logo

దయచేసి మారండి.. దర్జాగా వెళ్లండి!

ఆదిలాబాద్‌ కలెక్టరేట్‌ చౌక్‌లో గురువారం ఉదయం ట్రాఫిక్‌ పోలీసులు వాహనాల నెంబర్‌ బోర్డులు, చలానాలపై తనిఖీలు నిర్వహించారు.

Published : 25 Nov 2022 02:31 IST

ఈనాడు, ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ కలెక్టరేట్‌ చౌక్‌లో గురువారం ఉదయం ట్రాఫిక్‌ పోలీసులు వాహనాల నెంబర్‌ బోర్డులు, చలానాలపై తనిఖీలు నిర్వహించారు. రిమ్స్‌ మీదుగా వేగంగా వస్తున్న వాహనదారులు ఎదురుగా ఉన్న పోలీసులను చూసి ఒక్కసారిగా ఆగిపోవడంతో వెనుకనే వస్తున్న వాహనదారులు ఇబ్బంది పడ్డారు. మరికొందరు వెనుక ఎవరైనా వస్తున్నారా అని చూడకుండా అకస్మాత్తుగా మలుపుతిప్పడంతో చిన్నచిన్న ప్రమాదాలకు గురయ్యారు. మరోవైపు అన్నీ సరిగ్గా ఉన్న చోదకులు నేరుగా దర్జాగా వెళ్లారు. పోలీసులను చూసి భయపడి, ప్రమాదాలకు గురికాకుండా ఇప్పటికైనా వాహనదారులు నెంబరు బోర్డులు సరిచేసుకొని, శిరస్త్రాణం ధరిస్తే సాఫీగా వెళ్లొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని