తనిఖీ పేరిట దోచుకుంటున్నారు
అంతర్జాలంలో చరవాణులకు సందేశాల ద్వారా ఏదో ఆశ చూపి ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న ఘటనలు పట్టణం, గ్రామీణం అనే తేడా లేకుండా కొనసాగుతూనే ఉన్నాయి.
న్యూస్టుడే, ఆదిలాబాద్ నేరవిభాగం
అంతర్జాలంలో చరవాణులకు సందేశాల ద్వారా ఏదో ఆశ చూపి ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న ఘటనలు పట్టణం, గ్రామీణం అనే తేడా లేకుండా కొనసాగుతూనే ఉన్నాయి. వీటికి తోడు తనిఖీ అధికారులమంటూ కొందరు మరో కొత్త రకం మోసాలకు పాల్పడటం మొదలెట్టారు. ఆదాయపన్ను, జీఎస్టీ, ఇతరత్రా శాఖల అధికారులమంటూ మెట్రోపాలిటన్ పట్టణాలు, పెద్ద నగరాల్లో వ్యాపారులను మోసగించే ఘటనలు అప్పుడప్పుడు వింటుంటాం. ఇలాంటివి ప్రస్తుతం చిన్న నగరాలు, పట్టణాలకు వ్యాపించాయి. ఆగంతకులు వారి మోసాలను ఇలాంటి పట్టణాలకు విస్తరించినట్లు ఇటీవల ఆదిలాబాద్ పట్టణంలో చోటు చేసుకున్న ఘటనలు రుజువు చేస్తున్నాయి. తాము తనిఖీ అధికారులమంటూ నమ్మించి నగదు కాజేస్తున్నారు.
ఆదిలాబాద్ పట్టణంలోనే ఇలాంటి రెండు ఘటనలు వెలుగు చూశాయి. ఆదాయ పన్ను, జీఎస్టీ అధికారులమని చెప్పి మోసం చేసి నగలు, నగదు దోచుకుపోయారు. ఈ రెండు సంఘటనల్లో బాధితులు ఫిర్యాదు చేయటంతో.. వెలుగులోకి వచ్చాయి. వెలుగు చూడని ఇలాంటివి మరిన్ని ఉండవచ్చని పలువురు అనుమానిస్తున్నారు.
దర్జాగా నగలు తీసుకెళ్లి..
ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి ఐటీ అధికారినంటూ గతేడాది జనవరిలో ఒక నగల దుకాణానికి వచ్చాడు. యజమానిని పరిచయం చేసుకొని జీఎస్టీ ధ్రువపత్రాలు పరిశీలించాడు. అనంతరం స్నేహపూర్వకంగా మెలుగుతూ ఒక బంగారు గొలుసు, మరొక బంగారు కాయిన్ కొనుగోలు చేశాడు. దీనికి సంబంధించిన రూ.1.87 లక్షలు నెఫ్ట్ ద్వారా ఆన్లైన్లో చెల్లించినట్లు నమ్మించి యజమానికి చెల్లింపుల స్క్రీన్షాట్ పంపించడంతో యజమాని నమ్మారు. దుకాణం మూసే సమయంలో వారు తమ బ్యాంకు ఖాతాను పరిశీలించగా.. డబ్బు జమ్మ కాలేదని తెలుసుకొని మోసపోయినట్లు గుర్తించారు. ఈ మేరకు యజమాని ఒకటో పట్టణ పోలీసులకు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. పోలీసులు సీసీ ఫుటేజీ పరిశీలించినా నేటికీ ఆ ఆగంతకుడి ఆచూకీ లభించలేదు.
రూ.5 లక్షలు దోచేసి
ఇటీవల జిల్లా కేంద్రంలోని ఒక మాల్(వస్త్ర దుకాణం) యజమానికి ఇంద్రవెల్లికి చెందిన 22 ఏళ్ల యువకుడు ఫోన్ చేసి తాను జీఎస్టీ టాస్క్ఫోర్సు అధికారినని పరిచయం చేసుకున్నాడు. దుకాణానికి సంబంధించిన జీఎస్టీ చెల్లింపులు సరిగా లేవని, మాట్లాడాలని లాడ్జికి యజమానిని పిలిపించుకున్నాడు. అక్కడ అతనిపై సుత్తితో దాడి చేసి తాడుతో కట్టేసి భయాందోళనలకు గురిచేశాడు. అనంతరం తాను ఒక మాఫియా వ్యక్తినని భయపెట్టి, మీ కుటుంబ సభ్యులను హత్య చేస్తామని బెదిరించాడు. రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో ఆ వ్యాపారి డబ్బు చెల్లించాడు. పరువు పోతుందని భావించి కొన్నాళ్లు ఫిర్యాదు చేయలేదు. ఒక స్నేహితుడికి విషయం తెలిసి అతని ద్వారా ఫిర్యాదు చేయించడంతో.. పోలీసులు సదరు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. లాడ్జిలో యజమానిపై దాడి చేయటానికి ఉపయోగించిన సుత్తి, కత్తి, నైలాన్ తాడు చిత్రమే ఇది.
ఫిర్యాదు చేయాలి
- ఉదయ్కుమార్రెడ్డి, ఎస్పీ
గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అధికారులమంటూ లేదా మరే రకంగానైనా మోసం చేస్తే ధైర్యంగా ఫిర్యాదు చేయాలి. అప్పుడే పోలీసులు బాధితులకు న్యాయం చేయగలుగుతారు. మోసపోయి పరువు పోతుందని భావించి మిన్నకుండిపోతే ఇలాంటి వారు మళ్లీ మళ్లీ మోసాలకు తెగబడుతూనే ఉంటారు. ఇటీవల ఇలాంటి మోసగాళ్లు పెరిగిపోతున్నారు. ప్రజలు, వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మలేరియా రహిత సమాజానికి కృషి చేయాలి
[ 25-04-2024]
జిల్లాను మలేరియా రహిత జిల్లాగా మార్చడానికి ప్రజలను భాగస్వాములు చేస్తూ కృషి చేయాలని డీఎంహెచ్ఓ నరేందర్ సూచించారు. -
టీకాల నిర్వహణపై పరిశీలన
[ 25-04-2024]
జిల్లాలో టీకాల నిర్వహణ తీరుపై పరిశీలన కార్యక్రమం కొనసాగుతోంది. 2019లో అందుబాటులోకి వచ్చిన ఆర్వీవీ, 2021లో అందుబాటులోకి ... -
వివాహితపై హెడ్ కానిస్టేబుల్ అసభ్య ప్రవర్తన
[ 25-04-2024]
పట్టణంలోని ఓ కాలనీకి చెందిన వివాహితపై బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగు చూసింది. -
కూచిపూడి నృత్యం వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం
[ 25-04-2024]
భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలు నృత్యాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. -
ఉత్సాహంగా అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు
[ 25-04-2024]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో గురువారం జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగాయి. -
ప్రారంభమైన వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం
[ 25-04-2024]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో గురువారం హైదరాబాద్ క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం ప్రారంభమైంది. -
తగ్గిన ఇంటర్ ఉత్తీర్ణత
[ 25-04-2024]
కిందటేడాది మాదిరిగానే ఈసారి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను బుధవారం ఒకేసారి విడుదల చేశారు. గత సంవత్సరంతో పోల్చితే ఈసారి జిల్లా ఉత్తీర్ణత శాతం కొద్దిగా తగ్గింది. -
అయిదేళ్లుగా ఎదురుచూపులే!
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం రైతులందరికి అందడం లేదు. ప్రారంభంలో ఉన్న రైతుల్లో నిబంధనల కారణంగా తొలగిస్తున్నా.. కొత్త వారిని చేర్చకపోవడంతో ఏటా సాయం పొందే రైతుల సంఖ్య తగ్గుతోంది. -
దిగజారిన ఫలితాలు..
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా గతేడాదితో పోలిస్తే అయిదు స్థానాలు కిందికి పడిపోయి రాష్ట్రంలో 7వ స్థానానికి పరిమితమైంది. అయినప్పటికీ ఉత్తమ ఫలితాలనే సాధించినట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు. -
పక్కాగా ఎన్నికల సంఘం మార్గదర్శకాల అమలు
[ 25-04-2024]
పార్లమెంట్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి జిల్లాల ఎన్నికల అధికారులు, పాలనాధికారులు, -
ఏసీబీ అధికారుల విస్తృత తనిఖీలు
[ 25-04-2024]
నాలుగు వరుసల రహదారి విస్తరణలో భాగంగా.. పరిహారం చెల్లింపులో జరిగిన అక్రమాలపై ‘ఈనాడు’ ప్రచురించిన వరుస కథనాలకు ఏసీబీ అధికారులు స్పందించారు. -
స్థిరాస్తి వ్యాపారుల్లో గుబులు
[ 25-04-2024]
ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడం, నిబంధనలు కాలరాసి వెంచర్లు వేసి అమాయకులను మోసం చేయడం, బాండ్ పేపర్ల మీద రాసుకుంటూ బీడీపీపీ భూములను విక్రయించడం, వివాదాస్పద భూములను వాటాలు వేసుకుని పంచుకోవడం, -
ఏనుగు దాడి ఘటనలో.. బాధిత కుటుంబాలకు పరిహారం
[ 25-04-2024]
కాగజ్నగర్ అటవీ డివిజన్ పరిధిలో ఏనుగు దాడిలో మృతి చెందిన ఇద్దరు రైతుల కుటుంబాలకు ప్రభుత్వం మంజూరు చేసిన పరిహారం చెక్కులను అందజేశారు. -
ఆరో రోజు 8 నామినేషన్లు
[ 25-04-2024]
పెద్దపల్లి లోక్సభ స్థానానికి ఆరో రోజు బుధవారం 8 మంది నామినేషన్లు దాఖలు చేశారు. భాజపా జిల్లా అధ్యక్షుడు చందుపట్ల సునీల్రెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, నాయకులు కన్నం అంజయ్యలతో కలిసి -
ఫలితాల్లో దిగజారి.. అట్టడుగుకు చేరి
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ప్రథమ ద్వితీయ ఫలితాల్లో జిల్లాకు నిరాశే ఎదురైంది. -
అలా ఏర్పాటు.. ఇలా తొలగింపు
[ 25-04-2024]
ఆ యూటర్న్ మృత్యువుకు చిరునామాగా మారింది. ఇక్కడ జరిగిన రహదారి ప్రమాదాల్లో దాదాపు 10 మంది మృతి చెందారు. వీరంతా యూటర్న్ వద్దకు రాగానే ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయారు. -
మొరం తవ్వేస్తున్నారు.. వెంచర్లలో నింపేస్తున్నారు
[ 25-04-2024]
జిల్లాలో ఏ గుట్టను చూసినా అక్రమ దందా ఎలా సాగుతుందో తెలుస్తోంది. యథేచ్ఛగా మొరం తవ్వకాలు జరుగుతున్నా.. సిబ్బంది లేకనే ఇబ్బందులు ఉన్నాయంటూ సంబంధిత అధికారులు ప్రకటించడం చూస్తుంటే పరోక్షంగా వారికి ఎలా అండగా ఉన్నారో తెలిసిపోతోంది. -
అమ్మాయిలదే హవా
[ 25-04-2024]
ఇంటర్ వార్షిక పరీక్ష ఫలితాల్లో జిల్లాలో బాలికలదే పైచేయిగా నిలిచింది. గత ఏడాది సైతం వారే ముందంజలో ఉన్నారు. రెగ్యులర్ కోర్సుల్లో గత సంవత్సరంకంటే రాష్ట్రస్థాయిలో దిగజారినా ఒకేషనల్లో మాత్రం కొంత మెరుగైంది. -
ఇంటర్లో మెరిసిన విద్యాకుసుమాలు
[ 25-04-2024]
బోథ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, ఆదర్శ పాఠశాల విద్యార్థులు బుధవారం వెలువడిన ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సర ఫలితాలలో సత్తా చాటారు. -
నమ్మించి మోసం చేసిన హోంగార్డు అరెస్ట్
[ 25-04-2024]
ప్రజలను నమ్మించి మోసం చేసిన హోంగార్డు షమీ ఉల్లాఖాన్ను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణ సీఐ అనిల్ తెలిపిన వివరాల ప్రకారం షమీ ఉల్లాఖాన్ కొద్ది రోజుల క్రితం పట్టణంలో ట్రాఫిక్ విధులు నిర్వహించారు. -
చర్చనీయాంశంగా మాజీ ఎంపీ నామపత్రం దాఖలు
[ 25-04-2024]
మాజీ ఎంపీ రాఠోడ్ రమేష్ ఒక్కరే వచ్చి భాజపా తరఫున నామపత్రం దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. భాజపా అభ్యర్థి గోడం నగేష్ చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న ఆయన ఆ తర్వాత
తాజా వార్తలు (Latest News)
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM