కోతలేని కు.ని. పట్టించుకోరెందుకని?
రెండు జిల్లాలకు పెద్దదిక్కు మంచిర్యాలలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి. శస్త్రచికిత్స ఏదైనా ఇక్కడికి రావాల్సిందే.
పురుషులు ముందుకొస్తున్నా చేయలేని పరిస్థితి
జీజీహెచ్లోని పీపీపీ యూనిట్ గది
మంచిర్యాల వైద్యవిభాగం, న్యూస్టుడే: రెండు జిల్లాలకు పెద్దదిక్కు మంచిర్యాలలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి. శస్త్రచికిత్స ఏదైనా ఇక్కడికి రావాల్సిందే. ప్రస్తుతం వ్యాసెక్టమీ పక్షోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయి. జిల్లాలోనూ వారం రోజులుగా ఈ అంశంపై అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కోత, కుట్టులేని పురుషులకు చేసే ఈ కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సపై వివరిస్తున్నారు. సోమవారం నుంచి ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి కుటుంబ నియంత్రణ (కు.ని.) చికిత్సలు చేయాలని వైద్యారోగ్యశాఖ నిర్ణయించింది. ఇప్పటి వరకు వీటి నిర్వహణపై ఎలాంటి కదలిక లేదు. జిల్లాలో ఎక్కడెక్కడ నిర్వహిస్తున్నారు..? ఎంతమంది వ్యాసెక్టమీ చేసుకునేందుకు ముందుకొచ్చారు..? అనే దానిపై స్పష్టత లేదు. పక్షోత్సవాలను పురస్కరించుకుని కొంతమంది ఆశావహులు జీజీహెచ్ బాట పడుతున్నట్లు తెలిసింది. పీపీపీ(పోస్ట్ పార్టమ్ ప్రోగ్రాం) యూనిట్ సిబ్బంది వారి పేరు నమోదు చేసుకుని చికిత్సలు నిర్వహించే సమయంలో సమాచారం అందిస్తామని చెబుతున్నారు తప్ప కచ్చితమైన తేదీ సూచించడం లేదు. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చి నిరాశతో వెనుదిరుగుతున్నారు.
వైద్యుడు లేరు.. శస్త్రచికిత్స గదీ లేదు
వ్యాసెక్టమీపై గతంలో మాదిరి కాకుండా చాలా వరకు ఈ చికిత్సపై మగవారు అవగాహన పొంది దీన్ని చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు వైద్య సిబ్బందే తెలుపుతున్నారు. ఇటీవల మంచిర్యాల, ఆసిఫాబాద్, కాగజ్నగర్ నుంచి వస్తున్నారని పీపీపీ యూనిట్ సిబ్బంది చెబుతున్నారు. వచ్చిన వారి వివరాలు నమోదు చేస్తుండటంతో పుస్తకంలోని పేజీలు నిండుతున్నాయి కానీ చికిత్సలు జరగడం లేదు. జిల్లా వ్యాప్తంగా వ్యాసెక్టమీ చేసే ఒక్క వైద్యుడు లేకపోవడం, సంబంధిత గది అందుబాటులో ఉండకపోవడమే ఇందుకు కారణం.
శిక్షణ ఇస్తే నిత్యం చేసే అవకాశం..
వ్యాసెక్టమీ(కుట్టు, కోతలేని)చికిత్సకు తప్పనిసరిగా ప్రసూతి వైద్యులు, సర్జన్లు ఉండాల్సిన అవసరంలేదు. ఎంబీబీఎస్ వైద్యులు కూడా చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. వ్యాసెక్టమీ చేసే అర్హత ఆరోగ్యకేంద్రాల వైద్యాధికారులకు(ఎంబీబీఎస్)ఉంది. అయినా ఆ దిశగా ఆలోచన చేయడంలేదు. వీరికి ఒక శిబిరం ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తే నిత్యం చేసేందుకు అవకాశం ఉంటుంది. బాధితులు సైతం జిల్లా కేంద్రం బాట పట్టాల్సిన అవసరముండదు.
ఏర్పాట్లు చేస్తున్నాం
డా.సుబ్బారాయుడు, జిల్లా వైద్యాధికారి
వ్యాసెక్టమీ పక్షోత్సవాల్లో భాగంగా ఈ చికిత్సపై అవగాహన కల్పిస్తున్నాం. ముందుకు వస్తున్న వారికి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. 28 నుంచి జిల్లాలోని బెల్లంపల్లి, చెన్నూర్, బెల్లంపల్లిలో నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నాం. ఈ చికిత్సలు నిత్యం జరిగేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎస్ఐ చర్చిలో గుడ్ ఫ్రైడే
[ 29-03-2024]
జిల్లా కేంద్రంలోని విద్యానగర్ కాలనీలో ఉన్న సీఎస్ఐ చర్చిలో క్రైస్తవులు గుడ్ ఫ్రైడేను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. -
మతతత్వంతో లబ్ధి పొందే పార్టీలకు బుద్ధి చెప్పాలి
[ 29-03-2024]
మతతత్వం రెచ్చగొట్టి లబ్ధి పొందాలనుకునే పార్టీలకు రానున్న లోక్సభ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పూరపాటి రమేష్ పిలుపునిచ్చారు. -
అక్రమ మద్యం విక్రయిస్తే కేసులు తప్పవు
[ 29-03-2024]
అక్రమంగా మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ స్టేషన్ ఎక్సైజ్ సీఐ విజేందర్ హెచ్చరించారు. -
తేలిన బరి.. గెలుపుపై గురి
[ 29-03-2024]
ఆదిలాబాద్ ఎంపీ సీటు విజయం మూడు ప్రధాన పార్టీలకు కీలకంగా మారింది. కాంగ్రెస్ అభ్యర్థిగా ఆత్రం సుగుణ, భాజపా అభ్యర్థిగా గోడం నగేష్, భారాస తరఫున ఆత్రం సక్కు మధ్య త్రిముఖ పోటీ ఏర్పడింది. -
ఇక విద్యుత్తు కోతలకు చెక్
[ 29-03-2024]
ఎండలు ఎక్కువ కావడంతో విద్యుత్తు వినియోగం పెరిగిపోయింది. దీంతో కొన్ని చోట్ల సరఫరాకు అంతరాయం కలుగుతోంది. వచ్చే రెండు నెలల్లో విద్యుత్తు వినియోగం మరింత పెరిగే అవకాశం... -
ఎమ్మెల్యే ఫిర్యాదు చేసినా పట్టించుకోరా?: ఏలేటి
[ 29-03-2024]
గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అల్లోల ఇంద్రకరణ్రెడ్డి హయాంలో ప్రభుత్వ భూములను విచ్చలవిడిగా చెరబట్టారని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి మరోసారి ఆరోపించారు. -
పెన్గంగా.. ఇసుకదందా
[ 29-03-2024]
మండలవాసులకు వరప్రదాయినిగా ఉన్న పెన్గంగా నదిలో ఇసుకదొంగలు పడ్డారు. పారే నీటిని ఆపిమరీ యంత్రాలతో ఇసుకను తోడి అక్రమ రవాణా చేస్తున్నారు. -
గడువు ముందర సందిగ్ధం!
[ 29-03-2024]
ఏటా సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి, ప్రభుత్వ పనులకు బడ్జెట్ కేటాయిస్తారు. దానిని ఆ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ఖర్చు చేయాలి. ఇందుకు సంబంధించిన బిల్లులను ఖజానా శాఖకు పంపిస్తే.. వారు ఈ-కుబేర్లో నమోదు చేస్తారు. -
ఆన్లైన్ జూదంలో నష్టపోయి.. రైతుల డబ్బు కాజేత
[ 29-03-2024]
ఆదిలాబాద్ ఐపీపీబీ(ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్) మేనేజర్ విజయ్ జాదవ్ ఆన్లైన్ జూదానికి అలవాటు పడి అందులో నష్టపోయి రైతులకు చెందిన డబ్బులను కాజేసినట్లు తెలుస్తోంది. -
బహుజన, తెలంగాణవాదాన్ని భారీ మెజార్టీతో గెలిపించాలి
[ 29-03-2024]
రాజ్యాంగాన్ని కాపాడాలనే సంకల్పం, బహుజన, తెలంగాణ వాదం ఒక్కటేననే ఉద్దేశంతో తాను భారాసతో చేతులు కలిపినట్లు ఆ పార్టీ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ అన్నారు. -
సమస్యలు తెలుసుకుని.. పరిష్కారానికి ఆదేశించి
[ 29-03-2024]
గ్రామాల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని జిల్లా పాలనాధికారి వెంకటేష్ దోత్రే అన్నారు. గురువారం అదనపు పాలనాధికారి దీపక్ తివారీతో కలసి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. -
ఉద్యానవనాలపై ఉదాసీనత..
[ 29-03-2024]
మంచిర్యాల పట్టణవాసులకు ఆహ్లాదం కోసం వివిధ వార్డుల్లో ఉద్యానవనాల నిర్మాణం చేపట్టారు. ఒక్కో ఉద్యానవనానికి రూ.40 లక్షల నుంచి రూ.90 లక్షలు కేటాయించారు. -
రూ.‘కోటి’.. చీకటి పాలు
[ 29-03-2024]
ఒకవైపు రహదారి విస్తరణ లేక, మరోవైపు సిర్పూరు కాగితం మిల్లు(ఎస్పీఎం)కు నిత్యం ముడిసరకు లారీల రాకపోకల కారణంగా.. ఏడాదిలోపే రూ.కోటితో ఏర్పాటు చేసిన వెలుగులు విరజిమ్మే సెంట్రల్ లైటింగ్ వ్యవస్థ చీకటి పాలవుతోంది. -
‘టీజీ’ కోడ్తో రిజిస్ట్రేషన్లు
[ 29-03-2024]
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్ను ‘టీఎస్’ నుంచి ‘టీజీ’కి మార్పు చేస్తూ ఈ నెల 15న గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. -
పట్టణ వనాలపై పట్టింపు శూన్యం
[ 29-03-2024]
జిల్లాలోని నిర్మల్, భైంసా, ఖానాపూర్ పట్టణాల్లోని 80 వార్డుల్లో 52 పట్టణ ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. హరితహారంలో భాగంగా రూ.లక్షల నిధులు వ్యయం చేస్తున్నా నిర్వహణ లేకపోవడంతో అందులోని నాటిన మొక్కలన్నీ ఎండిపోతున్నాయి. -
ఆత్మహత్యలతో రెండు కుటుంబాల్లో విషాదం
[ 29-03-2024]
బాసర రైల్వే స్టేషన్లో నిజామాబాద్ పట్టణానికి చెందిన యువతి, యువకుడు బుధవారం రాత్రి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇరు కుటుంబాల్లో విషాదం నింపింది. -
సాగులో సాంకేతికత.. మహిళలకు సాధికారత
[ 29-03-2024]
వ్యవసాయరంగంలో మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం నమో డ్రోన్ దీదీ యోజనను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా జిల్లాలవారీగా ప్రయోగాత్మకంగా కొంత మంది యువతీ యువకులను ఎంపిక చేసి డ్రోన్ నిర్వహణ, -
ఈత కారాదు గుండెకోత
[ 29-03-2024]
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విభిన్న వాతావరణానికి పెట్టింది పేరు. ఇక్కడ వర్షాలు, చలి, ఎండ.. అన్నీ ఎక్కువే. మార్చిలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటుతున్నాయి. -
ఆదరిస్తే అభివృద్ధి చేస్తా : సుగుణ
[ 29-03-2024]
ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి మొదటిసారి ఆదివాసీ మహిళకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించిందని ఆ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ అన్నారు. దీంతో పార్టీకి ఆదివాసీలపై ఉన్న ప్రేమ నిరూపితమైందని తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
కేసీఆర్ను దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు