ఆహార భద్రతపై అవగాహన అవసరం
ఆహార భద్రతపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని, ఈ విషయంలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తే ప్రజలు చైతన్యవంతులవుతారని మొదటి అదనపు జిల్లా జడ్జి ఎం.మాధవికృష్ణ పేర్కొన్నారు.
మాట్లాడుతున్న మొదటి అదనపు జిల్లా జడ్జి ఎం.మాధవికృష్ణ, చిత్రంలో డీఎల్ఎస్ఏ కార్యదర్శి క్షమా దేశ్పాండె, అదనపు పాలనాధికారి నటరాజ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్రాల నగేష్, న్యాయమూర్తులు సూర్యావార్ మంజుల, యశ్వంత్సింగ్ చౌహాన్
ఎదులాపురం, న్యూస్టుడే : ఆహార భద్రతపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని, ఈ విషయంలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తే ప్రజలు చైతన్యవంతులవుతారని మొదటి అదనపు జిల్లా జడ్జి ఎం.మాధవికృష్ణ పేర్కొన్నారు. న్యాయసేవా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం న్యాయసేవా సదన్ భవన్లో జాతీయ ఆహార భద్రతా చట్టం-2103పై సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సుల్లో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ ప్రతి పౌరునికి నాణ్యమైన పౌష్టికాహారం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ప్రస్తుతం జనాభా పెరుగుదల దృష్ట్యా భవిష్యత్తులో ఆహారం దొరకని పరిస్థితులు కూడా నెలకొనవచ్చని ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. ఈ సదస్సులో పలువురు వక్తలు మాట్లాడుతూ ఆహార భద్రత గురించి అవగాహన కల్పించారు. డీఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో డీఎల్ఎస్ఏ కార్యదర్శి క్షమా దేశ్పాండె, అదనపు పాలనాధికారి నటరాజ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్రాల నగేష్, న్యాయమూర్తులు సూర్యావార్ మంజుల, యశ్వంత్సింగ్ చౌహాన్, న్యాయవాది వెండి భద్రేశ్వర్రావు, డీసీఎస్ఓ కిరణ్కుమార్, బీసీ సంక్షేమాధికారి రాజలింగు, అంగన్వాడీ కార్యకర్తలు, స్వయం సహాయక సంఘాల సభ్యురాళ్లు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Bill Gates: రోటీ చేసిన బిల్గేట్స్.. ఇది కూడా ట్రై చేయండన్న మోదీ
-
World News
Chinese Billionaires: చలో సింగపూర్.. తరలి వెళుతున్న చైనా కుబేరులు!
-
Sports News
IND vs AUS: టీమ్ఇండియా ‘తగ్గేదేలే’.. నెట్బౌలర్లుగా నలుగురు టాప్ స్పిన్నర్లు!
-
Movies News
vani jayaram: ప్రముఖ సినీ గాయని వాణీ జయరాం కన్నుమూత
-
Politics News
TS Assembly: దేశం చూపు కేసీఆర్ వైపు.. సంక్షేమంలో మాకు తిరుగులేదు: కేటీఆర్
-
India News
కంటి చుక్కలతో అమెరికాలో మరణం.. భారత ఔషధ సంస్థలో అర్ధరాత్రి తనిఖీలు