలకు దూరమవుతున్నారు.
జిల్లావ్యాప్తంగా 20 వేల మంది..
ధరణి వెబ్సైట్లో పాసుపుస్తకాల సవరణకు ప్రభుత్వం ఇటీవలే కొన్ని ఐచ్ఛికాలు ఇచ్చింది. ఇందులో పేర్లు, చిరునామాలు, విస్తీర్ణం, భూమి స్వభావం తదితర అంశాలున్నాయి. జిల్లా వ్యాప్తంగా 20 వేల మంది రైతులు వివిధ భూ సమస్యలతో సతమతమవుతున్నారు. అన్నదాతలు మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే అధికారులు సరిచేసి ధరణి వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. కానీ బాధితులు మీ సేవ కేంద్రాల్లో అర్జీలు ఇస్తున్నా, సమస్యలన్నీ అలాగే పెండింగ్లో ఉంటున్నాయి. రెవెన్యూ కార్యాలయాలకు వెళితే మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని అంటున్నారని.. ఇక్కడ ఎలాంటి పరిష్కారం లభించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రూ.లక్ష డిమాండ్..
కౌటాల మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి తాతల కాలం నుంచి భూమిని సాగు చేస్తున్నారు. ఇతనికి లావుణి పట్టా ఉంది. మరో వ్యక్తి ఈ స్థలం నాదేనని కోర్టుకు వెళ్లాడు. పట్టా ఉన్న వ్యక్తి లావుణి పట్టా పత్రాలతో పాటు, స్థానిక రెవెన్యూ కార్యాలయంలో ఈ భూమికి సంబంధించిన పత్రాలు కోర్టులో అందించాల్సి ఉంటుంది. వీటిని అడగానికి వెళితే స్థానిక అధికారులు రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు.
ఏడాదిగా ప్రదక్షిణలు..
కౌటాల మండలానికి చెందిన మరో వ్యక్తి బాండ్ పేపర్ మీద రాసుకుని భూమి కొనుగోలు చేశాడు. పట్టా విక్రయించిన వ్యక్తి పేరు మీదే ఉంది. ఈ నేపథ్యంలో తన పేరు మీద పట్టా చేసుకోవాలని భావించిన ఈ రైతు వద్ద సైతం అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లుగా బాధితుడు వాపోతున్నారు. సంవత్సరం నుంచి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
డబ్బులిస్తే అభయం..
కాగజ్నగర్ మండలానికి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి సైతం సరిహద్దు భూముల విషయంలో తరుచూ సమస్యలను ఎదుర్కొంటున్నారు. కొందరు సర్వేయర్లు మా చేతిలో డబ్బులు పెట్టండి మేము చూసుకుంటామని సదరు ఉద్యోగికి అభయమిస్తున్నారు.
ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దు.. : - రాజేశం, అదనపు పాలనాధికారి
భూ సమస్యలకు సంబంధించి రైతుతు ఏ అధికారికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ సేవలో దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి సమస్యలను పరిష్కరిస్తాం.
4 ఏళ్లుగా తిరుగుతున్నా.. : - చౌదరి రంగయ్య, ముంజంపల్లి, బెజ్జూర్
నాకు సర్వే నంబర్ 71/67లో అయిదెకరాల భూమి ఉంది. 2018 నుంచి ఇప్పటి వరకు పాసుపుస్తకం రాలేదు. డీఎస్(డిజిటల్ సైన్) పెండింగ్ అని ఆన్లైన్లో చూపెడుతుంది. నాలుగు సంవత్సరాల నుంచి రైతుబంధు, బ్యాంకు రుణాలు రావడం లేదు. ఎన్నోసార్లు మీ సేవలో అర్జీలు సమర్పించినా సమస్య పరిష్కారం కావడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తేలిన బరి.. గెలుపుపై గురి
[ 29-03-2024]
ఆదిలాబాద్ ఎంపీ సీటు విజయం మూడు ప్రధాన పార్టీలకు కీలకంగా మారింది. కాంగ్రెస్ అభ్యర్థిగా ఆత్రం సుగుణ, భాజపా అభ్యర్థిగా గోడం నగేష్, భారాస తరఫున ఆత్రం సక్కు మధ్య త్రిముఖ పోటీ ఏర్పడింది. -
ఇక విద్యుత్తు కోతలకు చెక్
[ 29-03-2024]
ఎండలు ఎక్కువ కావడంతో విద్యుత్తు వినియోగం పెరిగిపోయింది. దీంతో కొన్ని చోట్ల సరఫరాకు అంతరాయం కలుగుతోంది. వచ్చే రెండు నెలల్లో విద్యుత్తు వినియోగం మరింత పెరిగే అవకాశం... -
ఎమ్మెల్యే ఫిర్యాదు చేసినా పట్టించుకోరా?: ఏలేటి
[ 29-03-2024]
గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అల్లోల ఇంద్రకరణ్రెడ్డి హయాంలో ప్రభుత్వ భూములను విచ్చలవిడిగా చెరబట్టారని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి మరోసారి ఆరోపించారు. -
పెన్గంగా.. ఇసుకదందా
[ 29-03-2024]
మండలవాసులకు వరప్రదాయినిగా ఉన్న పెన్గంగా నదిలో ఇసుకదొంగలు పడ్డారు. పారే నీటిని ఆపిమరీ యంత్రాలతో ఇసుకను తోడి అక్రమ రవాణా చేస్తున్నారు. -
గడువు ముందర సందిగ్ధం!
[ 29-03-2024]
ఏటా సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి, ప్రభుత్వ పనులకు బడ్జెట్ కేటాయిస్తారు. దానిని ఆ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ఖర్చు చేయాలి. ఇందుకు సంబంధించిన బిల్లులను ఖజానా శాఖకు పంపిస్తే.. వారు ఈ-కుబేర్లో నమోదు చేస్తారు. -
ఆన్లైన్ జూదంలో నష్టపోయి.. రైతుల డబ్బు కాజేత
[ 29-03-2024]
ఆదిలాబాద్ ఐపీపీబీ(ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్) మేనేజర్ విజయ్ జాదవ్ ఆన్లైన్ జూదానికి అలవాటు పడి అందులో నష్టపోయి రైతులకు చెందిన డబ్బులను కాజేసినట్లు తెలుస్తోంది. -
బహుజన, తెలంగాణవాదాన్ని భారీ మెజార్టీతో గెలిపించాలి
[ 29-03-2024]
రాజ్యాంగాన్ని కాపాడాలనే సంకల్పం, బహుజన, తెలంగాణ వాదం ఒక్కటేననే ఉద్దేశంతో తాను భారాసతో చేతులు కలిపినట్లు ఆ పార్టీ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ అన్నారు. -
సమస్యలు తెలుసుకుని.. పరిష్కారానికి ఆదేశించి
[ 29-03-2024]
గ్రామాల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని జిల్లా పాలనాధికారి వెంకటేష్ దోత్రే అన్నారు. గురువారం అదనపు పాలనాధికారి దీపక్ తివారీతో కలసి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. -
ఉద్యానవనాలపై ఉదాసీనత..
[ 29-03-2024]
మంచిర్యాల పట్టణవాసులకు ఆహ్లాదం కోసం వివిధ వార్డుల్లో ఉద్యానవనాల నిర్మాణం చేపట్టారు. ఒక్కో ఉద్యానవనానికి రూ.40 లక్షల నుంచి రూ.90 లక్షలు కేటాయించారు. -
రూ.‘కోటి’.. చీకటి పాలు
[ 29-03-2024]
ఒకవైపు రహదారి విస్తరణ లేక, మరోవైపు సిర్పూరు కాగితం మిల్లు(ఎస్పీఎం)కు నిత్యం ముడిసరకు లారీల రాకపోకల కారణంగా.. ఏడాదిలోపే రూ.కోటితో ఏర్పాటు చేసిన వెలుగులు విరజిమ్మే సెంట్రల్ లైటింగ్ వ్యవస్థ చీకటి పాలవుతోంది. -
‘టీజీ’ కోడ్తో రిజిస్ట్రేషన్లు
[ 29-03-2024]
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్ను ‘టీఎస్’ నుంచి ‘టీజీ’కి మార్పు చేస్తూ ఈ నెల 15న గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. -
పట్టణ వనాలపై పట్టింపు శూన్యం
[ 29-03-2024]
జిల్లాలోని నిర్మల్, భైంసా, ఖానాపూర్ పట్టణాల్లోని 80 వార్డుల్లో 52 పట్టణ ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. హరితహారంలో భాగంగా రూ.లక్షల నిధులు వ్యయం చేస్తున్నా నిర్వహణ లేకపోవడంతో అందులోని నాటిన మొక్కలన్నీ ఎండిపోతున్నాయి. -
ఆత్మహత్యలతో రెండు కుటుంబాల్లో విషాదం
[ 29-03-2024]
బాసర రైల్వే స్టేషన్లో నిజామాబాద్ పట్టణానికి చెందిన యువతి, యువకుడు బుధవారం రాత్రి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇరు కుటుంబాల్లో విషాదం నింపింది. -
సాగులో సాంకేతికత.. మహిళలకు సాధికారత
[ 29-03-2024]
వ్యవసాయరంగంలో మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం నమో డ్రోన్ దీదీ యోజనను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా జిల్లాలవారీగా ప్రయోగాత్మకంగా కొంత మంది యువతీ యువకులను ఎంపిక చేసి డ్రోన్ నిర్వహణ, -
ఈత కారాదు గుండెకోత
[ 29-03-2024]
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విభిన్న వాతావరణానికి పెట్టింది పేరు. ఇక్కడ వర్షాలు, చలి, ఎండ.. అన్నీ ఎక్కువే. మార్చిలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటుతున్నాయి. -
ఆదరిస్తే అభివృద్ధి చేస్తా : సుగుణ
[ 29-03-2024]
ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి మొదటిసారి ఆదివాసీ మహిళకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించిందని ఆ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ అన్నారు. దీంతో పార్టీకి ఆదివాసీలపై ఉన్న ప్రేమ నిరూపితమైందని తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు